పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2
జియోఫీ చాసర్ –2-కవితావలోకనం
చార్లెస్ ‘’ది రోమాన్స్ ఆఫ్ ది రోజ్ ‘’మొదటగా రాశాడు .ఇది ఫ్రెంచ్ ఎలిగరి .ఇందులో ఆయన ‘’కలా’’(ళాకాదు)భిమానం ఉంది .అందుకే డ్రీమర్ అన్నారు .ఇది అసంపూర్ణ కవిత .అతని నిజమైన సృజనాత్మక కవిత ‘’ది బుక్ ఆఫ్ ది డచేస్’’.నలభై ఏళ్ళ వయసులో సంగీతం కూడా తనకవితలకు ఇవ్వటం ప్రారంభించాడు .ఇందులోనికవిత్వం చదివిన దానికంటే వింటేనే బాగుంటుంది .ఇప్పటికీ తన గమ్యం ఏమిటో తేల్చుకోలేక పోయాడు .’’ది హౌస్ ఆఫ్ ఫేం’’అనే మళ్ళీ పూర్తికాని కవిత రాశాడు .ఇందులో చాసర్ ‘’పలుకు బడులు’’ బాగా పేలాయి .
‘’ది పార్ల మెంట్ ఆఫ్ ఫౌల్స్ ‘’లో కద పాతదే కాని విధానం కొత్తగా ఉంది.ఇందులో రాసిన విధానాలకు కొత్త కళతెచ్చాడు అందుకే ‘’చాసరీయన్ స్టాంజా ‘’అన్నారు .గొప్ప కవిత కాదుకాని ఆయన ఆలోచనలకు రూపం .’’ది లైఫ్ ఈజ్ టూ షార్ట్ ది క్రాఫ్ట్ సో లాంగ్ టు లేరన్ ‘’అన్నాడు .ఇందులో యువ ప్రేమికుల మధ్య ప్రేమ ,అనుమానం ,మోసం చిత్రించాడు .తరువాత రాసిన ‘’ది లిజెండ్ ఆఫ్ గుడ్ విమెన్ ‘’లో ‘’క్లియోపాత్రా ‘’వంటి పాత్రల త్యాగం , వారి వీరోచిత చరిత్ర భావ గర్భితం గా చూపించాడు .ఇన్ని రాసినా రాస్తున్నా ఆయన మనసులో కాంటర్ బరీ కధలు ‘’గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి .వాటిని న భూతో గా రాయాలని చాసర్ సంకల్పం .మనసులో ఏంతో మధన పడుతున్నాడు .ఆ పాత్రలు నిత్యం దర్శన మిచ్చి తమను సజీవం చేయమని కోరుతూనే ఉన్నాయి .
చాసర్ రచనల లో ‘’మాగ్నం ఓపస్ ‘’అన బడేది ‘’ది కాంటర్ బరీ టేల్స్’’.ఇందులో ఆయన రాసిన ‘’ప్రోలాగ్ ‘’అంటే ప్రస్తావన అదిరిందని విమర్శకులంటారు .ఆయన అమాయక విజన్ ,వర్షం లో తడిసిన పుష్ప సౌందర్యం ,పడమటి గాలి కమ్మని సుగంధం ,చిన్ని చిన్ని పక్షలు ,వాటి నిశా నిస్వనాలు చదివిన వారి మనసులను రంజింప జేస్తాయి . ముప్ఫై మంది యాత్రికుల మనో భావాలు వాళ్ళు చెప్పిన కధలు అనుభవాలు ,అమాయకత్వం మోసం అన్నీ చిత్రించాడు . ఈ యాత్రీకులకు ‘’టాబార్డ్ ఇన్ ‘’ నిర్వహించే ‘’హారీ బైలీ’’ ఆతిధ్యం ఇస్తాడు .ఈ యాత్రికులలో ఒక సన్యాసి విద్యార్ధి ,మిల్లర్ నైట్ , చాసర్ మొదలైన వారుంటారు .ప్రతి యాత్రికుడిని రెండు కధలు చెప్పమని హోస్ట్ కోరతాడు .మంచికద చెప్పిన వారికి ఉచిత డిన్నర్ ఇస్తానంటాడు .ఒకరి కద ఇంకొరికి నచ్చదు.విమర్శలు ,ప్రతి విమర్శలు .కొందరు బోర్ కొట్టిస్తే కొందరు గిలి గింతలు పెట్టిస్తారు .కొందరికి కద బాగున్నా కధనం లో తడబాటు ఉంటుంది ..వంటవాడు తాగి హల చల్ చేస్తాడు .
ఈ కధల్లో వ్యక్తీ అంతరంగాన్ని ఆవిష్కరింప జేశాడు .ఈ అస్తవ్యస్త ప్రపంచం లో మనుషులు ఎలా బతుకుతూ జీవితం లాగిస్తున్నారో మనకు తెలుస్తుంది .మనుషుల మీద చాసర్ కున్న గౌరవం ప్రత్యేకత స్పష్టం అవుతుంది .చాసర్ రాసిన ప్రతి దాన్ని చుట్టూ ఉన్న వారికి చదివి వినిపించి మెప్పు పొందాడు .ప్రైవేట్ ఇళ్ళల్లో ,రాజ దర్బార్ లో పల్లె వీధుల్లో కవిత్వాన్ని వినిపించాడు .’’Although much of his verse is musical in the most memorable way ,showing the skill of a master craftsman ,most of it is poetry that talks rather than poetry that sing .The Canterbury tales are in them selves an extended conversation ,sometime bantering ,some time bitter .అన్నారు .చాసర్ కు మోహంతో కూడిన కధలు కావాలి (లస్టే ఎనక్దోట్స్).సహజ సామేతలు ఉండాలి ,కటువు ముతక జోకులున్డాలి .. అంతకు పూర్వం ఆ తర్వాత ఇలాంటి అమాయక నమ్మకమైన కవిత వెలువడలేదనే చెప్పాలి .మనిషిని విశాల కాన్వాస్ పై చిత్రించాడు చాసర్ .ఈ అమాయక చక్ర వర్తులైన పాత్ర దారులు ఆ నాటి సమాజం లో ఉన్న విజ్ఞాన శాస్త్ర, వేదాంత ,నీతి ,కళ,ల పై సంఘ ఆచారాలపై తమ మనో భావాలను విప్పి చెప్పిన వారే .
చాసర్ ది విప్లవాత్మక మనసు కాదు .ఆయన ఒక సామాజిక ఆలోచనా పరుడు .సాంఘిక సంస్కర్త కాదు ,,రాజకీయ అతివాది కాదు. మత వ్యతిరేకీ కాదు .ఉన్నది ఉన్నట్లు ఒప్పుకొన్న వాడు .దీనికి అభ్యంతరం చెప్పలేదు .ఆ భావాలు తానూ నమ్మిన వాటికి వ్యతిరేకం గా ఉంటె మాత్రం ఒప్పుకోలేదు .చర్చి గౌరవాన్ని మంట గాలిపే చర్చి అధిపతుల విధానాలను బయట పెట్టె ప్రయత్నం ఇందులో కని పిస్తుంది .అన్నిటికి మించి చాసర్ నిజాయితీకి పట్టం కట్టాడు .సత్యానికి దాసుడిని అన్నాడు .స్వచ్చమైన హృదయం అమాయక ఆరాధన ఆయనకు నచ్చిన విషయాలు .పదిహేడవ శతాబ్దం లో జాన్ డ్రైడేన్ ‘’Chaucer is a perpetual fountain of good sense with God;s plenty ‘’అని కీర్తిస్టూ ‘’he must have been a man of most wonderful comprehensive nature because ,as it has been truly said of him ,he has taken into the compass of the Canter bury tales the various manners and humors of the whole English nation in his age ‘’అన్నాడు .
చాసర్ మరణించి ఆరువందల ఏళ్ళు దాటినా అతని కాంటర్ బరీ కతలు ఆయన ప్రజ్ఞా సర్వస్వం ,మేధో వికసితం .దీనీతో ఇంగ్లీష్ జాతినే కాదు యావత్ మానవ జాతినీ తరతరాలుగా పరివేష్టించి ఉండి ప్రభావితం చేస్తూనే ఉన్నాడు చాసర్ .
మరో పూర్వాంగ్ల కవి ముచ్చట్లు ఈ సారి –
సశేషం
రేపు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భం గా శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-14-ఉయ్యూ
