పిండారీలు
బలవంతంగా దౌర్జన్యంగా హింసించి ధనాన్ని అపహరించే సాయుధ అవ్యవస్దిత గుర్రపు రౌతు మూకలే పిండారీలు .ఆహారం, డబ్బుకోసం దోపిడీ చేసే ముఠా.17వ శతాబ్ది ముస్లిం పాలన నుంచి 19శతాబ్ది వరకు ఉన్నారు .ముస్లిం సైన్యానికి దారి చూపించేవారు .తర్వాత మరాఠా సైన్యానికి సహాయ పడ్డారు .1817-18లో వారెన్ హేస్టింగ్స్ నాయకత్వం లో వీరిని అణగ తొక్కి అంత౦ చేశారు .హత్యలు దోపిడీలు కొల్లగొట్టటాలు వీరి నిత్య కృత్యం .పిండారీ అనే మాట పింద్ర అంటే మత్తుకలిగించే ద్రవం అనే మరాఠీ మాట లోంచి పుట్టింది .ఇది గడ్డిమోపు , తీసుకొనే వాడు అనే రెండుమాటలలోంచి కూడా ఏర్పడిందిఅంటారు .వీరికి ఆశ్వికదళమే కాక కాల్బలమూ ఉండేది .వీరి ఆహార్యం –నెత్తిపై టర్బన్ తో అర్ధ దిగంబరంగా నడుం చుట్టూ వస్త్రం తో మాత్రమె ఉండేవారు .చేతిలో నిశితమైన ఖడ్గం అంటే తల్వారు ఉండేది. కాళ్ళకు పాదరక్షలు ధరించేవారు .శత్రు సైన్యం రహస్యాలను ,కదలికలను పసిగట్టి తాము నమ్మిన వారికి అందించటం లో ఆరి తేరిన దిట్టలు .ఔరంగజేబు పాలన లో వీరి గురించి ప్రస్తావన మొదట వచ్చింది .తర్వాత ,మరాఠా సైన్యానికి మద్దతు నిస్తూ మొఘల్ సామ్రాజ్య పాలనపై ఎదురు తిరగటం తో పిండారీలపాత్ర బాగా ప్రచారమైంది .శత్రు భూభాగం లోకి తేలికగా చొచ్చుకుపోయి వారిని కల్లోలపరచి కకావికలు చేయటం లో సిద్ధహస్తులనిపించారు .ఐతే 1791లో శృంగేరిశారదా పీఠంపై పిండారీల దాడి వారిని దూషణకు గురి చేసింది .శివాజీ పాలనలో వారి అధికారాలకు కళ్ళాలు బిగించాడు .
పిండారీలు ముఖ్యంగా ముస్లిం లు . కాని వారి ముఠాలో అన్ని వర్ణాలవారినీ చేర్చుకొన్నారు .ఔరంగ జేబు చావుతో మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యాక ,నవాబులు, హిందువులు బహిరంగం గా యుద్ధాలు చేశారు .స్థానిక భూస్వాములు స్వంతఖర్చుతో సైన్యాలను ఏర్పాటు చేసుకొన్నారు .మఠాలు, మఠాధిపతులు వారికి అండగా నిలిచారు .దేవాలయాలు నివాసాలయ్యాయి .మధ్యభారతం లోదక్కన్ , గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఒరిస్సాలలో పిండారీలు దండిగా వ్యాపించారు .19వ శతాబ్ది ప్రారంభం లో పిండారీ నాయకుల ,దళాల నిర్వహణ కోసం డబ్బు బాగా అవసరం వచ్చి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గంగా దోపిడీలు బందిపోటుదొంగతనాలు ,హత్యలు చేసి డబ్బు కూడబెట్టేవారు .క్రీ.శ. 1800-15కాలం లో పిండారీల సంఖ్య 20వేలు నుంచి 30 వేలు ఉండేది .పల్లెటూళ్ల పై విరుచుకుపడి,అందిన౦తా దోచుకొని పోయేవారు.అమాయక ప్రజలను బానిసలు చేసి డబ్బుకు అమ్ముకొనేవారు .ఈ దౌర్జన్యాలతో స్థానిక నవాబుల హిందూ రాజులబ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేవారు .
పిందారీలను అణచి వేయగానే వారు అనేక ప్రదేశాలకు వలస పోయారు .అక్కడి ప్రజలు పిండారీ స్త్రీలకు ఆవాసాలు ఏర్పరచి జీవించటానికి తోడ్పడుతున్నారు ఆస్ట్రేలియాలో ని బ్రిస్బేన్ లో ఇలాంటి వసతి గృహాలున్నాయి .పిండారీ విమెన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పరచి వారి అభివృధికి జీవనోపాధికి వీలుకల్పిస్తున్నారు .ఆస్ట్రేలియాలోని స్ప్రింగ్ హిల్స్ లో పిండారీ వుమెన్ హాస్టల్ ఉంది .
హిమాలయాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లో పిండారీ నది ఉన్నది .దీని ప్రవాహం 105కిలోమీటర్ల వ్యాప్తిలో ఉండి తీరప్రాంతాలలో మన్మట్టి ,నంద కేసరి ,భాగోలి మొదలైన పట్టణాలున్నాయి .కర్ణ ప్రయాగ లో పిండారీనది అలకనంద నదిలో సంగమిస్తుంది .అక్కడినుంచి అలకనంద పేరుతొ నే పిలువబడుతుంది .
ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ పిండారీ హిమానీ నది ట్రెక్కింగ్ లో 24మంది మహిళా బృందం ఇండియన్ నేవీ ఆధ్వర్యం లో 2018మార్చి 24నుంచి ఏప్రిల్ 2 వరకు నడిచి వెళ్ళింది .ఇది మహిళా సాహసికులకు గొప్ప అవకాశమైంది .మార్చి 26న లోహార్ కోట్లో ట్రెక్కింగ్ ప్రారంభమైంది .మంచు రాళ్ళు కొట్టుకుంటూ దారి చేసుకొంటూ ధకూరి ఖాతి దవాలి గుండా ప్రయాణించారు .అక్కడినుంచి ముందుకు నడవటం ప్రాణాంతకమైన పనే అయినా ధైర్యం కోల్పోకుండా ఆరు లాండ్ స్కేప్ జోనులను దాటి ముందుకు సాగారు .మార్చి 30న 3353 మీటర్ల ఎత్తులో ఉన్న పిండారీ గ్లేషియర్ జీరో పాయింట్ చేరారు .ఈ హిమానీ నది ఒకటిన్నర కిలోమీటర్ల వెడల్పు ,మూడుపాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు ఉన్నది .కమాండర్ ప్రియా ఖురానా ప్రేరణతో ఈ మహిళా అధ్యయన బృందం విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేసి పిండారీ నది మార్గాన్ని సులువు చేసి విఖ్యాతి చెందింది .మార్చి8 మహిళా దినోత్స్వసందర్భంగా ఆ మహిళా సాహసిక బృందానికి అభినందనలు .
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూరు

