గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)
చాము కృష్ణ శాస్త్రి 23-1-1956న కర్ణాటక మంగుళూరు జిల్లా కాదిల గ్రామం లో జన్మించాడు .తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ లో సంస్కృతం నేర్చి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా టీనేజ్ లో ఇందిరా గాంధి ఎమర్జెన్సీ కాలం లో అండర్ గ గ్రౌండ్ కు వెళ్లి ,వీర సావర్కార్ ,స్వామి వివేకానంద లపై సంస్కృత రచనలు చదివి ప్రభావితుడై సంస్కృతమే ఊపిరిగా భావించాడు .
1981లో కృష్ణ శాస్త్రి ,స్నేహితులుకలిసి బెంగళూర్ లో ‘’సంస్కృత భాషణ ‘’(స్పోకెన్ లాంగ్వేజ్ )ఉద్యమ౦ ప్రారంభించారు .అంటే సంస్కృతాన్ని సంస్కృతం లోనే నేర్వాలి తప్ప వేరే భాష సహాయం తో కాదు అనే ఉద్యమం .అందుకని సంప్రదాయ విధానమైన వ్యాకరణం తో ప్రారంభించటానికి బదులు సంభాషణ రూపం లో సంస్కృతం నేర్చుకొనే నూతన విధానానికి శ్రీకారం చుట్టాడు .సంస్కృతం అభ్యసించేవారికి ఇది వరప్రసాదమై అందులో అతి తక్కువకాలం లో నిష్ణాతులయ్యారు .దీనితో కొద్దిపాటి చదువున్నవారు కూడా సంస్కృతం నేర్వటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు .
సంస్కృత భాషా వ్యాప్తికోసం చాము కృష్ణ శాస్త్రి ‘’సంస్కృత భారతి ‘’సంస్థను లాభాపేక్ష లేకుండా స్థాపించి ,తక్కువకాలం లో సంస్కృతం నేర్పెట్లు ఏర్పాటు చేశాడు .’’పదిరోజుల్లో సంస్కృతం లో మాట్లాడటం ఎలా ‘’ (టెన్ డేసాంస్క్రిట్ స్పీకింగ్ కోర్స్ )ఉద్యమాన్ని దేశమంతా ప్రచారం చేసి తగిన వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని ఉచితంగా నేర్పుతూ ఘన విజయం సాధించాడు .కోటి మంది ప్రజలకుఈ కోర్సు విధానం లో సంస్కృతం లో మాట్లాడే అవకాశం కలిపించాడు .ఒక లక్షమంది ఇళ్ళల్లో సంప్రదాయ విధానం లో సంస్కృతం లో మాట్లాడుతున్నారు .
సంస్కృత భారతి ప్రభావం విశ్వ విద్యాలయాలు కాలేజీల పై పడి సంస్కృతం లో సంభాషించే కోర్సులను ఏర్పాటు చేశాయి .అమెరికాలో’’ SAFL కోర్స్ ‘’అంటే ‘’సాంస్క్రిట్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ కోర్స్’’ భారతీయ చిన్నారులలో బాగా హిట్ అయింది.భారత దేశం లోనే కాక కెనడా అమెరికా ,యుకె ,యు ఏ యి వంటి 13 దేశాలలో కూడా సంస్కృత భారతి శాఖలు అత్యద్భుతంగా అంకిత భావం తో సేవ చేసున్నాయి .అంతేకాదు ఆ సంస్థ గుజరాత్ లో సంస్కృత భాష పునరుజ్జీవనాన్నికూడా సాధించింది.
‘’సంస్కృత గృహాలు ‘’, సంస్కృత మాతృభాషా పిల్లలు ‘’వంటి ప్రయోగాలు కూడా చేసి ఈ సంస్థ విజయాలు సాధించింది .’’సరస్వతి సేవ ‘’పేరిట వందలాది ఇతర భాషా పుస్తకాలను సంస్కృతం లోని అనువాదం చేయించింది .యువ రచయితలను ,పాఠకులను ఆకర్షించటానికి ‘’సంస్కృత పుస్తకోత్సవాలు ‘’’’,సాహిత్యోత్సవాలు ‘’నిర్వహించాడు శాస్త్రి .భారత దేశం లో ఇంగ్లిష్ ,హిందీ స్థానం లో సంస్కృతమే అనుసంధాన భాషగా(లింగ్వా ఫ్రాంకా ) ఉండాలని ,చేయాలని శాస్త్రి మనసారా కోరాడు .సంస్కృత భాష ఒక్కటే భారత ప్రజలందర్నీ ఒక్కటిగాచేయగాలిగేది అని ఖచ్చితం గా నమ్మాడు .సాంఘిక ఉన్నతి, ఐకమత్యాల సాధనకు సంస్కృతమే వేదిక కావాలని అంటాడు .
తనకున్న ఆశయాల సాధనకు శాస్త్రి ‘’సాంస్క్రిట్ ప్రమోషన్ ఫౌండేషన్ ‘’సంస్థ ను వాలంటరీ సంస్థగా ఏర్పాటు చేశాడు .సమాజం లో అణగారిన ప్రజలకు సమాజ అభ్యున్నతికి ,సంస్కృతికి సంస్కృతమే ఆధారం అని భావించాడు .ఈ సంస్థ ట్రస్టీలు గా భారత సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆర్ సి లాహోటి ,మాజీ చీఫ్ ఎలెక్షన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ యెన్ గోపాలస్వామి ,జస్టిస్ రామ జాయిస్ ,శ్రీ గురుమూర్తి వంటి ప్రముఖులున్నారు .దీనికి శాస్త్రి ముఖ్య ట్రష్టి మరియు సెక్రెటరి.
ఎక్కువకాలం టీచర్ ట్రెయిని౦గ్ వర్క్ షాప్ లలో లెర్నింగ్ మెటీరియల్స్ తయారీ ,సంస్కృత విద్యా చర్చలలో శాస్త్రి గడుపుతాడు .సంస్కృత భాష నేర్పటమే కాదు గణితం ,కెమిస్ట్రి,హిస్టరి మొదలైన సబ్జెక్ట్ లను కూడా సంస్కృతం లోనే నేర్పాలన్నది శాస్త్రి ఆశయం ,ధ్యేయం.కేంద్ర ప్రభుత్వ’’ రోడ్ మాప్ ఫర్ ది డెవలప్ మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ –టెన్ యియర్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ డాక్యుమెంట్ ‘’ కమిటీలో శాస్త్రిని 2016లో గౌరవ సభ్యుని చేశారు .శాస్త్రికి ఉన్న అపార అనుభవం తో ‘’బోర్డ్ ఆఫ్ రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ ‘’వంటి అనేక సంస్థలలో గౌరవ సభ్యుడయ్యాడు .సంస్కృతం లో అనర్గళంగా ,ఆలోచనాపూర్వాకం గా మాట్లాడే నేర్పు శాస్త్రి ది.భగవద్గీత ఆదర్శం గా ఆయన జీవిస్తాడు. ప్రశంసలకు పురస్కారాలకు దూరం .
కార్యకర్త మాత్రమేకాక శాస్త్రి సంస్కృత గ్రంథ కర్త కూడా –సావదాన్ శ్యాం ,ఉత్తిష్ట మా స్వప్తః ,పరిష్కారః (వ్యాస సంపుటి ) రచించాడు .శాస్త్రి చేసిన సంస్కృత సేవకు కాశీ విద్యా పీఠం’’సారస్వత సుధాకర ‘’ అఖిలభారత విద్యార్ధి పరిషత్ ‘’రాస్ట్రీయ యువ పురస్కార ‘’అందజేశాయి .కేంద్ర ప్రభుత్వం 2017లో ‘’పద్మశ్రీ ‘’పురస్కార మిచ్చి గౌరవించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-18-ఉయ్యూరు

