1969 లో అంటే 45 ఏళ్ళ క్రితం కవిత -బందరు -సారస్వత సమితి ముద్రించిన తొలి పుస్తకం లో

సాహితీ బంధువులకు శుభకామనలు -ఎప్పుడో 1969 లో అంటే 45 ఏళ్ళక్రితం  ,నా ఆదర్శ కదా రచయిత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారు అడిగితె రాసిన కవిత ”భ్రమ తొలగింది ”మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి  వారు ముద్రించిన  మొదటి పుస్తకం లో చోటు  చేసుకొన్నది .దాన్ని    ,బందరుకు చెందిన సాహితీ మూర్తి శ్రీ జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి గుడిపూడి రాదికారాణి  సేకరించి ,భద్రపరచి జిరాక్స్ కాపీ తీయించి నిన్న జరిగిన శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో పాల్గొనటానికి వచ్చి నాకు ఏంతో  ఆత్మీయం గా ముద్దుముద్దు మాటలతో అందజేసింది ఆ కవిత రాసిన విషయం ఎప్పుడో మర్చిపోయాను అది సమితి వారు ముద్రించిన పుస్తకం లో ఉందన్న సంగతీ నాకు తెలీదు లేక గుర్తు లేదు .ఈ క వితను పది రోజుల ముందు  రాధికా రాణి నాకు  ఫోన్ లో చదివి వినిపించి నన్ను ఆశ్చర్య పరచింది  నా కవిత వేనకే    బాలబందు స్వర్గీయ శ్రీ బి వి నరసింహా రావు గారి ”మంచి గంధము -మల్లెపువ్వులు ”కవిత కూడా ఉంది . ఆకవిత ఆయనలాగానే మంచిగంధపు చల్లదనాన్ని మల్లె పూల సోయగ ,సౌరభాలను వె ద జల్లుతుంది దాన్నికూడా మీ కోసం అందజేస్తున్నాను -దుర్గాప్రసాద్   69-1 001 69-2 001 balabandhukavita 001

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.