ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -162
62—సాంప్రదాయ ఆధునికత్వాల వారధి ప్రఖ్యాత జర్మన్ మార్మిక కవి –రైనెర్ మేరియా రిల్కే -2
కావాలనే ఒంటరిగా ఉన్నాడు రిల్కే .కాలాన్ని ఎక్కువగా మ్యూజియం, గాలరీ ,స్టూడియోలు ,లైబ్రరీలు పబ్లిక్ గార్డెన్ లలో గడుపుతూరాత్రి వేళల్లో రోడ్లమ్మట తిరుగుతూ సీన్ నది గట్ల వెంబడి పచార్లు చేస్తూ గడిపాడు .ఒంటరితనాన్ని ఆతను అర్ధం చేసుకోన్నంత ఎక్కువగా వేరెవరూ అర్ధం చేసుకోలేదు .బ్రహ్మాండంగా ఏకాంతాన్ని అనుభవించాడు .’’నాకు ఏకాంతమే కావాలి లోపలి ఏకాంతం . ఏకాంతమే పని, స్థాయి ,వృత్తీ అంటాడాయన .తాను రాసిన ‘’ది నోట్ బుక్స్ ఆఫ్ మాల్టేలారిడ్స్ బ్రిగ్గీ ‘’లో ‘’మనిషి అనేక నగరాలు తిరగి మనుషుల్ని చూడాలి .పక్షులు జంతువుల గురించి తెలుసుకోవాలి .పువ్వుల నవ్వులు అనుభవించాలి అప్పుడెప్పుడో ఏదో ఒక సమయం లో రాయాల్సిన దానిలో మొదటి ది స్పురిస్తుంది’’ అంటాడు
ఈ తిరగటం లో బెల్జియం ,కాప్రిమ్యూనిచ్ బిస్క్రా ,కార్తేజ్ ,నేపుల్స్ ,ట్యూనిస్లు చుట్ట బెట్టాడు .అల్జీర్స్ లో ఈజిప్ట్ లోనూ గడిపాడు .’’ది బుక్ ఆఫ్ అవర్స్ ,’’,ఎర్లి పోయెమ్స్ ‘’,ది లైఫ్ ఆఫ్ వర్జిన్ మేరీ లతోపాటు ఎలిజబెత్ బార్రేట్ బ్రౌనింగ్ పోర్చుగీస్ లో రాసిన సానేట్స్ ను అనువాదం చేశాడు. తనలో ఏదో మార్పు వస్తున్నట్లు గ్రహించాడు . పని దృష్టిఏర్పడి మనసు తో చూడటం ఆలోచించటం మొదలు పెట్టాడు. బయటిదాన్ని చూస్తూ అంతరంగం మదనాన్ని గ్రహించాడు . వస్తున్న మార్పు ఏమిటో తెలుసుకోలేక పోతున్నాడు .బాధ అనుభవిస్తూ ఎదురు చూస్తున్నాడు .భార్య నుండి విడిపోయి శారీరకంగా మానసికంగా కు౦గి పోయాడు .తనకు సృజన శక్తి తగ్గి పోతోందని బాధ పడ్డాడు .దిగులు నిరాశా ఉన్న సన్యాసి గా మారిపోయాడు .
అదృష్ట వశాత్తు మేరీ వాన్ తర్న్ అండ్ టాక్సిస్హోహెన్ లోహే అనే ప్రిన్సెస్ తో పరిచయమై ,త్రీస్టీలోని కాజిల్ ఆఫ్ ద్యునోలో ఆమె కు అతిధిగా ఉన్నాడు .ఏడాదిన్నర తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఒంటరిగా ఉన్నాడు .ఒక రోజు అకస్మాత్తుగా ఆధ్యాత్మిక శక్తి ఏదో అనుభవం లోకి వచ్చినట్లు అనిపించింది .ఏదో కొత్త విషయం జరిగింది .తానేదో ప్రకృతికి ఆవలి తీరం లో ఉన్నట్లు అనిపించింది .ద్యుయానో లో ఉన్న ఈకాలం లో అంతరాత్మ ఎదోచెప్పిన అనుభూతి కలిగింది .ఈ అనుభూతిని ‘’ద్యూనో ఎలిజీస్ ‘’గా పదేళ్ళు రాసి పూర్తీ చేశాడు .’’ప్రతి చోటా ఏదో కనిపించి దృష్టి గోచరమైంది .ప్రతి దానిలోనూ ఒక అంతర్ ప్రపంచం కనిపించింది . అంతరిక్షం తో ఉన్న ఒక దేవదూతదర్శనమైంది ..ఈ అంతరంగాన్ని పట్టుకోవటమే నా కర్తవ్యమ్ అనిపించింది ‘’అని రాశాడు రిల్కే .దైవ దర్శనం తోపులకించాడు .ఒక చెట్టు కొమ్మ లోనుంచి విశ్వాన్ని చూశాడు .రిల్కే చూసింది క్రిస్టియన్ దేవత కాదని దేవుని మారు పేరు అని అంటారు .రిల్కే ఆ దేవతలో కనిపి౦ చేది పూర్తిగా కనిపించనిదిగా మార్పు చెందుతుందని అన్నాడు .దేవదూతలో ఉన్న ప్రపంచానికే రిల్కే మనసును అర్పణ చేశాడు .అదే ఉండటం అవటం (బీయింగ్ అండ్ బికమింగ్ )అన్నాడు
ఈఎలిజీలలో ఉన్న శోకానికి జవాబుగా ‘’సానేట్స్ ఆఫ్ ఆర్ఫియస్ ‘’రాశాడు .శోకం తర్వాత ఆనందం అన్నమాట .మళ్ళీ ఒంటరితనం ,అవిశ్రా౦తత అనుభవించాడు .లోకసంచారం తిరిగీ ప్రారంభించాడు .ప్రజలంతా పతనం లో ఉన్నారన్నాడు ప్రేమ విషయం లో అతని అభిప్రాయాలు తమాషాగా ఉంటాయి .ఆదర్శ ప్రేమికులు అంటే స్త్రీత్వం ఉన్నవారే ,ఏదీ కోరనివారే ,అర్ధం చేసుకోగలిగిన వారే అంటాడు .మగ వాడు ప్రేమలో ఆశక్తుడని రిల్కే అభిప్రాయం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-16-ఉయ్యూరు
