నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

నా దారి తీరు -80

శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

ఉయ్యూరు నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్ళాలంటే విజయవాడ వెళ్లి ,నందిగామ ,మీదుగా వెళ్ళాలి .లేకపోతె జగ్గయ్య పేట దగ్గర చిల్ల కల్లు అనే హైదరాబాద్ రూట్ లో ఉన్న సెంటర్ నుంచి మక్కపేట మీదుగా వెళ్ళవచ్చు .నేను జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు నందిగామ నుంచే వెళ్లాను .అక్కడ హెడ్ మాస్టారు నేనెప్పుడో  బాడ్మింటన్ ఆటల్లో చూసిన ఏం .ఆంజనేయులుగారు .ఎర్రగా చాలా ఎత్తుగా తెల్లని గ్లాస్గో పంచె ,చొక్కా తో ఉండేవారు .చొక్కాకి గుండీలు పెట్టేవారు కాదు. కంకిపాడు దగ్గర గొడవర్రు స్వగ్రామం .మంచి వాలీబాల్ ,బాడ్మింటన్ ప్లేయర్ .వీటికి తోడూ చెస్ అంటే విపరీతమైన క్రేజ్ .పేకాట సరే సరి .ఫిజికల్ సైన్స్ టీచర్ .ప్రమోషన్ పై హెడ్ మాస్టారుగా ఇక్కడికి వచ్చారు .సరదా మనిషి ఈజీ గోయింగ్ వారు .,ఇది కమ్మ టూరు .శ్రీ తిరుపతమ్మ దేవత అమ్మ వారి ఆడ బడుచు .కృష్ణా  జిల్లాలో గొప్ప తిరుణాల ఇక్కడే జరుగుతుంది .శక్తిగల దేవత గా ప్రసిద్ధి .మునేరు నది ఒడ్డున ఆలయం ఉంది .నదిదాటితే  మరో ఊరు వస్తుంది . అక్కడా హైస్కూల్ ఉంది .

పెనుగంచి ప్రోలు హైస్కూల్ పెద్దదే .దాదాపు అయిదు వందల ,మంది విద్యార్ధులున్నారు అన్నీ డబల్ సేక్షన్లే.కింది తరగతుల్లో మూడు నాలుగు సెక్షన్లు ఉన్నాయి .ఒక పెద్ద బిల్డింగ్ ,దానికి  ఆనుకొని రేకుల షెడ్లూ ఉన్నాయి .వీటిలో లోయర్ క్లాసులు ఉండేవి .సుందరరావు అనే ఫిజికల్ సైన్స్ మేష్టారు స్తానికుడే .సబ్జెక్ట్ లో ఏమీ దమ్ము లేనివాడు .క్లాసుకు  వెళ్లి పాఠం చెప్పాలంటే విసుక్కొనే వాడు .లాబ్ కూడా పెద్దదికాదు .దాదాపు విద్యార్ధులందరూ కింద కూర్చోవటమే .సెక్షన్ కు కనీసం యాభై మంది ఉండేవారు .ఆడపిల్లలకు విడిగా సెక్షన్లున్నాయి .కింద కూచుని పైకి లేచే ఆడపిల్లలను చూస్తుంటే జాలి వేసేది .చదువు ఇక్కడ చాలా తక్కువే .నేను పది ,తొమ్మిది ఎనిమిది తరగతులకు ఫిజికల్ సైన్స్  చెప్పేవాడిని .ఇంగ్లీష్ కూడా టెన్త్ కుచెప్పేవాడినని జ్ఞాపకం  .పిల్లలకు ఏమీ రాదు కనుక మనం ఏమీ చెప్పక్కర లేదని అందరి మేస్టార్ల అభిప్రాయం .

లెక్కల మేష్టారు ఆచార్యులు గారు నాతొ పాటే భుజబల పట్నం దగ్గర ఉండే హైస్కూల్ నుండి బదిలీపై వచ్చారు .ఉయ్యూరు దగ్గర కపిలేశ్వర పురానికి చెందినా సాయిబు గారుకూడా లేక్కల టీచర్  .ఇంకో ఆతను వెంక టేశ్వర్లుకూడా  ఉండేవాడు .మంచి వాడు . బ్రాహ్మణుడు రోజూ బేజా వాడ నుండి వచ్చేవాడు . .సోషల్ మేస్టర్ లలో ఎవరూ గుర్తులేరు .తెలుగుకు ఒక శాస్త్రి గారుపంచె చొక్కా ,పిలకా తో ఉండేవారు .భార్యా విధేయుడని పేరు .కలతల కాపురం అని చెప్పుకునే వారు .పింగళి లక్ష్మణ రావు అనే తెలుగు ఏం .ఏ .జూనియర్ తెలుగు పండిట్ .కాకాని నరసింహా రావు ,దాసుగారు ,సుందరీ గ్రేడ్ టీచర్లు .దాస్ గారు జిల్లా లో పేరుమోసిన బాడ్మింటన్ ప్లేయర్ .వాలీ బాల్ ఆటగాడు కూడా . క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వర రావు నల్లగా బారుగా ఉండేవాడు .డబ్బు వడ్డీలు తిప్పేవాడు .మేస్టర్లకు అప్పు లిచ్చి ఒకటో తేదీ జీతాల రోజున కాబూలీ వాలా లాగా అయిదు రూపాయల వడ్డీ తో గోళ్ళు ఊడ కొట్టి లాక్కునే వాడని అనుకొనే వారు .గార్దేనర్ గా భర్త చనిపోయిన ఒక  అమ్మాయి ఉండేది .ఆమెకు క్రాఫ్ట్  కూ’’ ఏదో ఉందని ‘’గుసగుసలున్దేవి .డ్రిల్ మేష్టారు గా కాకాని రంగయ్య గారు చాలా వృద్ధులు .పంచ చొక్కా తో ఉండేవారు .లోకల్ కాంగ్రెస్ లీడర్ .గోపయ్య గారనే పెద్దాయన డ్రాయింగ్ ?టీచర్ గా ఉండేవాడు .ఈయనదీ పంచె కట్టే .మామిడి వెంకటేశ్వర రావు డ్రిల్ మేష్టారు కుర్రాడు మంచిప్లేయర్ .తమిరిస నుంచి వెంకటేశ్వర రావు అనే వెడల్పు ముఖం ఉన్న ఒక కుర్రాడు చెవుల పోగులతో గొల్లతను లాబ్ అసిస్టంట్ గా ఉండేవాడు .ఇక్కడికి వచ్చి ఎదేనిమిదేళ్ళయిందని చెప్పేవాడు .అలాగే ఆక్కడి నుంచే వచ్చిన ఒక క్రాఫ్ట్ మేష్టారు మంచి ఆంజనేయ భక్తుడు .ఏ రోజుకా రోజు మళ్ళీ వెళ్ళిపోతా నని చెప్పేవాడు ‘’ఇన్ ఫ్లు ఎంషియల్ పెర్సన్ ‘’ లా ఉండేవాడు . నాకూ అదే కోరిక ఉండేది .ఆయన ఎక్కువ కాలం ఉండ కుండానే   ట్రాన్స్ ఫర్  చేయించుకొని వెళ్ళిపోయాడు .

స్కూలు కు మంచి ప్లే గ్రౌండ్ ఉంది .మంచినీటి సరఫరా ,లైబ్రరి ,తోట ఉన్నాయి .సాయంకాలం ఆటలు ఆడేవాళ్ళం .ఊళ్ళో తిరుపతమ్మ దేవాలయమే కాక యోగానంద  నరసింహాలయం ,పాత శివాలయం మొదలైనవి ఉన్నాయి .ఒకప్పటి బౌద్ధ క్షేత్రం కూడా .తిరుపతమ్మ తిరుణాలు మూడు రోజులు జరిగే ఉత్సవం .ఎక్కడెక్కడి నుండో జనం తీర్ధ ప్రజల్లాగా చేరుతారు .మునేరు ఒడ్డున గుడారాలు వేసుఒని  వండు కొంటారు .పొంగళ్ళు వండి నైవేద్యం పెడతారు .నేను పని చేసినప్పుడు అంటే 1985లో అమ్మవారి గుడి చాల ఇరకుగా ఉండేది .ఇప్పుడు అన్ని వసతులతో సర్వాంగ సుందరం గా ఉంది .తిరుపతమ్మ ,ఆమె భర్త గోపయ్య విగ్రహాలుంటాయి .శివాలయం చాలా పాతది .అయిదు వందల యల్లా ఆలం నాటిది .కార్తీక  మాసం లో ఉత్సవాలు బాగా జరుగుతాయి .ఊరికీ దగ్గర లో పెద్ద చెరువు ఉంది .దీని నీళ్ళు వ్యవసాయానికి బాగా ఉపయోగ పడుతాయి .వరి పండిస్తారు .మెత్తచేలల్లో పోగాకు పండుతుంది .మినుము ,పెసర వేరు సెనగ కూడా పండుతాయి .యోగానంద నరసింహాలయం లో ప్రతి శుక్రవారం రాత్రి పూట పూజ  భజన ,పవళింపు సేవ  పాటలు భక్తిగా నిర్వహిస్తారు వైష్ణవ పూజారిగారు .ఆయన్ను అందరూ ‘’అయ్యా వారు ‘’అంటారు .రోడ్డుకు కొంచెం ఎత్తైన ప్రదేశం లో ఈ ఆలయం ఉంది .పూజారి గారు అక్కడే కాపురం .వ్రుద్దులైనా ఏంతో చదువుకొన్నవారు .గౌరవం మర్యాదా ఊరందరి చేతా పొందుతారు .  కొత్త వారెవరైనా బ్రాహ్మలు ఊర్లోకి  వస్తే ఆచార్యుల గారింట్లోనే భోజనం .అతిధి మర్యాద బాగా ఉన్న వారు .వీరు కాక పది బ్రాహ్మణ  కుటుంబాలున్నాయి .కోమట్లు కూడామంచి స్తితి పరులే .వ్యాపారం వారిదే .చిన్న భోజన హోటల్ ఉంది .ముందుగా చెబితే వంట చేసి పెడతారు .స్కూలుల్ కు వెళ్ళేదారిలో ఒక పాక లో  ఒక టిఫిన్ హోటల్ ఉండేది .ఉదయం టిఫిన్ ,కాఫీ మధ్యాహ్నం టిఫిన్ ,టీ అక్కడే బాగా బిజీ గా ఉండేది .

మెయిన్ రోడ్డు ఒకటే .బస్సులు ఈ మార్గం గుండానే గుడి దాకా  వెడతాయి .చెరువు ప్రక్కగా నందిగామ కు వెళ్ళే బస్సులు తిరుగుతాయి .మెయిన్ రోడ్డు మీదుగా మక్క పేట సెంటర్ కు చేరి చిల్లకల్లు మీదుగా జగ్గయ్య పేట  వెడతాయి .మెయిన్ రోడ్డు మీద ,దాని వెనకాల రోడ్డు మీదే బ్రాహ్మణుల కుటుంబాలున్నాయి .మెయిన్ రోడ్డు మీద ఉన్న బ్రాహ్మణులలో విష్ణుభొట్ల బాబు గారు బాగా సంపన్నులు. వేద విదులు .అనేక దేవాలయ ప్రతిస్ట లు  నిర్వహించిన  కర్మిష్టి.వారింటిలో ఒక  గది ని నాకోసం మా లాబ్ అటెండర్ మాట్లాడి ఉంచాడు .అద్దె యాభై రూపాయలని జ్ఞాపకం .అక్కడ కాపురం వగైరా ఈ సారి రాస్తాను .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.