గౌతమీ మాహాత్మ్యం -9
15వ అధ్యాయం –పైశాచ తీర్ధం
బ్రహ్మ ‘’గౌతమీనది దక్షిణ తీరాన ,బ్రహ్మగిరి ప్రక్కన ఉన్న అంజన పర్వతం పై శాపగ్రస్త యైన’’అంజనా ‘’అనే ఒక అప్సరస ఉంది.ఆమె తలవానర తల .భర్త కేసరి .ఇతనికి ‘’అద్రికా ‘’అనే మరోభార్యకూడా ఉన్నది .ఈమె కూడా శాపగ్రస్త అప్సరసయే .ఈమె కూడా ఇక్కడే ఉంటోంది .ఒకసారి కేసరి దక్షిణ సముద్రానికి వెళ్ళగా ,అగస్త్యముని ఇక్కడికి రాగా ఈ ఇద్దరూ భక్తితో పూజించారు .సంతోషించి వారిని వరం కోరమనగా ఇద్దరూ ‘’అందరికంటే బలవంతులు శ్రేస్టులు ,లోకోపకారులు ఐన పుత్రులను ప్రసాదించ ‘’మని కోరారు ‘’అలాగే ‘’అని ఆయన వెళ్లి పోయాడు .
ఒకరోజు ఈ స్త్రీలు నాట్యం చేస్తూ ,పాటలుపాడుతూ వినోదిస్తుండగా అప్పుడు వాయుదేవుడు నిరుతి చూసి చిరునవ్వు నవ్వగా ,వీరు కామంతో దగ్గరకు చేరబోగా తాము దేవతలమని వారిద్దరూ తమకు భార్యలౌతారని అనగా’’ సరే ‘’అన్నారు .అంజనకు వాయు దేవుని ప్రభావంతో హనుమంతుడు ,నిరుతి ప్రభావం తో అద్రికా కు ‘’అద్రి’’అనే పిశాచ రాజు పుట్టారు భర్తలు తిరిగి రాగా విషయం చెప్పి ,తమ తలచేత రూపం వికృతమై౦దని మొరపెట్టుకోగా గౌతమీ స్నాన దానాలు శాపమోచనం అని చెప్పి అదృశ్యమయ్యారు. పైశాచ రూపమైనఅద్రి అంజనను హనుమంతునిగౌతమీ స్నానం చేయించగా హనుమ అద్రిక నుకూడా తీసుకొచ్చి స్నానం చేయించాడు. అప్పటినుంచి ఇది ‘’పైశాచ తీర్ధం ‘’అయింది.’’వృషాకపి తీర్ధం ‘’అనే పేరుకూడా ఉన్నది . ‘’అన్నాడు నారదునితో .
16వ అధ్యాయం –క్షుధా తీర్ధం
నారదునికి బ్రహ్మ క్షుధా తీర్ధ విశేషాలు తెలియజేస్తూ ‘’ఒకప్పుడు కణ్వ మహర్షిఆకలితో అన్ని చోట్లలో తిరిగి సర్వ సమృద్ధమైన గౌతమాశ్రమం చేరి ఇక్కడి వైభవం చూసి ఆశ్చర్యపోయి తానూ గౌతముని వంటి ముని శ్రేస్టుడనే ,కనుక ఆయనను భిక్ష యాచించను అనుకోని గంగానదికి వెళ్లి స్నానం తో శుచియై, దర్భాసనం పై కూర్చుని గంగను, క్షుదను –‘’నమస్తేస్తు గంగే పరమార్తి హారిణే నమః క్షుధేసర్వజనార్తికారిణి-నమో మహేశాన జటోద్భవే శుభే నమో మహా మృత్యు ముఖాద్వినిః సృతే-క్షుధా రూపేణసర్వేషాం తాపపాప ప్రదే నమః –నమః శ్రేయస్కరీ దేవి నమః పాపప్రతర్దిని –నమః శాంతి కరీదేవి నమో దారిద్ర్య నాశిని ‘’ అంటూ స్తుతించాడు .ప్రీతి చెంది గంగ మనోహరాకృతిలో, క్షుద భీషణాకారం తో ప్రత్యక్షమై నారు.కణ్వమహర్షి నమస్కరించి’’సర్వమంగళ మాన్గల్యే బ్రాహ్మి మహేశ్వరి శుభే –వైష్ణవి త్ర్యంబకే దేవి గోదావరి నమోస్తుతే ‘’-సర్వ పాప కృతాం పాపే ధర్మకామార్ధ నాశిని-దుఃఖ లోభ మయీ దేవి క్షుదే తుభ్యం నమోనమః ;;అని కీర్తించాడు .ఇద్దరూ ప్రసన్నులై కావాల్సిన వరం కోరుకోమనగా ‘’దేహి దేవి మనోజ్ఞాని కామాని విభవం మమ-ఆయుర్విత్తం చ భుక్తిం చ ముక్తిం గంగే ప్రయచ్చమే ‘’అంటే ‘’నాకు మనోజ్ఞమైన కామనలు,సంపదా,ఆయుస్సు ధనం భుక్తి ,ముక్తి ఇవ్వు ‘’అని . గంగను –
‘’మయి మద్వంశజే చాపి క్షుధేతృష్ణే దరిద్రిణి-యాహి పాపతరే రూక్షేన భూయాస్త్వం కదాచన – అనేనస్తవేన యేవైత్వాం స్తువంతిక్షుధాతురాః-తేషాం దారిద్ర్య దుఖాని న భవేయు ర్వరో పరః ‘’ అంటే ‘’పాపురాలా తృష్ణా, దరిద్ర దేవీ రూక్షురాలా వెళ్ళిపో .నన్నూ నావంశం వాళ్ళనూ ఎప్పటికీ కలవద్దు .ఆకలిగొన్న వారెవరైనా ఈ స్తోత్రాన్ని చేస్తే వాళ్ళ దరిద్రం దుఖం కలుగకుండా చెయ్యి ‘’అని క్షుదను కోరాడు .అంతేకాక ఈ తీర్ధం లొ స్నానాదులు చేసినవారికి లక్ష్మి ప్రసన్నంకావాలనిఈ స్తోత్రాలను ఇంట్లోకాని తీర్ధంలో కాని పఠింఛిన వారికి దారిద్ర్యం ,దుఖం ,భయం కలుగాకు౦డుగాక ‘’అని కోరగా’’ అలాగే’’ అన్నారు వారిద్దరూ .అప్పటినుంచి ఇది కాణ్వ తీర్ధమని ,గాంగా అని క్షుధా తీర్ధమని ప్రసిద్ధమై సర్వపాపహరంగా ,పితరుల ప్రీతి వర్ధకంగా విలసిల్లు తోంది ‘’అని బ్రహ్మ చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
,
—
