యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26
ప్రబోధం
ఒకరోజు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళగా అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజించి ‘’గోవులు కావాలనా లేక నా చేత ఏదైనా అర్ధవంతమైన ప్రశ్న అడిగి౦చు కోవాలనా తమరు దయ చేశారు ?’’అని అడిగాడు గౌరవంగా .’’రెండిటికోసం వచ్చాను బ్రహ్మం గురించి ఇదివరకుఎవరైనా నీకు చెప్పినదంతా నాకిప్పుడు చెప్పు జనకరాజా ‘’అన్నాడు మహర్షి .’’వాక్కే బ్రహ్మ ‘’అన్నాడు రాజు .’’వాగ్బ్రహ్మ శరీరం స్థితి చెప్పు ?”’అంటే తనకు ఆగురువు చెప్పలేదన్నాడు .మహర్షి ‘’వాగ్బ్రహ్మ ఒక పాదం అంటే అతడు పలకాల్సింది ఇంకా మూడు వంతులుంది .’’అనగా దాని శరీరం స్థితుల గురించి వివరించమని కోరాడు రాజు .’’వాక్కే శరీరం ఆకాశం అంటే పరమాత్మ .ఆశ్రమం పరబ్రహ్మ లో నాలుగవ భాగమైన ఈ బ్రహ్మం నే ప్రజ్ఞ అంటారు .దీనినే ఉపాసించాలి .అన్నాడు .’’ప్రజ్ఞత అంటే వాక్కును తెలుసుకో దగిన శాస్త్రం ఏది ‘’?అని అడిగాడు .’’వాక్కునే ప్రజ్ఞత అంటారు .ఎందుకంటె ఆవాక్కుతోనే వేద శాస్త్ర పురాణాలు యజ్ఞ యాగాలు ధర్మ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసుకో బడతాయి .వాక్కును బ్రహ్మ అని ఉపాసిస్తే అది అతడిని విడిచి వెళ్ళదు అతడు సకల భూతాలను ప్రేమిస్తాడు .ఈలోకం లో ఉన్నంతకాలం దేవుడుగా ,చనిపోయాక దేవతలో కలిసిపోతాడు .’’అనగా ఆనందించి రాజు ఆయనకు ఏనుగుల్లాంటి నూరు ఎద్దులను ఇస్తానన్నాడు .మహర్షి ‘’రాజా !శిష్యుని కృతార్దుడిని చేయకుండా అతడి నుంచి ధనం తీసుకో రాదని మా తండ్రి చెప్పారు .ఇంకెవరైనా ఆచార్యుడు ఏదైనా చెబితే నాకు వివరించు ‘’అన్నాడు .జనకుడు ‘’ఉదంకుడు ప్రాణం లేని వాడికి ఏమీ కలుగదు కనుక ప్రాణమే బ్రహ్మం అని చెప్పాడు ‘’అనగా ఆ ప్రాణానికి శరీరం ఏమిటో ఆశ్రమం ఏమిటో ఆ గురువు చెప్పాడా ?’’అని అడుగగా చెప్పలేదన్నాడు .ప్రాణం ఏకపాదం మాత్రమే అంటే ఇంకా మూడు వంతులు ఉన్నది .వివరించమని అడుగగా ‘’ప్రాణ రూపపరబ్రహ్మానికి ప్రాణమే శరీరం .ఆకాశమే ఉత్పత్తి స్థానం .అది ప్రేమ రూపమైనదని భావించి ఉపాసించాలి ‘’అన్నాడు
‘’ప్రియత ‘’అంటే ?’’ప్రాణమే ప్రియత .ఎందుకంటె ప్రాణం కాపాడుకోటానికి ధనం సంపాదిస్తారు .యాగార్హత లేకపోయినాయాగం చేయిస్తుంది .తీసుకో కూడనివి తీసుకొనేట్లు చేస్తుంది .భయ పెట్టె దిక్కుకే ప్రాణ రక్షణకోసం వెడతాడు .కనుక ప్రాణమే పరబ్రహ్మం .ప్రాణ రూప బ్రహ్మాన్ని ఉపాసిస్తే ప్రాణం అతడిని వదలదు .అతడితో భూత సంతతి అంతా స్నేహంగా ఉంటుంది .ఈ లోకంలో దేవుడుగా భావింపబడి చనిపోయాక దేవతలలో కలిసిపోతాడు .’’అని చెప్పగానే జనకుడు పరమ సంతోషం తో అతడికి వెయ్యి ఎడ్లు ఇస్తానన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూ

