|
చరిత్రలో నెహ్రూ – ఇందర్ మల్హోత్రా
|
|
జవహర్లాల్ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే ఎంతగా ప్రేమాదరాలు పొందారో అంతగా ఇప్పుడు ఆయన అపనిందలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిని అప్రతిష్ఠ పాలుచేసే ప్రచారోద్యమ ఉధృతి పెరుగుతుందేగానీ తగ్గడం లేదు. నిజమే, నెహ్రూ గుణనిధి కాదు. సామాన్యులు, అసామాన్యులు అందరివలే ఆయనా తప్పులు చేసారు. కొన్నిసార్లు మహా ఘోరమైన తప్పులు చేశారు. ముఖ్యంగా చైనా విషయంలో చాలా పొరపడ్డారు. నెహ్రూ చేసిన తప్పులను తీవ్రంగా విమర్శించాల్సిందే.
అయితే స్వతంత్ర భారతదేశంలో అపమార్గం పట్టిన, అపసవ్యంగా జరిగిన ప్రతిదానికీ నెహ్రూను బాధ్యుడినిచేస్తూ ఆయన స్మృతిని కించపరచడానికి ఎడతెగని ప్రయత్నం చేయడం గర్హనీయం కాదా? అంగీకార యోగ్యంకాని ఈ దూషణోద్యమం వెనుక రెండు ప్రధాన శక్తులున్నాయి. మొదటి బృందంలోని వారు అమాయకులని చెప్పాలి. వీరిలో అత్యధికులు నెహ్రూ మరణాంతరం జన్మించిన వారు. స్వేచ్ఛావిపణిని, ప్రపంచీకరణను విశ్వసించేవారు. వలసపాలన నుంచి విముక్తమైన మరుక్షణంనుంచీ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను అనుసరించనందుకు నెహ్రూను తప్పుపట్టే వీరికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశం ఎలా ఉండేదన్న విషయమై అవగాహన లేనివారు. రాజకీయంగా, ఆర్థికంగా, మరెన్నో విధాల భారత్ను అభ్యుదయ పథంలోకి నడిపించడంలో నెహ్రూ కృషి గురించి తెలియని తరమిది. నెహ్రూని విమర్శించే రెండో బృందం వారు మొదటి వారికంటే మరింత ద్వేషపూరితంగా, పెడరసంగా వ్యవహరించ డంలో సుప్రసిద్ధులు. కరడు గట్టిన హిందూత్వ వాదులు ఈ బృందంలో అత్యధికంగా ఉన్నారు. నెహ్రూ లౌకికవాద సంస్కృతిని రూపుమాపడానికి వీరు ఎంతగా కష్టపడినప్పటికీ సఫలంకాలేకపోతున్నారు. ఈ వైఫల్యం వీరిని మరింతగా నెహ్రూ ద్వేషులుగా చేస్తోంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా, స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడంతో హిందూత్వ తీవ్రవాదులు మరింతగా చెలరేగిపోతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతసామరస్యాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య చీలికలు సృష్టించే ప్రకటనలు నిర్భయంగా చేస్తున్నారు. వారిని నిలువరించేవారు ఎవరూ కన్పించడం లేదు. యోగి ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్ ఇత్యాది ద్వితీయ శ్రేణి నాయకులను అలా ఉంచండి. సాక్షాత్తు సంఘ్పరివార్ అధినేత, రాషీ్ట్రయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మహాశయుడు ఏమన్నారో చూడండి. ‘హిందుస్థాన్లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే’ అని ఆయన అన్నారు. హిందుస్థాన్లో నివసించేవారు హిందుస్థానీలని, వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు మొదలైన వారు ఉన్నారనే వాస్తవాన్ని ఎవరైనా ఈ పెద్ద మనిషికి దయచేసి తెలియజేస్తారా! ఈ మత సంకుచితత్వాన్ని నిరోధించడానికి ప్రధాని మోదీ ఇంతవరకు చేసింది చాలా స్వల్పం. అయితే తన అనుయాయులు, అభిమానులు మతం ప్రాతిపదికన హింసాత్మక ఘర్షణలను ప్రారంభించడంలో సఫలమయితే అభివృద్ధి సాధన గానీ, పాలనావ్యవహారాలను సజావుగా నడపడం సాధ్యం గాదనే సత్యం మోదీకి త్వరలోనే తెలిసివస్తుందని ఆశిస్తున్నాను. అయోధ్యలో రామాలయాన్ని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలనే డిమాండ్ను వదిలిపెట్టేలా హిందూత్వ తీవ్రవాదులకు ప్రధాని మోదీ నచ్చజెప్పగలగడం భవిష్యత్తుపై ఒక ఆశావహ, ప్రోత్సాహకర భరోసాను కల్పిస్తోంది.
ఇదే సమయంలో మనం సిగ్గు పడాల్సిన పరిణామం ఒకటి చోటు చేసుకున్నదనే వాప్తవాన్ని విస్మరించకూడదు. గత ఆదివారం నాడు మోదీ మంత్రిమండలి విస్తరణలో బీహార్కు చెందిన బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్కు కూడా చోటు లభించింది! దీనినెలా అర్థం చేసుకోవాలి? గత వేసవిలో సార్వత్రక ఎన్నికల సందర్భంగా ‘మోదీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారికి భారత్లో స్థానం లేదు. వారిని పాకిస్థాన్కు పంపించి వేయాలి’ అని ప్రకటించింది ఈ గిరిరాజ్ సింగ్ మహాశయుడే కాదూ? ఆ అప్రజాస్వామిక ప్రకటనను గిరిరాజ్ ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. పైగా మరింత గట్టిగా పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు ఆ బెదిరింపు ప్రకటనను. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, గిరిరాజ్ సింగ్ ప్రకటనతో తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అంతే గానీ తమ పార్టీ సభ్యుడిని ఏ విధంగానూ మందలించలేదు. చివాట్లు పెట్టకపోగా ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిమండలిలో చోటు కల్పించారు!
ఈ నేపథ్యంలో మనం జవహర్లాల్ నెహ్రూ 125వ జయంత్యుత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో నెహ్రూ సమున్నత వ్యక్తిత్వం (ఆయన చేసిన తప్పులతో సహా) గురించి సర్వత్రా చర్చలు జరగకుండా ఎలా ఉంటాయి? జరుగుతున్నాయి కూడా. ఈ చర్చల ద్వారా, దేశ జనాభాలో మూడింట రెండు వంతులుగా ఉన్న 35 ఏళ్ళ వయస్సు లోపు యువజనులకు ఆ ఉదాత్త చరిత్ర నిర్మాత గురించి వాస్తవాలు తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఇది మాలాంటి వారికి ఎంతైనా సంతోషకరమైన విషయం. ఇప్పటికే పత్రికలు, టీవీల్లో జరిగిన చర్చల సారాంశాన్ని క్లుప్తంగా చెబుతాను. నెహ్రూ గురించి చాలా విమర్శలు చేశారు. వాటిలో కొన్నిటిని ఒప్పుకోక తప్పదు. అయితే చాలా విషయాలపై ఏకాభిప్రాయం ఉన్నది. మనకాలంలో మహాత్మా గాంధీ తరువాత ద్వితీయ మహోన్నత భారతీయుడు జవహర్లాల్ నెహ్రూ అనే విషయమై అందరూ ఏకీభవించడం వాటిలో చాలా ముఖ్యమైనది. |
వీక్షకులు
- 1,107,505 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


