గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970)
డా.మాడుగుల అనిల్ కుమార్ 1970 జూన్ 3న బ్రహ్మశ్రీ మాడగుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి సరోజనమ్మ దంపతులకు అనంతపురం లో జన్మించారు .తండ్రిగారు వేదపండితులు పురోహితులు. తల్లి సంస్కృత ఆంధ్రాలో పండితురాలు ,సంగీత విద్వాంసురాలు .అనిల్ కుమార్ పెదతండ్రి బ్రహ్మశ్రీ మాడుగుల వెంకట శివ శాస్స్త్రిగారు బహు గ్రంథకర్త .కనుక శర్మగారికి జన్మతః కవిత్వం అబ్బింది .సాధనతో ప్రావీణ్యం సాధించారు .
అనంతపురం శ్రీ విద్యారణ్య ప్రాచ్యోన్నత పాఠశాలలో10వ తరగతి వరకు చదివి ,గవర్నమెంట్ జూనియర్ కాలేజిలో ఇంటర్ పూర్తీ చేసి ,1987-91కాలం లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించి ,శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం లో ఏం ఏ .డిగ్రీ పొంది ,తిరుపతి కేంద్రీయ విద్యాపీతంలో బి.ఎడ్.అయి ,హిందూపురం లో కొంతకాలం సంస్కృత అధ్యాపకుడుగా పనిచేసి ,శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వ విద్యాలయం లో కులపతి శ్రీ సన్నిధానం సుబ్రహ్మణ్య శర్మగారి పర్య వేక్షణలో ‘’రఘువంశ మహాకావ్యం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్. డి.సాధించారు .
అవధాన పితామహులు శ్రీ సి వి సుబ్బన్నగారి ‘’అవధాన విద్య ‘’గ్రంథాన్నిఅవలోడనం చేసుకొని ,అవధాన విద్యలో పరిణతి సాధించి 1901నవంబర్ 1న మొదటి అవధానం చేశారు .1997లో తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలలో సంస్కృత అధ్యాపకులై ,క్రమంగా పదోన్నతి సాధించి ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల లో సంస్కృత విభాగ అధ్యక్షులుగా ఉన్నారు .ఇప్పటికి తెలుగు సంస్కృతాలలో ,అంతర్జాలం లో చేసిన దానితోసహా 19 అవధానాలు చేశారు.
తమ విద్వత్తుకు తగిన సంస్కృతాంధ్ర గ్రంధ రచన చేశారు .సంస్కృతం లో – , రఘు వంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః –పరిశోధన గ్రంధం .సంస్కృతం లో వివిధ ఛందస్సులతో అష్టకాలు స్తోత్రాలు రచించి ఆకడంబానికి ‘’’’వసంత కుసుమాన్జలిః అనిసార్ధక నామం పెట్టారు .అందులోని వి – శ్రీ ర్దినమనణే నవరత్నమాలః,శ్రీ రఘు రామ నవరత్నమాలాస్తోత్రం ,,శ్రీ వరదా౦జనేయాస్టకం ,శ్రీ గణేశా స్టకం,శ్రీ శారదా స్టకం,శ్రీ విద్యారణ్యస్తోత్రం ,శ్రీ వేంకటేశాస్టకం,శ్రీమచ్ఛంకర దేశికాస్టకం ,శ్రీ కృష్ణ మాలాస్తోత్రం ,మాతృభూమిస్తుతి
తెలుగులో శ్రీ వెంకటేశ్వర అక్సరమాలా స్తోత్రం ,శ్రీ రాఘవేంద్ర అక్షర మాలా స్తోత్రం , ఆన౦దమందాకిని ,శ్రీ వెంకట రమణ శతకం ,శ్రీరామనామ రామాయణం ,శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం(పురుష సూక్తానుసారం )శ్రీ సప్తమాతృకా వ్రతం ,వాల్మీకి (అనువాదం )చంద్రపీడా చరిత్ర ( సంస్కృత రచనకు తెలుగు తఅనువాదం )అవధాన పాంచజన్యం మొదలైన 21 గ్రంధాలు రాశారు’
అష్టావధాని శర్మగారికి అవధానరత్నసార్ధక బిరుదు లభించింది .గుత్తి నారాయణ రెడ్ది స్మారక అవార్డ్ అందుకొన్నారు
డా.అనిల్ కుమార శర్మగారి సంస్కృత కవిత్వ పాటవం చూద్దాం – .
1 -శ్రీర్దిన మణే నవరత్నమాలః –
1-స్పృహ ణీయ రూపమదితి ప్రియాత్మకం –నయనం హరేర్వరమయూఖ వర్షిణం-హనుమద్గురుం శ్రిత జనేషు వత్సలం –కరుణాకరం దినమణి౦ భజామ్యహం ‘’
8-గవేషణామే సఫలౌ బభూవ –యా దేవతా కామదుఘా ఇనానాం –తాం త్వాం ప్రపద్యే శరణాగతార్దీ –మాతారమా మంగళ మాతనోతు’’
2-శ్రీ రఘురామ నవరత్నమాలాస్తోత్రం
1-ఇనవంశ పయోనిధి సంజనిత –ద్విజరాజ మణే ద్విపరాడ్వరద-రఘురామ నమామి తవాన్ఘ్రియుగం ‘’
5-ప్రియ దర్శన భూత హితైకమతే –దశకంఠ విమర్దన నామతనో –హనుమద్ధ్రుదయం నిలయం భవతః –రఘురామ నమామి తవాంఘ్రి యుగం ‘’
3-శ్రీ వరదా౦జ నేయాస్టకం
4-వజ్ర సన్నిభ వక్షసం మృగరాజ మధ్యమవిగ్రహం -బ్రహ్మ సూత్ర విలంబినం దృఢ దంస్ట్రకం నగదారిణ౦—హారనూపుర కుండలై స్సమలంకృతం సువిలోచనం –శ్రీ ప్రభంజననందనం వరదాంజనేయ ముపాస్మహే .
4-శ్రీ గణేశాస్టకం
అగజయా నుతయా౦బికయా కృతం –వరమనోహర సుందర విగ్రహం –సరసిజాభముఖేన విభాసితం –గణపతిం శివపుత్ర ముపాస్మహే .
5-శ్రీ శారదాస్టకం
3-కరతలకమలాభ్యాం కచ్చపీవాదయంతీ—సురవర జన బృందైర్నిత్య మభ్యర్చమానా –స్పతికమణి నిభాసా మక్షమాలాం దధానా –నివసతు హృదయే మే శారదా సుప్రసన్నా ‘’
6-శ్రీ విద్యారణ్య స్తోత్రం
2-జ్ఞానం దత్వాచ బాల్యౌ త్ప్రభ్రుతి మయి గిరాం సంస్కృతం సంస్కృ తిం చ –నిక్షి స్యాన్త పూజ్యో విజయనగర సద్రాజ్య సంస్థాపకశ్చ-అధ్యాప్యంతే ధరిత్యాః నివసతి యశసా మండిత జ్ఞానభాన్డః-విద్యారణ్యో మునీన్ద్రః నిగమవన తటీ పాదపస్తం నమామి .
7-శ్రీ వేంకటేశాస్టకం
8-ఆనంద ఇత్యభి హితో నిలయ స్త్వదీయః-కాలుష్యపూర్ణ భువనం విమలం కరోతి –పాత్రీ కరోతు మయి భక్తి విశేషమిత్ధం –శ్రీ వేంకటేశ మమదేహి తవప్రసాదం’’
8-శ్రీ మచ్చంకర దేశికాస్టకం
1-విభూతి రేఖాంకిత ఫాల దీపితం –ఉరః ప్రదేశేచ తథాక్షమాలయా –దృశా ప్రసాదామలయా చకాసతం –నమామి శ్రీ శంకర దేశికోత్తమం .
8-నియమిత పద బంధైః స్తోత్ర ముక్తావలై స్త్వాం –కలుష రహిత భక్త్త్యౌ యాచనార్ధీ సిషించే-విలసతు ధిషణాయాం భావనాలోల లీలా-నివసతు హృదయే మే శారదా సంప్రసన్నా’’
9-మాత్రు భూమిస్తుతిః
1-శ్రీశైలం దక్షిణే భాగే వారణాసీం తదోత్తరే –ధృత్వా వపుషి దీప్తాం తాం వందే భారత మాతరం
6-పాణినే ర్ముని వర్యస్య చాస్టాధ్యాయీ విరాజతే –తయా విభ్రాజమానాం తాం వందే భారత మాతరం
10-శ్రీ కృష్ణ నవరత్నమాలా
1-శ్రీమద్వల్లవ పారిజాత విటపీ చూడామణి౦ రుక్మిణీ -హృన్మందార .ప్రదేశ విభ్రమ మహా భ్రుంగం యశోదా సుతం –
వందేహం జలజేక్షణం మురరిపుం భక్తౌఘ రక్షావరం –కృష్ణో రక్షతు మాం చరాచర జగత్క్రీడా విలాసొహరిః’’
ఈ స్తోత్ర ,అష్టకాలలో పండిన భక్తీ ,ఆరాధన ,ఆత్మనివేదన లను ,అమృతోపమానమైన పదబంధం తో రసగ గుళికలులాంటి శ్లోకాలతో ,ఛందో వైవిధ్యంతో అనిల్ కుమార శర్మగారు వర్ణించి తాను తరించి ,మనలనూ ధన్యులను చేశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-18-ఉయ్యూరు
