శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

సగం అన్నం అందులో సగం నీరు మిగిలింది గాలికి వదలితే సంపూర్ణ ఆరోగ్యమే .మాయ ఆవరించిన ఈ ప్రపంచం లో మాయ తొలగిపోతే బ్రహ్మమయమే అవుతుంది .యోగులకు అసాధ్యమేదీ లేదని చెబుతూ చక్కని పద్యం చెప్పారు శాస్త్రి గారు –‘’నేల జొచ్చు ,నింగి కెగయు ,గాలి నాపు -,నీరు ప్రవహింపగా  జేయు  నిప్పు నణచు –ప్రకృతి ఎల్ల స్వాధీనమై పరగు నెపుడు –యోగులకు నసాధ్యమను టెందు లేదు ‘’అంటారు .యోగులు శరీరాన్ని ఎముకల గూడుగా భావిస్తారు .అందుకే దేహం పై మొహం వదిలి సోహం అంటూ కర్మమును బ్రహ్మమును వీడక ఆత్మ ధర్మాన్ని అన్ని చోట్ల పాటిస్తూ జీవిస్తారు . ఎవడు తింటే సర్వ భూతాలూ తినినట్లు అవుతుందో వాడే సద్గురువైన వాసుదేవుడు .గురు శాపమే బలిని అధోలోకాలకు చేర్చింది .కనుక గురు అనుగ్రహ బలమే సుఖ శాంతులకు మూలం .’’కష్టముల కోర్చి హనుమ భాస్కరుని వద్ద –విద్యలను  నేర్చి యోగ ప్రవీణుడయ్యె ‘’అని హనుమంతుని యోగ వైభవ సాధన గూర్చి తెలియ జేశారు .మనసు నిగ్రహం గా ఉంచుకోవటం యోగ మార్గాలలో ఒకటి .

‘’ బ్రహ్మ మెరుగు సాధనము తపమ్ము ,ఋషులు –మునులు నిశ్చల చిత్తులై ముక్తి గా౦చుదురు ‘’రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటానికి యోగమే పరమ సాధనమైనదని గుర్తు చేశారు .’’ఆశలు నెరవేరగాహర్ష –మందు కు కృషి –ఆత్మ విశ్వాస ము గలుగుటవసరంబు ‘’అని  ధర్మ సూక్ష్మంతెలియ జేశారు .బుద్ధిజాడ్యాన్ని తొలగించి ,సిద్ధి నిచ్చి ,ఆత్మ విజ్ఞాన మిచ్చి ,చాలాకాలంగా నిద్రాణ మై ఉన్న ‘’జీవ శక్తి మేలు కొలుపు  -యోగాసనాల్ మేలు గూర్చు ‘’అని ప్రాణ శక్తి ఉద్దీపనకు సర్వ విధాలా సహకరించి జీవితాన్ని ఉత్తేజ పరచేది యోగాసనాలే నంటూ స్పష్టం గా చెప్పారు .’’త్రికరణాలు కలుషితమై ,కోపం తారా స్థాయిలో ఉంటె ,అలాంటి క్రోధాన్ని అణగ చేయగల ఏకైక మార్గం యోగా .

‘’అందరికి గల ప్రాణ౦ బానంద రూప –మదియు బరమాత్మ కు బ్రతీక మగుచు వెలుగు –‘’ఆత్మ వత్సర్వ భూతంబు ‘’లాదరింప –దగుననెడి సూక్తికిన్ బరమార్ధ మిదియే ‘’అని వేదోపనిషత్ ధర్మాన్ని కమ్మని పాదం గా మలిచి సుబోధకం చేశారు .అలాగే ‘’దేహమున నవయవముల్ దీప్తి దనర –సూత్ర నేతి యు ,గజకర్ణి సుఖము నిచ్చు ‘’అంటూఈ  రెండు అభ్యసిస్తే సుఖానికి కొరత ఉండదని హామీ యిస్తారు .యోగం వలన బుద్ధి వికసిస్తుందని చెబుతూ పద్య రూపం లో ‘’బుద్ధి వికసించు యోగ విభూతి కతన ‘’అంటారు .ప్రాణాయామం అంటే యెంత తేలికో అంత తేలిక పదాలతో పద్యాలలో అందంగా బంధించి మన ముందు నిలిపారు –‘’ఒక ముక్కు బంధించి ,వేరొకట బీల్చి –రెండు బంధించి తగు నూపిరి బిగ బట్టి –తొలుత మూసిన ముక్కుతో వెలువరింప –ప్రముఖమైన ప్రాణాయామ పధ్ధతి యగు –నాడులనది శోధించు  ననవతరంబు ‘’అంటూ ప్రాణాయామం నాడీ శోధనకు  దివ్యౌషధం అన్నారు .శ్వాసలకు యోగ పరిభాషలో ఉన్న పూరక ,రేచకాలకు నిర్వచనం చెబుతూ గాలిపీలిస్తే పూరకమని వదిలితే రేచకమని వివరించారు .

‘’పడక కుదరదు,నిద్రయు పట్ట దెపుడు –నిలబడుతకు కూర్చుండుట కలమట పడు –నడుము నొప్పితో గనపడు  నరక మెపుడు –తొలగునది భుజంగాసన మలవడ౦గ’’అని భుజంగాసనం చేసే మేలును  వర్ణించారు . ఈ విశ్వానికి పరమ యోగా గురువు ఆ శ్రీ మహా విష్ణువే నని చెబుతూ –‘’యోగ నిద్ర బూనెడు హరి ,యుత్తమ గతి –మనల కుపదేశ మొనరించు మమత తోడ –దేహముకన్న భిన్నమౌ దేహి యనుచు –విశ్వ రూపు డైనను తాను  వేరగుటను ‘’ అని విష్ణు యోగ రహస్యాన్ని చేదించి చెప్పి మనల్ని ‘’ఫాలో ఆన్ ‘’అవమన్నారు .యోగాభ్యాసం చేస్తే –యవ్వనం తరగదు ,ముసలితనం ముఖం  లో కనిపించదు ,కాలం తెలియదు గ్లాని ఉండదు .నిత్యోత్సాహంగా మానవుడు ఉండాలంటే యోగమే శరణ్యం అంటారు .’’రక్త పోటును ,మధు మేహ రక్కసులన –బరగు నుగ్ర రోగ౦ బుల బారి బడక –బ్రతుకు సుఖ మయంబుగ జేయు జతన మందు –యోగమే శరణ్య మఖిలాభ్యుదయమునకు ‘’అని’’ నవీన పత౦జలి ‘’లా ఉద్ఘోషించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .బ్రాహ్మీ ముహూర్తం లో లేచి పక్షుల కలరవాలను వీనుల విందుగా వింటూ ప్రక్రుతి ప్రశాంత అందాలను ఆస్వాదిస్తూ శుభ్రమైన ప్రాణవాయువు  పీలుస్తూ యోగా చేస్తే ఆయురారోగ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయంటారు .ఇవి సాధకులకు అనుభవైక వేద్యమైనవే కదా .మితాహారం సత్సాంగత్యం వలన పవిత్ర జీవితం కలిగి ‘’బ్రహ్మ మీ జగంబను జ్ఞాన పధము జూపు ‘’  .

‘’తిష్ట కుదిరిన వారికి నిస్ట కుదురు –నిష్ట కలిగిన ధ్యాన గరిస్టు డగును-ధ్యాన యోగ సాధన పరమాత్మ జేర్చు –పరమద్వైత సుఖమనుభవమున గను’’అని యోగాభ్యాసం తో చివరి మెట్టు అయిన ముక్తి పదం లభిస్తుందని నిర్ద్వందంగా తెలియ జేశారు .జీవికి కావాల్సింది అదే .దాన్ని అందుకోవటానికి యోగం పరమ ప్రమాణమైన సాధనం .శీర్షాసనం ఏకాగ్రత కలిగిస్తుంది .పౌష్టికాహారం ,పళ్ళు పాలు ఆకుకూరలు యోగ సాధకునికి మేలు చేస్తాయి .’’నిన్ను నీవు తెలిసికొనుట’’కే యోగా అవసరం .  ‘’పనిలో దైవాన్ని చూడాలి .విషయ వాంచలు దూరమై ఆత్మనిగ్రహం ,అంతర్ముఖత్వం యోగా వల్ల లభిస్తాయి .ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ –కనుక సౌర శక్తిని ఆస్వాదించి ఆరోగ్యం పొందాలి .సూర్యుడు త్రిమూర్తులకు మూల శక్తి ,ఆత్మ శక్తి కూడా .

చివరగా ఫల శృతి చెబుతూ శాస్త్రిగారు –‘’కాల మతి వేగముగ సాగు,కష్ట సుఖము–లకు ,వియోగ సంయోగములకు నతీత-మగుచు ధనమదికారంము నడ్డు కావు –బలము ,బలగమ్ము నద్దాని నణప లేవు –యోగులకు పునరావృత్తి యుండ బోదు ‘’అని యోగులకు పునర్జన్మ ఉండదని పునరావృత్తి రాహిత మోక్ష సామ్రాజ్యం లో శాశ్వతం గా ఉండి పోతారని యోగ విభూతిని శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు తేట తేట తెలుగు మాటలతో మృదు మధురంగా యోగ రసామృతాన్ని మన చేతిలో పద్య రూపం లో ఉంచి రికార్డు సృష్టించారు .అంతర్జాలం లో ఉన్న ఈ 131పద్యాలను అందరూ చదివి ఆస్వాదించి శాస్త్రి గారిని అభినందించాలని కోరుతున్నాను . ఈ యోగ వైభవ పద్య శతకం ప్రధాని మోడీ గారి దృష్టిని ఆకర్షించాలని కోరిక .

శాస్త్రిగారి ఫోన్ నంబర్ -8106766197

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1

Inline image 1

ప్రధాని మోడీ పిలుపు ననుసరించి ప్రపంచమంతా యోగ మాయ లో మునిగి పోతోంది .ఇప్పటి వరకు తెలుగులో యోగా పై వచన రచనలే వచ్చినట్లు జ్ఞాపకం .పద్యాలలో యోగ వైభవాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు చెప్పగలం అని రుజువు చేశారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .వారికి పద్యం నల్లేరు పై బండి .చాలా సరళం గా సాగిన రచన ఇది. శృతి లయలతో పద్యానికి శోభ కలుగు తుంది .కాని అది నేడు గ్రహణం పట్టింది .ఛందస్సులో రాసినవే శాశ్వతాలు అని కవి గారి నమ్మకం .ముందుగా యోగ వైభవాన్ని బోధించిన పతంజలి మహర్షికి నమస్కరించి ,యోగాన్ని పరంపరానుగతంగా నేర్పు తున్న వారందరికీ శత కోటి వందనాలు సమర్పించారు .యోగా చేస్తే -’’ఉదర దోషంబు తొలగు ,నూబ కాయ మడుగు నంద మారోగ్యంబు నంద గలుగు –సుఖము సంతాన సౌఖ్యంబు చూర గొనగ –సాధకులకు యోగ మొక రసాయనంబు ‘’అని దాని వలన పొందే లాభాలను తెలియ జెప్పారు .దేవ ,పితృ,రుషి రుణాలు తీర్చుకొని తరిస్తారు .కాని యోగ సాధన జగతికభ్యుదయ మొసగు ‘’అని రూఢిగా చెప్పారు .  యంత్రాల సాయం తో అన్ని సుఖాలు పొందుతున్నాం .’’శరీర రక్షణ ముపకరింప ,యోగ రక్షణము కల్పింప వలయు ‘’నని సుద్ది చెప్పారు .’’సకల రోగ నిరోధక శక్తికి యోగం అభయమిస్తుంది మానసిక శారీరక బాధలు నాడీ రోగాలకు దివ్యౌషధం యోగ .వజ్రాసనం ఉదర రోగాలపాలిటి వజ్రాయుధం .వ్యసనాలకు బానిస కాకూడదు  .’’యోగాభ్యసనమే అభి వ్రుద్ధిపధము ‘’అని ఢంకా బజాయించి చెప్పారు .సుప్త పవన ముక్తాసనం అపూర్వ ఫలాలనిస్తుంది .భస్త్రిక చేస్తే నరాలకు ఊర్జవం వస్తుంది .ఎన్నోరకాల ఆసనాలున్నాయి గురుముఖతా నేర్చి అభ్యాసం చేయాలి .’’జీవులకు యోగమె సిద్ధు లెనయ ‘’అంటారు .

‘’వజ్రము నవ రత్నములలో వాసికెక్కు –నటులెఆసనములను వజ్రాసనంబు –అరుగుదలయు నారోగ్యంబు నలర జేయు –కాళ్ళు ముడిచి కూర్చుండి మోకాళ్ళ పైన –చేతులుంచి ఏకాగ్ర మౌ చిత్త మెనయ –  వెన్నెముక నిటారుగా నిల బెట్ట వలయు –సకల జీవులన్ నరులకే సాధ్యమగును-నాత్మ యోగంబు సిద్ధింప ననువు పడును ‘’అంటూ పద్యం లో వజ్రాసనం ఎలా వేయాలో సులభంగా చెప్పారు .’’యమ నియమములా సనములు ,ప్రాణ నియతి –ధ్యాన ధారణ యోగముల్  తత్సమాది –‘’అని యోగం లో 8విభాగాలను వివరించారు .ఇలాంటి యోగామ్రుతాన్ని అందరూ గ్రోలి సుఖ శాంతులు పొందాలి .శ్వాస కోశ బాధలకు ‘’కపాల భాతి ‘’దివ్యాస్త్రమే .’’ఆత్మ యన ప్రాణ మది పరమాత్మ తోడ –జేర్చుటయే యోగ మానంద సిద్ధి ఫలము –పరిమితంబైన వ్యక్తి ,అపరిమిత మగు – విశ్వ శక్తితో జేరి వివేక మెనయ ‘’అని యోగ రహస్యాన్ని విప్పి చెప్పారు .యోగం లో ప్రాణాయామం ఊపిరి ఉండే దాకా చేయాలి .కారణం ‘’బ్రతుకు లూపిరితోడ ,సంబద్ధ మగుట –నభ్యుదయ సాధకము యోగ మరయ బ్రజకు ‘’అని యోగ అభ్యుదయ సాధనమన్నారు .యోగం శాంతి సౌఖ్యాలిచ్చే ప్రశస్త ఔషధం.  యోగ సాధన వలన ఆత్మ శోధనం అలవడుతుంది .నేను, నాది అనే సంకుచిత పరిధి దాటి విశ్వ చైతన్య శక్తిలో చేరిపోతాం .’’చిత్త వ్రుత్తి నిరోధింప శీఘ్ర గతిని –బుద్ధి వికసించు నెందు నపూర్వముగను –కోరికలు జయింప బడుచు ,క్రోధ లోభ –మద మత్సరము లు విముక్తమగును ‘’అని యోగం అందించే పరమ విభూతిని వివరించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-16-ఉయ్యూరు  .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

Inline image 1Untitledభారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ ,జైజిబాయ్ సొరాబ్జీ దంపతులకు జన్మించింది .వీరికి కుటుంబానికి సంఘం లో మంచి పరపతి ఉంది. తండ్రి వ్రుత్తి రీత్యా వ్యాపారే కాని ప్రవ్రుత్తి రీత్యా లాయర్ .పార్శీ లలో బాగా ప్రాపకం గౌరవం ఉన్నవాడు .అలేక్సా౦డ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ స్కూల్ లో చేరి, భికాజీ బహుభాషా పరిచయం పొందింది .24ఏళ్ళకు ఆమెకు ధనవంతుడు, బ్రిటిష్ వేష భాషలపై అపరిమిత అభిమానం ఉన్న రుస్తుం కామాతో వివాహం జరిగింది . కామాకు రాజకీయాలలో రాణించాలని కోరిక ఉండేది .భార్య మాత్రం సేవాకార్యక్రమాలు , దాన ధర్మాలతో సమయం గడిపేది .

1896లో బొంబాయి రాజ్యం తీవ్రమైన కరువుతో ఆ తర్వాత బుబానిక్ ప్లేగు(బొబ్బలతో వచ్చే ప్లేగు వ్యాధి ) తో తీవ్రంగా నష్టపడింది .ప్రజా సేవా దృక్పధం ఉన్న భికాజీ మిగిలిన స్వచ్చంద సేవకులతో పాటు గ్రాంట్ మెడికల్ కాలేజి తరఫున సేవా కార్యక్రమాలలో పాల్గొన్నది .ప్లేగు వ్యాధి సోకిన వారికి సేవచేస్తూ ,మిగిలినవారికి వ్యాధి రాకుండా టీకాలు వేస్తూ నిర్విరామ కృషి చేసింది. దీనితో కామాకూ ప్లేగు సోకింది కాని అదృష్ట వశాత్తు బ్రతికి బయట పడింది .కాని విపరీతంగా బలహీన పడింది .1901లో కామాను చికిత్స కోసం బ్రిటన్ పంపారు .1908లో ఇండియాకు తిరిగి వచ్చే ప్రయత్నం చేసింది ..కాని లండన్ లో భారతీయులతో సత్సంబంధాలున్న జాతీయ నాయకుడు స్వామి కృష్ణ వర్మ తో పరిచయమై ,హైడ్ పార్క్ లో ఆయన ఉపన్యాసాలకు ప్రేరణ పొంది ,ఆయనద్వారా మరొక అకలంక దేశభక్తుడు భారత జాతీయ కాంగ్రెస్ కు బ్రిటిష్ కమిటీ ప్రెసిడెంట్ -దాదాభాయి నౌరోజీ తో పరిచయం సాధింఛి , ఆయన సెక్రెటరిగా పని చేసింది .దాదా తోనూ ,సింగ్ రేవాభాయ్ రాణా తో కలిసి లండన్ లో కామా 1905ఫిబ్రవరిలో వర్మ ఏర్పాటు చేసిన ఇండియన్ హోమ్ రూల్ ను బలపరచింది . ‘’జాతీయ ఉద్యమం లో పాల్గొనను’’ అని హామీ రాసి ఇస్తేనే ఆమెను ఇండియాకు పంపటానికి అనుమతిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం షరతు పెడితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ధీర వనిత మేడం కామా .

ఆ ఏడాదే ఫ్రాన్స్ కు వెళ్లి పారిస్ లో రేవాభాయ్ ,మున్చేర్షా భుర్జిర్జి గాడ్రెజ్ లతోకలిసి ‘’పారిస్ ఇండియన్ సొసైటీ ‘’స్థాపించింది భారత దేశ విముక్తికోసం పుస్తకాలు రాసి వందేమాతరం గీతం తో పాటు నెదర్లాండ్స్ ,స్విట్జర్ లాండ్ లలో ముద్రించి భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరులూదిన ,ప్రవాస భారతీయ దేశభక్తురాలు మేడం కామా .ప్రముఖ విప్లవ వీరుడు మదన్ లాల్ ధింగ్రాను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీస్తే కడుపు రగిలిపోయి ‘’మేడమ్స్ తల్వార్ ‘’.రాసి ప్రచురించింది .వీటిని ప్రచురించిన పత్రికలు ఆ నాడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పాండిచ్చేరి చేరి ఇండియాలో ప్రత్యక్షమై దేశభక్తులను ఉత్తేజ పరచేవి .

22-8-1907లో జర్మనీలోని షట్ గార్డ్ లో జరిగిన ‘’అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫ రెన్స్’’లో మేడం కామా పాల్గొని భారత దేశం లో కరువు వలన ఏర్పడిన తీవ్ర సంక్షోభాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చింది .గ్రేట్ బ్రిటన్ కబంధ హస్తాలనుండి భారత్ కు విముక్తి కలిగి మానవ హక్కులు ఏర్పడి సమాన హక్కులు లభించి త్వరలో స్వతంత్ర భారత దేశం ఆవిర్భావించాల్సిన అవసరముందని ఎలుగెత్తి చాటింది .అకస్మాత్తుగా ‘’భారత స్వాతంత్ర్య పతాక ‘’ను వేదికపై ఆవిష్కరించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేసింది .

ఈ సందర్భంగా కామా ప్రసంగిస్తూ ‘’ఇది పవిత్ర భారత స్వాతంత్ర్య పతాకం .ఇప్పుడే ఇది ఆవిర్భవించింది .భారత స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమర వీరుల పవిత్ర రక్తం తో తయారైంది .మహా జనులారా !లేచి నిలబడి ఈ పతాకానికి వందనం చేయండిఅని అర్ధిస్తున్నాను .ఈ పతాకం సాక్షిగా ప్రపంచం లోని స్వేచ్చా ప్రియులందరూ దీన్ని శక్తి వంతం చేయండి .’’అని గంభీర స్వరం తో చెప్పింది . ఈసంఘటన ఆఫ్రికన్ అమెరికన్ రచయితా ,మేధావి డబ్ల్యు .ఇ.బి.డూబోయిస్ కు ప్రేరణ నిచ్చి 1928లో ‘’డార్క్ ప్రిన్సెస్ ‘’నవల రచనకు స్పూర్తిగా నిలిచింది .కామా ఆవిష్కరించిన పతాకం కలకత్తా లో రూపొందించిన పతాకానికి చేసిన మార్పు తో ఏర్పడింది .దీని రూప కల్పనలో కామాకు వినాయక దామోదర సావర్కార్ , శ్యాం జీ కృష్ణ వర్మలు సహకరించారు .కామా ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం లో ఆకుపచ్చ ,కాషాయం రంగుతోబాటు ఎరుపు గీతలున్నాయి ఎరుపు శక్తికి ,కాషాయం విజయానికి ,ఆకుపచ్చ ధైర్యం ,ఉత్సాహాలకు ప్రతీకలు .అందులోని ఎనిమిది పద్మాలు ఎనిమిది రాజ సంస్థానాలకుగుర్తు .మధ్యలోని కాషాయ రంగు పై దేవ నాగరలిపిలో వందేమాతరం ఉంది .క్రింద ఉన్న సూర్య చంద్రులు హిందూ ముస్లిం విశ్వాసాలకు చిహ్నాలు . .ఈనమూనా నుంచే అనేక మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడున్న మన జాతీయ పతాకం ఆవిర్భ వించింది .

ఈ జర్మనీ సమావేశం తర్వాత కామా అమెరికా వెళ్లి భారత దేశానికి స్వతంత్రం యెంత అవసరమో అనేక సభలలో వివరించింది .బ్రిటిష్ రాజ్య దౌష్ట్యాన్ని ,అణచి వేతను గర్హించాలని కోరింది .’’పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి జనని ‘’అని గర్వంగా చెప్పుకొనే బ్రిటన్ ఇండియాకు ఎందుకు స్వతంత్రం ఇవ్వటం లేదు ?అని ప్రశ్నించింది .అందుకనే కామాను అమెరికాలో ‘’భారతదేశ తొలిసాంస్కృతిక ప్రతినిధి ‘’అన్నారు .

1909లో సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా గా ఉన్న విలియం హట్ కర్జన్ విల్లీ ని మదన్ లాల్ ధింగ్రా హత్య చేసినందుకు స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు బ్రిటన్ లో ఉన్నసావర్కార్ మొదలైన ముఖ్య కార్య కర్తలను అరెస్ట్ చేశారు .1910లో ఈకేసు విచారణ కోసం సావర్కార్ ను ఇండియా కు పంపించేశారు .సావర్కార్ ను ఇండియా తీసుకొస్తున్న షిప్ మార్సేల్లీస్ నౌకాశ్రయం లో లంగర్ వేయబడినప్పుడు సావర్కార్ చాకచక్యం గా ఒక కిటికీ గుండా సముద్రం లోకి అమాంతం దూకి ఈదు కొంటూ తీరం చేరాడు .ముందే వేసుకొన్న పధకం ప్రకారం అక్కడ మేడం కామా వాళ్ళు స్వాగతం పలుకుతారని ఆశించాడు. కాని రావటం ఆలస్యమైనందున పోలీసులు ముందే చేరారు . .కామా సాయం లేకుండా తనకేమీ మేలు జరగదని తెలుసుకొని బ్రిటిష్ కస్టడీ లో ఉన్నాడు .బ్రిటిష్ ప్రభుత్వం మేడం కామాను కూడా అప్పగించమని కోరినా, ఫ్రెంచ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు .కోపం తో బ్రిటిష్ ప్రభుత్వం కామా వారసత్వ ఆస్తినంతటినీ వశపరచుకొన్నది .అప్పుడు లెనిన్ కామాను రష్యా దేశానికి సగౌరవంగా ఆహ్వానించాడు .దీన్నికూడా కామా తిరస్కరించింది .

క్రిస్టబెల్ పాంక్ హర్స్ట్ ,ప్రభావంతో పురుషులతో బాటు స్త్రీలకూ సమానావకాశాలకోసం కామా ఉద్యమించింది .1910లో ఈజిప్ట్ లోని కైరో నగరం లో ఉపన్యసిస్తూ ‘’ఈజిప్ట్ పుత్రులారా !ఇక్కడి ఈ సభకు దేశం లో సగం మంది మాత్రమె వచ్చారు .మిగిలిన సగభాగంఅయిన ఈజిప్ట్ పుత్రికలు ఎందుకు రాలేదు ?మీ తల్లులు ,అక్క చెల్లెళ్ళు ఎక్కడ?మీ భార్యలు ,ఆడపిల్లలు యేరీ?’’అని ప్రశ్నిస్తే సభ అవాక్కయింది .భారత స్వాతంత్ర్యం కామాకు మొట్టమొదటి కోరిక. మిగిలినవి దీని తరువాతే .1920లో హారాభాయ్ ,మితన్ టాటా అనే మహిళలను కలుసుకొని మహిళా హక్కు కోసం వారు చేస్తున్న పోరాటాన్ని చూసి ‘’ముందు భారతదేశ స్వేచ్చా స్వాతాన్త్ర్యాలకోసం పోరాడండి .స్వతంత్రం వస్తే మహిళా వోటుహక్కుతో పాటు అన్ని హక్కులూ వస్తాయి ‘’అని సలహా ఇచ్చింది కామా .

1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రిటన్ ,ఫ్రాన్స్ దేశాలు కూటమిగా ఏర్పడగానే మేడం కామా ,రేవాభాయ్ రాణా తప్ప మిగిలిన పారిస్ ఇండియా సోసైటీలోని సభ్యులంతా దేశం విడిచి వచ్చేశారు .కామాను జీన్ లాంగేట్ అనే సోషలిస్ట్ నాయకునితో,ఆచార్య తో కలిసి స్పెయిన్ వెళ్ళమని సలహా ఇచ్చారు .కాని ఆమె అక్కడే ఉండి పోవాలని నిశ్చయి౦చు కొన్నది .1914అక్టోబర్ లో యుద్దానినికి వెడుతున్న పంజాబ్ రెజిమెంట్ మార్సేలిస్ కు వస్తే వారి ముందు కామా ,రాణా తో కలిసి నిరసన ప్రదర్శన చేస్తే అరెస్ట్ చేసి కొద్దికాలం జైలు లో ఉంచారు .కామాను మార్సేలిస్ వదిలి వెళ్ళిపొమ్మని ఆదేశిస్తే బోర్డాక్స్ దగ్గర ఆర్కచాన్ లో ఉన్న రాణా భార్య ఇంటికి వెళ్ళింది .ఫ్రెంచ్ ప్రభుత్వం రాణాను, కుటుంబాన్ని మార్టినిక్ లోని ‘’కరేబియన్ దీవి’’కి ప్రవాసంగా పంపింది .మేడం కామా ను’’ విచీ ‘’కి పంపింది .అక్కడ ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది .ఆరోగ్య రీత్యా ఆమెను1917 నవంబర్ లో బోర్దాక్స్ కు తిరిగి పంపించటానికి అనుమతించి ,వారానికొకసారి అక్కడ పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని ఆదేశించింది .యుద్ధం జరుగుతుండగానే పారిస్ లోని తన స్వగృహం 25 రూ డీ పా౦థియా కు .చేరుకొంది .

1935వరకు కామా యూరప్ లో ప్రవాసంగా ఉంది .ఏడాది క్రితమే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చి శరీరం పక్షవాతానికి గురైంది .కోవాసి జహంగీర్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అభ్యర్ధన పంపుతూ తనకు ఇండియా వెళ్ళటానికి అనుమతినివ్వవలసి౦దిగా కోరుతూ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను త్యజించానని హామీ ఇచ్చింది .జహంగీర్ సహాయం తో 1935నవంబర్ లో మాతృ దేశం భారత్ చేరి బొంబాయిలో కాలు పెట్టింది .తొమ్మిది నెలల తర్వాత 74వ ఏట బొంబాయి లోని పార్సీ జనరల్ హాస్పిటల్ లో ప్రవాసం లో ఉంటూ భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం అహరహం శ్రమించిన స్వేచ్చా పిపాసి మేడం కామా ప్రాణ వాయువు అనంత ప్రాణ వాయువులో కలిసింది .

ఎందరో మహా రాణుల లాగా స్వాతంత్ర్య సమరోద్యమం లో తనదైన విధానం లో సేవలందించింది కామా .ఎందరో విప్లవ వీరులకు లండన్ ,పారిస్ లలో ఉంటూ అజ్ఞాతంగా ధన వస్తు సాయం అందించి ఉద్యమ నిర్మాణానికి సాయపడింది .భారత స్వతంత్ర పోరాట తొలి సంవత్సరాలలో మేడం కామా చేసిన సాహసం,పోరాటం చిరస్మరణీయం .ఆమె జీవితమే ఒక పాఠ్య గ్రంధం . కామా జీవితం అందరికి ఆదర్శం ,అనుసరణీయం .ధన్య జీవి మేడం కామా.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ హాకింగ్

భౌతిక ఖగోళ శాస్త్ర  వేత్త ,స్టీఫెన్ విలియం హాకింగ్ 8-1-1942లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించాడు .కేంబ్రిడ్జి యూని వర్సిటిలోని సెంటర్ ఫర్ దీరేటికల్ కాస్మాలజి కి రిసెర్చ్ డైరెక్టర్ .జనరల్ రిలేటివిటి కు చెందిన గ్రావిటేషనల్ సింగ్యులారిటి దీరంస్ పై రోజర్ పిన్ రోజ్ తోకలిసి శాస్త్రీయ పరిశోధనలు చేశాడు .బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు )రేడియేషన్ వెలువరిస్తాయని కనుగొన్నాడు .దీనికే ‘’హాకింగ్ రేడియేషన్’’అనే పేరొచ్చింది .క్వాంటం మెకానిక్స్ ను జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటితో అనుసంధానం చేసి కాస్మాలజీ సిద్ధాంతాన్ని తయారు చేసిన వారిలో ప్రధముడు హాకింగ్ .క్వాంటం మెకానిక్స్ చెప్పిన బహు ప్రపంచాలను సమర్ధించాడు .

రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు హాకింగ్  ఆనరరి ఫెలో   .పాంటిఫికల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కు జీవిత సభ్యుడు .అమెరికా ప్రభుత్వం నుండి ప్రేసిడేన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అనే అత్యున్నత పౌర సన్మానం అందుకొన్న ప్రతిభా మూర్తి .1979-2009కాలం లో కేంబ్రిడ్జ్ యూని వర్సిటి లుకేషియన్ ప్రొఫెసర్ ఆఫ్ మాథమాటిక్స్ గా పని చేశాడు .పాపులర్ సైన్స్ పై చాలా పుస్తకాలు రాశాడు .హాకింగ్ రాసిన ‘’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’అనే గ్రంధం 237వారాలు బెస్ట్ సెల్లర్ గా రికార్డ్ సృష్టించిందని బ్రిటన్ కు చెందిన సండే టైమ్స్ పత్రిక  తెలియ జేసింది .

తక్కువ వయసులో హాకింగ్ కు అరుదైన ‘’ఏమియో ట్రోఫిక్  లేటరల్  సీరోసిస్ (ఎ.ఎల్.ఎస్.)అనే నరాలకు సంబంధించిన జబ్బుతో బాధ పడ్డాడు .అదే తర్వాత శరీర పక్షవాతానికి దారి తీసి కొన్ని దశాబ్దాలుగా బాధ అనుభ విస్తున్నారు .ఇప్పుడు స్పీచ్ జెనరేటింగ్ పరికరం ద్వారా తన మనోభావాలను తెలియ జేస్తున్నారు .. రెండు సార్లు పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చాడు .అయినా అనేక దేశాలు పర్యటిస్తూనే ఉన్నాడు. కెనడా ప్రభుత్వం ఫ్రాన్సికా ప్రైజ్ నిచ్చి గౌరవించింది .ఇప్పుడు ప్రైవేట్ జెట్ లో పర్యటన చేస్తున్నాడు .2007లో కూతురు లూసీ తోకలిసి ‘’జార్జెస్ సీక్రెట్  కీ టు ది యూనివర్స్ ‘’రాసి ప్రచురించాడు .2002లోబ్రిటన్ దేశపు వందమంది ప్రముఖులలో ఒకడుగా హాకింగ్ ఎంపికయ్యాడు .హాకింగ్ ఉద్యోగ పర్వం లో 39 విద్యార్ధులు  పి.హెచ్.డి.చేశారు .ఉద్యోగం నుంచి రిటైర్ కాకుండా కేంబ్రిడ్జ్ యూని వర్సిటి లో డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్లైడ్ మాధమాటిక్స్,దీరేటికల్  ఫిజిక్స్ రిసెర్చ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ,2012 లో తనకు రిటైర్ అయ్యే ఆలోచనే లేదని తెలియ జేశాడు .20-7-2015న ‘’ఎక్స్ ట్రా టెర్ర్రే స్త్రియల్ లైఫ్ ,పరిశోధనలో ‘’బ్రేక్ థ్రు ఇనిషి యేటివ్స్’’ప్రారంభానికితోడ్పడి’’మనం ఒంటరి వాళ్ళమా ?(ఆర్ వియ్ ఎలోన్ )అన్నదానికి సమాధానం కనుగొనటానికి సహాయ పడ్డాడు .

ఇప్పుడున్న సామాజిక ,రాజకీయ .పర్యావరణ సంక్షోభం లో మానవ జీవితం మరో వందేళ్ళు మనగలుగుతుందా ?అని ఇంటర్నెట్ లో ప్రశ్నించాడు హాకింగ్ .అకస్మాత్తుగా వచ్చే న్యూక్లియర్ యుద్ధం భూమికి చాలా  చేటు తెస్తుందని ,వైరస్ ,గ్లోబల్ వార్మింగ్ వంటివాటి వలన అనుకోని ఉపద్రవాలు కలుగుతాయని హెచ్చరించాడు ..’’సూపర్ ఇంటలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ‘’మానవ భవిష్యత్తును నిర్ణ యిస్తుందన్నాడు .మానవ చరిత్రలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణ అరుదైన గొప్ప సంఘటన అన్నాడు .ఇందులోని ప్రమాదాలను మనం గుర్తించక పొతే ఇదే చివరిది అయ్యే ప్రమాదం ఉందన్నాడు .కంప్యూటర్ వైరస్ కొత్త జీవులకు స్థానం కల్పిస్తోందని,ఆదిమానవ వినాశనానికి దారి తీస్తుందని జాగ్రత్త పడాలని కోరాడు .మన ప్రతి బింబం నుండి జీవిని సృష్టించే దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలని చెప్పాడు .ఆధునిక శాస్త్రీయ విజయాలను ఫిలాసఫీ లక్ష్య పెట్టటం లేదని బాధ పడ్డాడు .స్వర్గం కాని పునర్జన్మ కాని లేవన్నాడు .2014లోతాను  ‘’నాస్తికుడిని ‘’అని హాకింగ్ ప్రకటించాడు .

జీరో గ్రావిటి కార్పోరేషన్ ఆధ్వర్యం లో 2007లో ‘’ వామిట్ కామెట్ ‘’అనే జీరో గ్రావిటి ఫ్లైట్ లో ప్రయాణించి రికార్డ్ సృష్టించాడు. సైన్స్ లో స్వయంగా  ఆరు ,ఇతరులతోకలిసి అయిదు ,బాల సాహిత్యం లో నాలుగు రచనలు చేశాడు .హాకింగ్ పైనా, ఆయన రచనలపైనా సినిమాలు తీశారు .వైకల్యం శరీరానికే తప్ప ,సంకల్పానికి, మనసుకు కాదని తన జీవితం ద్వారానిరూపించి  మానవాళికి గొప్ప ప్రేరణ ,స్పూర్తి కలిగించిన  మహోన్నత శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-16-ఉయ్యూరు .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

13-2-16శనివారం ఉయ్యూరు నారాయణ టెక్నో ఇ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమం లో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాలు 

13-2-16శనివారం ఉయ్యూరు నారాయణ టెక్నో ఇ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమం లో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాకినాడలో 11-2-16-గురువారం ఉదయం మా అమ్మాయి ఛి.సౌ విజయ లక్ష్మి అత్తగారు శ్రీమతి కోమలి సూర్య కుమారి గారు చేసుకొన్నలక్ష పసుపుకోమ్ములనోము,,మరియు ఉప్పాడ సముద్రం హొయలు చిత్రాలు 

కాకినాడలో 11-2-16-గురువారం ఉదయం మా అమ్మాయి ఛి.సౌ విజయ లక్ష్మి అత్తగారు శ్రీమతి కోమలి సూర్య కుమారి గారు చేసుకొన్నలక్ష పసుపుకోమ్ములనోము,,మరియు ఉప్పాడ సముద్రం హొయలు  చిత్రాలు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం

https://plus.google.com/u/0/115752370674452071762/posts/D8EQwgLCwSX?pid=6248937066643413666&oid=115752370674452071762

 

ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం ,ఔరంగా బాద్ లో  మా రెండవ అబ్బాయి శర్మ బావమరది రమణ,మణిదంపతుల ఇంట్లో మా మనవడు ఛి శ్రీహర్ష సాయి పుట్టిన రోజు వేడుక ,అక్కడి ఇద్దరి బంధువుల ఇళ్ళల్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి

భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరిbhakara6 001 bhakara9 001 bhakar8 001 bhakara 7 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భ కా రా మాస్టారికి బాపు ,రమణ లనవ్వుల నజరానా -1-రచన -ఫిబ్రవరి

bhakara2 001 bhakara3 001 bhakara4 001 bhakara5 001 bhakara1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -3(చివరి భాగం )

పియరీ శవాన్ని ఇంటికి చేర్చగానే ,ఆశవాన్ని వదిలిమేరీ ఉండలేక పోయింది .ఆమె దుఖం కట్టలు తెంచుకు ప్రవహించింది .ఆపుకోలేకపోయింది .ఆపటం ఆమెకు అసాధ్యమైంది .తన తల్లి దుఖాన్ని వర్ణిస్తూ కూతురు ఈవ్ ‘’పియరీ నా పియరీ ‘’అని ఎలుగెత్తి ఏడ్చింది .నువ్వుఅక్కడ సమాధిలో ప్రశాంతంగా ఉండిపోయావు .నా కలలో కూడా నువ్వే .మనం ఒకరికొకరం విడిచి ఉండలేని వాళ్ళం .నీ అంత్యక్రియలకు అనంత జనవాహిని వచ్చి నిన్ను స్మరించి దుఖించింది. పుష్ప వృష్టి కురిపించింది .చివరి నిద్రలో ఉన్నావు .ఇదే అన్నిటికీ ఆఖరు ,అవును అన్నిటికీ అన్నిటికీ ‘’అని ఫునేరల్ అయింతర్వాత మేరీ విపరీతంగా శోకి౦చి౦దని రాసింది .

నలభై వ ఏట తలమరింత నెరిసి ,మరింత ముసలిదానిలా మేరీ కనిపించింది .’’నేను ఆత్మ హత్య చేసుకోవాలనుకోలేదు .నేను హిప్న టైజ్ అయిన దానిలాగా ఏపనీ చేయకుండా ఉండిపోయాను .’’అని తర్వాత రాసుకొన్నది మేరీ .లేబరీటరీకి మేరీని పియరీస్థానం లో నియమించారు .మంచో చెడో తెలియక ఒప్పు కొన్నది .భర్త వదిలేసిన పనిని కొనసాగించి ముందుకు వెళ్ళటానికే నిశ్చయించి కార్య రంగం లో దిగింది .ఆమె మనసంతా రేడియో యాక్టివిటీ లెక్కలే ,భావనలే నిండిపోయాయి .లాబ్ పని తర్వాత ఇద్దరాడ పిల్లల విషయం పై ద్రుష్టి పెట్ట్టేది .ఇద్దరిపిల్లలకోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకొన్నది .మామ గారినిసంరక్షించాల్సిన బాధ్యతా ఆమెదే .భర్త మరణానంతరం మరో నోబెల్ ప్రైజ్ ను1911లో  ఇచ్చారు దీన్ని భర్తకు అంకితం చేసింది .’’ది సార బాన్నే ‘’,మరియు పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ కలిసి మేరీ పరిశోధనలకోసం కోసం రెండు పెద్ద లాబ్ లను స్థాపించాయి  .వాటి భవిష్యత్ దేవాలయాలు అన్నది .ఈ పవిత్ర ఆలయం లో ఆమె నిరంతర పరిశోధనలు చేసింది .మొదటి ప్రపంచ యుద్ధం యూరప్ ను కబళింఛి నప్పుడు ,రేడియం ను అందరి దృష్టికీ తెచ్చింది .రెనాల్ట్ పాసెంజర్ ఆటో మొబైల్ ను ‘’రేడియాలాజికల్ కార్ ‘’గా మార్చింది .యుద్ధం పూర్తీ ఆయె లోపు 20  మొబైల్ యూనిట్ లను తయారు చేసి అందులో రేడియాలాజికల్ సామగ్రిని ఏర్పాటు చేసి ,200పైగా హాస్పిటల్ రూమ్ లను తయారు చేసింది .

యుద్ధం అయిన తర్వాత మేరీ అమెరికా వెళ్ళింది .అక్కడి మహిళలు ఆమెకు ఒక గ్రాము రేడియం కొనటానికి కావలసిన డబ్బు వసూలు చేసి ప్రెసిడెంట్ హార్డింగ్ చేతుల మీదుగా వైట్ హౌస్ లో  కానుకగా అందించారు .రేడియం అనేది తన స్వంత ఆస్తికాదని అది సైన్స్ కు చెంది౦దని  అన్నది .కార్నెజీ హాల్ లో కాలేజి లో ఆమెకు ఘన సన్మానాలు జరిగాయి .కూతురు ఈవ్ కూడా వెంట ఉంది ఆమె గొప్ప మేధావి రచయిత్రి గా ప్రసిద్ధి చెందింది .పెద్దకూతురు ఐరీన్ భర్త ఫ్రెడరిక్ జోలియట్ తోకలిసి 1935లో ‘’రేడియో యాక్టివ్ మూలకాలను కృత్రిమంగా ఉత్పత్తి చేసినందుకు నోబెల్ బహుమతిని అందుకొన్నది .అంటే క్యూరీ కుటుంబానికి  నాలుగు నోబుల్స్ లభించాయి .పిల్లల కీర్తి ప్రఖ్యాతులను చూసి ఆన౦దించే సమయం ఆమెకు లేదు .తన ప్రయోగాలు ,పరిశోధనలో మునిగి పోయింది .58వ ఏట తన స్వదేశం పోలాండ్ కు వెళ్లి ,’’రేడియం ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ వార్సా ‘’కు శంకుస్థాపన చేసింది .అరవై వ ఏట రెండవ సారి అమెరికా వెళ్లి ,మళ్ళీ మరొకఅరుదైన అతి విలువైన  గ్రాము రేడియం ను కానుకగా పొందింది .65వ ఏట కూడా రోజుకు 12నుంచి 14గంటలు పని చేసింది .ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది .అంధత్వం వచ్చినట్లు అనిపించింది .ఎవరికీ చెప్పలేదు .అక్క బ్రోన్యాకు జాబు రాస్తూ ‘’ .నా కళ్ళ చూపు బలహీనమై పోతోంది .ఇక వాటికి ఏ చికిత్సా పని చేయదు .ఇక నా చెవుల సంగతి చూస్తె ,నిరంతరం రణగొణ  ధ్వనులు అతి పెద్దగా విని పిస్తున్నాయి .’’అని  తెలిపింది .

తన వ్యాధులకు రేడియం కొంత కారణమై ఉండచ్చు ననుకొన్నది మేరీ .డబుల్ కేటరాక్ట్ కోసం నాలుగు సార్లు ఆపరేషన్ జరిగింది .అంధురాలైన తల్లికి చిన్న కూతురు ఈవ్ సేవలు చేసింది .క్రమంగా ఆమెకు చూపు వచ్చి ,’’యాక్టిమం  x.’’ను తయారు చేయటం లో నిమగ్నమైంది .మరొక బాధ తో ఇబ్బందిపడింది ఎక్స్ రే తీస్తే గాల్ బ్లాడర్(పిత్తాశయం ) లో  రాళ్ళు ఉన్నట్లు  తేలింది .ఇక ఆపరేషన్ చేయించుకొనే స్తితి లేక ,తన పరిశోధనకు  అడ్డంకి అవుతుందని వద్దని తిరస్కరించింది .1934మే నెలలో ఆమెకు తీవ్రంగా జ్వరమొచ్చి , లాబ్ .కు వెళ్ళలేక పోయింది .మళ్ళీ లాబ్ కి వెళ్ళలేదామే .బ్రాంకైటిస్(శ్వాస నాళం వాపు ) వచ్చి ,అలసట ఎక్కువై ,విపరీతమైన రక్త హీనత తో  సెయింట్ సేల్మోజ్ శానిటోరియం లో 4-7-1934న 66ఏళ్ళ వయసులో డబుల్ నోబెల్ లారియెట్ మేరీ క్యూరీ తుది శ్వాస విడిచి భర్త పియరీని కలుసుకోవటానికి వెళ్ళింది .చరిత్రలో అరుదైన మహిళా సైంటిస్ట్ గా నిలిచి పోయింది మేరీ క్యూరీ .

పోలాండ్ ,ఫ్రాన్స్ దేశాలు 2011సంవత్సరాన్ని మేరీ క్యూరీ సంవత్సరంగా ప్రకటించి గౌరవించాయి .అమెరికా ఆ ఏడాదినే  అంతర్జాతీయ రసాయనిక శాస్త్ర సంవత్సరం గా ప్రకటించింది .నోబెల్ బహుమతితో బాటు మేరీ డేవీ మెడల్ ,మాత్యూ మెడల్ ,ఆక్టోనియం ప్రైజ్ ,ఫ్రాన్క్లిన్ ప్రైజ్ అందుకొన్నది .అమె పేర ప్రపంచామంతా అనేక స్మారక చిహ్నాలు వెలిశాయి .

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106

45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -2

మేరీ ని చూసిన మొదటి క్షణం లో పియర్రీ స్త్రీ ద్వేషి అనిపించాడు ,కాని ఈ పాలిష్ద్ పోలిష్ అమ్మాయి ని చూసి ఫ్లాటైపోయాడు .కాని మేరీ మాత్రం ప్రేమవ్యవహారాలు కాక క్వార్ట్జ్  గురించి క్రిస్టల్స్ గురించి చర్చి౦చేది .చాలా శాస్త్రీయంగా సుదీర్ఘకాలం ప్రేమ కలాపం సాగింది .అతని మొదటిప్రేమ కానుక ‘’ఆన్ సిమ్మెట్రి ఇన్ ఫిజికల్ ఫినామినా –సిమ్మెట్రిఆఫ్ ఆన్ ఎలెక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఎ మాగ్నెటిక్ ఫీల్డ్ ‘’ అనే కరపత్రం .ఉన్న పరిస్తితులలో ప్రేమ వ్యవహారం గురించి తీవ్రంగా ఆలోచించింది మేరీ .పది నెలల తర్వాత పెళ్లి చేసుకొని మేరీ క్యూరీ అయింది .ఇద్దరూ స్వేచా ఆలోచనా పరులే కనుక వివాహం పౌర వేడుక (సివిల్ సేరిమని )గా జరిగింది .పెళ్లి ఉంగరాల మార్పిడి లేదు .బావ అమ్మ తెల్లని పెళ్లి గౌను కొని బహుమతిగా ఇస్తానంటే నల్ల గౌను ఇస్తే చాలా సంతోషిస్తానని లాబ్ లో  పని చేయటానికి  దాన్ని వేసుకొంటానని రాసింది .వాళ్ళ’’మధు చంద్రం ‘’  హనీమూన్ కూడా పారిస్ దగ్గరున్న వనారణ్యం లోనే నడిచి సైకిల్స్ మీదా .బాగా ప్రసిద్ధ శాస్త్ర  వేత్తలయ్యాక కూడా వారు ఇదే తీరుగా ఉన్నారు .1895లో చిన్న ఫ్లాట్ లో ఉన్నారు .అంతకు ముందు ఏనాడూ గుప్పెడు మెతుకులు వండటం రాని  మేరీ ,అన్నీ నేర్చి ఎక్స్ పర్ట్ ఫ్రెంచ్ మహిళఅయింది .ఇల్లు తీర్చి దిద్దుకోవటం ఆమెకు మరొక ప్రయోగమే .వంటగది ఆమెకు పరిశోధనాలయమే .కొత్త జంట అరుదుగానే సినిమాలు చూసేవారు .సాయం వేళలో స్నేహితులింటికీ చాలా తక్కువగానే వెళ్ళేవారు . ప్రేమ పావురాలు లాగా కలిసి మెలిసి దాంపత్య ఫలం గా అరీన్ ,ఈవ్ అనే ఇద్దరమ్మాయిలకు జన్మ నిచ్చారు .

క్యూరీల వివాహమైన ఏడాదిలోనే  విల్హెం రోఇంజేన్’’ x కిరణాలు ‘’కనుగొన్నాడు .అప్పుడే హెన్రి బెక్వేరల్ యురేనియం లవణాలు కాంతి సోకకుండానే అజ్ఞాత కిరణాలను వెలువరిస్తున్నాయని కనిపెట్టాడు .చీకటిలో వీటిని నల్లకాగితాం లో దళసరిగా చుట్టిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్  దగ్గర ఉంచితే  మచ్చలు ఏర్పరచాయి  .కనుక యేవో కిరణాలు వెలువడి ప్లేట్ ను తాకి మచ్చలేర్పరచాయని గ్రహించాడు .వీటినే ‘’బెక్వేరల్ కిరణాలు ‘’అన్నారు .ఇది తెలుసుకొన్న పియర్రీ మేరీ చేస్తున్న ప్రయోగాలకు సాయం చేశాడు .వీరికి బయటి సహాయం లేదు .నిధుల కొరత .పరికరాలు తగినన్ని లేవు .వాళ్ళ ప్రయోగ శాల ముతక కర్ర దుకాణం లా ఉండేది .గది ఎప్పుడూ చెమ్మతో ఉండేది .వేసవిలో పొగలు వింటర్ లో ఫ్రీజింగ్ పాయింట్ కంటే కొంచెం ఎక్కువ 42డిగ్రీల ఫారెన్ హీట్ .తెలిసిన అన్నిస్వచ్చ మైన  కెమికల్స్ ను ,రసాయన  సమ్మేళనాలను ,పరీక్షిస్తూ యురేనియమే కాక ,మరొక లోహమూ కంటికి కనిపించని కిరణాలను వెద జల్లుతోందని గ్రహించారు .ఇదే రేడియో ధార్మికత -రేడియో యాక్టివిటి.అయినా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .

తరువాత పని చాలా పెద్దది .కొన్ని సమ్మేళ నాలు యురేనియం ,దోరియం లకంటే శక్తి వంతమైనవి అని గుర్తించారు .ఫలితాలను అనేక సార్లు చెక్, రీచేక్ చేసుకొన్నారు .రేడియేషన్ వలన అత్యంత శక్తి వంతమైన కొత్త మూలక౦  ఏర్పడుతుందని గ్రహించారు .యురేనియం ధాతువు అయిన పిచ్ బ్లెండి లో అది చాలా తక్కువ పరిమాణం లో ఉందని తెలిసిన ,అది అంత  సూక్ష్మ స్థితిలో మిలియన్లో ఒక వంతు (మిలియ౦త్ )  ఉంటుందని తెలుసుకోలేక పోయారు .పిచ్ బ్లేన్దీని ఎక్కువగా సేకరించటం చాలా కస్టమైంది ,ఖర్చుతో కూడినదీ .వీళ్ళకు అది టన్నులకొద్దీ కావాలి. పిచ్ బ్లేండీ నుంచి ఉరేనియం పొందిన తార్వాత మిగిలిన దానిలోంచి తాము ఎదురు చూసే మూలకం వస్తుందనుకొన్నారు .ఖర్చుకు వెనకాడకుండా నిరుత్సాహ పడకుండా సేకరించి ప్రయోగాలు చేశారు .ఎట్టకేలకు తాము ఎదురు చూసిన’’ పొలోనియం’’ మూలకాన్ని ఆవిష్కరించి లోకానికి తెలియ జేశారు ..క్యూరీ దేశం పోలాండ్ పేరు తో దాన్ని పొలోనియం అన్నారు .పోలాండ్ కు ప్రాచీన మైన పేరు పొలోనియా .గొప్ప పవిత్ర ఘడియలు గా  వారి జీవితాలలో నిలిచి పోయాయి .

లాబ్ లో మెరీ ది ‘’పగటి కూలి’’ పాత్ర .అనేక గాజు జార్లలో సమ్మేళనాలు ,అవక్షేపాలు నిలువ చేయటం,టన్నుల కోద్దీ పిచ్ బ్లేండీ ని అతి సూక్షంగా  శుద్ధి చేసి,మరిగే నీటిలో ఉడికించటం ఆమె పని తల్లిగా, భార్యగా ,ఇల్లాలుగా, సైంటిస్ట్ గా అన్నీ సర్వ సమర్ధంగా నిర్వహిస్తోంది మేరీ .పిల్లలకోసం గూస్ బెర్రీ జ్యూస్ ,రుచికరమైన వంటకాలు చేస్తూ పెద్దమ్మాయి కి చదువు నేర్పుతూ ఆదర్శ గృహిణిలా  ఉంది  .లాబ్ చాలా చల్లగా ఉండటం, వెచ్చదనానికి పెట్టె స్టవ్ అయిదడుగుల దూరం లో ఉంచటం తో ఆమె నరకమే అనుభవించింది .దీనికి తోడూ పైకప్పు చిల్లులు పడినీళ్ళు కారటం ,పొగ బయటికి వెళ్ళే చిమ్నీ కూడా లేక పోవటం ఆమె పాలిటి మ్రుత్యుపాశాలే అయ్యాయి .’’ఇలాంటి వ్యతిరేక పరిస్తితులలో మేమిద్దరం అన్యోన్యంగా ఆనందంగా మా పరిశోధన చేసి విజయం సాధించాం. పెద్ద పెద్ద పాత్రలలో ద్రవాలు ఉడకటం పొంగటం నా అంత  అంతపొడవైన  బలమైన ఇనుప రాడ్ తో ఆ ద్రవాన్ని కలపటం తో రోజు రోజంతా గడిచి పోయేది.సాయంకాలానికి తీవ్ర అలసట వచ్చేది . అయినా అవన్నీ మాకు మధురాతి మధురమైన రోజులు ‘’అని రాసుకొన్నది మేరీ .

క్యూరీ దంపతులు బతకటానికి సంపాదించటమే కాక ,అడ్డంకుల్ని అధిగమించాల్సి వచ్చేది .పొలోనియం కని పెట్టిన ఆరు  నెలలకే ‘’రేడియం ‘’అనే మరో కొత్త మూలకాన్ని కనిపెట్టి దానికి సంబంధించిన పత్రాలను విడుదల చేశారు .కాని మరొక 45నెలల తర్వాతనే ఒక ‘డేసిగ్రాం ‘’బరువున్న రేడియం ను ఉత్పత్తి చేసింది  మేరీ .దీని రేడియో ధార్మికత యు రేనియం ధార్మికత కంటేఒకటిన్నర మిలియన్ల  రెట్లు ఎక్కువ .1899-1904లోపు 30కి పైగా సైంటిఫిక్ పేపర్లు రాసి  ప్రచురించారు క్యూరీ దంపతులు .రేడియం చాలా ప్రాణాంతకమైనా, తీవ్రంగా శరీరానికి బొబ్బలు వంటివి కలిగించినా ,అది కొన్ని రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తుందని తెలియ జేశారు .వ్యాధి సోకిన కణాలను నాశనం చేసి ,అవి మళ్ళీ వృద్ధి చెంద కుండా చేస్తుందన్నారు .కొన్ని రకాల కేన్సర్ ను కూడా నివారిస్తుందని చెప్పారు .1902లో అకాడెమీ ఆఫ్ సైన్స్ మేరీకి  రేడియో యాక్టివ్ పదార్ధాన్ని శుద్ధి చేసి సాధించినందుకు 20 వేల ఫ్రా౦కు లను కానుకగా అందజేసింది .పారిస్ యూని వర్సిటి మేరీని ‘’డాక్టర్   ఆఫ్  ఫిజికల్ సైన్స్ ‘’ఇచ్చి గౌరవించి సత్కరించింది .1903లో రేడియో యాక్టివిటీ ఆవిష్కరణ చేసిన హెన్రీ బెకరెల్ కు ,క్యూరీ దంపతులకు సంయుక్తంగా ‘’నోబెల్ ప్రైజ్ ‘’నిచ్చారు .

అ నాటి కి ఒక గ్రామ్ రేడియం ఖరీదు  1,50,౦౦౦ డాలర్లుగా నిర్ణయించారు .దీన్ని స్వార్ధం కోసం వాడుకోవాలని క్యూరీ దంపతులు భావించక.అలా చేస్తే సైన్సుకే ద్రోహం చేసినట్లుగా తలచారు .వ్యాధుల చికిత్సా విధానం లో ఉప యోగపడే రేడియం ఏ ఒక్క వ్యక్తీ స్వంతం కాదని అది విస్తృత మాన వాళి కే చెందాలని చెప్పారు .దానిపై ‘’పేటెంట్ ‘’తీసుకో లేదు .తమ పరిశోధనా ఫలితాలను రహస్యంగా ఉంచక బహిర్గతం చేశారు .నోబెల్ నగదు బహుమతి చాలా ఎక్కువ గా రావటం తో పియర్రీ టీచింగ్ ను వదిలేశాడు .ప్రత్యేక విందులు వినోదాలకు హాజరు కాలేదు ఆ దంపతులు .ఫ్రాన్స్ లో అత్యున్నతమైన ‘’లీజియన్ ఆఫ్ ఆనర్ ‘’ఇస్తామని మినిస్టర్ తెలియ జేస్తే తనకు దాని కంటే లాబ్ అభివృద్ధి ముఖ్యం అని తెలియ జేశాడు .ఏడాది క్రితం వరకు జనాలకు  పట్టనీ ,ఎవరికీ తెలియని ఈ అజ్ఞాత జంటను ఇప్పుడు చూడటానికి, సందర్శించటానికి  ఇంటర్వ్యు లకు వేలాది జనం నిత్యం వస్తున్నారు ,అభినందిస్తున్నారు .సంచులకొద్దీ అభినందన ఉత్తరాలోస్తున్నాయి .లెక్చర్ టూర్ లకు రమ్మని ,సన్మానాలు స్వీకరించమనే వినతులు వెల్లువలా వస్తున్నాయి .అమెరికా ప్రభుత్వం సాదర ఆహ్వానం పలికింది .చివరికి అకాడెమి ఆఫ్ సైన్స్ పియర్రీని తీసుకొన్నది వాళ్ళకూ ఈయనకూ పూర్తిగా ఇష్టం లేకుండానే .సార్బారన్ లో ప్రొఫెసర్ షిప్ ఇచ్చి పూర్తికాలం పరిశోధనలోనే గడపమని కోరారు .

ఒక సంపన్నురాలు అన్ని వసతులతో లాబ్ నిర్మించి అందజేస్తానని ముందుకొచ్చింది కాని ఆ అద్రుస్తాన్నీ ఆనందాన్ని అనుభవించలేక పోయాడు పియరీ . 1906ఏప్రిల్ 19న నోబెల్ పొందిన రెండేళ్లకుఒక వర్షపు రోజున  తన పబ్లిషర్ ను కలవటానికి పియరీ వెళ్ళాడు .రోడ్లు జనసమ్మర్దంగా ఉండి,కాళ్ళు జారిపోతున్నాయి .రోడ్డు దాటే ప్రయత్నం లో  ఎదురుగా వచ్చే రెండు చక్రాల గుర్రపు బండీని గమనించలేదు .గుర్రాలు అదుపు తప్పాయి .పియరీ  ఒక గుర్రానికి తగులుకొని వ్రేలాడిపోయాడు .కొన్ని క్షణాలు సురక్షితంగానే ఉన్నట్లు కనిపించాడు .గుర్రాలను తప్పించుకొన్నా, బండి చక్రాల కింద పడి  తల చితికిపోయి ,ఆ బురదలో మెదడు ముక్కలు ముక్కలై కూరుకు పోయి దారుణంగా ఆ  నోబెల్ లారియేట్ పియరీ క్యూరీ మరణింఛి , భార్య మేరీకి తీవ్ర మానసిక వేదన మిగిల్చాడు .

.Inline image 1Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105

45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ

 

రోగ చికిత్సా విధానం లో కొత్త మూలకాన్ని కనిపెట్టి ,35ఏళ్ళకే భర్తతో పాటు విఖ్యాతురాలై చిన్న కుటీరం లో అనామకం గా ఉన్న మేరీక్యూరీ .పోలాండ్ లోని వార్సాలో స్క్లోడోవ్ స్కాలో’’ మార్యా ‘’గా 7-11-1867న జన్మించింది .తండ్రి వార్సా హైస్కూల్ లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు .తల్లి సంగీత విద్వాంసురాలు ,గర్ల్స్ అకాడెమీ ప్రిన్సిపాల్ .ఈమె కాక జోశియా ,జోసెఫ్ ,బ్రోన్యా ,హెలెన్ లు న్నారు .అందరిలో మార్యా చిన్నది .అందరు చురుకైనవారే .పోలాండ్ రష్యన్ ఆధిపత్యం లో ఉండటం వలన వాళ్ళు పోల్స్ ను చాలా హీనంగా చూసేవారు .పోలిష్ చరిత్రను మార్చేశారు .పోలిష్ మాండలికాన్ని హేళన చేసేవారు .రష్యన్ భాషలోనే చదువుకోవాల్సి వచ్చేది .తండ్రి జీతం తగ్గించి అవమానించారు .ఈ బాధలు భరించలేక స్క్లోడో విస్క్ లు బోర్డింగ్ లలో   చిన్న గదుల్లో పదేసి మందికి పైన ఉండేవారు .చదువుకోనేవారికి బారక్ లాంటి వాటిలో ఉంచి విద్య నేర్పేవారు .ఈ దుర్భర పరిస్తితులలో జోషియా,బ్రోన్యాలకు టైఫాయిడ్ తగిలి చాలా ఇబ్బంది పడ్డారు పదహారేళ్ళ జోషియా తీవ్రమైన జ్వరం తో బాధ పడ్డాడు .రెండేళ్ళ తర్వాతా దారిద్ర్యం తో ,అనారోగ్యం తో ,టి బి వచ్చి తల్లి చనిపోయింది .11ఏళ్ళ మర్యా కు ఇది ఆశనిపాతమే అయింది ఆ లేత వయసులో .

యవ్వన ప్రాదుర్భావం లోమార్యా మోడల్ విద్యార్ధినిగా ఉండేది .కాని మానసికంగా  ఆమెది తిరుగుబాటు మనస్తత్వం .ఆమె కు అవార్డులు రివార్డులు బహుమతులు గా రష్యన్ పుస్తకాలే ఇచ్చేవారు .దారిలో ఉన్న తన దేశానికి ద్రోహం చేస్తున్న రష్యా వాళ్ళ విగ్రహాలపై ఉమ్మి వేస్తూ స్కూల్ కు వెళ్ళేది .పోల్స్ కు సార్వ భౌమాదికారం కావాలని కోరుకొనేది .ఈ యువ పద్మ౦ చక్కగా క్రమంగా వికసించి శోభించింది .చేపలు పడుతూ ,డాన్స్ చేస్తూ ,స్ట్రా బెర్రీలు కోసుకొంటూ  కొండలెక్కుతూ నీటిలో ఈదుతూ స్నేహితురాళ్ళతో హాయిగా కాలం గడిపేది .ఒక్కోసారి తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచేది .పెద్దగా సీరియస్ పుస్తకాలేవీ చదివేదికాదు  .అశ్లీలం లేని ప్రమాదం కాని పుస్తకాలే చదివింది .స్కూల్ చదువు పూర్తీ అయేసరికి అందరిలో గౌరవనీయురాలైన అమ్మాయి అని పించింది

వార్సా కు తిరిగి వచ్చి ‘’పాజిటి విస్ట్స్’’అనే అండర్ గ్రౌండ్ కార్యక్రమాలు నడిపే బృందం తో చేతులు కలిపింది .సంస్కరణల కోసం కరపత్రాలు తయారు చేయటం, పంచటం చర్చలలో పాల్గొనటం చేసేది .ఈ రహస్య మిషన్ కు  ‘’ఫ్లోటింగ్ యూని వర్సిటి ‘’అని పేరు పెట్టుకొన్నారు .17ఏళ్ళ మేరీ దీన్ని జీవితాంతం జ్ఞాపకం ఉంచుకొన్నది .ఆర్ధిక వనరులు లేక పోయినా ,సాధించింది అతి స్వల్పమైనా అది అసలైన సాంఘిక పురోభి వృద్ధికి దారి చూపిందని తర్వాత చెప్పింది .వ్యక్తిని తీర్చి దిద్దకుండా కొత్త సమాజం ఏర్పడదు అంటుంది .ప్రతివ్యక్తి తన స్వీయ ఉన్నతికీ కృషి చేస్తూ సమాజాభి వృద్ధికి దోహదం చేయాలని విశ్వసించింది .ఈ బోర్డర్ స్కూల్  ను  స్క్లోడో వ్ స్కి నిర్వహించటం కస్టమై ఆర్ధికంగా లాభించక వదిలేసి ,మరొక చిన్న ఇంటికి మారాడు .ఇప్పుడు పిల్లలు స్వంత కాళ్ల మీద నిలబడే అవకాశం వచ్చింది .18వ ఏట మార్యా గవర్నేస్ అయింది .వచ్చే జీతం లో కొంత డబ్బును పారిస్ లో మెడిసిన్ చదువుతున్నచిన్నక్క బ్రోన్యా కు పంపేది . మార్యా ఇంటి జనం డబ్బు హజం తో తప్పు దారిన పడే తత్త్వం ఉన్నవాళ్ళు .అదొక నరకమని పించి ,వారంతా ఫ్రెంచ్ భాష తప్ప మాట్లాడారని ఇంట్లో అయిదుగురు నౌకర్లున్నారని ,వీళ్ళంతా లిబరల్స్ లాగా పోజు కొదుతున్నారని ఒక కజిన్ కు కార్డ్ రాసింది .

కొన్ని వారాల తర్వాత మరిన్ని సమస్యలొచ్చాయి .ఈమె కు ఉద్యోగమిచ్చిన యజమాని పెద్దకుటుంబం ,చిన్న ఎస్టేట్ ఉన్న వ్యవసాయ దారుడు .వాళ్ళ 18ఏళ్ళ అమ్మాయి తో మంచి స్నేహమేర్పడింది .కూలీల జీవన పరిస్థితి ,పాసిటివిస్ట్  ధానాలను  తనతో ఆమె చర్చించేది . . మార్యా ఆమె అన్న కాసిమిర్ తో ప్రేమలో పడింది .మార్య అంటే ఆ యజమానికి భార్యకూ ఇష్టమే కాని సాంఘికంగా తక్కువ స్థితి లో గవ ర్నేస్ గా ఉన్న అమ్మాయిని కోడలిగా చేసుకోవటానికి వారు ఇష్టపడలేదు .కాసిమిర్ యూని వర్సిటిలో చదువుకోటానికి వెళ్ళిపోయాడు. మార్యా అక్కడే ఉండి పోయింది .అక్కకు డబ్బు పంపుతూ ఏదో ఒక రోజు తానూ పారిస్ చేరి చదువుకోవాలని అనుకొన్నది .ఆమె పొజిషన్ మారినా అలాగే మరో అయిదేళ్ళు కొనసాగింది .తర్వాత తండ్రిని చిన్న చెల్లెలు హేలా ను వదిలిపెట్టి నాలుగవ తరాగతి రైలు పెట్టె లో ఫ్రాన్స్ కు బయలు దేరింది .

బ్రోన్యా ఒక పోలిష్ రివల్యూషనరి,సహా విద్యార్ధి డ్లుస్కి ని పెళ్ళాడగా మార్యా ఫాకల్టి ఆఫ్ సైన్స్ లో చేరి తనపేరునుగాలిక్ సంప్రదాయం లో  మేరీ గా రిజిస్టర్ చేసుకొన్నది .అక్కాబావా ప్రాక్టీస్ ప్రారంభించారు .అక్క స్త్రీ లకు సంబంధిన రోగాలకు కన్సల్టంట్ గా ఉండేది .కొంతకాలం హాయిగా కాలం గడిచింది .బ్రోన్యాకు సంతానం కలిగింది .మేరీ రోజూ యూని వర్సిటికి బస్సులో వెళ్లి రావటానికి అక్కడ లంచ్ చేయటానికి చాలినంత డబ్బు లేక ఇబ్బందిపడేది .1892మార్చ్ లో లాటిన్ క్వార్టర్ కు మారిపోయింది .అది ఒక చిన్న ‘’సన్నాసి’’ గుహలాగా చలిగా ఉండేది .కాని తన కెమిస్ట్రీ లాబ్ కు 15నిమిషాల నడక దూరమే .కొన్ని రోజులకే ఆ గది అసౌకర్యంగా ఉండటమేకాక ,మురికి కూపం అని పించింది .తర్వాత రెండేళ్లలో  ఇళ్ళుమారుతూనే ఉంది .బావ పంపే అతి చిన్న మొత్తం తో జీవితాన్ని లాక్కోచ్చేది .బ్రెడ్ తో టీతో మాత్రమె బతికింది. తగినంత ఆహారం,పోషణా  లేక ఒకసారి క్లాస్ లో నీరసం వచ్చి పడిపోయింది కూడా .బావ కంగారుపడి పరిగెత్తుకొచ్చి చూసి ఆమె రోజు మొత్తం మీద రెండు ముల్లంగి దుంపలు ,కొద్దిగా చెర్రీ పళ్ళు మాత్రమె తిన్నదని తెలిసి అవాక్కయ్యాడు .ఇంటికి తీసుకు వెడితే అక్క బ్రోన్యా చక్కగా సేవ చేసి కడుపు నిండా తినిపించి సేవ చేసింది .కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్లి చదువు పై ద్రుష్టి పెట్టాలని  పట్టు బట్టి వెళ్ళిపోయింది .

మేరీ బుర్రంతా పరీక్షలమీదే ఉంది .కెమికల్స్ ,కాల్క్యులస్ లు తప్ప మిగిలిన వాటి గురించి ఆలోచనే లేదు .అందం వికసించి మరింత అందంగా కనిపించి అందరి దృష్టిలో పడేది .ఒకసారి ప్రేమలో పడింది కాని ఇప్పుడు ధ్యాసంతా చదువు మీదే .తీక్షణ౦గా చదివి చిక్కి శల్యమైంది కాని ఆమె మనస్సు శరీరాన్ని నియంత్రించి ముందుకు సాగేట్లు చేసేది .26ఏళ్ళ వయసులో ఫిజిక్స్ లో ఫస్ట్ గా మాస్టర్  డిగ్రీ పొందింది ..కొన్ని నెలల తర్వాతా గణితం లో సెకండ్ వచ్చి పాసైంది .ఆమెకు ఆరు వందల రూబుళ్ళ స్కాలర్ షిప్ వచ్చి ఉత్సాహాన్ని పెంచింది .కాని ఉంటున్న గది మార్చలేదు .తన బీదరికానికి గర్వ పడేది –she was proud of her poverty ‘’.విదేశం లో ఒంటరిగా స్వతంత్రంగా ఉండటం మేరీకి ఇష్టమైంది .ఇలాంటి సమయం లో పియర్రీ క్యూరీతో పరిచయమేర్పడింది .

మేరీకి అన్ని సౌకర్యాలతో లాబ్ కావాలని ఫ్రెంచ్ టీచర్  పియరీ అర్ధం చేసుకొన్నాడు .ఆయన్ను చూడగానే మనసు పారేసుకొన్నది మొదటిసారిగా మేరీ .పియర్రీ పారిస్ లో 15-5-1859లో పుట్టాడు క్యూరీలు ప్రొటెస్టెంట్ ఆల్సేషి యన్లు.తండ్రి డాక్టర్ ,క్షయ వ్యాధిపై  గ్రంధాలు  రాసిన రచయిత..పారిస్ లో మ్యూజియమాఫ్ నేచురల్ హిస్టరీలో రిసేర్చర్ .సోదరుడు జాక్వెస్ కూరా పరిశోధకుడు ,లాబ్ వర్కర్ కూడా .కొడుకు సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్నాడని డాక్టర్ క్యూరీ బాధ పడేవాడు .కొడుకుకు 16ఏళ్ళు వచ్చేదాకాసైన్స్ లో డిగ్రీ పొందేదాకా ఇంటి వద్ద  తానె చదువు చెప్పాడు .18వ ఏట ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ సాధించాడు .24వయసులో సోదరుడితో కలిసి అతి తక్కువ విద్యుత్తును కొలిచే సాధనం కనిపెట్టాడు .తర్వాత ‘’క్రిస్టలైన్ ఫిజిక్స్ ‘’పై ద్రుష్టి పెట్టి అతి నాజూకు సున్నిత సైంటిఫిక్ స్కేల్ ను కనిపెట్టటమే కాక ,మాగ్నేటిజం లో ప్రాధమిక సూత్రం (ఫండ మెంటల్ లా )కనిపెట్టాడు దానినే ఇప్పుడు ‘’క్యూరీస్ లా ‘’అంటున్నారు.

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-4-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479- ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్(1835-1904)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

479-  ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్(1835-1904)

సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే భారతీయులు ,చైనా వారు ,ఈజిప్షియన్లు గ్రీకులు చెప్పారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఖగోళ విజ్ఞానం అభి వృద్ధి లోకి రాక ముందే ,ఏ యూని వర్సిటి విద్య లేకుండా ,టెలిస్కోపులు కూడా లేని కాలం లో చేతి పరికరాల సాయం తో పరిశీలన చేసి గణన చేసి ఖచ్చితమైన విలువలను రాబట్టిన ‘’పటాని సామంత్ ‘’అనే ఖగోళ శాస్త్ర వేత్త ను అందరం మర్చి పోయాం .ఆయన పరిశోధనా ఫలితాలు ఈ నాటి వారిని అత్యాశ్చర్యం లో ముంచెత్తాయి ఈ మహాను భావుని పూర్తీ పేరు’’ మహా మహోపాధ్యాయ చంద్ర శేఖర సింగ్ హరి చందన మహా పాత్ర సమంత్.’’.1835డిసెంబర్ పద మూడు న ఒరిస్సా లో ‘’ఖండాపర ‘’ప్రాంతం లో జన్మించాడు .

 

చిన్న నాటి నుంచే విశ్వం ఖగోళం ,రాశులు మొదలైన వాటిపై ఆసక్తి ఉండేది .వీటిపై సంస్కృత గ్రంధాలు విస్తృతం గా చదివాడు .ప్రాచీన విజ్ఞానాన్ని ఔపోసన పట్టాడు .ప్రయోగ శీలిగా పరి వర్తన చెందాడు .సామాన్య కళ్ళ  తో చూడలేని‘’దనూ రాశి ‘’ని ఆరు శతాబ్దాల కిందటే భారతీయులు కానీ పెట్టారు .మిగిలిన రాశులను ఏ శాస్త్రీయ పరిజ్ఞానం తో గుర్తించారో ఈ రోజుకీ ఎవరికీ అంటూ బట్టటం లేదు .సూర్యుడు రాప్తాశ్వ రధా రూఢుడు అని మన వాళ్ళు వేలాది ఏళ్ళ క్రితమే గుర్తించి ఆయన లో ఏడు రంగులున్నాయని చెప్పగలిగారు

ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త ‘’నేకల్స్హన్ మెర్లే ‘’కి కొన్ని వందల సంవత్స రాలకు పూర్వమే శ్రీ నాద మహా కవి‘’కాశీ ఖండం ‘’లో కాంతి వేగాన్ని ఎలా చెప్పగలిగాడో ఎవరికీ తెలియలేదు .అప్పటికి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్నే కవి చెప్పి ఉంటాడు .అలాగే ‘’సమంత్’’గారి పరిశీలనలకు గణన లకు మూలాధార మేమిటో తెలుసుకో లేక పోతున్నారు .ఖగోళ విజ్ఞానాన్ని భూకేంద్ర సిద్ధాంతం ,సూర్య కేంద్ర సిద్ధాంతాల ద్వారా తెలుసుకొనే వీలుంది .ఖగోళం లో జరిగే అపురూప సంఘటనలనుఆధారం గా చేసుకొని గణించే అవకాశం ఉంది ఫలితాలను సమీక్షించుకో వచ్చు కూడా .సంప్రదాయ పండితుడైన సమంత్ 1874 లో జరుగ బోయే ‘’శుక్ర గ్రహ సంక్రమణం ‘’అంటే శుక్ర గ్రహ ప్రయాణ మార్గం (ట్రాన్సిట్ ఆఫ్ వీనస్ )గురించి చాలాకాలం ముందే ప్రకటించాడు .

సమంత్ పరి శీలనకు జ్ఞానానికి కోపర్నికస్ తెచ్చిన ఖగోళ విప్లవం గురించి పరిచయం తెలియనే తెలియదు .అయినా 1874డిసెంబర్ తొమ్మిది నసంభ వించిన శుక్ర గ్రహ సంక్రమణం ఆయన చెప్పిన తేదీననే ఖచ్చితం గా జరిగింది .ఇది మన భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుత పరిశోధనా మిగిలి పోయింది సువర్నాధ్యాయమై వెలిగి పోతోంది .ఈ సంఘటన వ్యవధి సమయం ఆధారం గా భూమి –సూర్యుడి మధ్య దూరాన్ని గణన చేయటం ఏంతో ఆసక్తికర విషయం .ఆ నాటి బ్రిటిష్ పాలకులు కూడా ఈ పరిశోధనా ఫలితాన్ని ఆశ్చర్యం తో గమనించారు .ప్రభుత్వ ఆధ్వర్యం లో ‘’అబ్సర్వేటరి సెంటర్లు ‘’ప్రారంభ మైనాయి అంటే ఇది సమంత్ కృషి ఫలితమే అని గుర్తించుకోవాలి  పటాని సమంత గణించి ,నిర్ధారించిన ఖగోళ సంఘటన మళ్ళీ 2004జూన్ఎనిమిది న జరిగింది .ఈ రెండు సంఘటన పరిశీలనలు లెక్కలు పాశ్చాత్య శాస్త్ర వేత్తల కృషి కి ఏ మాత్రం తీసి పోవేమీ కాదు .ఇలా తనకున్న స్వంత చిన్న పరికరాలతో అమూల్య ఫలితాలను తెలియ జేశాడు .తన కృషిని అంతటిని ‘’సిద్ధాంత దర్పణ’’సంస్కృతంలో పొందు పరచాడు .ఇది ఒరియా లిపి లో తాళ పత్రాల మీద రాయగా కలకత్తా యూని వర్సిటీ వారు  1899 లో ప్రచురించారు .ఇందులో మొత్తం 2,500శ్లోకాలున్నాయి .

ఈ సిద్దాన్తగ్రంధం లో అనేక అద్భత అంశాలున్నాయి .సూర్య ,శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32అని లెక్క చెప్పాడు ఇది 31నిమిషాల ,31సెకనులు గా లెక్కించి చెప్పటం మరింత గొప్ప విషయం .ఈ పుస్తకం లో కొన్ని ముఖ్య భాగాలను అరుణ కుమార్ ఉపాధ్యాయ ఇంగ్లీష్ లోకి అనువదించారు .శుక్ర గ్రహణ సంక్రమణం సమంత్  ఇంట ఖచ్చితం గా ఎలా చెప్పా గలిగాడో ఎవరికీ అంటూ బట్టటం లేదు .పటాని సమంత్ 1904లో మరణించాడు భారతీయ పురాణాలలో,సంస్కృత గ్రంధాలలో మంత్రాలు శ్లోకాలరూపాలలో అనేక శాస్త్రీయ విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి

.ధ్రువుడి తపస్సుకు మెచ్చి విష్ణువు మెచ్చి ధ్రువ నక్షత్రం ఏర్పరచి ‘’నువ్వు ఆకాశం లో అత్యున్నత స్తానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 2,600 ఏళ్ళ కోసారి ప్రదక్షిణాలు చేస్తారు ‘’అని భాగవతం లో ఉంది . ఈ విషయాన్ని క్రీ.పూ..’’హిపార్చస్ ‘’అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు దీనిని ఎన్నో వేల ఏళ్ళ క్రితమే మన భాగవత కర్త వ్యాసుడు చెప్పటం అత్యాశ్చర్యం కరం .మన సమంత డాక్టరేట్లు సైన్సు పట్టాలు లేకుండా నే ఖగోళ అద్భుత రహస్యాలను కను గోన్నాడు కేంద్ర ప్రభుత్వం 11-6-2001న సమంత్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి గౌరవించింది .’’హాట్స్ ఆఫ్ టు సమంత్’’.11-6-1904 న మరణించాడు .

Inline image 1

480-విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి

భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు  సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం ,అది శ్రీ కృష్ణార్జున యుద్ధం దాకా వెళ్ళటం తెలిసిందే .రామాయణం లో కుబేరుని ‘’పుష్పక విమానాన్ని ‘’రావణుడు లాక్కొని అనుభ వించాడు .దానిలోనే శ్రీ రామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే .వసు రాజు కు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు అది ‘’ఎయిర్ కండిషన్డ్ విమానం ‘’..దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి .

వి అంటే పక్షి .గాలిలో పక్షి లాగా ఎగిరేది విమానం అని పిలువ బడింది ..మహా భారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది .ఋగ్వేదం లో విమాన యాన ప్రసక్తి ఉంది .మూడు చక్రాలతో ఆకాశం లో విహరించేరదాలున్నట్లు మన పురాణాలలో ఉంది .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’లో విమాన యానం కు సంబంధించిన రచన ఉంది .దీనికి అను బంధం గా ‘’సంస్కార రత్నావలి  ‘’,’’శకట యానం ‘’,’’లోహ తంత్ర’’,’’యాన బిందువు ‘’మొదలైన గ్రంధాలు వచ్చాయి .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’ను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందు బాటు లో లేవు .

క్రీ.పూ.ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది .తండ్రి బృహస్పతి .తల్లి మమత .హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు .ఋగ్వేద అధర్వణ వేదం ,రామాయణ ,మహా భారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది .ఈయనే విమాన శాస్త్ర రచయిత గా అందరు భావిస్తారు .భరద్వాజుడు రాసిన ‘’బృహత్ యంత్ర సంహిత ‘’లో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమె .ఇందులో అనేక పూర్వ గ్రంధాలను ఆధారం చేసుకొని రాసినట్లు చెప్పాడు .ప్రాచీన విజ్ఞాన గ్రంధాలు ముఖ్యమైనవి 25ఉన్నాయి .అవి ‘’వైశ్వానర తంత్రం ,ధూమ ప్రకరణం ,సౌదామిని కళ,శక్తి సూత్రం ,అంశు బోధిని ,వాయు తత్వ ప్రకరణం ,ఆకాశ  తత్త్వం.

భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రం కు విపులమైన వ్యాఖ్యానం రాసిన వాడు ‘’బోదా నంద’’ .ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ,ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు .భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రం పై అనేక పరిశోధనలు చేశారని,గ్రంధస్తం చేశారని  తెలుస్తోంది .అయితే అవి అస్పస్టాలు అసంపూర్నాలు అవటం తో అసలు విషయం తెలియ లేదు .శౌనక మహర్షి రాసిన ‘’వ్యోమ యాన యంత్రం ‘’వాచస్పతి రాసిన ‘’యాన బిందు‘’,నారాయణ రాసిన ‘’విమాన చంద్రిక ‘’దుండి నాధుడు రాసిన ‘’వ్యోమ యానార్క ప్రకాశిక ‘’,గార్గ్య మహర్షి రాసిన‘’యంత్ర కల్పం ‘’,చక్రాయన రచించిన ‘’భేత యాన ప్రదీపిక ‘’మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే .

భరద్వాజ విమాన శాస్త్రం లో ఎనిమిది అధ్యాయాలువంద అధికరణాలు,500సూత్రాలున్నాయి  ,ఇదీ అసంపూర్తి గ్రంధమే .పూర్తీ గ్రంధం అలభ్యం .భరద్వాజుడు తన విమాన శాస్త్రం లో మొత్తం 32విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు .విమాన నిర్మాణం లో

32యంత్రాలున్నట్లు ,వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో వాటి పనులేమిటో కూడా తెలియ జేశాడు .2005లో హరిద్వార్ లో ఆవిష్కరింప బడిన ఆమంచి బాల సుదాకర శాస్త్రిగారి రచన  ‘’భరద్వాజ వైమానిక ‘శాస్త్రం ‘’లో కావలసిన వివరాలున్నాయట .శాస్త్రి గారు విజయ వాడలో ‘’మహర్షి కాల జ్ఞానం ‘’సంపాదకులట.ఇందులో మూడు వేల శ్లోకాలు వంద అధ్యాయాలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ లలో ఈ పుస్తకం వేలు వడిందట .  మన దేశం లో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయి లో’’ శివ శంకర్ బాపూజీ తల పడే ‘’అనే శాస్త్ర వేత్త1895లో మొదటి విమానాన్ని తయారు చేసి ఆకాశం లో ఎగిరెట్లు చేశాడట .ఈయన బొంబాయి చైనా బజార్ లో ఉండేవారు .సంస్క్రుత ఆంగ్లలో  నిష్ణాతుడు .విజ్ఞాన పరిశోధనల్లో ఆరి తేరిన వాడు .బొంబాయి జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో లెక్చరర్ .వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసిన వారు .1913లో శివకర్ గారు ‘’ప్రాచీన విమాన విద్వేచా శోధ’’పేరుతొ మరాఠీ లో ఒక గ్రంధం రాశారు .భార్య మిత్రుల సహకారం తో వేదం లోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విమానాన్ని నిర్మించారు .తన విమానానికి‘’మరుత్సఖ’’ (వాయు మిత్రుడు ).అని పేరు పెట్టారాయన .బొంబాయి లోని ఆర్ట్ సొసైటీ నిర్వహణ లో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు .పాదరసాన్ని  ,సౌర శక్తిని ఇంధనాలు గా ఉపయోగించారు .బొంబాయి లోని ‘’చౌ పట్టి’’సముద్ర ప్రాంతం లో ప్రయోగించి నడిపించారు .1500అడుగుల ఎత్తు  వరకు ‘’మరుత్సఖ ‘’యెగిరి క్షేమం గా భూమి మీదకు దిగింది .ఆ నాటి బరోడా యువరాజు సాయీజీ రావు గైక్వాడ్ ,ప్రసిద్ధ న్యాయ వేత్త మహా దేవా గోవింద రానడే ,వాణిజ్య వేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖు లందరూ ఈ విమానాన ప్రయోగాన్ని చూశారు .దీన్ని అభి వృద్ధి చేయటానికి కావలసిన ఆర్ధిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు .కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం భార్య మరణించటం తో ,శివాకర్ గారు కూడా చని పోవటం తో ఈ ప్రయోగం ఆగిపోయింది .ఈయన వారసులు ఈ తోలి విమానాన్ని బ్రిటిష్ కంపెని కి అమ్మేశారు .బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రిక లో 1953 may 10న  ఒక వ్యాసం రాశారు ‘’శివకర్ తల పడే’’ విమాన ప్రయోగం గురించి పూర్తీ వివరాలు అందులో రాశారు .బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయం తో ఈ విషయాన్ని అంతకు ముందు

బయటికి పొక్క కుండా చేసింది. కాని తిలక్ గారి వల్లనే మొదటి సారి లోకానికి తెలిసింది .1950లో ‘’శిల్ప సంసార‘’అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారా వాహిక గా రాచురించింది .1956లో జనవరి ఎనిమిదిన ‘’త్రిపుర‘’పేరు తో ఒక ప్రత్యెక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు .ఈ విమానం భూమి మీద ,గాలి లోను ఎగుర గలదని తెలిపింది .

భారద్వాజుడి విమాన శాస్త్ర అధ్యయనాన్నిఅనేక మంది ఆధునిక శాస్త్ర వేత్తలు చేశారు .ఇందులో డాక్టర్ రామ ప్రభు,డాక్టర్ మహేశ్వర్ సేరోన్ ,డాక్టర్ యెన్ జి దొంగ్రే ,పి రామ చంద్ర రావు మొదలైన వారున్నారు.

1956-60-ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరు కు రెండు సార్లు వచ్చిన ఉయ్యూరు వాస్తవ్యూలు రష్యాలో ఆయిల్ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతా రామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానం లోను విడిగా బంధువుల ఇంటి లోను మాతో మాట్లాడి నప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశశాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకొని వెళ్లి జర్మని లో విమానాన్ని తయారు చేశారని చెప్పారు .ణ

కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం సమాప్తం .

Inline image 2

గబ్బిట దుర్గాప్రసాద్ –3-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

-477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )

నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర  అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది .

సుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దిలో జన్మించి నట్లు తెలుస్తోంది .ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడని ,అంటారు ధన్వంతరి కి ముఖ్య శిష్యుడు .సుఖ ప్రసవం కోసం శాస్త్ర చికిత్స కూడా చేశాడు .మూత్ర పిండాలలో రాళ్ళను కూడా తొలగించే వాడు .విరిగిన ఎముకలు అతికించటం లో ,కంటి శుక్లాలు తొలగించటం లో కృషి చేశాడు .ప్లాస్టిక్ సర్జరీ ,రైనో ప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణం ప్లాస్టిక్ శాస్త్ర చికిత్సలో నిష్ణాతుడు

సుశ్రుతుడు శాస్త్ర చికిత్స మీద ‘’సుశ్రుత సంహిత ‘’ అనే బృహద్ద్ద్ గ్రంధాన్ని రచించాడు .ఇందులో నూటొక్క శాస్త్ర పరికరాలను పేర్కొన్నాడు .ఇది ఇప్పటి శాస్త్ర వైద్యానికి మణి దీపం గా నిలుస్తోంది .ఈయన ప్రక్రుతి ఆరాధకుడు కూడా .జంతు వృక్ష ప్రపంచం మీద ద్రుష్టి సారించి అమూల్య సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేశాడు .భిన్న ఋతువులలో వాతావరణ పరిస్తితులలో ఆరొగ్యాఆఆఆఆఆమ్ గా ఎలా ఉండాలి అన్న వాటిని వివరించాడు .

ఒక సారి ఒక ప్రయాణీకుడు అడవి గుండా వెడుతుంటే ప్రమాద వశాన అతని ముక్కు తెగింది తెగిన ముక్కును చేత్తో పట్టుకొని దగ్గిరున్న సుశ్రుత ఆశ్రమానికి చేరాడు .ఆయన గమనించి ముందు నీతితో గాయాన్ని తుడిచాడు .దానికి మూలిక్కా రసం అద్దారు సెప్టిక్ కాకుండా .ఒక గిన్నెడు మద్యం తాగించాడు .ఆటను స్పృహ కోల్పోగానే సూక్షమమిన కత్తులతో సూదులతో శాస్త్ర చికిత్స చేశాడు .ఒక ఆకుతో ముక్కు కొలత కొలిచాడు చిన్న పడు నైన వేడి చేసిన కత్తి తో దవడ కంద లో కొంత భాగం కోసి దాన్ని సరిగ్గా కావాలసినంత గా రెండు భాగాలు చేసి ముక్కు పుతాలలో అమర్చాడు .ముక్కు ఆకారాన్ని సరి చేసి బియ్యపు పిండి ,గంధం తో పట్టు వేశాడు .దాని మీద బూరుగు దూది పెట్టి ,ఔషధ నూనె పోసి కట్టు కట్టాడు .రెండు రోజుల్లో ఆ వ్యక్తీ తేరుకొన్నాడు .అతడు ఏ ఏ ఆహార నియమాలు పాటించాలో ఏయే మందులు వాడాలో సూచించాడు సుశ్రుతుడు .

సుశ్రుత సంహిత గ్రంధాన్ని ఎనిమిదో శతాబ్దిలో అరెబిక్ భాష లోకి ‘’కితాబ్ పాశూన్ –ఏ –హింద్ ‘’,కితాబ్ –యి –సుసృద్ ‘’పేరా అనువదించారు .విరిగిన ఎముకలను సరి చేయటానికి అనేక రకాలైన కర్ర బద్దల్ వివరాలున్నాయి ఇదే‘’శల్య తంత్రం ‘’.మత్తు మందుగా మద్యాన్ని వాడే వాడు

పిస్తులా వ్యాధికి ‘’క్షార సూత్రా ‘’చికిత్స చేసే వాడు మొలలు నాదీ వరణం మొదలైన వాటికీ దీన్ని ఉపయోగించేవారు ఒక దారాన్ని తీసుకొని ఇరవై ఒక్క  సార్లుక్షార ఔషధాలతో సమ్మిళితం చేయటాన్నే క్షార చికిత్స అంటారు దీన్ని వాడితే అయిదారు వారాలలో ఫిస్తులా మాయం .

అతి నైపుణ్యం గా శాస్త్ర చికిత్స చేయటానికి కొన్ని జంతువుల వెంట్రుకలను ,బాగా ఎదిగిన వెదురు బొంగులను ,కొన్ని ప్రత్యెక లక్షణాలున్న బెరడులతో చేసిన కుంచెలను ఉపయోగించేవాడు .సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం వీలున్నా పూర్వ కర్మ చికిత్స అంటే ‘’ఫిజియో తెరపి ‘’చేయాలని సూచించాడు .ఆయన వాడిన శాస్త్ర పరికరాల వివరాలనూ వివరం గా వర్ణించాడు తన గ్రంధం లో సుశ్రుతుడు ,చరకుడు చెప్పిన వైద్య విధానం క్రీస్తు పూర్వమే ఆగ్నేయ ఆసియా ఉత్తర ఆసియా ,మధ్య ప్రాచ్యాలలో బాగా వాడుక గా ఉంది చరిత్ర కారుడు ‘ఫరిస్తా ‘’రాసిన చరిత్రలో పదహారు ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంధాలు ఎనిమిదో శతాబ్దం నాటికే అరబ్బులకు పరిచయమైనాయి .

గర్భ ధారణా కు అనువైన ఔషధాలు యవ్వనోత్సాహానికి మందులు సూచించాడు ఆయన తయారు చేసిన ‘’ఫొర్ సేప్స్‘’,దిసేక్తింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫొర్సేప్స్ ‘’ఈ నాటి శాస్త్ర చికిత్సా సాధనాలకు మార్గ దర్శకలయ్యాయి తెగిన ముక్కు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన మహానుభావుడాయన .

మహా రాష్ట్ర లో పది హేనవ శతాబ్దం లోనే ఇటుకలు తయారు చేసే కాంగ్రా వంశీకులు ప్లాస్టిక్ సర్జరీ లో సిద్ధ హస్తులయ్యారు .ఈ కుటుంబాలలో హకీమ్ దీనా నద కుటుంబం ఇరవై వ శతాబ్దం లో ఈ చికిత్స చేసిన చివరి కుటుంబం .బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం లో బాల పడిన తర్వాత ఈ చికిత్సా విధానాన్ని బ్రిటిష్ పాలకులు తెలుసుకొని 1794లో పాశ్చాత్య దేశాలకు తెలియ జేశారు ఇదంతా సుశ్రుత మహర్షి కృషి ఫలితమే .

Inline image 1

478-  కణాదుడు౯(క్రీ పూ .800)
ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే చిన్న కణాలుగా విభజించటం కుదరదని చెప్పాడు .వీటినే అణువులు అన్నాడు గ్రీకు లో ఆటోమాస్ అంటే విభజించాతానికి వీలుకానిది అని అర్ధం .అనువులున్నాయని నిరూపించా లేక పోయాడు
కఠోపనిషత్తు లో ప్రపంచ పరిణామానికి జడ పదార్దమే కారణం అని ఉంది దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారం గా తీసుకొని మన వాళ్ళు వేరే మార్గం లో పయనించారు కపిల ,కణాదుల భౌతిక సిద్ధాంతం తర్వాత బౌద్ధం వచ్చింది తర్వాత జైనమతం హేతు వాదం తో వృద్ధి చెందింది .బౌద్ధ ,జైన శాస్త్ర వేత్తలు కనాడ కపిలులనే ఆధారం గా తీసుకొన్నారు .దేమోక్రాతిస్ కు ముందే కణాదుడు జన్మించాడు వైశేషిక దర్శనం లో ”అన్విక విశిష్టత ”ఉంది .వైషేశికం లో ఆధునిక శాస్త్ర వేత్త ”ఔలూక్యుడు ”.ఈ నాడు మనం చెప్పే శాస్త్ర వేత్త ,పరిశోధకుడు అనే పేర్లు ఆయనకే సరి పోతాయి ఆయనే కణాదుడు .డేమోక్రాటిస్ కు నాలుగు వందల ఏళ్ళ క్రితమే కణాదుడు పుట్టాడు .

”ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం ”నూతన అధ్యాయానికి దారి తీసింది .”అణు భక్షకుడు ”అని కణాదుడు పేరు పొందాడు .కణాదుడు అంటే కణాలు తినే వాడని అర్ధం .”అణుస్ ”అనే సంస్క్రుత్సపడమే ఆటం అయింది ఇంగ్లీషులో .సూదులను అయస్కాంతం ఆకర్షించటం ,మొక్కలలో జల ప్రసరణ జడం అనేది ఈధర్ లేక అయస్కాంతం లో ప్రసారం చేయటానికి ఆధారమవటం ,అన్ని రకాల వేడికి సూర్యుడు ,అగ్నియె కారణం ,భూమి అనువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనం కోన సాగటం అను విచ్చ్చ్చేడం ద్వారా విశ్వ ప్రళయం ,ఉష్ణ ,కాంతి కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించటం వల్లనే కణాలు అనూహ్య వేగం తో అన్ని వైపులకు దూసుకు పోతాయి (విశ్వ కిరానా సిద్ధాంతం ),దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటిని కణాదుడు స్స్పస్తం గా చెప్పాడు .
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది .అనువుల్లో అంతర్భాగం గా ఉన్న సహజ భౌతిక శక్తి ,బహిర్గాతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు .ప్రపంచ సృష్టికి అణువులే కారణం .అణువులు గుండ్రగా ఉంటాయి .అణువులు ఒకదానినుంచి ఒకటి వేరైనప్పుడు కాని ,కదలిక లేనప్పుడు కాని ఏ పనీ జరుగదు అన్నాడు .అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణ మౌతాయి .కణాలు ఏర్పడటానికి అందులోని అణువులే కారణం .అణువులు ఎప్పుడూ చేతనా స్తితి లో ఉంటాయని కణాదుడు ఊహించ లేక పోయాడు .డిమొక్రటిస్ సిద్ధాంతాల కంటే కనాడ సిద్ధాంతాలు భౌతిక వాదాన్ని బాగా బల పరుస్తాయి .
”పరిమిటి గల పదార్ధం అనంత కోటి వస్తువులకు పదార్ధం కాజాలదు”అన్న వైషేశికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్ధం అనువు అనే నిర్ధారించింది .
కణాడునికి ఔలూఖ్య ,కాశ్యప అనే పేర్లున్నాయి క్రీ పూ ఆరవ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు .ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ జిల్లా పభోస ప్రాంతం లో ప్రభాస లో కణాదుడు జీవించాడు ఆయనది ”పావురం జీవితం ”అన్నారు కొందరు .అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకొని తిని బతికాడని అర్ధం .చిన్న చిన్న రేణువులు అంటే కణా దులు మీద ఆధార పడిజీవించాడు కనుక ”కణాదుడు ”అని పించుకొన్నాడు .ఆయనకు ”కణ  ”,కణ భూకర్ ,కణ భక్ష ”పేర్లు కూడా ఉన్నాయి ఈయన సోమ శర్మకు శిష్యుడు .”సూర్య కారణ సంబంధం ”అనే సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన వాడు కనాడుడే .”వైశేషిక సూత్రా ”రచయితా .ఇది పది గ్రందాల సంపుటి .ప్రతి గ్రంధం లో రెండేసి అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం లో అనేక సూత్రాలు ఉన్నాయి ప్రతి గ్రంధంలో కనీసం 370సూత్రాలుంటాయి .పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని వాటిని మళ్ళీ విభజించినా ఆ తర్వాత విభజించటం సాధ్యం కాదు అని చెప్పాడు
కణాద సిద్ధాతం ప్రకారం ఈ విశ్వం ఆరు స్తితులలో ఉంది ద్రవ్య ,గుణ ,కర్మ ,సామాన్య ,విశేష ,సమవాయ స్తితులు .పదార్ధాలు తొమ్మిది అస్తిత్వాలను కలిగి ఉంటాయి భూమి జాలం ,అగ్ని ,తేజ ,వాయు ఏఎధర్ ,కాలం ,అంట రిక్షం మనస్సు ,ఆత్మా ..కణాదుడు నిరీశ్వర వాదిడ చని పోయే ముందైన దేవుడిని ప్రార్ధించమని శిష్యులు కోరితే ”పీలవః”అని అన్నాడట .అంటే ”పరమాణువు ,పరమాణువు ”.అని అర్ధం .ఈయన భావనలో మనస్సు ఆత్మా రెండు ద్రవ్యాలే .ప్రతి ద్రవ్యం అణురూపం లోనే ఉంటుంది .స్పేస్ అండ్ టైంకూడా ద్రవ్యా లేనివని ఐ న్ స్టీన్ కాలాని కంటే ముందే  కణాద మహర్షి చెప్పాడు నిరీశ్వర వాదికావటం  వల్ల తగినంత ప్రచారం పొందలేక పోయాడు .

Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 475- చరక మహర్షి(10వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

475- చరక మహర్షి(10వ శతాబ్దం )
మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం  లో అధర్వ వేదం లో ఉచరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన  ,కల్పస్థాన  ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను  ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త  ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై  ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది

 

Inline image 1

476-ఆచార్య నాగార్జునుడు(931-

రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన ‘’ఆర్య నాగార్జునుడు ‘’అని పించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివశించాడు .ఇక్కడి ఈ పర్వతానికే ‘’నాగార్జున కొండ ‘’అనే పేరొచ్చింది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .

కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి  ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .

ఆచార్య నాగార్జుండు అనేక వైద్య గ్రంధాలు రాశాడు .రస ప్రక్రియ అంటే ఆల్కెమీ కూడా నేర్చి నట్లు అని పిస్తుంది .ఆయన కాలం లో ‘’విజ్ఞాన వాదం ‘’ప్రారంభం అయి తర్వాత కూడా వ్యాప్తి చెందింది .అదీ ఆయన ఘనత .ఈ నాగార్జునుడు వేరు ఏ లోహాన్నైనా బంగారం గా మార్చ గలిగే ‘’పరసు వేది ‘’ని కని పెట్టిన సిద్ధ నాగార్జునుడు వేరు అనిఅనేక కధలు  ప్రచారం లోఉన్నాయి . దీనితో నాగార్జునా చార్యుడు రసాయన శాస్త్రానికి చేసిన అద్వితీయ కృషి మరుగున పడి పోయింది .నాగార్జునుడు వివిధ లోహాలను ప్రకృతి నుంచి సేకరించి వాటిని శుద్ధి చేసే విధానం కని  పెట్టాడు .రాత్రి వేళల్లో అడవుల్లో కాంతులు ప్రసరించే అనేక మూలికలను సేకరించి ప్రయోగాలు చేశాడు .వృక్ష సంబంధ పదార్ధాల తోను అనేక ప్రయోగాలు చేసి నమోదు చేశాడు .వీటి నన్నిటిని ‘’రస రత్నాకరం ‘’లో వివరించాడు .

ఆచార్యుడు రసాయన శాస్త్రం లోనే కాకుండా వైద్య ,యోగ శాస్త్రాలలో కూడా సృజనాత్మక కృషి చేశాడు .రస రత్నాకరం తో బాటు ‘’కక్షపుట తంత్రం ‘’,’’ఆరోగ్య మంజరి ‘’,యోగసారం ‘’యోగాస్టకం ‘’మొదలైన రచనలు చేశాడు .తన సిద్ధాంతాలను జన సామాన్యానికి అందించాలని ఎంతో తపన పడ్డాడు .దీనికి ఒక చిట్కా చేశాడు  .ఈ అపూర్వ విజ్ఞానం అంతా తనకూ దేవతలకు మధ్య జరిగిన సంభాషణల వల్లనే అబ్బిందని అందరికి చెప్పాడు ఈవిషయాన్ని రస రత్నాకరం లో చెప్పాడు కూడా .

నాగార్జునుని రస రత్నాకరం ఆధునిక రసాయన శాస్త్ర వేత్తలకూ ప్రామాణిక గ్రంధమే అయింది .తన గ్రంధాలలో వాదప్రతి వాదాలరూపం తో  ఆకట్టుకొనే విధం గా విజ్ఞానాన్ని అందించాడు .ఈయనకున్న మహిమల్ని జనం విస్త్ర్తుతం గా ప్రచారం చేశారు .ఈయన ప్రయోగించిన చిట్కా వల్ల  ప్రాచీన శాస్త్ర వేత్త లెవ్వరికి రాని  ప్రచారం ఆచార్యునికి దక్కింది .రస రత్నాకరం లో రసాయన మూల కాల వివరణ బాగా ఉంది .రాసాయనిక యౌగికాల గురించి మొట్ట మొదట తెలియ జేసిన వాడు నాగార్జునుడే .ఇదే ఆ తర్వాత మెటలర్జీ ,ఆల్కేమీ గా వృద్ధి చెందాయి. రాగి, సీసం ,టిన్ ,వెండి బంగారం మొదలైన ముడి లోహాలను ఖనిజాల నుండి ఏ విధానం లో సంగ్రహించాలో వాటిని ఎలా శుద్ధి చేయాలో మొదలైన అమూల్య విషయాలు ఈ గ్రంధం లో రాశాడు .ఆయన మేధస్సును అంచనా వేయటం కష్టం .రస రత్నాకరం ఒక ప్రయోగాత్మక రసాయన శాస్త్రం .ప్రయోగాల వల్లనే వివిధ ధాతువుల నిర్మాణం, మేళ వింపు ప్రయోజ నాలు తెలుసుకోవచ్చని చెప్పాడు ప్రకృతిలో దాగి ఉన్న ఖనిజాలు ,మొక్కలు, మూలికలు,తృణ  ధాన్యాలు మొదలైన వాటిని ఆరోగ్య సంరక్షణ కై ఔషధాలను తయారు చేసుకోవచ్చునని సూచించాడు ,

‘’సిన బార్ ‘’(ఇంగిలీకం )నుండి పాదరసం తయారు చేయచ్చని ,’’కాలమైన్ ‘’సీసాం లాగా కనీ పిస్తుందని దీన్ని కూడా తయారు చేయ వచ్చునని ఈ గ్రంధం లో రాశాడు .దాతువుల్లో ఉన్న హాని చేసే పదార్ధాలను తొలగించి వాటిని ప్రయోజన కరమైన వాటిగా మార్చే విదానాలెన్నో చర్చించాడు .ఆరోగ్యం కోసం కొద్ది మోతాదులో పాదరసం ,గంధకం ఇంగువ  కలిపీ తింటే ఆయుస్సు పెరుగుతుందనీ తెలియ జేశాడు .దీన్నే ఇప్పుడు ‘’రస సింధూరం ‘’గా పిలుస్తున్నారు .మనిషి లో ప్రాణ శక్తి ,దీర్ఘకాల జబ్బుల వల్ల ‘’ఓజస్సు ‘’క్షీనిస్తుందని ,మళ్ళీ దాన్ని పొందాలంటే రసాయన పదార్దాలే గతి అని స్పష్టం గా చెప్పాడు .శరీరం లో రసం ,రక్తం మాంసం ,మేధస్సు ,ఆస్థి ,మజ్జ ,శుక్లం వల్లనే ‘’ఓజస్సు‘’ఏర్పడుతుంది .కనుక ఓజస్సు తగ్గితే రసాయనిక చికిత్సే అవసరం అవుతుందని చెప్పాడు .వ్యాధి నిరోధక శక్తి పెరిగి ప్రాణ శక్తి పెరిగి సూక్ష్మ జీవులు  నసించితే తే ఓజస్సు వృద్ది చెందుతున్దన్నాడు

వ్యాధిని వివారించటం తో బాటు నియంత్రించటం లో కూడా శ్రద్ధ చూపించాలన్నాడు. ఆచార్యుడు .శుశ్రుతుడు రాసిన‘’సుశ్రుత సంహిత ‘’ఆధారం గా ‘’ఉత్తర తంత్ర ‘’రాశాడు .దీని అసలు ప్రతి ఇతర దేశాల్లో వ్యాపించటం తో దాని వివరణలు

మనకేమీ తెలియ లేదు .ప్రక్రుతి సిద్ధ మైన రోగ నిరోధక శక్తి ని పెంచటానికి ఇందులో లొ చాలా విషయలున్నాయట..పాదరాసాన్ని పద్దెనిమిది సార్లు శుద్ధి చేసి,ఆ ద్రావకం లో వన మూలికల కషాయాన్ని రంగరించి విపరీతం గా చిలికితే అందులోని గంధకం ,అభ్రకం కొన్ని క్షారాలు కలిపి మళ్ళీ పది హేడు సార్లు శుద్ధి చేస్తే ‘’స్వర్ణ లోహం‘’ఏర్పడుతుంది అని వివ రించాడు నాగార్జునుడు .అయితే ఇందులో ఏవి ఎన్నిపాళ్ళు ఉండాలో   స్పష్టం గా లేదట .జింక్ ను మూడు రెట్ల రాగితో కలిపి అత్యధిక వేడిలో ఉంచితే ఇత్తడి ఏర్పడుతుంది .కాని బంగారం ఎలా ?దీన్ని ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించాడు ,

‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’  కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు .

నాగార్జునుడు ఏర్పరచిన విశ్వ విద్యాలం లో బౌద్ధ భిక్షువులు ,సన్యాసులు అనేక దేశాల నుండి వచ్చి చేరి చదువు కొనే వారు అన్ని శాస్త్రాలను ఇక్కడ విద్యార్ధులు నేర్చుకొనే అవకాశం ఉండేది .ఇక్కడే 108అడుగుల వ్యాసం ,86అడుగుల ఎత్తు ,ఉన్న మహా స్తూపం ఉంది .దీన్ని పద్దెనిమిది అంగుళాల పొడవు ,తొమ్మిది అంగుళాల వెడల్పు ,నాలుగు అంగుళాల మందం తో చేసిన ప్రత్యెక ఇటుక లతో ఈ స్తూపాన్ని నిర్మించారు .విజయ పురి అంతర్జాతీయ బౌద్ధ విహార కేంద్రం అయింది ఇప్పటి నాగార్జున సాగర్ కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ‘’అనువు ‘’అనే చోట ఇక్ష్వాకుల కట్టడాల్ని పునర్నిర్మించారు

నాగార్జునుడు సకల శాస్త్ర పారంగతుడని అపర ధన్వంతరి అని శాస్త్ర శాస్త్ర ప్రవీణుడు అని తత్వ వేది, తార్కికుడు ,ఖనిజ కళా నిష్ణాతుడు ,వేదంవేదంగ  విద్యా విశారదుడు ,కవి సార్వ భౌముడు ,కళోపాసకుడు ,మాధ్యమిక వాద మహా ప్రవక్త,మహా యాన మార్తాండుడు ,శతాధిక గ్రంధ కర్త అని ఎందరో తమ రచనల్లో ఆయన ప్రతిభా విశేషాలను ప్రస్తుతించారు .చిన్ననాటే వేదం వేదంగ పారంగతుడై ,వివాహ ప్రసక్తి లేకుండా సన్య సించి సర్వ జ్ఞాని అయ్యాడు అని చరిత్ర కారుల అభి భాషణ .భారతీయ రస వాదుల్లో ప్రప్రధముడు .బట్టీ పట్టటం (దిస్తిలేషన్ )శుద్ధిచేయటం (సబ్లిమేషన్  )భస్మం చేయటం (కాల్సి నేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాల రంగులు మార్చటం ,లోహ మిశ్రమం (అల్లాయ్ల్ )అగ్ని శీలా (పైరైట్స్త్స్ )నుంచి రాగి తీయటం ,మెటాలిక్ ఆక్సైడ్స్ ,ఆక్సైడ్స్ ఆఫ్ బ్రాస్ మొదలైనవి  నాగార్జున మేధో జనితాలే వైద్యం లో ‘’కజ్జోలి ‘’అన బడే బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి ని పరచయం చేసిన వాడు కూడా ఆచార్యుడే .తన శాస్త్రీయ ప్రయోగ వివరాలను శిలలపై చెక్కించాడు .లోహ సంగ్రహణ శాస్త్రానికి (మెటలర్జీ )కి ఆద్యుడయ్యాడు .ఆచార్య నాగార్జుడిని మొదటి నాగార్జునుడు అంటారు .

ఆధునిక భౌతిక శాస్త్రం లో లేజర్ కిరణాల సహాయం తో అణువు కేంద్రకం లోని ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చే అవకాశం కలిగింది . ప్రోటాన్ సంఖ్య మారితే ఒక మూలకం ఇంకో మూలకం గా మారుతుందని రుజువు అయింది .లేజర్ తో రాగి కేంద్రాణువులో ఒక ప్రోటాన్ చేరిస్తే నికెల్ అయి పోతుంది .అలానే ‘వల్కన్ ‘’అనే శక్తి వంత మైన లేజర్ నుపయోగించి బంగారాన్ని పాదరసం గా మార్చ గలిగారు ఈ నాటి శాస్త్ర వేత్తలు .వీటి కన్నిటికి ఆచార్య నాగార్జునుని మౌలిక భావనలే ఆధారం .

రెండవ నాగార్జునుడే ‘’’సిద్ధ నాగార్జునుడు ‘’క్రీ.శ.600వాడు .రస విద్య లో అఖండుడు .పుణ్య సాధువు అనే ఆయన మేనల్లుడు .జైన తత్వ వేత్త .వైద్య ప్రకాన్దుడు అని పించుకొన్న పూజ్య పాదుల వద్ద ఉద్యోగి. జైనుడుగా పుట్టినా బౌద్దం స్వీకరించాడు .దేశం లో ను నేపాల్ ,టిబెట్ లలో పర్యటించి బౌద్ధ ప్రచారం చేశాడు శ్రీశైలం కొండడకు వచ్చి ‘’నాగార్జున బోధి సత్వ ‘’గా ప్రసిద్ధుడైనాడు. అనేక రసాయన ప్రయోగాలు చేశాడు .రస వాదవిద్య ద్వారా మోక్షాన్ని పొందాడు అందుకే సిద్ధ నాగార్జునుడుగా అందరూ ఆరాధించారు .’’రస కాచ పుట ‘’,’’కక్షు పుట తంత్ర ‘’,మొదలైన గ్రందాల రచయితగా సుప్రసిద్దుడయ్యాడీ సిద్ధ నాగార్జునుడు .

మూడవ నాగార్జునుడు –అసలు పేరు ‘’భదంత నాగార్జున ‘’క్రీ.శ.ఏడవశతాబ్దివాడు . కేరళ కు చెందిన బౌద్ధ సన్యాసిగా చరిత్ర పుటల కెక్కాడు .ఆయుర్వేదం లో ఆనాడు ప్రసిద్ధ మైన అనేక గ్రందాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’రస వైశేషిక సూత్ర ‘’అనే గ్రంధం రాశాడు .ఆయుర్వేద వైద్యానికి చెందిన మౌలిక సూత్రాలను ఇందులో చర్చించాడు .ఇది486సూత్రాలతో నలుగు అధ్యాయాలుగా ఉంది .స్వతంత్ర విధానం గా అలోచించి రాశాడు .తన శైలిలో ‘’నాగార్జుని యాన్‘’అనే ప్రత్యెక వైద్య స్సంప్రదాయాన్ని నెల కొల్పి అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు .మొత్తం  మీద నాగర్జునులు ముగ్గురూ ముగ్గురే .వైద్య రసాయనాలకు ముగ్గులేసి వ్యాప్తి చెందించిన వారే .

Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

— 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

12-2-1824న గుజరాత్ ,లో కదియవాద్ జిల్లా త౦కారాలో బ్రాహ్మణ కుటుంబం లో మహర్షి దయానంద సరస్వతి జన్మించాడు .మూలానక్షత్రం లో పుట్టటం వలన ‘’మూల శంకర్’’ అని పేరు పెట్టారు .ఆయన జన్మ దినోత్సవాన్ని ఫాల్గుణ కృష్ణ దశమినాడు ,ఫిబ్రవరి 24మంగళవారం నిర్వహిస్తారు .తండ్రి కర్షం జీ లాల్జి తివారి, తల్లి యశోదా బాయి .ఎనిమిదేళ్ళకే ఉపనయనం చేశారు.ఒక శివ రాత్రి నాడు ఉపవాసం ఉండి,జాగరణ చేస్తుంటే శివునికి పెట్టిన నైవేద్యాన్ని ఎలుక తినటం చూశాడు .ఎలుకనే నివారించలేని దేవుడు ప్రపంచాన్నే౦  పాలిస్తాడు అనే అనుమానమొచ్చింది .

వేద,శాస్త్రాలన్నీ నేర్పించారు .చిన్న చెల్లెలు ,బాబాయి కలరాతో చనిపోవటం చూసి అసలు చావు ,పుట్టుకలపై ఆలోచన పెరిగి తలిదండ్రులను ప్రశ్నించేవాడు .పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే, తెలియకుండా 1846లో ఇంటి నుండి పారి పోయాడు .25ఏళ్ళు దేశమంతా తిరుగుతూ సన్యాసిగా గడిపాడు .అరణ్యాలలో హిమాలయాలలో ఒంటరిగా ఉండి ఆత్మ సాక్షాత్కారం కోసం తీవ్ర తపస్సు చేశాడు .పుణ్య క్షేత్రసందర్శనం చేస్తూ యోగాభ్యాసం చేశాడు .సనాతన  ధర్మాన్ని ఆచరణలో కలుషితం చేస్తున్నారని గ్రహించి దాని శుద్ధి చేయాలని సంకల్పించాడు .’’విరజానంద దండీశ్వర ‘’కు శిష్యుడై ఎన్నో నేర్చి వేదోద్ధరణకు పూనుకొన్నాడు .వేదాలలో ఉన్న సకల మానవ సోదరత్వ భావనా వ్యాప్తికి నడుం బిగించాడు .ఆర్య సమాజ స్థాపన చేసి దశ సూత్రాలను ప్రవచించాడు .తనకున్న వేద,సంస్కృత పరిజ్ఞానం తో ఎందరినో వాదం లో ఓడించి జయించి తన విశ్వాసాన్ని నిలబెట్టాడు .పురోహితుల బండారాలు బయట పెట్టాడు .వేదం చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తున్నదొకటి అని మండిపడ్డాడు. దేశ సంచారం చేస్తూ ఆర్య సమాజ భావ జాల వ్యాప్తి చేశాడు .

భారత దేశానికి’’ స్వరాజ్యం ‘’రావాలి అని మొట్ట మొదట చెప్పింది ‘’,భారత్ భారత దేశానిదే’’ అని ఖచ్చితంగా చెప్పిందీ దయానండుడే .స్త్రీకి సమాన హక్కు ,విద్యా ఉండాలి అని చెప్పిన మొదటివాడూ దయానండుడే .క్రిస్టియన్ ,ఇస్లాం బౌద్ధ జైన మతాలన్నీ కాచి వడపోశాడు విగ్రహారాధనను నిరసించాడు .’’సత్యార్ధ ప్రకాశిక ‘’అనే ఉద్గ్రంధం రాశాడు తన సంస్కరణ భావాలను చదువుకొన్న వారికే కాక ప్రపంచం లోని సకల మానవాళికీ అందేట్లు చేశాడు .అన్యమతస్తులను హిందువులుగా మార్చే కార్య క్రమం చేబట్టాడు. వేదం లోని సకల మానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పి దానికోసమే తీవ్ర కృషి చేశాడు .14ఏళ్ళ వయసులోనే మత గ్రంధాలు చదివి వాటిని జనాలకు బోధించేవాడు 22-10-1869న వారణాసి లో జరిపిన గొప్ప చర్చ ఆయనకు పెద్ద పేరు తెచ్చింది .27మంది విద్యావేత్తలు ,12మంది నిష్ణాతులతో జరిపిన బహిరంగ చర్చ అది యాభై వేల మంది ప్రజలు పాల్గొన్నారు .’’’వేదాలు విగ్రహా రాదన ను అంగీకరిస్తున్నాయా ?’’అనే విషయం పై జరిగిన చర్చ అది యజ్న యాగాదులలో జంతుబలి పనికిరాదని ,,తీర్ధ యాత్రలు దేవుళ్ళకు నైవేద్యాలు ,రదోత్సవాలు బాల్య వివాహాలు మాంస భక్షణ ఆర్య సమాజం లో నిషిద్ధం .స్త్రీ విద్య, సమానావకాశాలు వేదాలలో ఉన్నాయని రుజువు చేశాడు .కర్మ సిద్ధాంతాన్ని ,పునర్జన్మ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు .బ్రహ్మ చర్యం అనుసరించాల్సిన ఆవశ్యకతను తెలియ జేశాడు .పరమాత్మకు తప్ప వేరెవరికీ మొక్క రాదన్నాడు ‘’.స్వదేశీ ‘’అనే మంత్రమూ ఆయనదే ., గాంధీజీ కన్నా ఎన్నో ఏళ్ళకు ముందే దళితులను ‘’ హరిజనులు ‘’ అనే గౌరవ పదంతో సంబోధించి,  మొదట ప్రయోగించినవాడు మహర్షి యే.మూఢాచారాలను విసర్జి౦చాలన్నాడు. ఆయనను చంపాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి .గొప్ప’’ హఠ యోగి’’కనుక అన్నిటినీ తప్పించుకొన్నాడు .

1883లో జోధ పూర్ మహారాజు ఆహ్వానించగా దయా నందుడు వెళ్ళాడు .రాజు ఆయన శిష్యుడని తరించాలని భావించాడు .అక్కడ రాజు ఒక నర్తకితో శృంగార క్రియ లో ఉండటం మహర్షి చూసి నిర్భయంగా అడిగి మానసిక పరి వర్తనకోసం ధర్మాచరణ చేయమని హితవు చెప్పాడు .కాని నర్తకి స్వామిపై పగ బట్టింది .స్వామి వంటవాడిని లోబరచుకొని ఆయన త్రాగే పాలలో గాజుముక్కల పొడి కలిపించి తాగించింది .త్రాగాగానే గ్రహించాడు అప్పటికే అవి నరాలను కండరాలనూ కోసేస్తున్నాయి ..విషయం తెలిసిన రాజు పరుగెత్తుకొచ్చి వైద్యుల చేత చికిత్స చేయించే లోపే పరిస్తితి విషమించింది నొప్పి భరించ శక్యం కావటం లేదు .ఇది చూసిన వంటవాడు స్వామి కాళ్ళపై పడి తన తప్పును ఒప్పుకొన్నాడు .స్వామి వాడిపై జాలి చూపించి రాజ భటులకు చిక్కకుండాపారి పోయి  ప్రాణంరక్షించుకోమని తనదగ్గరున్న డబ్బు మూటనిచ్చి పంపి వేసి తన’’ దయానంద ‘’గుణాన్ని సార్ధకం చేసుకొన్నాడు మహర్షి .వైద్యుల సలహాపై రాజు మహర్షిని మౌంట్ ఆబూ కు చేర్చారు .అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం అజ్మీర్ పంపారు .కాని ఆరోగ్యం లో మార్పు రాలేదు .30-10-1883ఉదయం ఆరుగంటలకు మహర్షి దయానంద సరస్వతి వేద మంత్రాలు పఠిస్తూ తుది శ్వాస పీల్చాడు .

భారత స్వాతంత్రోద్యమ బీజాలు వేసిన తోలి దేశభక్తుడు దయానంద సరస్వతి .ఆయన ప్రభావం సుభాస్ చంద్ర బోస్ ,మహాదేవ గోవింద రానడే,  మేడం కామాలపై అధికం గా ఉంది .షహీద్ భగత్సింగ్ పై మహర్షి ప్రభావం అత్యధికం .ఈయన దయానంద్ వేదిక్ స్కూల్ లో చదివాడు .సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వామిని గురించి ‘’నవ భారతం లో శిఖరాయమాన వ్యక్తిత్వమున్న యోగీశ్వరుదు  దయానందుడు .రాజకీయ మత సాంస్కృతిక బానిసత్వాలను చేది౦చటానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు .హిందూ మతాన్ని వేద ధర్మ ఆధారం పై నిలబెట్టటానికి జీవితాన్ని త్యాగం చేశాడు .భారత దేశం తెచ్చిన సాంఘిక సంస్కరణలు ఆయన ప్రవచి౦చినవే ‘’అని ఘన నివాళి అర్పించాడు .

దయానందుని సాహితీ వైభవం

మహర్షి దయానందుడు వేదా౦గా లపై 16గ్రంధాలు ,పాణిని అస్టాధ్యాయిపై అసంపూర్ణ వ్యాఖ్యానం ,నీతి,ధర్మ బోధకాలైన చిరు పుస్తకాలు వేద విధులు ,.అద్వైత ,ఇస్లాం క్రిస్టియన్ మతాలపై ఖండనాలు మొదలైన 60 గ్రంధాలు రాశాడు అందులో ‘’సత్యార్ధ ప్రకాశం ‘’,సంస్కార విధి ,ఋగ్వేద భాష్య భూమిక ,యజుర్వేద భాష్యం చాలా ప్రసిద్ధమైనవి .స్వామి అజ్మీర్ లో’’ పరోపకారిణి సభ ‘’స్థాపించి వేదాలపై గ్రంధాలు రాసి ప్రచురించి వేద ధర్మ వ్యాప్తి చేశాడు .

అయన రాసిన వాటిలో కొన్ని పేర్లు –సంధ్య ,భాగవత ఖండనం ,,అద్వైత ఖండనం ,పంచ మహా యజ్న విధి ,సత్యార్ధ ప్రకాష్ ,అష్టాధ్యాయి భాష్యం ,ఋగ్వేద యజుర్వేద భాష్యాలు .స్వామి ప్రసిద్ధ మంత్రం –‘’ఓంవిశ్వాని దేవసవితర్ దురితాని పరసుర్ యద్ భద్రం తన్నా ఆశువ ‘’.

సశేషం

 

Inline image 1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య( 1114-1185)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు  –భాస్కరాచార్య( 1114-1185)

కర్ణాటకలోని బీజాపూర్ లో భాస్కరాచార్య 1114లో జన్మించాడు .మహా గణిత ,ఖగోళ శాస్త్ర వేత్త .’’సిద్ధాంత శిరోమణి ‘’అనే గొప్ప గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .ఇందులో నాలుగుభాగాలు లీలావతి ,బీజ గణితం ,గ్రహగణితం ,గోళాధ్యాయం ఉన్నాయి ..నాలుగూ వేటికవే ప్రత్యేకమైనవి .ఇందులో గ్రహాలకు  సంబంధించిన సకల గణితమూ  ఉంది .’’కర్ణ కుతూహల ‘’అనే మరో ఉద్గ్రంధమూ రాశాడు .న్యూటన్ ,లీబ్నిజ్ లు కనిపెట్టిన కాల్క్యులస్ కంటే అర్ధ సహస్రాబ్ది (500 ఏళ్ళు ) ముందే భాస్కరాచార్య దాని గురించి చెప్పాడు ‘’.డిఫరెంషియల్ కాల్క్యులస్’’దాని ఉపయోగించే విధానంఆధారం గా ఖగోళ గణితాన్ని అభివృద్ధి చేశాడు . కాల్క్యులస్ పితలుగా న్యూటన్ ,లీబ్నిజ్ లను పేర్కొనటం అత్యంత దారుణం .దీనికి ఆద్యుడు భాస్కరాచార్య యేఅని నిర్ద్వంద్వంగా పేర్కొంటారు .

భాస్కరుడు తాను రాసిన వాటిని ‘’ఆర్యా వృత్త శ్లోకం లో ఇలా తెలియ జేశాడు –‘’రస,గుణ ,పూర్ణ మహీసమా –సాక నృప సమయే భవత్ మహోత్పత్తిః-రస గుణ వర్షేణ మయా –  సిద్ధాంత శిరోమణి రచితాః ‘’.దీన్ని బట్టి తాను  1036అంటే  శక వత్సరం 1114లో పుట్టానని ,36ఏళ్ళ వయసులో సిద్దాంతా కౌముది రాశానని ,69వ ఏట ‘’కర్ణ కుతూహల ‘’1183లో రచించానని చెప్పాడు .బ్రహ్మ గుప్త ,శ్రీధర ,మహావీర ,పద్మనాభ లప్రభావం భాస్కరునిపై ఉంది .ఉజ్జయినిలో గ్రహవేధశాలకు అధ్యకక్షునిగా  పని చేశాడు .మహారాష్ట్రలోని సహ్యాద్రిపర్వత ప్రాంతం లో జలగం జిల్లలో ఉండేవాడు .తరతరాలుగా రాజాస్థానం లో గౌరవ స్థానం లో ఉన్న కుటుంబం .తండ్రి మహేశ్వరోపాధ్యాయుడు గణిత ఖగోళలలో నిష్ణాతుడు .కొడుకుకు వీటిని నేర్పి ,మనుమడు లోక్ సముద్రకు అందజేస్తే ,ఆయన కొడుకు 1202లో భాస్కరాచార్య రచనలను అధ్యయనం చేసే విద్యాలయం పెట్టాడు .

సిద్ధాంత శిరోమణిలోని ‘’లీలావతి ‘’లో 277శ్లోకాలున్నాయి .ఇందులో కొలతలు,ప్రస్తారణలు (పెర్ముటేషన్స్),ప్రోగ్రేషనన్స్ మొదలైన  గణనం ఉంటుంది . బీజగణితం లో 213శ్లోకాలుంటాయి .సున్నా ,అనంతం ,(ఇన్ ఫినిటి)ధన ,రుణ సంఖ్యలు ,ఇప్పుడు పెల్లీస్  ఈక్వే షన్ గా పిలువ బడే  ‘’కుట్టక పధ్ధతి ‘’ఉన్నాయి భాస్కరుడు 61×2+1=y2అనే సూత్రాన్ని ఐరోపావాళ్ళు కనిపెట్టి చెప్పిన ఎన్నో వందల ఏళ్ళ క్రితమే   సాధించి చెప్పాడు .గ్రహ గణితం లో గ్రహాల వేగాలను కనిపెట్టే సూత్రం ‘’బిమ్బార్ధస్య  కోటీయాగుణ స్త్రిజగాహారః ఫలం దొరియాయో రంతరం ‘’చెప్పాడు .దీని ఫలితాన్ని అంతకుముందే 932లో ‘’లఘుమానసం ‘’లో మున్జకాచార్య లెక్క గట్టి సరి చూశాడు .ఇవన్నీ ట్రిగనామెట్రి’’లో ‘’సైన్ ‘’కు సంబంధించిన లెక్కలు .గ్రహం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దాని వేగం శూన్యం అని చెప్పాడు .పైథాగరస్ కంటే ఆ సిద్ధాంతాన్ని ముందే చెప్పాడు .వర్గ ఘన ద్విఘాత(క్వార్టే క్)మొదలైన  వాటిని చెప్పాడు .సైక్లిక్ విధానం –చక్రవల పధ్ధతి చూపాడు ,రుణ ,కరణీయ(ఇర్రేషనల్)సంఖ్యలను సాధించాడు . చేశాడు .

అంక గణితం లో నిర్వచనాలు ,అంక గణితపదాలు ,ప్రోగ్రెషన్లు మొదలైనవాటిని లీలావతిలో 13అధ్యాయాలలో వివరంగా చెప్పాడు .బీజగణితం లో 12అధ్యాయాలున్నాయి .ధన ,రుణ సంఖ్యలను ,సున్నా ,తెలియని నంబర్లను (అన్నొన్)చర్చించాడు .ట్రిగానా మెట్రి,కాల్క్యులస్లలో ఏంటో ముందు చూపుతో ఎన్నో విషయాలు భాస్కరుడు చెప్పాకే ఎన్నో వందల ఏళ్ళ తర్వాత  పడమటి దేశీయులకు  తెలిశాయి.

ఖగోళ శాస్త్రం లో సూర్య చంద్ర గ్రహణాలు ,గ్రహాల అక్షాంశాలు ,సూర్యోదయ సమీకరణాలు ,చంద్ర వంకలు ,గ్రహాలు , భూమికి ఉన్న సముచ్చయాలు,సూర్య చంద్ర గతులు అన్నీ ఖచ్చితమైన లెక్కలతో చెప్పాడు .1150లోనే నిరంతరం తిరిగే యంత్రాన్ని తయారు చేసి తన ఇంజినీరింగ్ ప్రతిభనూ కనబరచాడు .

Inline image 1  Inline image 2

473-సంస్కరణ లతో పాటు సంస్కృతాన్ని నిలబెట్టిన –భండార్కర్ (1837-1925)

6-7-1837లో మహారాష్ట్రలోని సింధు దుర్గ జిల్లా మాల్వన్ లో జన్మించాడు .రత్న గిరిలో చదివి ,బొంబాయి ఎల్ఫిన్ స్టన్ కాలేజిలో చేరాడు. మహా దేవ గోవింద రానడే తోకలిసి బొంబాయి యూని వర్సిటి నుండి  మొట్ట మొదటిసారి గ్రాడ్యుయేట్ అయ్యాడు .మరుసటి ఏడాది మాస్టర్ డిగ్రీ పొందాడు .1885లో గోటింజెన్ నుండి పి.హెచ్ డి.పొందాడు .ఎల్ఫిన్ స్టీన్,దక్కన్ కాలేజీలలో లెక్చరర్ గా పని చేశాడు .రచనలో రిసెర్చ్ లలో జీవితాంతం గడిపాడు .బాంబే యూని వర్సిటి వైస్ చాన్స్ లర్ గా 1884లో రిటైర్ అయ్యాడు .1874లో లండన్లో ,1886లో ,వియన్నాలలో  లో జరిగినఅంతర్జాతీయ  ఓరి యెంటల్ భాషా సదస్సులో పాల్గొన్నాడు .శాతవాహన ,డెక్కన్ చరిత్రలకు ప్రాణం పోశాడు .భండార్కర్ గొప్ప సంస్కరణాభిలాషి .వితంతు వివాహాన్ని సమర్ధించాడు .కుల వ్యవస్థను బాల్య వివాహాలను నిరసించాడు .

1903లో కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నాన్ అఫీషియల్ మెంబర్ గా ఎన్నికయ్యాడు .గోపాలకృష్ణ గోఖలేగారు ఇందులో మరొక మెంబర్ .1911లో ప్రభుత్వం ‘’నైట్ హూడ్’’ను(సి.ఐ.ఇ) ప్రదానం చేసి గౌరవించింది .సమకాలీన సమాజం లోని కుళ్ళు ను ఏరిపారేయటానికి ‘’పరమ హంస సభ ‘’ను ఏర్పాటు చేసి ప్రక్షాళనం చేశాడు .1864లో కేశవ చంద్ర సేన్ పర్యటనతో ప్రభావితమై ఆత్మారాం పాండురంగ ఇంట్లో సభ్యులు సమావేశమై కులవ్యవస్తను నిరసించి ,విధవా వివాహాలను సమర్ధించి బాల్య వివాహాలను ఈసడింఛి స్త్రీ విద్యనూ సమర్ధించారు .31-3-1867న ఈ సంస్కరణల అమలుకోసం ప్రార్ధనా సమావేశం జరిపారు . ఇదే తర్వాత ‘’ప్రార్ధనా సమాజ్ ‘’అయింది .కేశవ చంద్రుని మరో పర్యటన ,ప్రతాప చంద్ర మజుందార్ ,నవీన్ చంద్ర రాయి ల ప్రేరణతో పంజాబ్ బ్రహ్మ సమాజం ఏర్పడింది .పూనా లోని భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆయన పేరుమీదనే ఏర్పడింది .

భండార్కర్ సంస్కృత భాషాభ్యాసం కోసం పుస్తకాలు రాశాడు .మొదటిపుస్తకం లో  విద్యార్ధులను దృష్టిలో పెట్టుకొని వ్యాకరణం సంస్కృతవాక్యాలను ఇంగ్లీష్  లోకి అనువదించటం ఉంటాయి .సులభం గా అర్ధమయ్యేవిధానం లో రాశాడు .రెండవ పుస్తకమూ పరమ ప్రయోజనకరమైనదే .ఒకరకంగా అది ఉపాధ్యాయులకూ విద్యార్ధులకూ కూడా  కర దీపిక .తెలుగులో ఏం ఏ చదివేవారికి సంస్కృతం లో ఒక పేపర్ ఉంటుంది దీనికోసం అందరూ భండార్కర్ శరణం గచ్చామి అనాల్సిందే .సంస్కృత వ్యాకరణం కూడా రాశాడు భండార్కర్ .భండార్కర్ పుస్తకాలన్నీ పరమ ప్రయోజనకరమైనవి .సంస్కృత భాషకు భండార్కర్ చేసిన కృషి చిరస్మరణీయం .

భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో దక్షిణ ఆసియాలో ఉన్న అరుదైన సంస్కృత వ్రాత ప్రతులన్నీ ఉంటాయి .లక్షా ఇరవై ఐదువేల పుస్తకాలు ,29,510 వ్రాతప్రతులు ఉన్నాయి .మూడునేలలోకసారి జర్నల్ ను ప్రచురిస్తారు .ఇందులో భద్రపరచిన ఋగ్వేదం వ్రాత ప్రతి ‘’యునెస్కో వారి మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ ‘’లో చోటు చేసుకొన్నది .24-8-1925న భండార్కర్ మహశయుడు 88వ ఏట మరణించాడు

.Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -2-2-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104

44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-3(చివరిభాగం )

‘’ దేవుడు మనిషిని ఎగిరేట్లు చేయాలనుకొంటే రెక్కలు పెట్టె వాడే కదా’’ అని సన్నాయి నొక్కులు నొక్కారు .దాదాపు  వెయ్యి సార్లైనా వీళ్ళ ప్రయత్నాలపై నీళ్ళు చల్లే ప్రయత్నాలు చేశారు జనం. కాని అధైర్యపడకుండా జంకకుండా ముందుకే వెళ్ళారు రైట్ సోదరులు .గాసోలిన్ ఇంజన్ ను పకడ్బందీగా తయారు చేశారు .ఇదే తగినదని భావించారు .వీళ్ళకు అనువైన మోటారు తయారు చేసివ్వటానికి కంపెనీలు చాలా బిజీ గా ఉండటం వలన ముందుకు రాలేదు .కనుక అదీ  వాళ్ళే తయారు చేయాలనుకొన్నారు .1903వేసవి అంతా దీనికోసమే వెచ్చించారు దీక్షగా .వీరి కృషిని సమీక్షిస్తూ ‘’ది రైట్ బ్రదర్స్ ‘’పుస్తకం లో ఫ్రెడ్ సి కెల్లీ ‘’ఈ పవర్ మెషీన్ రెక్కలు నలభై అడుగులకు పైన కొన్ని అంగుళాలు .పై రెక్క ,కింది రెక్క మధ్య దూరం ఆరు అడుగులు .ఇంజన్ పైలట్ మీద పడకుండా ఉండటానికి దాన్ని కింద రెక్కపైమధ్యనుండి కొంచెం కుడివైపుకు  అమర్చారు .పైలట్ మధ్యనుంచి కొంచెం ఎడమవైపు పడుకొని  బాలన్స్ సమకూర్చుకొని నడిపారు .దిగేటప్పుడు మెషీన్ దొర్లి కిందపడకుండా రన్నర్ లను విస్తృతపరచారు .తోక కదిలే  రెండు బ్లేడ్ ఆకారాలతో నిర్మించారు  .

1903నవంబర్ లో ఈ కొత్త యంత్రాన్ని కిట్టీ హాక్ లో ప్రయోగం చేశారు .లోపాలు గుర్తించి సరిచేశారు .కొన్నిభాగాలు తీసిపారేశారు కొత్తవి కొన్ని అమర్చారు .డిసెంబర్ 14న విల్బర్ పైలట్ అవతారం ఎత్తాడు .యంత్రాన్ని నడిపి పైకి లేపి మూడున్నర నిమిషాలు గాలిలో తేలి దింపాడు  .కొన్నిభాగాలు  దెబ్బతిన్నాయి అది ఎగురుతుంది అనే ధైర్యం వచ్చింది . రిపైర్ చేశారు .ఆర్విల్లీ వంతు వచ్చింది .కాని నిరాశగా ఉంది .ఉదయం బాగా చలి ,గాలి ఉన్నాయి .గంటకు ఇరవైఏడు మైళ్ళ వేగం తో గాలి వీస్తోంది .సోదరులు పనిలో స్వేచ్చ ఉండదని  ఓవర్ కోట్ తొడుక్కోలేదు .డిసెంబర్ 17న మళ్ళీ ప్రయోగం చేశారు .ఇంజన్ లోంచి వింతశబ్దాలోచ్చాయి .చుక్కాని వణికింది కాని యంత్రం మాత్రం పైకి లేచింది .12 సెకన్లు గాలిలో నిలబడింది .ఆర్విల్లీ మాటలలో ‘’ఇదే మొట్టమొదటి సారి మనిషితో యంత్రం గాలిలోకి పైకిస్వయంగా  లేచి స్వేచ్చగా పూర్తిగా ఎగరటంతో చరిత్ర సృష్టించబడింది  ‘’అన్నాడు .స్పీడ్ తగ్గించకుండా ముందుకు సాగింది .యెంత ఎత్తుమీదనుంచి లేచిందో అంత ఎత్తుమీద దిగింది .రైట్ సోదరుల నాలుగవ ప్రయత్నం విజయ వంతమైంది .59 సెకండ్లు అత్యద్భుతంగా గాలిలో స్థిరంగా యెగిరి రికార్డ్ నెలకొల్పింది .ప్రపంచం అంతా ఈ క్షణాలకోసమే నిరీక్షించింది .అందరి హృదయాలలో హర్షం ఆనందం వెల్లివిరిశాయి . బలహీనమైన రెక్కలు లేని ద్విపాద జీవి గాలిలో ఎగిరిన మధుర క్షణం అది .నిజంగానే మానవుడు గాలిలో యెగిరి చరిత్ర సృష్టించాడు .ఈసడించినవారికి సత్తా చాటి చూపించి తాము కన్నకలలను నిజం చేసుకొన్నారు రైట్ సోదరులు .విమానయానానికి తొలిసారి రైట్ చెప్పారు .

దీనితర్వాత ఇంకాసామర్ధ్యమున్న ఫ్లైట్ లను నిర్మించారు .తమ ఊరికి కిట్టీహాక్ చాలా దూరంగా ఉన్నందున డేటాన్ దగ్గరే హాఫ్మాన్ ప్రయరీ భూములలో ప్రయోగాలు చేశారు .51వ ఫ్లైట్ లో ఒక నిమిషం సేపు ఎగిరారు .1904లో 5నిమిషాలు గాలిలో తేలారు .ఏడాదితర్వాత 11మైళ్ళు తర్వాత 15  ,20 మైళ్ళు ఎగిరారు .అక్టోబర్ 5నాటి ఫ్లైట్ లో 24మైళ్ళు అరగంట సేపు  ప్రయాణించారు .అయిన ఇవేవీ అస లైన  వార్తలు గా నిలబడలేదు .పేపర్లేవీ దీన్ని పట్టించుకోలేదు. నిర్లిప్తంగా ఉండిపోయాయి .దినపత్రికలు విషం కక్కాయి .’’ది సైంటిఫిక్ అమెరికన్ ‘’పత్రికే ఎగరటం అంతా  అబద్ధం అంది .న్యు యార్క్ హెరాల్డ్ పత్రిక కరేస్పాన్దేంట్ ఒక ప్రత్యక్ష సాక్షి కధనాన్ని పంపిస్తే యాజమాన్యం తిరస్కరించింది .’’నువ్వు రాసిన కధనం చదవటానికి సరదాగా ఉంది .అది సత్యమూకాదు, ఫిక్షనూ కాదు ‘’అని తేలికగా కొట్టిపారేస్తూ అన్నాడట ఎడిటర్ .అమెరికా సైన్యం కూడా దీన్ని పట్టించుకోలేదు ,ఆసక్తీ చూపలేదు .

కాని యూరప్ దేశంవిమాన యానాన్ని క్రేజీ గా భావించింది .1908 లోవిల్బర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టిఫ్రాన్స్ కు వెళ్లి  360అడుగులపైకి విమానం నడిపి గంటఇరవైనాలుగు నిమిషాలు    ఆకాశం  లో చక్కర్లు కొడితే అవాక్కయి జనం వీక్షించారు .ఇక్కడ అమెరికాలో ఆర్విల్లీ అనేక బహుమతులు అందుకొంటూ ,యుద్ధ శాఖ ఉదాసీనతను భగ్నం చేశాడు .1911లో ఈ బైసికిల్ తయారీ దార్లు విమానాలు తయారు చేయటం ప్రారంభించారు .అప్పుడప్పుడు గాలిలో ఎగిరినా ఎగారటానికంటే తయారు చేయటంపైనే శ్రద్ధ చూపారు .అకస్మాత్తుగా నకిలీ విమానాలు మనుషులు ,తమ పేటెంట్ హక్కులపై కేసులు ,విజయాలతో రైట్ సోదరులు చాలా ఇబ్బందులు పడ్డారు .అంతిమ విజయం సోదరులదేఅయినా ,అప్పటికే విల్బర్  కేసులతో నీరసించి ,న్యాయ పోరాటం లో ,అతి శ్రమవలనఅలసిపోయి  టైఫాయిడ్ పాలై 30-5-1912న  46 ఏళ్ళు వచ్చే ముందు చనిపోయాడు .సోదరుల రెక్కలలో  ఒకటి విరిగిపోయింది .

ఆర్విల్లీ వ్యాపారం కొనసాగించాడు .ఒంటరిగాచేయలేననుకొన్నాడు .అన్న చనిపోయిన మూడేళ్ళ తర్వాత కంపెనీని ,పేటెంట్ లను  అమ్మేశాడు .కాని విమాన తయారీలో రిసెర్చ్ మాత్రం ఆపలేదు .చాలా  ఎయిర్  క్రాఫ్ట్ ఫాక్టరీలకు కన్సల్టంట్ గా ఉన్నాడు .అరుదుగా పబ్లిక్ గా కనపడేవాడు .కారణం అనారోగ్యం అని చేప్పేవాడు .వివాదాల జోలికి పోకుండా ఉన్నా ,స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూట్ తో దీర్ఘకాలం వైరం సాగింది .యాభై ఏళ్ళకే బాగా ముసలివాడైపోయాడు .అన్న మరణం తర్వాత 36ఏళ్ళు జీవించి ,ఊపిరితిత్తుల వ్యాధితో ౩౦-1-1948న 87ఏడేళ్ళ వయసులో ఆర్విల్లీ రైట్ అస్తమించాడు .మరో రెక్క రాలిపోయింది

ఆర్విల్లీ మరణం తర్వాత ఒక నెలకు నేవీ కి  చెందిన ఎఫ్ జే 1అనే ఫైటర్ ప్లేన్ సియాటిల్ నుంచి950 మైళ్ళు ఉన్న లాస్ ఏంజెల్స్ కు ఒకగంట యాభై ఎనిమిది నిమిషాలలో చేరింది .కిట్టీహాక్ లో 12సెకన్లు ఎగిరిన రైట్ సోదరుల విమానాన్ని సౌత్ కేంసింగ్ టన్ మ్యూజియం  లో భద్ర పరచారు .వార్తాధనానికి అది ఊగిందో లేదో రుజువూకాలేదు ,మనిషి ఎగరటం అసాధ్యం అన్న ప్రొఫెసర్ న్యుకామ్బ్ సమాధి నుంచి కంగారుపడి లేచి బయటికీ రానూ లేదు  .

Inline image 3  Inline image 4Inline image 1 Inline image 2

 

The Lift Equation

L = lift in pounds
k = coefficient of air pressure (Smeaton coefficient)
S = total area of lifting surface in square feet
V = velocity (headwind plus ground speed) in miles per hour
CL = coefficient of lift (varies with wing shape)

Inline image 5  Inline image 6

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103

44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-2

చిన్నతనం నుంచి యంత్ర శాస్త్రం అన్నా , అందులో చలన యంత్రాలన్నా  రైట్ సోదరులకు మక్కువ ఎక్కువగా ఉండేది .వారు తయారు చేసిన మొదటి ఆటవస్తువు’ఒక చిన్న ’ గైరోస్కోప్ ‘’-ఒక వలయం లో ఉన్న చక్రం –దీన్ని వేగంగా త్రిప్పితే కత్తిమొనమీద లేక కప్పు అంచు మీదఎటూ ఒరగకుండా బాలన్స్ గా ఉండే ఆటవస్తువు .రెండవది మియేచర్ హెలి కాప్టర్ .వెదురు ,కాగితాలతో రబ్బర్ బాండ్ లతో కట్టి తిరిగేట్లు చేశారు .ఇద్దరికీ పదేళ్ళ వయసు లోపు ఉండగానే దీని నాణ్యత పెంచటానికి కృషి చేశారు .తర్వాత బైసికిల్స్ తయారు  చేయటం లో దృష్టిపెట్టారు .ఆట వస్తువులు తయారు చేసి అమ్ముతూ జీవికకు డబ్బు సంపాదించారు .అన్నదమ్ములకు 25,20ఏళ్ళున్నప్పుడు  సైకిళ్ళను అద్దేకిస్తూ, అమ్ముతూ జీవించారు .తమ షాపు పైన ఒక గదిలో బైసికిల్స్ తయారు చేస్తూ యంత్రభాగాలను కూరుస్తూ ,లాభసాటి వ్యాపారం చేశారు .ఇన్ని చేస్తున్నా గాలిలో ఎగిరే హెలికాప్టర్ తయారు చేయాలన్న ఆలోచన మాత్రం మనసుల నిండా అలాగే ఉండి పోయింది .ఆర్విల్లీ ఇరవైలలో ఉండగా ఆల్బర్ తో కలిసి ఫ్లైయింగ్ కు సంబంధిన విషయాలన్నీ సేకరించి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకొన్నారు .వీరిద్దరికీ జర్మన్ ఎక్స్ పర్ట్ఆటో లిలీన్తాల్ .ఆతను గ్లైడింగ్ గురించి బాగా అధ్యయనం చేయటమేకాక ,ఒక కొండ ప్రక్కనుండి చిన్న చిన్న దూరాలకు గ్గ్లైడ్ చేసి ఆశ్చర్య పరచాడు .పాపం ఈ గ్లైడింగ్ లో ఆతను ప్రాణాలు పోగొట్టుకొన్నాడు .ఇది విని మన సోదరులు కలత చెందారు కాని నిరాశ పడలేదు .అతని ప్రయత్నాలు అనుభవాలను  క్షుణ్ణంగా పరిశీలించి,అతనురాసిన ‘’ది ప్రాబ్లెమ్స్ ఆఫ్ ఫ్లైయింగ్  అండ్ ప్రాక్టికల్ ఎక్స్ పెరి మెంట్స్  ఇన్ సోరింగ్ ‘’పుస్తకాన్ని అధ్యయనం చేశారు .స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూషన్ సెక్రెటరి పీర్పాంట్ లాంగ్లే కు ఉత్తరం రాసి ఆయన పుస్తకం ‘’ఎక్స్ పెరమెంట్స్ ఇన్ ఏయిరో డైనమిక్స్ ‘’పుస్తకాన్నీ చదివారు .ఆయన సూచన మేరకు ఏయిరో నాటికల్ జర్నల్స్ 1895,96,97లను పరిశీలించి అవగాహన పొందారు .ములార్డ్ రాసిన ‘’ఎంపైర్ ఆఫ్ ది ఎయిర్ ‘’,అందరూ చదవాల్సిన ఆక్టేవ్ చాన్యూట్ రాసిన ‘’ప్రోగ్రెస్ ఇన్ ఫ్లైయింగ్ మెషీన్స్ ‘’కూడా చదివి ఆయనకు మంచి స్నేహితులైపోయారు .ఆయన వీరికి గొప్ప ప్రేరణ కలిగించాడు .దీన్ని సమగ్రంగా ఫ్రూడేన్థాల్’’ఫ్లైట్ ఇంటు హిస్టరీ ‘’లో వివరంగా రాశాడు .

రైట్ సోదరులు స్వయంగా గ్లైడర్ తయారు చేయాలని నిర్ణయించారు .పూర్వం చేయబడిన వాటికి భిన్నంగా ఈ బై ప్లేన్ తయారు చేయాలన్నది వీరి సంకల్పం .ఇతర విమానాల వింత పోకడలను  గమనించి ,తాము నిర్మించే దానికి ముందు భాగం లో స్టెబి లైజర్ ,పైలట్ చేతిలో నియంత్రణ ఉండేలా ఒక చిన్న అనుబంధ ప్లేన్ లేక ఎలివేటర్ ను నిర్మించారు .ఎగిరేప్పుడు అటూ ఇటూ ఒరిగితే ,అది ఆ యంత్రాన్ని మరింత పైకి ఎగిరెట్లు చేస్తుంది దాన్ని అణచేస్తే పైకి ఎగరటాన్ని వెనక్కి మారుస్తుంది (రివర్స్ ).కాని పార్శ్వ సమతులనం (లేటరల్ బాలన్స్ )లో చిక్కులున్నాయి .కాకుల సంజ్ఞలను గమనించి విమాన రెక్కలను సమతల౦ గా కాకుండా కొంచెం వంపు ఉండేట్లు తయారు చేసి బాలన్సింగ్ సమస్యను అధిగమించారు .అనువైన రెక్కల అమరిక నేర్పరచడం తో గ్లైడింగ్ లో విప్లవాత్మక మార్పు వచ్చింది .దీనిపైనే వారి భవిష్యత్తు పేటెంట్ లన్నీ ఆధార పడ్డాయి .రెక్కలచివరలలో కదిలే వాటిని మార్చటం తో నడిపెవాడికి పని తేలికై ఒకసారి ఎగిరితే గాలిలో దాన్ని స్థిరంగా ఉంచటం సాధ్యమైంది .దీనితో బైసికిల్ బిజినెస్ దెబ్బతింది .అందులోని స్పేర్ పార్టులన్నీ  దీనికోసం వాడారు .1900ఆగస్ట్ లో రైట్ సోదరుల కొత్త గ్లైడర్ తయారైంది .

మొదటి ఫలితాలు ఆశా జనకం గా రాలేదు .కానిఎంతో అనుభవం వచ్చింది .గ్లైడింగ్ ఫ్లైట్ లను కంట్రోల్ చేయగలం అనే నమ్మకం కుదిరింది .అసలైన ఎగురుడు ఎంతో దూరం లేదని పించింది .డేటాన్ కు  సోదరులు చేరుకొన్న వెంటనే ఇంతకు  ముందెన్నడూ ఎవరూనిర్మించని  అతిపెద్ద  ఎగిరే  యంత్రాన్ని తయారు చేశారు .కిట్టీ హాక్ లో దాన్ని ప్రయోగం గా నడిపి అంతకు ముందు కొన్ని సెకన్లు మాత్రమె ఉన్న గ్లైడింగ్ రికార్డ్ ను బద్దలు కొట్టి ,ఎక్కువ దూరం ఎక్కువ కాలం ఎగిరారు .ద్విగుణీకృత ఉత్సాహం తో సోదరులు మళ్ళీ ప్రయత్నాలు చేశారు .డేటన్ వచ్చి విండ్ టన్నెల్స్ ను ,సుమారు 200రెక్కల నమూనాలను రూపొందించారు .స్వయంగానే నేర్చి సంక్లిష్ట పట్టికలు ,జటిలమైన  లెక్కలేనన్ని గణిత సూత్రాలను తయారు చేశారు .’’లెక్కల సూత్రాలపై ఎగిరే యంత్రాలు నమ్మకమైనవి కావు అని తెలిసింది ‘’అని ఆ తర్వాత రాశారు .ఒకదాని తర్వాత ఒకదాన్నిశాస్త్రీయం గా  ప్రయోగం చేస్తూ ,అనుమానించిన వాటిని వదిలేస్తూ రెండేళ్ళు కఠోర శ్రమ చేసి విసిగి వేసారి చివరికి తామే స్వయంగా పరిశోధన చేసి తేల్చుకోవాలనుకొన్నారు .అత్యంత శాస్త్రీయ బద్ధంగా ఆలోచించి విమానం తాయారు చేయాలనే సంకల్పానికి వచ్చారు .

1902 శిశిరం లో కిట్ట్టేన్ హాక్ లో కొత్తగా అభివృద్ధి చేసి  తయారు చేసినమూడవ  గ్లైడర్ ను వాడారు .రెక్కల పొడవు 32అడుగులు .రెక్కల అమరికలో మార్పులు చేసి తోక కూడా ఏర్పాటు చేశారు .అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సుమారు వెయ్యి గ్లైడింగ్ ఫ్లైట్స్ తయారు చెశారుఇద్దరూ .ఆరువందల అడుగుల పొడవుతో కొన్ని రెండు నెలలలో తయారు చేశారు .పార్శ్వ సమతుల్యతను అనేక చిట్కాలతో  రెక్కలలో మార్పులతో సాధించారు .మరో అడుగు ముందుకు వేయటానికి సిద్ధ మైనారు  .అదే’’ పవర్ ఫ్లైట్’’.అప్పటికి విల్బర్ కు 36,ఆర్విల్లీకి 32ఏళ్ళు .ఇద్దరూ సన్నగా పుల్లలాగా తీగల్లాగా ఆరు ,అయిదున్నర అడుగుల అందగాళ్ళుగా ,స్టీల్ బ్లూ కళ్ళతో, డేగ చూపుతో దృఢమైన శరీరం తో ఉండేవారు . ప్రముఖ అమెరికన్ కవి రచయిత ‘’ఎడ్గార్ అల్లెన్ పో’’ పోలికలు౦డేవి .చిన్నోడిని ఒక సభలో మాట్లాడమంటే ‘’నాకు చిలుక పక్షి ఒకటే తెలుసు కాని అది బాగా ఎగరలేదు కదా ‘’అని చెప్పి కూర్చున్నాడట .విల్బర్ రైట్ జీవితం గురించి గ్రిఫ్ఫిత్ ‘’ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ విల్బర్ రైట్ ‘’పుస్తకం లో ‘’To try to be always comfortable and happy was a mistake ,for ,if one succeeded life  became unbearably monotonous ‘’అన్నాడని రాశాడు .విల్బర్ ఆర్విల్లీలిద్దరూ  చాలాపవిత్రం గా ఉండేవారు .తాగుడు స్మోకింగ్ వారు ఎప్పుడూ చేయలేదు .సబ్బాత్ లో చెప్పిన నాలుగవ కమాండ్ మెంట్ ను తూ చా తప్పక ఆచరించేవారు .సాధారణ వ్యాపార వేత్తల దుస్తులనే ధరించేవారు .బజారులో తిరిగే బట్టలతోనే ఆర్విల్లీ గ్లైడర్ లో కూర్చునేవాడు .కళ్ళజోడు హెల్మెట్ ,చేతి తొడుగులు ధరించేవాడు కాదు .లేకపోతె ఆల్బర్ గ్రే సూట్ లో  బాగా గంజి పెట్టిన కాలర్ తో పైలట్ గా ఉంటె చూస్తూ౦ డేవాడు .

Inline image 1Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం
88వ సమావేశం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసంvargal1 001 vargal2 001 vargal3 001

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102

44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు

‘’మానవుడు ఎగరటం అసాధ్యమే కాదు ,తర్క విరుద్ధమైనది ‘’అని  ‘’మనిషి ఎగరాలంటే కొత్త లోహాన్నిలేక ప్రకృతిలో కొత్త శక్తిని  కనిపెట్టాలి ‘’అని  బల్ల గుద్ది మరీ  చెప్పాడు ప్రముఖ ఖగోళవేత్త ప్రొఫెసర్ సైమన్ న్యు కాంబ్ .ఒక వేళ అలాంటి యంత్రాన్నికనిపెట్టినా ,అది కూలి నడిపే పైలట్ ను తప్పక చంపేస్తుంది,స్పీడ్ తగ్గించి నా ,దిగేటప్పుడు చచ్చిన శవం లా నేల కూలుతుంది  అని ఆయన అభిప్రాయం .ఈ విషయాలన్నీ బహిర్గతం చేస్తూ ఆయన 1903లో రాసి ప్రచురించాడు .ఇదే సమయం లో రైట్ సోదరులు కిట్టీ హాక్ లో విమానం తయారు చేసి గాలిలోఎగిరెట్లు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం ,అతత్కాన్ని తర్క హేతుబద్ధం చేసి చూపించారు .ఒక పావు శతాబ్దం లో గతకాలపు జాగ్రఫీ కి చెందిన భావనలన్నీ విప్లవాత్మకం గా మారిపోయి రవాణా లో  విమానయుగపు కొత్త శకం ఆవిర్భ వించింది .దీనికి 500సంవత్సరాలకు పూర్వం ప్రఖ్యాత చిత్రకారుడు సైంటిస్ట్ ,మేధావి లియొనార్డో డావిన్సి  తాత్కాలిక౦గా  ఎగిరే యంత్రాన్ని డిజైన్ చేశాడు  .ఆ తర్వాత  రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టటానికి వందేళ్ళ ముందు మనుషులు బెలూన్ల సహాయం తో గాలిలోకి ఎగరటం నేర్చారు .గాలికంటే తేలికైన యంత్రాన్ని కనిపెట్టినా దాన్ని నియంత్రించలేక పోయారు .చరిత్రలో మొట్ట మొదటి సారిగా రైట్ సోదరులు గాలికంటే చాలా బరువైన సుస్థిరమైన ,నియంత్రణలో ఉండే గాలి యంత్రాన్నితయారు చేసి ఎగిరారు .

1932లో కేట్టిహాక్ లో ఏర్పాటు చేసిన స్మ్రుతి చిహ్నం పై విమానానికి కారకులైన వారి గురించికాక ‘’భయం లేని స్పష్టమైన ,అజేయమైన విశ్వాసం ‘’అని రాశారు   ఈ విమానం తో ప్రసిద్దులయ్యేదాకా వారుమధ్యతరగతి పౌరులని ,వ్యాపార వేత్తలని  ,వారికి వైమానిక శాస్త్రం హాబీ అని అని మాత్రమె అందరికి తెలుసు .వీరి తండ్రి మిల్టన్ రైట్ ఇండియానాలో లాగ్ కేబిన్ లో పుట్టాడు .యునైటెడ్ బ్రదర్న్ ఇన్ క్రైస్ట్ కు బిషప్ అయ్యాడు .అయిదుగురు సంతానం లో సోదరులకు ఇద్దరు పెద్దన్నయ్యలు ,రూక్లిన్ ,లోరిన్ ,ఒక సోదరి కేధరిన్ఉన్నారు .విల్బర్ రైట్ 16-4-1867న ఇండియానా లోని మేల్విల్లీ లో  పుట్టాడు .చిన్నవాడు ఆర్విల్లీ రైట్ 19-8-1871న ఒహాయో లోని డేటన్ లో పుట్టాడు .ఇదే తర్వాత వీరి కుటుంబ ఆవాసం అయింది .  ఇక్కడే సోదరుల అన్యోన్యత సుస్థిరమై అజేయమై  నిలిచింది .వారి క్లాస్ రూమ్ అస్థిరం గా  ఉండేది .14ఏళ్ళ వయసులోనే విల్బర్ స్కూల్ వదిలేశాడు .ఆర్విల్లీ పైక్లాస్ చదివాడుకాని డిప్లొమా పొందేదాకా లేడు.ఇద్దరికీ కాలేజి చదువు యావే లేదు .ఎడిసన్ ,ఫోర్డ్ లలాగా వీరికీ పెద్దగా  విద్య,శిక్షణా లేవు.పని చేస్తూ నేర్చుకోవటం వీరి కలవాటైనది .

తండ్రి క్రిస్టియన్ మినిస్టర్ అయినా కుర్రాళ్ళ చేష్టలను నిరుత్సాహ పరచలేదు .ఆరేళ్ళప్పుడే  ఆర్విల్లీ ఇంకో కుర్రాడితోకలిసి  పాత ఎముకలను ఏరి ,ఎరువుల ఫాక్టరీకి అమ్మి డబ్బు సంపాదించాడు .11వ ఏట  తోటి ఆటగాళ్లకు  గాలిపటాలు తయారు చేసి అమ్మి డబ్బు పోగేశాడు .పనికి రాని లోహపు ముక్కల్ని  ఏరి ,జంక్ డీలర్ కు అమ్మి సొమ్ము చేసుకొనేవాడు .చర్చ్ ప్రచురణ  కాగితాలను మడతలు పెట్టి సాయం చేసేవాడు .నాలుగేళ్ల పెద్దవాడైన ఆల్బర్ ఆర్విల్లీ తోకలిసి సృజనాత్మక పనులు చేసేవాడు మొట్టమొదటిసారిగా ఇద్దరూకలిసి బాల్ బేరింగ్ లకోసం చెక్క సాధనం (వుడేన్ లేత్)తయారు చేశాడు .12వ ఏట ఆర్విల్లీ ప్రింటింగ్ పై అభిరుచి చూపిస్తే ,విల్బర్ ప్రెస్ తయారు చేయటం లో సాయం చేశాడు .18వ ఏట నే పబ్లిషర్ అవతారమెత్తాలని అర్విల్లీ నిర్ణయించుకొని ‘’వెస్ట్ సైడ్ న్యూస్ ‘’ను ప్రారంభించి పడమటి తీరం లోని ప్రజల  వ్యారస్తుల ప్రయోజనాలకోసమే ప్రచురిస్తున్నానని ప్రకటించాడు.ప్రజల  ,నైతిక బౌద్ధిక ,ఆర్ధిక అభి వృద్ధిలపై  తన పత్రిక ద్రుష్టి సారిస్తుందని  హామీ ఇచ్చాడు .దీనిలో  మొదట రాసిన వాడు ఎలివేటర్ బాయ్ అయిన ఒక నీగ్రో పాల్ లారెన్స్ డన్బార్ .ఇతను తర్వాత ‘’లిరిక్స్ ఆఫ్ లౌలీ లైఫ్ ‘’తో ప్రసిద్ధి చెందాడు .కొన్నేళ్లలో రైట్ సోదరులు’’ దిమిడ్జేట్,దిఈవెనింగ్ ఐటెం ,స్నాప్ షాట్స్ ‘’అనే చిన్న వార పత్రికలు తెచ్చారు .నీగ్రోలకోసం దన్బార్ఎడిటర్ గా  ప్రారంభించిన ‘’ది టాట్లేర్’’ను ముద్రించారు .భాగస్వామ్యం ,అనుభవం తో  ఇది బాగా ఆభి వృద్ధి చెందింది .ఒకరికొకరు అర్ధం చేసుకొంటూ చేయి చేయి కలిపి సోదరులు ముందుకు పోతున్నారు .ఎవరి సాయం లేకుండానే దూసుకుకు పోతున్నారు .ఇద్దరికీ పెళ్లి సంగతే పట్టలేదు .వారిజీవితాలలో తాత్కాలిక ప్రేమ వ్యవహారాలూ లేనేలేవు .ఇద్దరు పరస్పరం సహకరించుకొంటూ గొప్ప ముందడుగే వేశారు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా Book PDF

కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా Book PDF

kemotalogi pitha

kemo2 001 kemopita-1 001 kemo4 001 kemo3 001

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

Inline image 1

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం
88వ సమావేశం -ఆహ్వానం
పుష్య బహుళ పంచమి 29-1-16 శుక్రవారం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30 గం లకు  త్యాగరాజ స్వామి వారికీ అష్టోత్తర పూజ నిర్వహింపబడును . రాత్రి 7 గం .లకు ప్రముఖ సంగీత విద్వాంసురాలు ,రేడియో ఆర్టిస్ట్  శ్రీమతి  ఎం .శాంతిశ్రీ గారుశ్రీ త్యాగ రాజ స్వామి వారి ”పంచ రత్న కీర్తనలు ”గానం చేస్తారు .సాహిత్య ,సంగీతాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన

—                                                             గబ్బిట  దుర్గాప్రసాద్

                                                               -సరసభారతి అధ్యక్షులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కృ త జ్ఞ త లు

శ్రీ ప్రసాద్ గారికి ,

నమస్కారములు.మీ దగ్గర నుండి అన్ని విశేషములు వచ్చిన తరువాత అవి చదివి మెయిల్ ఇద్దామన్న ఉద్దేశ్యం తో ఆగాను. మీరు పంపించిన వన్నీ చదివాను.అందులో నాకు మరిచిపోలేని విశేషాలు.
అంతర్జాతీయ ఖ్యాతి గణిం చిన ప్రేమ్చంద్ గారు శాకాహారి కావటం .వీరి తండ్రి గారు వీరికి ప్రేమ్చంద్ అని పేరు పెట్టటానికి ఏమి కారణం అయిఉంటుందొ .Radio చైతన్యం కలిగించిన వారు కాబట్టి .. అ పేరు తట్టి  ఉంటుందేమో .
ఇక కొలచల కుటుం బాన్ని గురించి …. ఒకే కుటుంబం లో గాయత్రి ఉపాసన చేసే వారు .తరువాత  సుబ్రమణ్య  శాస్త్రి గారు…  సీతారామయ్య శాస్త్రి గారు ఉండటం జీవుల కర్మ పూర్వ జన్మ పుణ్య విశేషాలు . బ్రహ్మాస్త్రం నేర్చుకున్న చిరంజీవి అశ్వత్థామ… వేదవిద్యాచార్యుడైన ద్రోణుడి పుత్రుడే ..
 మైనేని గోపాల కృష్ణ గారిని గురించి చెప్పేదేముంది .కపిధ్వజమల్లె మీరు చేసే ప్రతి ఉత్సవం లోను , ఉద్యమం లోను ముందర ఉంటారు. వారు ఇచ్చె బలం .. మిఠాయి లో బెల్లమల్లె అంతటా వ్యాపించి ఉంటుంది .
నాకు ఈ ఉత్సవంలో పాలు పంచుకునే అదృష్టం కలిగిన తీరు .. తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తున్ది. నేను నా పొన్నూరు మిత్రుడికి సంస్కృత నాటకం పంపిమ్చటము, అది దక్షిణ మూర్తి గారికి తెలియటము .. వారు నన్ను గురించి మీతో చెప్పటం … మీరు నేను ఫోన్ లో మాట్లాడుకోవటం . ఆతరువాత మనం కలవటం … ఇంట తొందర గా కలలలోను ,సినిమాలలోను మాత్రమె జరుగుతయ్యి.
ప్రపంచం Anthropic సూత్రం తోనే నడుస్తుంది కదా ..
మీకు చెప్పటానికి “ధన్య వాదాలు ” అనే మాట తప్ప లేక పోవటం వలన అదే వాడుతున్నాను. థాంక్స్
VB రాజేంద్ర ప్రసాద్  గారు కృష్ణజిల్లా వాడని తెలుసు గాని .. అంత  సంస్కారవంతుడనీ .. మిమ్మల్ని మాస్టర్ గారని పిలుస్తాడని తెలిసి చాలా సంతోషం వేసిన్ది.
మీ నిరంతర కృషి ని గురించి మాకు ఒక 30  ఎల్లా క్రింద తెలిసివుంటే .. మా జీవితాలలో టైం ఇంకా  సదుపయోగం అయ్యేదేమో   ..
భవదీయుడు
ACPSastry

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు

డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు

251-16సోమవారం ఉదయం 10-30గం లకు 67వ భారత రిపబ్లిక్ దినోత్సవం ము0దురోజున సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,, ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –కెమిస్ట్రీ శాఖ –ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరుకు చెందిన ప్రరంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త జీవిత చరిత్రపై సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’గ్రంధావిష్కరణ ను భారత్ టుడే సంపాదకులు శ్రీ జి .వల్లీశ్వర్ ,రామయ్య గారి అన్నగారు శ్రీ గాయత్రి అనంతరామయ్య గారి  మనవరాలు 86ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి గారు సంయుక్తంగా ఆవిష్కరించి చరితార్ధతను సృష్టించారు .కెమిస్ట్రీ హెడ్ శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు గ్రంధ పరిచయం చేశారు .గ్రంధ రచన ఉద్దేశ్యం ,విషయసేకరణ, రామయ్య గారి బహుముఖీన వ్యక్తిత్వం ,ఆయన్ను స్వయంగా చూసి మాట్లాడిన అనుభవాలతోబాటు గ్రంధం లోని ముఖ్య విశేషాలను శ్రీ దుర్గాప్రసాద్ సభకు తెలియ జేశారు .

రెండు ప్రముఖ నిర్ణయాలను తీసుకోవటం ఈ సభ ప్రత్యేకతను చాటింది .మొదటిది శ్రీదుర్గా ప్రసాద్ ఉయ్యూరులో సీతారామయ్య గారి విగ్రహం స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి స్పూర్తి భవిష్యత్ తరాలకు అందించటానికి ఇదొక ప్రేరణ అవుతు౦దని ,దీనికి రాజకీయ నాయకుల ను ఒప్పించి చేయటం చాలా ఔచిత్యంగా ఉంటుందని ,సభలో లేకున్నా శాసన మండలి సభ్యుడు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  కు   సభాసదుల మనసులోని మాటను  తెలియజేయవలసినదిగా,ఆయన తరఫున సభకు హాజరైన  ఆయన శ్రీమతి ఉయ్యూరు మాజీ సర్పంచ్ శ్రీమతి భ్రమ రాంబ కు సూచించ గా ఆమె వెంటనే ఇందులో తనకూ బాధ్యతా ఉందని అందరి అభిప్రాయాన్ని శ్రీ రాజేంద్రకు తెలియజేస్తానని మాట ఇచ్చారు  . ఇది ఒక సుదీర్ఘ ప్రయత్నమే అవుతుందని ,కాని ఉపాయం గా ఇప్పుడు గోవా వీరుడు సూరి సీతారాం విగ్రహం ప్రక్కనే రామయ్య గారి బస్ట్ విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్ తో సూరి ట్రస్ట్ తరఫున హ్యాం రేడియో అధినేత శ్రీ  సూరి శ్రీరామ మూర్తి చేయించి తక్కువ ఖర్చుతో యేర్పాటుటు చేయవచ్చునని సూచించగా ,వెంటనే స్పందించి డాక్టర్ శ్రీమతి దానికి తన వంతు విరాళంగా 10వేల రూపాయలను ఎప్పుడు అడిగితె అప్పుడు శ్రీ సూరి కి అందజేస్తానని వాగ్దానం చేశారు .శ్రీ శ్రీరామ మూర్తి చాలా సంతోషంగా ఆ బాధ్యతను తానూ సూరి ట్రస్ట్ తరఫున నెరవేరుస్తానని సభా ముఖం గా తెలియ జేయటం తో ఆ ఇద్దరినీ కరతాళ ధ్వనులతో సభ అభినందించింది .ఈ విగ్రహ స్థాపన రామయ్య గారి జయంతి  రోజు జులై 15న జరిపితే బాగుంటుందని ,ఒక వేళ వీలుకాని పక్షం లో వారి వర్ధంతి సెప్టెంబర్ 29న జరిపించాలని దుర్గా ప్రసాద్ సూచించారు .అక్కడ ఉన్న అందరి అభిప్రాయమూ అదే కనుక కార్యక్రమం త్వరలోనే రూపు దాల్చ వచ్చు .

రెండవది హ్యాం రేడియో అధినేత శ్రీ సూరి శ్రీరామ మూర్తి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో తుఫాన్లను పసిగట్టి హెచ్చరించేందుకు హ్యాం రేడియోకు కాని ,ప్రభుత్వానికి కాని మచిలీపట్నం విజయవాడలు సరైన కేంద్రాలు కావని ,అవి తుఫాను ప్రభాలకు గురై కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ప్రాంతాలని అనుకని ఉయ్యూరు లోని ప్రశాంత అందమైన విశాలమైన,అన్ని వనరులు ఉన్న ఏ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ కాలేజిలో హ్యాంరేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాలేజి కన్వీనర్ శ్రీ తాతినేని శ్రీహరి రాగారు యాజమాన్యం తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించగా వేదికపైనే ఉన్న కన్వీనర్ సద్యో  స్పందనగా  మనస్పూర్తిగా అంగీకరించి  దానికి సంబంధిన ప్లాన్ అంతా తయారు చేసి  తనకు వెంటనే పంపమని శ్రీ సూరి ని కోరారు .సభా సదుల హర్షధ్వానాలు మిన్నంటాయి .ఈ రెండు విషయాల సాధనగా ఈ వేదిక సాఫల్యమైనదదని దుర్గాప్రసాద్ అన్నారు .

సభాధ్యక్షులు  కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు ,గౌరవ అతిధిగా శ్రీ తాతినేని శ్రీహరి రావు ,ఆత్మీయ అతిధులుగా కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్యనారాయణ ,శ్రీ సూరి శ్రీరామ మూర్తి దంపతులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి ,రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ,రచయిత శ్రీ గబ్బిట కృష్ణ మోహన్ ,శ్రీ సూరి ఆంగీరస శర్మ ,అంతర్జాతీయ హ్యాం కార్యకర్త శ్రీటాం జోస్.సరసాభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జ్యోశ్యుల శ్యామలాదేవి వేదిక నలంకరించారు .

శ్రీ సుబ్బారావు ‘’ఇలాంటి సభలు విద్యార్ధులతో నిర్వహించటం గొప్ప విషయమని దీనికి రెండు సంస్థలను అభినందిస్తున్నానన్నారు .శ్రీ పూర్ణ చంద్ లూబ్రికంట్ లంటే ఏమిటో వాటి సామర్ధ్యాన్ని పెంచటానికి రామయ్య గారు యెంత కష్టపడ్డారో తెలుసుకోవాలని ఊరికే ఏదీరాదని కృషి పట్టుదల సామర్ధ్యం ఉంటె విజయం వరిస్తు౦దన్నారు .శ్రీ శ్రీహరిరావు ఇంతటి గొప్ప పుస్తకం తమ కాలేజీలో ఆవిష్కరింప బడటం తమ కాలేజి అదృష్టమని విద్యార్ధులకు వరం అని అన్నారు .శ్రీచలపాక సరసభారతి అన్నా దుర్గాప్రసాద్ గారన్నా తనకు ఎంతో గౌరావమని  పుస్తకాలు అన్నీ రిసెర్చ్ చెందిన విలువైన గ్రంధాలని వీటిని ఏంతో కస్టపడి ప్రసాద్ గారు రాశారని ఆయన తమ లాంటివారికి ప్రేరణ అనీ అన్నారు .శ్రీ జి కృష్ణమోహన్ తాను రామయ్య గారిని చూసి మాట్లాడిన అనుభవ౦ వివరించారు.

సభాకార్యక్రమానికి ముందు శ్రీ టాం జోస్ హుద్ హూద్ తుఫాను  విశాఖను కల్లోల పరచిన తీరును ,అప్పుడు హ్యాం రేడియో ద్వారా తానూ అందించిన సేవలను తన సేవను గుర్తించి  రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు తనను గౌరవించి సన్మానించిన చిత్రాలను ,తన విదేశీ పర్యటన సత్కారాల చిత్రాలను  ప్రొజెక్టర్ పై ప్రదర్శించి గొప్ప అనుభూతిని కల్గించారు  .అప్పుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ‘’టాం మీలాగా ఇంకా కాలేజి విద్యార్దియే .హుద్ హూద్ తుఫానులో హ్యాం రేడియో తో చేసిన సేవలకు గుర్తింపు పొంది ఇవాళ ప్రపంచ ప్రముఖుడు అయ్యాడు  .అంతేకాదు తెలంగాణా ప్రభుత్వం టాం సాధించిన విషయాలను 9వ తరగతికి లెసన్ గా చేసి ఇంత చిన్న వయసులో అతనికి అతి గొప్ప గౌరవాన్ని కలిగించిందని ,అందరు  లేచి నిలబడి కరతాళ ధ్వనులతో-స్టాండింగ్ వోవేషన్ ఇచ్చి  టాంను అభినందించాలి అనగానే సభ ఒక్క మాటున ఆనందం తో లేచి నిలబడి కరతాళ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేట్లు చేసి ఈ  విద్యార్ధి నాయుకునికి అభినందనలు తెలియ జేసింది .టాం వినయంగా స్వీకరించి హ్యాంరేడియోతో ప్రపంచ ప్రముఖుల౦దరితోనూ మాట్లాడవచ్చునని ,ప్రపంచ వ్యాప్తంగా విషయాలన్నీ తెలుసుకోవచ్చునని విద్యార్ధులకు హితవు చెప్పాడు .సరసభారతి శాలువా, రామయ్య గారి చిత్రం ఉన్న జ్ఞాపికతోబాటు 2,౦౦౦రూపాయల నగదు బహుమతిని అందజేయగా ,కాలేజి యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది .

శ్రీ సూరి సభాముఖంగా శ్రీ దుర్గాప్రసాద్ కు 15,౦౦౦రూపాయల చెక్ ను అందజేసి ,విద్యార్ధులకు హ్యాం,పైనా ,రామయ్య గారిపైనా క్విజ్ కార్యక్రమాలవంటివి నిర్వహించి బహుమతులను అందజేయ  వలసిందని కోరగా ,ప్రస్తుతం ఫైనల్ పరీక్షల మూడ్ లో విద్యార్దులున్నారని  తీరుబడిగా వాటిని చేయచ్చునని అప్పటిదాకా ఆడబ్బు తన వద్ద ఉంచు కోవటం  భావ్యం కాదని, నిర్వహించినపుడు తానే అడిగి బహుమతులకోసం తీసుకొంతటాననిమర్యాదగా చెప్పి చెక్కును తిరిగి ఇచ్చేశారు .

ఈ సభలో పాల్గొన్న అతిదులందరికి సరసభారతి శాలువా జ్ఞాపికలతో సత్కరించింది . రామయ్య గారి గ్రంధాన్ని కాలేజి లైబ్రరీకి 50,కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కు 25కాపీలు ,స్పాన్సర్ అయిన శ్రీ రాజేంద్ర కు 75,రామయ్య గారి బంధువులకు .సభకు హాజరైన వారందరికీ అందజేయ బడినాయి .సరసభారతి కార్య దర్శి  శ్రీమతి మాదిరాజు శివలక్ష్మికార్య క్రమ నిర్వహణ చేయగా  ,సాంకేతిక సలహాదారు శ్రీ వి బి జి రావు ,కోశాధికారి శ్రీ జి వి రమణ,కేమిస్త్రే లెక్చరర్లు శ్రీమతి శాంతి, కుమారి నవ నీత విలువైన సహకారం అందించారు .మాజీలెక్చరర్ శ్రీ పి .నారాయణ  మూర్తిగారు సరసభారతికి కాలేజి కి అనుసంధాన కర్తగా వ్యవహరించి విజయానికి తోడ్పడ్డారు  రెండు గంటలకు పైగా జరిగిన ఈ సభ విజయవంతం కావటానికి ముఖ్య కారకులు అత్యంత క్రమశిక్షణతో మెలగినకాలేజీ డిగ్రీ విద్యార్ధినీ విద్యార్ధులేనని దుర్గాప్రసాద్ వారిని అభినందించారు . సభ ప్రారంభానికి ముందు కాలేజి వారు అతిధులకు అల్పాహార విందు నివ్వగా సభానంతరం సరసభారతి మధ్యాహ్న విందు నేర్పాటు చేసింది .విద్యార్ధినుల మా తెలుగు తల్లి ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమై ,జనగణ మనజాతీయ గీతం తో  సమాప్తమైంది .కాలేజి విద్యార్ధినీ విద్యార్ధులు సుమారు వందమంది ,సాహిత్యాభిమానులు సుమారు  25మంది తో సభ కళకళ లాడింది .

రామయ్యగారి కుటుంబ సభ్యులు ఏంటో ఉత్సాహం గా ఇదొక పండుగ వేడుకలాగా కార్లలో హైదరాబాద్ నుండి వచ్చి పాల్గొని రామయ్యగారిపై ఉన్న గౌరవాన్ని ప్రకటించారు .వారందరు భోజనానతరంశ్రీ దుర్గా ప్రసాద్ ఇంటికి వచ్చి ఒక గంట ఉండి మార్యాద పొందారు .1963లో శ్రీ దుర్గాప్రసాద్ తో బాటు రాజ మండ్రి ట్రెయినింగ్ కాలేజీ లో బి ఎడ్ సహా విద్యార్ధి అయిన శ్రీ వారణాసి సుబ్బయ్య (రిటైర్డ్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ )భార్య శ్రీమతి లలితాదేవి తో  52ఏళ్ళ తర్వాత ఉయ్యూరు వచ్చి సభలో పాల్గొని  శ్రీ దుర్గాప్రసాద్ దంపతులకు నూతన వస్త్రాలతో సత్కరించి  వారిచే శాలువా జ్ఞాపికా అందుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .శ్రీ సుబ్బయ్య దంపతులు శ్రీ దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి నూతన వస్త్రాలతో సత్కార మందుకొన్నారు . స్థానిక పత్రికా విలేకరులెవ్వరూ హాజరు కాకపోయినా .స్థానిక మన చానెల్ సిటీ కేబుల్ వారొచ్చి వీడియో తీసి  ,వార్తలలో చూపారు నేషనల్ చానెల్ భారత్ టుడే విస్తృత కవరేజ్ నిచ్చి సభ ను  చిరస్మరణీయ౦ చేసింది .

భారత గణ తంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-16-ఉయ్యూరు

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కెమో టాలజిపిత ముఖ చిత్రాలు-స్పాన్సర్ స్పంసన- ”అజ్ఞాత మార్గ దర్శి– -శీ ఏ ప్రేమ్ చంద్ – మైనేనివారి ”మంచిప్రయత్నం ,వల్లీశ్వర్ ,భల్లం-నా మనవి మాటలు -దాతల విరాళాలు

kemo3 001kemo4 001kemopita-1 001kemo2 001manchi 001 prem1 001 prem2 001 valli 001 bhallam1 001 bhallam2 001 ajnata6 001 ajnata7 001 ajnata8 001 ajnat3 001 ajnata1 001 ajnata2 001 ajnata4 001 ajnata5 001 garva2 001 garvaaaa1 001 kemo5 001 ankitam1 001 ankitam2 001durga1 001 durga2 001 acp 001 manavi1 001 viralam 001 mana2 001 mana3 001 mana4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు 

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

52ఏళ్ళ క్రితం రాజమండ్రిలో నా ట్రెయినింగ్ మేట్ వారణాసి సుబ్బయ్య దంపతులు 25-1-16 సోమవారం మా ఇంట్లో అతిధులు 

This gallery contains 5 photos.

More Galleries | Tagged | Leave a comment

గ్రంధావిష్కరణ -పేపర్ కవరేజ్ జ్యొతీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016

‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని పాడినా.. వందేమాతరం, గీతం ఆలపించినా కలిగే గాఢానురక్తి శబ్ద నాదంలో స్వరఝరిగా మారి గుండెలోతుల్లోంచి దూసుకుపోతుంది. ఈ రస స్ఫూర్తి అందించిన కంఠస్వరం రాగ మాధుర్యంతో తొణికిసలాడుతుంటే.. ఆ సంగీత మణిపూసకి పర్యాయ పదమే మంగళంపల్లి బాలమురళీకృష్ణ. స్వర – లయ జ్ఞానాలతో శ్రుతిబద్ధతను పాటిస్తూ.. రాగం తానం పల్లవులలో చూసిన ఒడుపులు, ఒద్దికలు జన్మతః ఆ కళాభిజ్ఞుడు గానకృష్ణకు అబ్బిన రాగాల పరుసవేది విద్య. మందర గాంధారం నుండి తారా షడ్జమం దాకా స్థారుూ విన్యాసాలను ప్రదర్శించడం ఆ రాగాల బాలుడికే చెల్లింది. కీర్తనల్లో సమ్మోహనత్వం.. గానాలాపనలో మృదుత్వం.. గొంతులో ఉప్పొంగే మార్దవం.. స్వరకల్పనలో బహుముఖ ప్రజ్ఞ.. విజ్ఞులనే కాదు.. రసజ్ఞులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రస వాహినిలో ఓలలాడిస్తాయి. ఆనంద పారవశ్యంలో విహరింపజేస్తాయి. రసిక మనోరంజకంగా.. అలంకారమయంగా.. వర్ణ రంజితంగా.. తాత్వికుడి గుంభనపు నవ్వుతో రస తృప్తిని కలిగిస్తాయి. ముఖ కవళికల్లో కదలాడే రసార్ద్ర భావం.. గళంలోకి వొలికించి పలికించే గాన శైలీ విన్యాసం శ్రవణేంద్రియాల్ని మేల్కొలిపే రాగ నాదవేదం ఈ గాన గంధర్వుడికే సొంతం. భక్తిప్రపత్తులతో కళ్లల్లో ఆరాధనా భావాన్ని ప్రదర్శించే నేర్పరితనం.. భావితరాలకు ఆదర్శ దిశా నిర్దేశనం, ధాతు, మాతు రచనలో తనదైన విలక్షణ ముద్ర.. ఈ సంగీత పుంభావ సరస్వతి బాలమురళి. ఈ సంగీత సర్వస్వంతో ముఖాముఖి..

గేటు దాటగానే ముందు వాకిలిలో పూల మొక్కల మధ్య ఊయల చిరుగాలికి నెమ్మదిగా తనంత తానే ఊగుతున్నట్టు. ఆ ఇంటి గృహలక్ష్మి అన్నపూర్ణమ్మగారు.
‘బాగున్నావా? ఎప్పుడు రాక?’ అంటూ హాయిగొలిపే పలకరింపు. వారితోపాటుగా ఇంట్లోకి వెళ్లగానే సోఫాలో చిరునవ్వులు చిందిస్తున్న బాలకృష్ణుడు. కుశల ప్రశ్నల అనంతరం ఈసారైనా నాకు ఆంధ్రభూమి తరఫున ఆర్టికల్ రాసే అవకాశం ఇవ్వాల్సిందే అని చనువుగా అర్థింపు. హాయిగా నవ్వేస్తూ…
‘ఏం అన్నపూర్ణా!’ అంటూ వారు అంగీకారంగా తల ఊపగానే ‘సరే మరి’ అన్నారు. చెవుల్లో అమృతం. ‘గానసుధారసమే పరమానంద దాయకము…’
‘మీరే చెప్పేస్తే రాసేసుకుంటాను. నాకేం చేతనవును మిమ్మల్ని ఏం అడగాలో?’ అన్నాను.
‘అలా వద్దు. నువ్వు ప్రశ్నలడుగు నేను చెప్తా’ అన్నారు. మర్నాడు పొద్దున మొదలైంది ముఖాముఖి.

మీ బాల్యం ఎలా గడిచింది? సంగీతపరమైన మూల బీజాలు మీకు అప్పుడే పడ్డాయా?
(చిన్న నవ్వు)
నేను పుట్టింది సంగీత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సంప్రదాయక కుటుంబంలో. తోటి పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛాపూరిత వెసులుబాటు నాకు అక్కడ లభించలేదు. నన్ను చాలా గౌరవభావంతో చూసి నా ఈడు వాళ్లంతా దూరంగా జరిగిపోయేవారు. సంగీత కచేరీలు, అభినందనలు, సన్మానాలతో నా బాల్యం గడిచిపోయింది.
ఆ అపురూప ఘడియల్ని ఇప్పుడు నా మనుమలు, మనుమరాళ్లతో నెమరువేసుకుంటూ పంచుకుంటున్నాను. అప్పటి అల్లరి సరదాలను వీళ్లతో ఇప్పుడు తీర్చుకుంటున్నాను. సంగీతం విషయానికొస్తే నాకు తొలి గురువు మా నాన్నగారైన పట్ట్భారామయ్యగారే! మా అమ్మ సూర్యకాంతంగారు స్వతహాగా మంచి వైణిక విద్వాంసురాలు. అలాంటి కళాత్మక పరిసర వాతావరణంలో క్రమశిక్షణతో పెరిగి పెద్దవాడినయ్యాను. ఆ క్రమంలో పారుపల్లి రామకృష్ణయ్యగారి శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ దినదిన ప్రవర్థమానమై ఎదుగుతూ వచ్చాను.

ప్ర: అతి చిన్న వయసులోనే సంగీత కచేరీ చేసిన బాల గంధర్వుడిగా, ఏకసంథాగ్రాహిగా ముద్రపడ్డారు. ఆ అనిర్వచనీయమైన అనుభవం ఎలాంటిది?
జ: ఏడేళ్ళ ప్రాయంలో 1939 జూలై 6న త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం రోజున, సంగీత విద్వాంసుల మధ్య తొలి సంగీత కచేరీ చేసిన అనుభవం నాది. ‘ఈశ మనోహరి’ రాగంలో ‘మనసా శ్రీరామచంద్రుని’ అనే కీర్తనని ఆలపించి శ్రోతలకి వినిపించాను. అపూర్వ స్పందన వచ్చింది. అప్పటి నుంచి వేదికలపై నా సంగీత కచేరీ ప్రస్థానం మొదలయ్యింది.
ప్ర: సంగీత పరంగా మీరు ఎలాంటి శిక్షణని తీసుకుని సాధన చేశారు? ఆ వివరాలు తెలుసుకోవాలని..
జ: నేను ఒక పద్ధతి ప్రకారం ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. మా నాన్నగారి ఏకైక సంతానంగా, గారాల ముద్దు బిడ్డగా ఆయన పక్కనే ప్రతి రాత్రి పడుకుని సంగీత విద్యని అభ్యసించేవాడిని. సరళీస్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు, కీర్తనలు అలా అలవోకగా అవలీలగా నా నోటికి వచ్చేశాయి. వేదవిద్యను పోలిన శ్రుత పాండిత్యమది. అలా మూడేళ్ల చిరుప్రాయంలోనే సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాను. నా ఏడవ ఏట గురువుగారు రామకృష్ణయ్య గారి వద్దకి తీసుకెళ్లారు. గురువుల వద్ద నాకు శిక్షణ నామమాత్రమే! స్వశక్తితో అంకితభావంతో బాల్యదశ నుండే సాధన మొదలయ్యింది.
ప్రశ్న: పలు రకాల వాయిద్య పరికరాలు పలికించడంలో మీరు మంచి దిట్టని విన్నాను…
జ: చిన్నప్పుడూ ఒకసారి వయొలిన్ తీసి వాయించాను. అది చూసి మా పెద్దమ్మ సుబ్బలక్ష్మి, మా నాన్నగారు ముచ్చటపడ్డారు. నేను పుట్టిన 15 రోజులకే మా అమ్మగారు సూర్యకాంతమ్మ కాలం చేశారు. దానితో మా పెద్దమ్మ కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆ దశలో సంగీత పరికరాలను వాయించి పలికించడం నేర్చుకున్నాను. తొమ్మిదేళ్లు వచ్చేసరికి వయొలిన్, మృదంగం, కంజీర, వీణ వంటివి నేర్చేసుకున్నాను. మరోవైపు గాత్రం. నాది సహజ పాండిత్యం. డిగ్రీలు చదవలేని విద్వత్తును మిగిల్చింది.
ప్ర: ‘పిట్ట కొంచెం – కూత ఘనం’ అన్నట్టుగా మొదలైన మీ గాత్ర స్వరం కోకిల సుస్వరంగా మారి చిరుప్రాయంలోనే కొత్త పుంతలు తొక్కించింది అనడానికి ఏవైనా ప్రయోగాత్మక సంగీత రచనలు చేసి, ఆలపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారా?
జ: నా పధ్నాల్గవ ఏటనే జనక రాగాలలో ‘రాగంగా రవళి’ని స్వరబద్ధం చేసాను. 430 బాణీలతో 72 మేళకర్త రాగాలకు ఒక్కో కృతిని సమకూర్చుతూ కీర్తనలను రాసి స్వరపరిచాను. ‘జనకరాగ కృతి మంజరి’ పేరిట గ్రంథంగా ప్రచురించి గానం చేశాను. అవన్నీ కవిత్వ ప్రధానం కాకపోయినా రాగప్రధానమైనవే. గతంలో ఎవ్వరూ పాడని విధంగా సంగతులు ఉంటాయి వాటిలో. ఆ విధంగా రాసుకుంటూ వచ్చాను. స్వీయకృతుల్ని ‘సూర్యకాంతి’ అనే పుస్తక రూపంలో విడుదల చేశాను.
ప్ర: మీ కచేరీలు ఎనభై ఐదేళ్ల వయసులోనూ… ఇప్పటికీ శ్రోతలను గానంతో రంజింపజేసి, ఉర్రూతలూగించి మంత్రముగ్ధుల్ని చేస్తాయి కదా? వీటి వెనుక దాగి ఉన్న విజయ రహస్యాన్ని చెబుతారా?
జ: ఎనిమిదిన్నర దశాబ్దాల నా సంగీత యాత్రలో రాగం, స్వరం, తాళం, లయ అన్నింటి మీదా అధికారంతో కూడిన పట్టు సాధించాను. స్వరకర్తగా సంగీతకారుడిగా అన్ని పార్శ్వాలలోను సొంత ముద్ర వెయ్యడానికి ప్రయత్నించాను. ఇందులో తెచ్చి పెట్టుకున్నది ఏదీ లేదు. ఇప్పటికి 27 వేలకి పైగా కచేరీలు చేశాను.
ఎలాంటి రాగం పాడినా అందులో కొత్తదనం ధ్వనిస్తుంది. నా కీర్తనల్లో కవిత్వముంటుంది. గాన రీతిలో కానీ స్వర కల్పనలో కాని, రాగాలాపనలో కాని స్వతంత్ర శైలిని ప్రదర్శించడానికి ఇష్టపడతాను. ఇవన్నీ సహజంగా అబ్బిన లక్షణాలే. సంగీతం పాడడం, వినడం మూలంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవితమంతటా లయ ఉంటుంది. రాగం ఇలా ఉందని చెప్పడానికి నేను సంగీతం ద్వారా ప్రయత్నిస్తాను. పరిమితులు లేని భావ ప్రకటనలను అందించాలని నా తాపత్రయం. సంగీతంలో సాహిత్యం ప్రధానం కావాలి అన్న భావనని నేనే పరిచయం చేశానేమో? నాకు సంగీతం తెలియదు. కాని సంగీతానికి నేను తెలుసు. నా జీవితం సంగీత సర్వస్వం. చిత్తశుద్ధి, కృషిలను మించిన ప్రత్యామ్నాయ శక్తులు లేవు. సంగీతంలో నవరసాలు భక్తిలో విలీనమవుతాయి. దాని అంతిమ పరమార్థం కూడా ఇదే. ఇలాంటి ఉదాత్తమమైన ఉత్తమ ఆదర్శం ఇంకే దేశంలోనూ కనిపించదు.
ప్ర: స్వర కల్పనల విషయంలో అప్పటికప్పుడే వేదికపై సిద్ధపడతారని తెలిసింది. అదెలా సాధ్యం?
జ: కచేరీ చేయడానికి వేదికపైకి వెళ్లాక ఆశువుగా సంగీతాన్ని పాడటం అలవాటు చేసుకున్నాను. దీని కోసం ప్రత్యేక సాధన చెయ్యను. ‘ముక్తాయి’ వేద్దామని గతంలో ఒకసారి ప్రయత్నిస్తే జ్ఞాపకం ఉండట్లేదు. ఇక అప్పట్నించి ఎలా వస్తే అలా పాడడం అలవాటయిపోయింది.
ప్ర: పరాయి భాషల్లో సంగీత కచేరీలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు.
జ: నదులు వాలును బట్టి ప్రవాహ గతిని మార్చుకుంటాయి. అలాగే సంగీత సాహిత్యాలూనూ. ఇతర భాషలలో గానం చేసేటప్పుడు సాహిత్యం మీద దృష్టి పెడతాను. అలాంటప్పుడు సంగీతానికి – సాహిత్యానికీ అవినాభావ సంబంధం లేకుండా ఎలా పోతుంది? భాష ముఖ్యం కాదు. మూలాధారం ఎక్కడుంది? ఏ స్థాయిలో పాడాలో తెలుసుకుంటాను.. సంగీతం ఉంటే ఏ భాష
లోనైనా పాడవచ్చు. హిందీ, బెంగాలీ, ఆంగ్లం, తమిళం, సంస్కృతం ఇలా ఎన్నైనా పాడి మెప్పించవచ్చు. వ్యక్తిగత అనుభవం, దాని లోతు, భావం ముఖ్యం. విషయ పరిజ్ఞానం లేనిదే ఏ విషయాన్నీ విమర్శించకూడదు. ఇది నా వ్యక్తిగత తాత్విక భూమిక.
ప్ర: కర్ణాటక సంగీతంలో ‘జుగల్‌బందీ’ని ప్రారంభించిన ఘనత మీది. మరి కర్ణాటక – హిందుస్తానీ సంగీతాల మధ్య సారూప్యం ఎలాంటిది?
జ: భీమ్‌సేన్ జోషి, కిశోరీ అమాంకర్, హరిప్రసాద్ చౌరాసియాలతో కలిసి ఈ ‘జుగల్‌బందీ’ ప్రదర్శనలిచ్చాను. ప్రాచీన సంప్రదాయాల్ని సజీవంగా నిలుపుతూనే, ఆధునిక ధోరణులలో కొత్త రాగాల్ని స్వరపరచి వినిపించగలగాలి. కర్ణాటక సంగీతంలోని ప్రౌఢత్వం, హిందుస్తానీ బాణీలోని ‘రక్తిమ’లను జోడించి పాడగలగాలి. ఈ రకమైన కొత్త ఒరవడులు సంగీత కచేరీకి ప్రయోగాత్మకంగా నిలుస్తాయి. శాస్ర్తియ సంగీతానికి దగ్గరవుతాయి. సాహిత్య ప్రధానమైన సంగీతానికి ప్రాధాన్యతనిస్తే అది సంప్రదాయం కాదనీ, అది కర్ణాటక సంగీతం కాదనీ, ఆచార వ్యవహారాలను తారుమారు చేస్తున్నానని చాలామంది భ్రమపడ్డారు. దేనినైనా శాస్ర్తియ దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటక సంగీతం పేరుతో ఉన్న సంగీతం త్యాగరాజ సంగీతమే!
ప్ర: గురువు చెప్పిన విషయాలతోపాటు కొత్త రూపాన్ని అందివ్వడం శిష్యుడి కర్తవ్యమేకదా? సొంత బాణీలో పాడడానికి మధ్య తేడా ఏమిటి?
జ: ఏ బాటలో నడవాలో నేర్పించేది గురువైతే విభిన్నత్వాన్ని వినూత్న కోణంలో ఆవిష్కరించడం శిష్యుడి బాధ్యత. త్యాగరాజు పాడిన సంగతులు పూర్తయ్యాక, మిగతా పాటకి మార్పుల చేర్పులతో కొత్తదనాన్ని ఆపాదించి పాడడం నేను చేసే ప్రయోగ ప్రయత్నాలలో ఒకటి. అందులో శాస్ర్తియ దృష్టి ప్రతిఫలించాలి. అలా చేయడం వల్ల మనలోని సృజనాత్మక శక్తి బయటికి వస్తుంది. వేరొకర్ని అనుసరించి పాడడంలో మన సొంత గొంతు వినిపించదు. స్వతంత్ర శైలిలో సొంత బాణీలో పాడితే దాని ప్రత్యేకత వేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు, రామానుజయ్యంగార్, మహారాజపురం విశ్వనాథయ్యర్ వంటి లబ్దప్రతిష్టులు, వేరొకరిలాగా పాడలేదు. స్వయంగా తమకు నచ్చిన రీతిలో ఆలపించేవారు. అలా సొంత గొంతుకతో విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి వాళ్లు భవిష్యత్తులో గొప్ప వాళ్లవుతారు. గానం బాగున్నట్టయితే అది పాటగా విస్కృతి చెందుతుంది. లేకపోతే నశించిపోతుంది. ఈ తేడాని గమనించి యువ గాయకులంతా మసలుకోవాలి. ఇలాంటి కొత్త మార్గాల అనే్వషణ వాళ్లలో జిజ్ఞాసను రేకెత్తించి సృజనాత్మకతకు దారి తీయిస్తుంది.
ప్ర: మీపై వచ్చే పరోక్ష విమర్శలను ఎలా స్వీకరిస్తారు?
జ: నా పట్ల సద్విమర్శ చేసేవారంటే అపారమైన గౌరవం నాకు. అలాంటి విమర్శలను ఆలోచించి సరిదిద్దుకుంటాను. వ్యక్తిగత కృషికి, ఎదుగుదలకు ఆత్మ విమర్శ చాలా అవసరం. నేను చేసేది సరైనదనిపిస్తే ఎలాంటి వారు చెప్పినా వినిపించుకోను. వ్యక్తిగత అభిరుచి, నిస్వార్థ లక్ష్యం, సాధనతో కూడిన ప్రజ్ఞగా సంగీతం నా జీవితంలోకి ప్రవేశించింది.
ప్ర: సంగీత సాధన ఏ రకమైన దృష్టితో కొనసాగించాలని మీ అభిప్రాయం?
జ: ఏ వ్యక్తిగత ప్రయోజనం కోసమో, లబ్ధి కోసమో కాక, మానసికోల్లాసానికి, స్వీయ తృప్తిని పొందడానికి మాత్రమే పరిమితం చెయ్యాలని మా గురువుల ఉవాచ. ఉపాధిని, ప్రతిఫలాన్ని ఆశించని విద్య కళాత్మకంగా, శోభాయమానమై విరాజిల్లుతుందని నా సంగీత జ్ఞానం నాకు చెప్పిన మొదటి పాఠం.
ప్ర: ఒకప్పటి సంప్రదాయక కర్ణాటక సంగీతం ఆధునిక, శాస్ర్తియ సంగీతంగా మీలో మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: పారుపల్లి రామకృష్ణయ్యగారి ఆధ్యాత్మిక గురువులైన విమలానంద భారతీస్వామి గారు ఓసారి నాకు కబురు పంపి పిలిచారు. త్యాగరాజుకి పూర్వ సంగీతాన్ని, సంగీతంలో ఆయన తొక్కిన కొత్త పుంతలు, చేసిన కొత్త రాగాల వివరాలు, పాడిన తీరు, ఆయనని వాగ్గేయకారునిగా మలచిన వైనం, చరిత్రలో నిలిచిపోయిన విధానాన్నీ ప్రశ్నించి ప్రస్తావించారు. అలా నేను రూపుదిద్దుకోవాలని ఆశీర్వదించి పంపారు. ఆ ఉద్దీపన మేలుకొలుపుతో 16 ఏళ్ల ప్రాయంలోనే సరికొత్త అడుగులు వెయ్యడం ప్రారంభించాను. నాలో అంతర్లీనంగా దాగి ఉన్న వాగ్గేయకారుడిని చైతన్యంతో తట్టి లేపి స్ఫూర్తిదాయకంగా మలిచి పైకి తీసుకొచ్చిన ఘనత విమలానంద భారతీస్వామి గారిదే!
ప్ర: మీరు సృష్టించిన రాగాల్లో విలక్షణత ఉట్టిపడుతుందంటారు. మచ్చుకు కొన్ని చెప్తారా?
జ: త్రిశక్తి, ఓంకారి, లవంగి, రోహిణి, కాళిదాస, సర్వశ్రీ, తరణి, పుష్కర గోదావరి, మనోరమ, ప్రతిమాధ్యమావతి, సుముఖం, వల్లభి, జనసమ్మోదిని, మహతి రాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నా కీర్తనల్లో రాగం, భోగం, స్నేహం, మోహం దోబూచులాడుతూ ఉంటాయి. వీటిలో ఆరాటం, ఆవేదన, ఆకాంక్ష, ఆర్తి, తపన కొట్టొచ్చినట్టు కనపడతాయి.
ప్ర: ఇంకా మీరు రాసి, మరికొన్నింటిని స్వరపరచినవి చాలా మిగిలే ఉంటాయి. వాటిని గురించి?
జ: లేకేం? చాలా ఉన్నాయి. జయదేవుని అష్టపదులు, స్వాతితిరునాళ్ రచనలు, అన్నమయ్య పదాలు, సంగీత త్రిమూర్తుల కృతులు, గాయత్రీ రామాయణం, సదాశివ బ్రహ్మేంద్ర, అమరనారాయణ కీర్తనలు, తత్వాలు.. ఇలా అన్నింటినీ గౌరవిస్తూ ఆ పాటలకు జీవం పోశాను.
ప్ర: ఆకాశవాణితో మీకు ఉన్న ప్రత్యేకత అనుబంధం ఎలాంటిది? ఇందులో కూడా కొత్త ప్రయోగాలు చేసి శ్రోతలను అలరించారని ప్రతీతి.
జ: 22 ఏళ్లకే ‘ఆకాశవాణి’లో సంగీత పర్యవేక్షక ఉద్యోగం చేశాను. నేను అప్పట్లో రూపొందించిన ‘్భక్తి రంజని’ కార్యక్రమం బహుళ ప్రజాదరణ పొందుతూ వచ్చింది. అందులో పాడిన ప్రయోగ రంగదాసు కీర్తనలు సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలిచినవే. ఇంకా ‘ఏమి సేతురా లింగా’ వంటి తత్వాలు, వింజమూరి శివరామారావుగారి శ్రీరామ కథాగానం బాగా ఆకట్టుకొన్నాయి. కాబట్టే అఖిల భారత రేడియో సంస్థ ఉన్నత కళాకారుడిగా నన్ను ప్రత్యేకంగా గుర్తించింది.
ప్ర: త్యాగరాజస్వామికి ఐదవ తరం వారసునిగా ఆరున్నర దశాబ్దాలుగా దేశ విదేశాలలో సంగీత ఝరితో ప్రవహిస్తున్న మీ భారతీయ స్వరానికి మూల చైతన్య కేంద్ర బిందువు ఎక్కడుంది?
జ: మానవ శరీరంలో సంగీతం ఉంది. గుండె చప్పుడు లయ, ఉచ్ఛ్వాస నిశ్వాసలే దీనికి శ్రుతి. మనసే ఒక చైతన్య కేంద్ర బిందువు. నా ఉద్దేశంలో లలిత, శాస్ర్తియ సంగీతాలు వేర్వేరు కాదు. రెండింటికీ ఆత్మ ఒక్కటే – సంగీత సాహిత్యాల్లాగ. ఈ ఎనిమిది దశాబ్దాలలో ఐదు వందలకు పైగా సమ్మేళ రచనలు చేశాను. ‘మురళీగానసుధ’ పేరిట కృతుల సంపుటి వచ్చింది. సంగీతాన్ని అందుబాటులోకి తేవడానికి ‘మురళీ రవళి’ అనే సంస్థను స్థాపించాను. 1939 నుండి నేటి దాకా దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూనే ఉన్నాను. అష్టపదులు, జావళీలు, హిందుస్తానీ భజనలు, తిల్లానాలు, లలిత గీతాలు ఏవి పాడినా సొంత గొంతుకతో నాదైన ముద్రతతో సృజనాత్మకతకు ఊపిరి పోస్తూనే వస్తున్నాను.
ప్ర: మీ పూర్తి పేరులో కొంత సర్దుబాటు జరిగిందంటారు. ఏమిటా కథ?
జ: 1939 జులైన నా తొలి కచేరీ జరిగింది. ఆ సందర్భంలో ‘మురళి’ని వాయించిన మా నాన్నగారు నాకు ‘మురళీకృష్ణ’ అని నామకరణం చేశారు. ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ నా పేరుకి ముందు ‘బాల’ని చేర్చారు. అలా నేను ‘బాల మురళీకృష్ణ’ని అయ్యాను.
ప్ర: లబ్దప్రతిష్టులైన సంగీత విద్వాంసులు పరచిన సంప్రదాయ శైలిని మీ బాణీలోకి మలచుకుని ఉత్తేజం పొందిన సంఘటనలు, సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
జ: ప్రేరణ ఎక్కడైనా ఒక్కటే. ఎవరి నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందినా అది సంగీతమయమే అవుతుంది. సంగీత ప్రతిభావంతులు మనకు చాలామందే ఉన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగూడి శ్రీనివాసయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ వంటి గాన కళాకోవిదులు తమ సొంత మార్గాల్ని అనుసరించారు. నేను వీళ్లందర్నీ అధ్యయనం చేశాను. వాళ్లు గుర్తించి కొనసాగించిన పద్ధతులను, అంశాలను నా గానంలోకి స్వీకరించి ఆస్వాదించాను. వీళ్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన విలక్షణత గల శైలి ఉచ్ఛారణలో వైవిధ్యం కనిపిస్తుంది. వీటన్నింటిని స్థూల దృష్టితో చూసి సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడే మనదైన ప్రత్యేకత ఏర్పడుతుంది. ఈ నేర్పుని కొత్తదనంతో అంది పుచ్చుకోవాలి. ప్రతిభావంతులంతా ఈ కోవలో ప్రయాణించి మార్గ దిశా నిర్దేశం చేసుకున్నవాళ్లే!
ప్ర: మీరు చేసిన స్వీయ రచనలు సంగీత ప్రియులకు ఎలాంటి రాగాలను అందించాయి?
జ: తన హితమే (శుద్ధ్ధన్యాసి), అమ్మ ఆనందదాయిని (గంభీర నాటవర్ణం), చలముజేసి (రామప్రియ వర్ణం), అఖిలాండేశ్వరి (కర్ణాటకకాపి), గణాధిపం (నాట), సదా తవపాద (షణ్ముఖప్రియ), గాన రసిక (హిందోళం), సరగున (తోడి వర్ణం) ఇత్యాదులు చాలా ఉన్నాయి. ఇంకా వందకు పైగా కృతులు, థిల్లానాలు, రాగమాలికలు, పద వర్ణాలు ఉన్నాయి. రాగం పూర్తిగా గాయకుడి ద్వారానే వికాసం పొందుతుంది. కాబట్టి అది కూడా అతని స్వంతమేనని అనుకోవాలి. ఇదీ నా అభిప్రాయం.
ప్ర: సంగీత ప్రపంచంలో కొత్తదనానికీ, బాణీలకు మీరిచ్చే విలువ ఎలాంటిది?
జ: శ్రోతలే సరైన న్యాయనిర్ణేతలు. సంగీతం మహా సముద్రం లాంటిది. తప్పొప్పుల్ని మనం నిర్ణయించలేం. నా వరకూ సృజనాత్మకతతో పోటీ పడుతూనే ఉంటా!
ప్ర: భారతప్రభుత్వం, దక్షిణ భారత సంగీతం పట్ల సహాయ సహకారాల విషయంలో మీరు సానుకూల దృక్పథంతో ఉన్నారా?
జ: వాటి పని చేసుకుపోతున్నాయి. ఇందులో రాజకీయ కలుషితం లేనంత వరకూ ఫరవాలేదు.
ప్ర: సాధారణంగా మీ కచేరీ ప్రదర్శనల్లో కొన్ని కట్టుబాట్లలో కూడిన పరిమితులు ఉంటాయి. దీని వెనుక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ: నా వరకూ నా ప్రదర్శనలపై, సామర్థ్యంపై విశ్వాసం ఉంది. భావితరాలు కూడా వీటిన ఆస్వాదిస్తూ అనుభూతించగలగాలి.
ప్ర: సినిమా సాహిత్యం మీకు అపూర్వమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. ఆబాలగోపాలాన్ని అలరించే ఆ చలనచిత్రాల గీతాల విశేషాల్ని, వాటి నేపథ్య సంగీత దర్శకత్వ బాధ్యతల్ని, నటించిన పాత్రల్ని, స్వరపరచిన బాణీలని కొంచెం విడమర్చి విశే్లషిస్తారా?
జ: చెప్పడానికైతే చాలా విషయాలు, విశేషాలున్నాయి. ‘ఉయ్యాలజంపాల’ చిత్రంలోని ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు’ పాటతోపాటు ‘నర్తనశాల’లో ‘సలలిత రాగ సుధారస సారం’ గీతం ఉంది. ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’ సినిమాలో ‘వసంత గాలికి వలపులు రేగ’ పాటను పాడాను ‘కర్ణ’ చిత్రంలో ‘నీవూ నేనూ వలచితిమి’ గీతం ‘గుప్పెడు మను’లో ‘వౌనమే నీ భాష ఓ మూగ మనసా!’ వంటి పాటలు ఆలపించాను. ‘్భక్తప్రహ్లాద’ చిత్రంలో పాడిన అన్ని గీతాలూ తృప్తినిచ్చాయి. ‘పలుకే బంగారమాయేనా.. అందాల రామా’ వంటి పాటలు కూడా ప్రసిద్ధి పొందాయి.
‘సంధ్య గిదేన సింధూరం’ అనే మలయాళ చిత్రంలో కథానాయకుడిగా.. ‘్భక్తప్రహ్లాద’లో నారదుడిగా నటించిన పాత్రలు చాలా మంచివి. ‘సంధ్యారాగ’ కన్నడ సినిమాకి 1974లో ఉత్తర సంగీత దర్శకుడిగా ప్రాంతీయ బహుమతి లభించింది. సినిమా గాయకుడిగా ‘హంసగీతే’ కన్నడ చిత్రానికి 1975లోనూ, ‘మధ్వాచార్య’ చిత్రానికి 1986లో సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు పొందాను. ‘ఆదిశంకరాచార్య (1983), రామానుజాచార్య (1989) చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశాను. సినిమా అనగానే తమిళ ప్రేక్షకులకి ‘తిరువివైయాడల్’ చిత్రంలోని ‘ఒరునాల్ పోదుమా’ పాట గుర్తుకొస్తుంది. ‘తలలై వనుక్కోరుతలైవి’ అనే పాటకు సంగీత దర్శకత్వం వహించాను. నటించిన ‘నవరత్నం’ చిత్రానికి కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య బాణీలతోపాటు జానపద వరస అవసరమైంది.
* * *
చిరునవ్వుల రేడు.. సంగీత సామ్రాట్టుతో కబుర్లు పూర్తయ్యాక ఆ దంపతులకు నమస్కరించి మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకుని బయటికి వచ్చాను… గేటు వరకు వచ్చి జాగ్రత్తగా వెళ్లమని చెప్తున్నప్పుడు ఆ ఆప్యాయతకు కళ్లల్లో సన్నటి నీటిపొర. కొంత దూరం వచ్చాక వెనుతిరిగి చూశాను.. ఒక పాట మహాద్భుతంగా.. నాతోపాటుగా.. ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు.. ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు’
.. ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా.. సొంత ఊరు.. అయిన వారు అంతరాన ఉందురోయ్!

**************************

నాద బ్రహ్మోపాసనలో తన కంఠస్వరంలో రసస్ఫూర్తిని జ్ఞానాన్ని ఏకకాలంలో అందించిన స్వరబ్రహ్మ మంగళంపల్లి.
సంగీతమే అభ్యాసంలో శాస్త్రం, ప్రయోగంలో కళ, శాస్త్ర జ్ఞానానికి బుద్ధి, కళారూపానికి హృదయం.. ఈ రెండింటినీ ఆత్మజ్ఞానంతో ఆవిష్కరించిన సంగీత శిల్పకారుడు బాలమురళి. ప్రపంచంలో అందరూ శాస్త్రం ఆధారంగా పాండిత్యాన్ని సముపార్జిస్తారు. బాలమురళి మేళకర్త రాగాల సృష్టికర్త. శాస్త్రాన్ని కొత్తరీతిలో ఆవిష్కరించి సప్త స్వరాల్లో నవరసాలు అందించిన జ్ఞాని. ప్రస్తుత ప్రపంచంలో కళాస్వరూపి. వాగ్గేయకారుడు.
రాగాల సృష్టిలో వీరిది వినూత్న శైలి. ఎదురీత పద్ధతి. సంగీత శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే రాగానికి అయిదు స్వరాలుండాలి. బాలమురళి అదేం పట్టించుకోకుండా నాలుగు, మూడు స్వరాలతో కూడా రాగాలను సృష్టించి పాటలను రాసి, అద్భుతంగా పాడి విన్పిస్తారు కూడా. సుముఖం, లవంగి (సాక్షాత్తు ఈ రాగం పేరే వీరి ప్రియ మనవరాలి పేరు), మహతి (వారి ఇంటికి పేరదే) మొదలైనవి. నాలుగు స్వరాలతో ఉండే సర్వశ్రీలో మూడే (సమ/ప) అయినా వీటి ఆలాపనలో గాని కృతుల రచనలో గాని ఏ లోటు ఉండదు.

**********************************

సహజ గాన కవితాంకృతులగు వాగ్గేయకారుడు మంగళంపల్లి ఉద్భవించి జనకరాగ కృతి మంజరి అనే గ్రంథాన్ని రచించి లోకానికి మహోపకారం చేసిన వ్యక్తి. ఈ గ్రంథంలో డెబ్బై రెండు మేళకర్త రాగాలలో 72 కృతులు రాయబడ్డాయి. ఈ గ్రంథ పూర్వభాగం, ఉత్తరభాగంగా ఒకే సంపుటము. శుద్ధ మధ్యమ ప్రధానమైన 36 కృతులు, ప్రతిమధ్యమ ప్రధానము 36 ఉన్నాయి. ఇవి అమ్పుర్ణ రాగములు అవడం చేత సరళంగా మాధుర్యంగా స్ఫురిస్తాయి.
* మధుర శబ్దాలను ఉపయోగించే కవితా శక్తిలో ప్రతిభ, కవి భావన విశేషం కనిపిస్తుంది. కొన్ని కృతులలో రాగాల పేర్లనే రాయడం, గాయకులూ ఆ రాగాలతో పాడడం విశేషం. జనకరాగ కృతి గ్రంథం నుండి 14వ కృతి వకుళాభరణ రాగం, 17వ కృతి సూర్యకాంత రాగము, 57వ కృతి సింహేద్ర మధ్యమము, 62వ మేళకర్త రిషభ ప్రియ.. ఇంకా ఈ కృతి రాసినప్పుడు నందీశ్వర స్తుతి చేయడం.
* పూర్వభాగములో తాన వర్ణములో, ఆలసింప సొంపా మురళీధర.. అన్నప్పటి సొగసు, 16వ మేళకర్తలో భుజంగా సహిత నీలకంఠలోని రమ్యత, 36లో ఐ లబిల సఖ, 38లో మనోన్మని, 64వ మేళకర్తలో నతా వరప్రదా, పాండిత్య స్ఫోరకాలుగా రచింపబడ్డాయి.
* 25 మేళకర్త సంస్కృత భాషలో వ్రాయబడి తృతీయా విభక్తులు చివరిదాకా సమర్థింపబడి శ్రీకృష్ణుని మా రంజిత మాన సేన అనే మాట సుకుమారంగా కనపడుతుంది.

**************************************

పరిచయం.. అద్భుతం
స్వర సమ్మోహన లోకాలకు తెర తీయగా రాదా అని రసజ్ఞులు పారవశ్యంతో వేడుకుంటే చాలు ఆయనకే సొంతమైన అపూర్వ గాత్రం నుంచి అలవోకగా పంచరత్నాలు రాలుతాయి. కురంజిలో సీతా కళ్యాణ వైభోగ ఘట్టాన్ని కళ్లకు కటిటనట్టు వీనులకు విందుచేస్తూ ఆలపించినా.. పాపి రామ ప్రభో అని శ్రీరాముడిని స్తుతిస్తూ మధ్యమావతి మాధుర్యాన్నీ మనకు అందించడం అది ఆ మహానుభావునికే చెల్లింది.
నేటికీ.. 85 వసంతాలు దాటినా నిరంతరం ఎక్కడో ఒకచోట విశ్వమోహనంగా వినిపించే బాలమురళి గొంతులో ఎన్ని సంగతులు సునాయాసంగా పలికి, లక్షలాది రసికులలో రసానందం చిలికి అద్భుత రాగాల వాయులీనంలో భారతీయ సంగీత వైభవాన్ని ఖండాంతాలకు వ్యాపింపజేసాయో చరాచర సృష్టిలోని ప్రకృతికి మాత్రమే తెలుసు.
‘్భగవంతుడు నన్ను పనికిరానివాడుగా కాక సంగీత పరికరంగా వినియోగించాడు ’ అని కర్నాటక సంగీత సార్వభౌముడిగా ఉన్నత శిఖరాలు చేరుకున్న తరువాత కూడా వినయంగా పలికిన మహానుభావుడు బాలమురళి.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి శంకర గుప్తంలో ఒక బ్రాహ్మణ పండిత కుటుంబంలో 1930 జులై 6న జన్మించిన ఈ సంగీతఖని గోదావరి తరంగాల నుంచి కృష్ణా తరంగాల మీదుగా తమిళనాడులోని త్యాగరాజ స్వామి బాటలో స్థిరపడి ఖండాంతరాలలో సాగర సంగీతంలో మమేకమై విశ్వజనీన సంగీత మహోదరిగా విస్తరించి ప్రభవించినది. దాదాపు ఐదు తరాల సంగీత కోవిదులను, రసికులను ప్రభావితం చేస్తూ ఇప్పటికీ గానామృతధారల్ని నిఖిల జగతికి పంచి పెడుతూనే ఉంది. ఈ అనంత సృజనాత్మక రాగవాహినిలో తడిసి పరవశించని రసికులు లేరు.
నాలాంటి సామాన్యురాలిని… అత్యంత ఆదరణతో ఆహ్వానించి చక్కని చిరునవ్వుతో నా క్షేమ సమాచారాల్ని.. అడుగుతూ.. మా పిల్లలతో ఫోన్లో మాట్లాడి ఈ మారు అమ్మతో రండి అని చెప్పడం వారి నిరాడంబరతకి చిహ్నం. శ్రీమతి అన్నపూర్ణగారి చల్లని పలుకులు మరువలేనివి. ఆ ఆదిదంపతులకి పాదాభివందనాలు సమర్పిస్తూ… అడిగిన వెంటనే.. వారి సంగీత యాత్రను ఓపికగా తెలియజెయ్యడం నా పూర్వజన్మ సుకృతం.. చక్కని చిరునవ్వు బాలమురళీకృష్ణ గారి శోభాయమానమైన సంగీతాభరణం.

*************************************

మంగళంపల్లి బాలమురళీకృష్ణ కొన్ని దశాబ్దాలుగా దేశ విదేశాలలో ప్రవహిస్తున్న భారతీయ ప్రవాహం. 25,641కి పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సర్వశ్రీ, లవంగి, మహతి, ప్రతిమధ్యమావతి వంటి అపురూప రాగాల స్రష్ట. ఉత్తమోత్తమ పరిశోధకులు. మూడుసార్లు ఉత్తమ చలనచిత్ర సంగీత దర్శకత్వానికి బహుమతులందుకున్న ప్రతిభాశాలి. పాడిన ప్రతి పాటకు ఒక మనోహర శిల్పాన్ని మలచగల నేపథ్య గాయకుడు. వీరు అధిరోహించని కీర్తి శిఖరం లేదు. భారత ప్రభుత్వ విశిష్ట పురస్కారం పద్మ విభూషణ్, ఫ్రెంచి ప్రభుత్వపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పెషలియర్’ వంటివి ఆయనని వెదుక్కుంటూ వచ్చాయి.

***************************************

నేనేం చేశానంటే…
‘‘సంగీతంలో నేనేం చేసానంటే చేతనైనంత మట్టుకు వడపోశానంతే!.. క్లీన్‌గా ఇచ్చాను వాటర్. అంతే తప్ప నేను కొత్తగా పెద్దగా సృష్టించాననటం లేదు. అదే ఒక సృష్టి. తర్వాత నాకు తెలియకుండానే వాగ్గేయకారత్వం మా తాతామహులు తాతగారి వద్ద నుంచి వచ్చింది. మీరు కీర్తనలు ఎందుకు రాయాలి? అలా రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే దానికో కథ ఉంది… నేను అస్సలు చదువుకోలేదు. మా గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వాముల వారి దగ్గరికి నన్ను తీసుకెళ్తూండేవారు. ఆయనకి నా పాటంటే ఇష్టం. ఒకసారి చాతుర్మాస్య దీక్ష కోసం బెజవాడలో మా ఇంటి ఎదురుగా సత్రంలో ఉన్నారు. ఓ రోజు మధ్యాహ్నం నన్ను ‘రావోయ్ మురళి’ అని పిలిచారు.. నాకు 15 ఏళ్లు అప్పుడు. త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేది? పాడితే ఏం పాటలు పాడేవారు? త్యాగరాజ కీర్తనలు ఎక్కువ ప్రచారంలోకి రావటానికి కారణం ఏమిటి? ఆ గొప్పదనమేమిటి? లాంటి ప్రశ్నలడిగితే.. ఆయన చాలా రాగాలు సృష్టించాడు. రాగాలయితే పేపర్లలో పుస్తకాల్లో ఉన్నాయి. కానీ అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఏ రాగమైనా మనకి తెలియాలంటే ఆ రాగంలో ఒక రచన ఉండాలి. కీర్తన ఉండాలి. లేకపోతే రాగం తెలియదు. అటువంటి అనేక రాగాలను త్యాగరాజుకి పూర్వం ఎవరికీ తెలియనివి పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి రూపకల్పన కల్పించి… సాహిత్యానికి అన్వయించి రామభక్తుడు కాబట్టి రాముడి మీద కీర్తనలు రాసి పాడాడు. అదే త్యాగరాజ సంగీతమై పోయింది. ఇప్పుడు కర్ణాటక సంగీతమనే పేరుతో ఉన్నది త్యాగరాజ సంగీతమే అన్నాను.
ఓహో! త్యాగరాజు కొత్త సృష్టి చేశాడంటావు. నువ్ కూడా ఏదైనా చేయి. ఆయన పేరులాగే నీ పేరు నిలబడుతుంది. లేకపోతే అందరిలాగే పాఠకుడిగా ఉండిపోతావు అన్నారు. అదీ నా మనసులో నాటుకుపోయి ఏం చేయాలి అనుకున్నాను. ఏవేవో ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఈలోగా ఒకరోజు తెల్లవారుజామున ఐదింటికి అప్పయ్య శాస్ర్తీగారు వారింటికి తీసుకెళ్లి క్లుప్తంగా యతి అంటే ఏమిటి? ప్రాస, గణం లాంటివి కొన్ని చెప్పారు. అంతకు ముందు నేను రాసిన కీర్తనలు పరిశీలిస్తే తప్పులు లేవని గ్రహించాను. ఆ తర్వాత 72 మేళకర్తలలో కీర్తనలు రాశాను. ఇది వరకున్న కీర్తనలలో కవిత్వ దారిని తక్కువ సంగీతం ప్రధానంగా పెట్టి మాటల్లో పాడాలి గనుక కవిత్వం ఉండాలని అనిపించి దాని మీద దృష్టి పడి నా పాటలో ఒక మెరుపు సాహిత్యంలో, కవిత్వంలో రాగంలో ఉండేలా చూసుకున్నాను. ఇదివరకు ఎవరు పాడిన రాగమైనా ఒక పాడని సంగతి ఉంటుంది నా పాటలో… ఆ విధంగా రాసుకుంటూ వచ్చాను.’’

************************

పల్లకిలో…
శిష్యులు, పరోక్ష ప్రత్యక్ష శిష్యులు వేలకు వేలు ఉన్నారు. ఇతర దేశస్థులు కూడా. వారిలో ఒకరిద్దరు ప్రిన్స్ వర్మ, మోహనకృష్ణ యోగ్యులు. వీరి శిష్యులలో కళలకు పుట్టినిల్లయిన విజయనగరానికి చెందిన గంటి మురళి ఆత్రేయ స్మారక కళాపీఠం తరఫున నిర్వహించిన సభలో.. బాలమురళిని ముత్యాలతో అలంకరించిన పల్లకిలో ఊరేగింపులో కళాశాల బాలికలు, యువతులు మోయడం విశేషం.. అంటారు. ఆ పల్లకి చూసి బాలమురళి అవాక్కయ్యారట. ఆనంద భాష్పాలు వచ్చాయట. సీతాకోక చిలుకలల్లే ఆడపిల్లలు ముందుకొచ్చి పల్లకీ మోయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తన జీవితంలో మరపురాని ఘటన అన్నారట.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937)

వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో  62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు –

‘’నిర్బీజాది సమాధి స౦ స్థితపాదం నీవార శూకోపమం –నిష్పాపం నిగమాంత వేద్య నిలయం నిర్లేపకం నిర్గుణం

నిర్ద్వంద్వం నిరుపద్రవాత్మక పదంనిర్వాణ దీపం  నిజం –బ్రహ్మానంద సరస్వతీ గురు పదం మోక్షప్రదాం భజే ‘’

రెండవ రచన –‘’శ్రీ దత్త పూజా గీత కదంబం ‘’లో దత్తాత్రేయ స్వామి పూజా విధానాన్నిపాటలతో శ్లోకాలతో  వివరించింది ..వివిధ రాగాలతో తాళాలతో అందులో 42 గేయాలున్నాయి .మధ్యమావతి రాగం జంప తాళం లో రచన –

‘’లాలీతి జగురమర లాలనాస్త్వాం దత్తా-నారదస్త్వేకదాశ్రీ బ్రహ్మ సదసి –లోహ చణా౦కాభ్యూష పాక పరిశీలా –అత్రిజాయపతి వ్రతేతి ప్రససం’’

1926లో ‘’శ్రీ శంకర భగవత్పాదాచార్య పూజా విధి ‘’రచించింది .ఇందులో షోడషోపచార పూజా విధానం ఉన్నది .చివరికి శంకరాచార్య పై అస్టోత్తరం రాసింది .ధ్యాన శ్లోకం –

‘’భాష్యం వామకరే నిధాయ పరతిస్చిన్ముద్రయా బోధితం –ప్రాక్కుండీవరదండ శిష్య సహితం పద్మాసనస్తం ప్రభుం –ఫాలె భస్మధరం సుధాకర నిభం రుద్రాక్ష హారాన్ గలే-శ్రీమచ్చంకర పూజ్య పాదమనిశం ధ్యాయామ్యహం సద్గురుం ‘’

ఇవి కాక అనేక దేవీ దేవతలపై స్తోత్రాలు రాసింది. ‘మహా గ్రహ గాయత్రి ‘’పై పుష్పమాలికా బంధం ‘’రాసింది –

 

హంసస్తాం సత్య సందామ గజగ నిగమ దారతాస్వరస్తాం-గాయత్రీం యజ్నయజ్నాం సురనర వరదాం పంకజం కంబు కంఠీ౦

సావిత్రీం విశ్వ విద్యాం శ్రుతిమతి గతిదాం దేవా సౌవర్ణ వర్నాం—వందేహం దేవ దేవీం విమల మణి మయీం కుంద సౌందర్య దంతం ‘’హనుమాయమ్మ బంధ కవిత్వంలోనూ నిష్ణాతురాలని ఈ శ్లోకం తెలియ జేస్తోంది .

97-పిల్లల మర్రి వేంకటపతి సూరి

‘’రాజేశ్వరవిలాస మహాకావ్యం’’ రాసిన పిల్లల మర్రి వేంకటపతి సూరి నాగ లింగ సోమయాజి కుమారుడు .కౌశిక గోత్రం .దీనిని భాగాపురం అంటే హైదరాబాద్ వాసులు బ్రాహ్మణ దంపతులైన గౌతమ గోత్రీకులు లక్ష్మీనారాయణ  నాగమాంబ లకుమార్తే  మహా రాజ్ఞి రాజేశ్వర భూపతికి అంకితమిచ్చినది .మహా కావ్యమనే పేరేకాని ఇది అలంకార శాస్త్రం .అందులో 12పత్రాలేఆచార్య బిరుద రాజు వారికి లభించాయి .అవికూడా వరుసలో లేవు ..దొరికిన దానిలో  వంశ ప్రకరణం అలంకార ప్రకరణం న్యాయ ప్రకరణం ఉన్నాయి .మొదటి అధ్యాయం లో మొదటి  అంకం అన్నాడు  ఇది నాటకానికి వర్తించేది .కద విషయానికి వస్తే

సాకేత రాజసోదరులు  నిజాముల్- ముల్క్ చేత ఓడింప బడ్డారు .రాజ సోదరుల పౌరుష పరాక్రమాలను బాగా వర్ణించాడు కవి –

‘’సూరాస్సాహసికా స్త్రయసమానాధిక ప్రావీణ్య వంతో ధను –ర్విద్యాయాం రాజ వాజీ రాజిస్త సంపత్తి ప్రశేనాశాతాః

సాకేత నగరే వినోదాన కదాలాపోర్నిశా యాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయన్యధ్యాదితేయద్రుమాః’’

తరువాత యువరాజు రాజేశ్వరుని అతని భార్యను వర్ణించాడు .అలంకార ప్రకరణం లో ఉపమాలంకారం తో ప్రారంభించాడు .సంబందాతిశయోక్తి వర్ణన చేశాడు .చివరిది న్యాయ ప్రకరణం

హైదరాబాద్ భాగ్యనగరంగా లేక భాగ నగరం గా ఉన్నప్పటి రచన ఇది .ఈ వంశపు మొదటి రాజు నిజాముల్ ముల్క్ .

98-చెన్న మాధవుని వెంకట రామ రాజు (1840-1910)

యల్లమ రాజు అని పిలువ బడే వెంకట రామ రాజు భరద్వాజ గోత్రానికి చెందిన పెరుమాళ్ళురాజు  కొడుకు .1840లో వరంగల్ జిల్లా బచ్చన్నపేట లో పుట్టి 1910లో మరణించాడు  క్రిష్ణభక్తుడు కనుక ఆఊరిలో గొప్ప కృష్ణాలయం నిర్మించాడు .ఆలయం లోని పల్లకీ వంటివి నిజాం రాజు కానుకగా అందించాడు .రాజు మంచి గుర్రపు రౌతు .కత్తి బల్లెం ఉపయోగించటం లో గొప్ప లాఘవం ఉన్నవాడు .సైన్యాధికారి నుంచి కత్తి లాక్కొని చేతిలోని బల్లెం ఆధారంగా పోల్ వాల్ట్ లాగా కోట లోకి దూకాడని కధలు గాధలు చెప్పుకొంటారు .’’సూర్య నారాయనియము అంటే చంపు  ‘’రాశాడు తెలుగులో కేశవ శతకం చేశాడు .-కొన్ని మచ్చుకి –

‘’శ్రీరామః ప్రదిశోచ్చమం స భవతాం హంస స్తుతో ద్వాధ్వాశాః –సత్యానంద కరస్సుర గవరడో గోరాజ సంసేవితః

కృష్ణోననంత మనోజ్ఞా భోగ రుచిరా సాద్ధర్మ భ్రుద్విగ్రహః –భానీరేజ పదస్తితౌ బుధ గురు స్సంస్తుత్య దామాధవః ‘’

దేవతా స్తుతి –

‘’విద్యాప్రదం సురజ్జేస్త పూజితాంఘ్రి పయోరుహం –ప్రత్యూహద్వా౦త సప్తశ్వాం నమామి హయ కంధరం ‘’

కదా ప్రారంభ శ్లోకం –‘’పరేరయోధ్యా మధురాచ మానవే రస్తి ప్రపూర్నా వాసు సన్చయయాఐర్యుతా –సుహస్తి జాతేతిపురీ మహోజ్జ్వలా భాసాల దుర్గేశ్చ విరాజితా భువీ ‘’

99-వీటూరి వెంకట రామ శాస్త్రి (20శతాబ్దం )

భారద్వాజ గోత్రీకులు పద్మాంబ ,నాగేశ్వర శాస్త్రి ల కుమారుడు రామ శాస్త్రి .శ్రీకాకుళం జిల్లా యలమంచిలి తాలూకా కోరుప్రోలు వాసి .20వ శాతాబ్దప్రారంభం వాడు .వేదశాస్త్ర పండితుడు. తెలుగు సంస్కృతాలలో కవిత్వం చెప్పాడు .ఉర్లాం వేద పరీక్షలలో ఎన్నో బహుమతులు ,సత్కారాలు పొందాడు .జ్యోతిష  శాస్త్ర౦ లోనూ  దిట్ట .సంస్కృతం లో ‘’హరి స్తోత్రం ‘’రాశాడు .హైమవతీపరిణయమూ రాశాడంటారు  కాని అలభ్యం .-

‘’శ్రస్తా కైశ్యాదివ జలధర్రాత్తస్తతో నేత్ర యుగ్మం –మాటసా ద్వంద్వ త్తవను చ దశాత్మ ధారా సా విరేజుః

100-చెరుకూరి వెంకట రెడ్డి శాస్త్రి

రెడ్డి శాస్త్రిగా పేరున్న చెరుకూరి వెంకట రెడ్డి శాస్త్రి వేంకటకవి వెంకాంబ ల పుత్రుడు .నడిమింటి సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు ,అల్లుడు .గురువుగారితో  మంత్రం శాస్త్ర వ్యాకరణాలలో సమాన పాండిత్యం ఉన్నవాడు .శాస్త్రిగారమ్మాయి విశాలమ్మను వివాహమాడి అల్లుడయ్యాడు రెడ్డి శాస్త్రి .ఇక్కడ రెడ్డి అనేది గౌరవ వాచకం ..

రెడ్డి శాస్త్రి సంస్కృతం లో ‘’గీతా గిరీశం ‘’ను గీత గోవిందం మాదిరి రాశాడు .ఉమామహేశ్వరుల ప్రణయ లీలా వృత్తాంతమే ఇది .దీన్నీ శిష్యుడు జయంతి కామేశం ముద్రించాడు .-కొన్ని శ్లోకాలు –

‘’ఇక్షు గ్రామ కులాగ్రయ వెంకట కవేః పుత్రః పవిత్రః కృతీ –వెంకమామ్బోదర శుక్తి   మౌక్తిక మణిరశ్రీ వెంకటార్యస్సుదీః

చక్రే గీత గిరీశ కావ్య మధునా యో గీత గోవింద కృత్ –ప్రాగాస్సీజ్జయదేవ ఇత్యాభిదాయా లీలాం శివస్యోజ్వలాం ‘’

చివరి శ్లోకం –

మణి కాచవత్ప్రసిద్దో జయ దేవ గ్రంధ మత్కృత గ్రందో –మద్గ్రందోదార్య స్సయాదాదునికై రర్ధ గౌరవా భావాత్ ‘’

ఇదికాక ‘’శైవ శతకం ,నవగ్రహాస్టకం’’లతోబాటు కొన్ని చాటువులు కూడా రాశాడు .-రుచికి కొన్నిచాటువులు – ,

‘’మానస గోపాలేశం భజనా క్ర్యశ్రయోపి గోపాలేశం –యస్మిన్ గోపాలేశం ప్రాపర్షి గణ శి స్శ్రాయో పిగోపాలేశం ‘’

రవయోరి శైల పవయే తమోపహ చ్చవయేరూపాయ కవయే నమోస్తుతే –న వయేత్ సర్వ శివాయేన సంయుత ద్రువయోడితాత్మ భవ యేశ శోభయా ‘’

పంచ దశి స్త్రోత్రం లో రెడ్డి శాస్త్రి మామగారి శ్లోకానికి పూరణ చేశాడు –సరదాగా మామా అల్లుళ్ళ సవాల్ చూద్ద్దాం –

మామ సర్వమంగళశాస్త్రి –‘’సవిదా ద్దితయ సమత్వం రంభాయుగలస్య సంభావత్యేవ –ఊర్ధ్వా ముదన్చిత మూలం తద్యుగలం చేహ్వ ర్హీనాం ‘’

దీనికి అల్లుడు రెడ్డి శాస్త్రి గారి పూరణ – అంబ తవోరుద్వి తయ౦ రంభాయుగమేవ జఘన పులినో త్ధం-వేణీ యమునా వేగా  దధరీకృత మపి చ సంహ తచ్చదనం ‘’.

తులసిగురించి చెప్పిన శ్లోకం –

‘’తులసి చత్వరే భాతి కలశీకృత తమ౦టపే –కు లసీమంతి నీదత్త జలశీకర వర్దితా ‘’

సమకాలీన కవి గొర్తి సాంబ మూర్తి పార్దివలింగం తో శివార్చన చేసినప్పుడు మామా అల్లుళ్ళు కలిసి చెప్పిన శ్లోకం –

 

‘’శ్రీ గొర్తి సాంబ మూర్తేః కోర్తిః కార్తిక యుడు స్ఫురన్మూర్తిః –నర్తి తమార్తిక మూర్తే సార్తహరాల్లబ్ద కామ సంపూర్తేః’’.

101-శతావధాని వరుకూరు వెంకట శాస్త్రి (19-20శతాబ్దం )

పూర్వపు నిజాం పాలనలో గుల్బర్గా జిల్లాలో సూరాపురం లో జన్మించి బేదార్లు అనబడే తెలుగు నాయక రాజుల కాలం లో 19శతాబ్ది చివరనుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు జీవించాడు వరుకూరు వెంకట శాస్త్రి .కవి సార్వ భౌమ బిరుదాంకితుడు. తెలంగాణా ప్రభువుల ప్రాపకం లో వృద్ధి చెందాడు .అనేక శతావధానాలు చేసి శతావధాని అయ్యాడు ..సంస్కృతం లో ‘’పాండవాశ్వమేద చంపు ‘’రాశాడు .శరత్  ఋతు వర్ణన-

‘’శారదారంభ విలోల శుభ్ర జల దవ్రాతా౦త రేషు స్ఫురత్ –హరి నీల ప్రతిమాన సూక్ష్మ జలముకపంజాః పరం  జజ్జలుః

కల శంభో నిదివార్ధితేషువిపులేషూర్మి వ్రజేషు స్థితా –రమణీయా ఇవ వారిజాసన గురోశ్యామా అభి వ్యక్తితః ‘’

102-శత జిత్ కవి (1770)

వెంకట పండితుని కొడుకు ,వీరరాఘవుని మనవడు శత జిత్ కవి .భరద్వాజ గోత్రం గూటాల కు చెందిన సామసాఖ వాడు. గోదావరి జిల్లా పట్టి సీమ లో ఉన్నాడు .’’శృంగార సంజీవన భాణం’’రాశాడు .దీనిని ఏలూరు సంతాన గోపాల స్వామి చైత్రోత్సవాలలో ప్రదర్శించేవారు .నూజివీడుప్రభువు మేకా వెంకట నృసింహ అప్పారావు ఆస్థాన కవి .దీన్ని 24-7-1797న రాశాడు .కనుక కాలం 1770అవచ్చు .ప్రారంభ శ్లోకం –

‘’యద్వక్ష రసజ్నదారాణాం యన్నాభిః సూతికాగృహం –పుత్రజ్ఞయా భవాత్కి౦జిత్తేజోస్తు చ సతాం ముదే’’

ఉపోద్ఘాతం లో పూర్వీకుల చరిత్ర చెప్పుకొన్నాడు .కవిపూర్వీకులు తమిళులని ,గోదావరిజిల్లాకు వలస వెళ్ళారని గూటాలలోగూటం లాగా పాతుకు పోయారని ,తండ్రి తమిళుడు ,తల్లి ఆంద్ర అని ,తెలుగు సంస్కృతాలలో పాండిత్యం ఉన్నదని ,కనుక తనకు తమిళం రాలేదని చెప్పాడు .కవి వారసులు ఇప్పటికీ గూటాలలో ఉన్నారు ..

నాలుగవ గీర్వాణ౦ సర్వం సంపూర్ణం

మనవి –గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 వ భాగం దీనితో సంపూర్తి .దీనికి ఆధారం ముందే చెప్పినట్లు కీ శే ఆచార్య బిరుదరాజు రామ రాజు గారు ఇంగ్లీష్ లో రచించిన ‘’కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టుసాంస్క్రిట్ లిటరేచర్ ‘’అని మరొక్క మారు మనవి చేస్తున్నాను .అందులో ఇంకా రాయాల్సిన కవులు కొందరు మిగిలిపోయినా ఈ 102మందితో ఆపేస్తున్నాను .ఇందులో కవి రచనలు అన్నీ రాజు గారు యధాతధంగా నాగర లిపి లోనే రాశారు ..నాకున్న సంస్కృత పరిజ్ఞానం అత్యల్పమైనది .కొంతలోకొంత హిందీ వచ్చుకనుక ,మా తండ్రిగారు మృత్యుంజయ శాస్త్రిగారు మాకు సెలవులలో కుమారసంభవ శాకు౦తలాలు సంత చెప్పారు కనుక ఏదో మిడి మిడి జ్ఞానం తో ఆ  సంస్కృతాన్ని అర్ధం చేసుకొని కూడబలుక్కుని చదివి  ,తనువూ మనసు ఏకం చేసి అతి ప్రయాసపడి  తెలుగు లిపి లో రాశాను .నికి పూర్తి న్యాయం చేశానని నేను అనుకోను .నా అవగాహనా లోపం కొండంత ఉండవచ్చు .కాని నా పూనిక స్వచ్చమైనది కనుక లాగించేశా .ఇందులో దోషాలన్నీ నావి గుణాలన్నీ ఆచార్య బిరుదరాజు వారివి అని మరొక్కమారు వినయంగా తెలియ జేస్తున్నాను .ఈ పుస్తకాన్ని నాకు సద్గురు శివానందమూర్తిగారి కుమారులు శ్రీ బసవరాజు గారి నుండి తెప్పించి అందజేసిన నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఋణం తీర్చుకోలేనిది .వారికి కృతజ్ఞతా శతం .

మొదటి గీర్వాణం లో -146 మంది కవుల గురించి రాసి ,ఈ మన్మధ ఉగాదికి ముద్రించి శ్రీ మైనేనిగారికి అంకితమిచ్చి ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిందే .శ్రీ మాడభూషి క్రిష్ణమాచారియార్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’ను కొని నాకు పంపించి చదివి౦పజేశారు మైనేని వారు .దీని  ఆధారం గా రెండవ గీర్వాణం అంతర్జాలం లో రాయటం ప్రారంభించి 254మంది సంస్కృత కవులపై రాయగలిగాను .అంటే రెండుభాగాలలోని మొత్తం కవులు 400అయ్యారు .అవధాన సరస్వతి ,ఆత్మీయులు శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ‘’సంస్తూయం ‘’పంపారు .దీనిలో స్వాతంత్ర్యానంతరం  ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాల కవులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ ఉంది .దీన్ని ఆధారంగా చేసిమూడవ గీర్వాణంమొదలు పెట్టి  118మంది గీర్వాణ కవుల గురించి రాసి సంఖ్యను 518కి చేర్చాను .నాలుగవ గీర్వాణం లో 102మంది సంస్కృత కవుల గురించి రాశానని ఇంతకూ ముందే పై పేరాలో తేలియ జేశాను .అంటే దీనితో సంఖ్య ‘’620 ‘’అయిందన్నమాట .ఇందులో కొందరు కవులు పునరావృత్తం గా వచ్చారు .వారి వివరాలు అప్పుడు వారి జీవిత చరిత్రలు అసంపూర్తిగా లభించికాని ,లేక నేను రాస్తున్నహదావిడిలో రిపిటీషన్ పట్టించుకోక కాని జరిగి ఉండచ్చు .అందుకని వారిని సుమారు 20మంది గా లెక్కించి తీసేసినా  నికరంగా 600మంది కవులపై రాసిన అదృష్టం నాకు  దక్కిందని భావిస్తున్నాను. నిజంగా ఇదొక బృహద్ద్గ్రంధం గా వెలువడాల్సిన అవసరం  ఉంది .పుస్తకరూపం గా వస్తుందనే ఆశతో రాసింది కాదని మనవి. నా సంతృప్తి కోసమే రాసింది .వీరి గురించి రాయాలికనుక రాసినవి .అంతే.

అంకితం –మొదటి భాగాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి వారికి తెలియ కుండా ఆన్ లైన్ గా  అ౦కితమిచ్చాను .ఇప్పుడు కూడా ఈ మూడు గీర్వాణాలలోని474మంది గీర్వాణ కవుల గీర్వాణాన్ని మళ్ళీ వారికి తెలియకుండా వారి అనుమతి కోరకుండా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికే మనః పూర్వకంగా  ఆన్ లైన్ గా అంకితమిస్తూ ,నా ఈ సాహసాన్ని  మన్నించే విశాల హృదయం వారికి ఉందని భావిస్తూ ,వారికంటే అర్హులు లేరని పూర్తిగా నమ్ముతూ ,వారి అంగీకారాన్ని అర్ధిస్తున్నాను .వారి సౌజన్యం మహా దొడ్డది .అంతటి వారు నాకు మహా మిత్రులైనందుకు అది నా అదృష్టంగా భావిస్తాను .

రెండవ గీర్వాణ౦ తర్వాత పరిచయమైన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి గారిచ్చిన ప్రోత్సాహం మరువ రానిది .ఎందరో మహా కవుల గురించిన వివరాలు, వారి జీవిత చరిత్రలు ,వారి ఉద్గ్రంధాలు నాకు  పంపి చదవ జేసినఆత్మీయులు .ఎందరో కవుల ఫోన్ నంబర్లు ఇచ్చి  వారితో మాట్లాడే అవకాశం కల్పించి ,వారి దర్శన భాగ్యమూ కలిగించిన సహ్రుదయులుశ్రీ శాస్త్రిగారు .’’ప్రసాద్ గారూ !మేమెవరం చేయలేని గొప్ప సాహసాన్ని చేసి ఇంతమంది కవుల గురించి రాస్తూ ,అందరికి అందుబాటుగా చేస్తూ చరితార్ధత సాధించారు .మిమ్మల్ని చూస్తే మాకు గర్వంగా ఉంది ‘’అని ప్రోత్సహించిన వారి సౌజన్యం మరువ రానిది .

మరో మనవి – ఈ మధ్య డా .రామడుగు వెంకటేశ్వర శర్మగారితో ఫోన్ లో మాట్లాడి గీర్వాణంఅభ్యుదయాన్ని వారి చెవిన వేసినపుడు మహా సంతోషించి ‘’అయ్యా దుర్గాప్రసాద్ గారూ !గీర్వాణం రెండవ భాగం ఎప్పుడు ముద్రిస్తారు ?’’అని ఆసక్తి కనబరచారు .అది అంత తేలికైన పని కాదని వినయంగా చెప్పాను .అయినా నా మనసులో ఒక భావన ఉంది .ఈ 474మందిలో పూర్తి జీవిత చరిత్ర ఉండి,వారి రచనలపై సమగ్ర విశ్లేషణ ఉన్న వారిని ,అటు పూర్వకవుల నుండి ఇటు ఆధునిక కవుల నుండి ఎంపిక  చేసి అన్ని రచనా ప్రక్రియలు అందులో ఉండేట్లు చూసి ఒక 200మంది’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2’(’రెండవ భాగం) గా తెస్తే బాగుంటుంది అని .దీనికి ముందుకు వచ్చేవితరణ శీరులైన  సహృదయ ప్రాయోజకులు  (స్పాన్సర్స్) ఎవరైనా ఉంటె తెలియ జేయమని సరసభారతి సహృదయ ఆహ్వానం పలుకుతోంది .

ఇప్పటిదాకా నన్నూ ,సరసభారతిని ఆదరించి ప్రోత్సహించి న సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు భారత గణ తంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను .-

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

వడ్లమాని  సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని ధూమ శకట తీర్ధ యాత్ర చరిత్రం ‘’అనే యాత్రా సాహిత్యాన్ని సంస్కృతం లో రాశాడు .మద్రాస్ ప్రెసి డెన్సిలో కవి చేసిన రైలు యాత్రా విశేషాలన్నీ  గుది గుచ్చాడు .ఇందులో 28౦ శ్లోకాలున్నాయి .అందులో 17తన ఇష్టదేవత శ్యామలాంబ మీద,గురువులపైనా  రాశాడు .మిగతాదంతా రైలుయాత్రా  సాహిత్యమే .తన గురువులైన కిలాంబి రామానుజాచార్య ,పరవస్తు రామానుజ స్వామి ,గుడిమెల్ల వరదా చార్య ,మహా మహోపాధ్యాయ తాతాసుబ్బరాయ శాస్త్రి వాదూల వెంకట రామ ,భావనారాయణ ,కోపెల్ల విశ్వనాధ ,పేరి లక్ష్మీనారాయణ ,నగుదూరు వెంకట శాస్త్రి ,గంటి సూర్య నారాయణ శాస్త్రి ,పేరివెంకట శాస్త్రి ,అప్ప్ల జోగన్న శాస్త్రి ,ఆకొండి వెంకట రత్న శాస్త్రి గుమ్ములూరి సత్యనారాయణ గార్లను స్తుతించాడు .కవిని ఈకావ్యం రాయమని సోమనాధుడు కోరాడని చెబుతూ –

‘’సుప్రాచ్యా విద్వాద్గురూదోసి జాతు దేవాది సంస్థాన సు పండితోస్మి –ప్రతస్తివాన్ తద్విభునా కదాచిత్ సమస్త తీర్దాటనమాప్యకార్షాః

త్వట్టీర్ధ యాత్రా చరితం సమస్తం గీర్వాణ భాషా మవలంబ్య సాదు –నానావిదై వ్రుత్తవరేస్సుబద్ధం సమస్త సంస్థాన చరిత్ర యుక్తం

భూగోళ శాస్త్రాన్విత దేశ వృత్తం వ్రుత్తాంతం పూర్వ కవీశ్వరాణాం –సర్వం స్వభావోక్తి యుక్తం సురమ్యం గ్రంధం కురుష్వేతి చ మామవాదీత్ ‘’

ఈ రైలు యాత్రను తన రాజు బాలసూర్యారావు బహద్దర్ తో కలిసి మద్రాస్ ప్రెసిడెన్సి మైసూర్ రాజ్యం నిజాం రాజ్యం సందర్శించారు యాత్ర 1924లో దేవిడిలో ఎడ్లబండ్ల మీద ప్రారంభమై ఉర్లాం స్టేషన్ కు చేరి ,అక్కడినుండి ఈ విధంగా సాగింది –

‘’కల్లోల్లోలసితం సుసంక్రమ యుతాంతాం వంశ దారానదీం –తీర్త్వా వాయు జవేన ధూమ శకటోగత్వా సుందరం తతః

తచ్చీకాకుల మార్గ ధూమ శకటాస్థానం త్యతీత్య ధ్వనన్ –ప్రావి క్ష ద్బలరామ లాంగల కృతాంనాగావళీ సంనిదీం ‘’

దారిలో పొందూరు ,విజయనగరం ,రాజమండ్రి,నెల్లూరు ,బెంగుళూరు శ్రీరంగ పట్నం ,మైసూర్ మదురై ,కంచి వరంగల్ లను చూస్తూ ప్రయాణం సాగింది .వరంగల్ శిదిలావస్తను కవి కళ్ళకు కట్టించాడు –

‘’అహో దుర్గామిదంసుజీర్ణ మభవత్  శ్రీ వీర రుద్ర ప్రభో –ప్రాసాదాస్సకలా నిపత్య వాసుదా భాగే నిమగ్న భ్రుశం

ద్రష్టవ్యాని చ తోరణాని సుశిలా బద్వాన్య ఖండాన్యహో –దుర్గేస్మిన్ కిల భాంతి పశ్యయత నిరాలంబాని సప్రేక్షకాః’’

అని మహోన్నత కాకతీయ వైభవ౦ పతనమైనందుకు కలత చెందాడు .రైలు యాత్రా బృందం మళ్ళీ దేవిడీ చేరింది –చివరగా –

‘’క్రిష్ణారయో జనకః సహోదర వరో రామాహ్వాయాశ్శా బ్దికః – -సూరామ్బా జననీ ప్రసిద్వాలసితా శ్రీ శ్యామలామ్బా స్వసా

శ్రీమద్వేంకటనారసింహ మహిళా భార్యా కవేర్యస్య తత్ –శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి రచితా సంపూర్ణ మగాత్క్రుతిః

ఈకావ్యం సంస్కృత చరిత్రలో ఏకైక సమకాలీన యాత్రా సాహిత్యం గా నిలిచి పోయింది .

92-కర్ణ వీర నాగేశ్వర రావు

తెలుగు సంస్కృతం హిందీ లలో గొప్ప పండితుడు కర్ణ వీర నాగేశ్వర రావు .గుంటూరు జిల్లా వేటపాలెం వాసి .తెలుగులో చాలా రాశాడు సంస్కృత రచనలు –సంస్కృత వాచకాలు అయిదు భాగాలు ,స్వాతంత్ర్య సందేశం ,వాణివీణ,మృత్యుంజయ తారావళి ,చండికా తారావళి ,శ్రీ వెంకటేశ్వర తారావళి ,పొట్టి శ్రీరాములు బలిదానం జాతీయ గీతం ,రెండుభాగాలు ,కదామంజరి ,వాణీ నిబంధన మణిమాల ,టాటా సుబ్బరాయ శాస్త్రి ,వజ్ర పాతం ,సంస్కృత పత్రావళి మొదలైనవి .వీటిలో చివరివి గద్య రచనలు .-కొన్ని

‘’శ్రీకరః సంస్క్రుతాకారః దయా పేతో గుణాన్వితః –పరబ్రహ్మా జగత్కర్తా ,రాక్షతాం సంస్కృతం సదా ‘’

సాహాయ్యం కురు సర్వేషాంసాహాహైం సత్ప్రవర్తనం –సాహాహ్య జీవితెన్నైవ దృశ్యతే సంస్థితం జగత్

మఖార్య రక్షణం మత్వా నిజ భక్తాన్ ప్రబోదయ –నేత్ర యుక్తా హృప్రకాశా మాం పాహి గరుడ ధ్వజా ‘’

93-లక్కా వజ్ఝాల వెంకట కృష్ణ శాస్త్రి –(1827లేక 1887)

సుబ్బమ్మ ,సుబ్బయ్య సిద్దా౦తిల పుత్రుడు వెంకట కృష్ణ శాస్త్రి .కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కురుమద్దాలి లో 25-5-1887లేక 16-5-1827జన్మించాడు పామర్రులో స్థిరపడ్డాడు సాహిత్యం తో బాటు న్యాయం వేదాంతం జ్యోతిషాలను మధించాడు .ఈ శతాబ్ది చివరి కవులందరూ ఈయన శిష్యులే .ఆంధ్రా బరోడా రాజాస్థానాల సత్కార గౌరవాలు అందుకొన్న ఘనుడు..సంస్కృతం లో ‘’స్తోత్ర కదంబం ‘’,శ్రీరామ స్తవమాల ,కదామంజరి ,వైఖానస మీమాంస ,ప్రశ్న కల్పతరువు రాశాడు .హైమవతీ పరిణయం కూడా రాశాడని అంటారు .

94-వేముల కొండ వెంకట నారాయణ (1866)

భారద్వాజ గోత్రీకుడు వేములకొండ కోనయామాత్య కుమారుడు వెంకట నారాయణ 1866లో విశాఖ లో జన్మించాడు పూనాలో సంస్కృతం ఇంగ్లీష్ చదివాడు .మధురంగా సంస్కృత కవిత్వం చెప్పటం అలవాటై చాలా రాశాడు .21ఏళ్ళ వయసులో ‘’పద్మినీ చంద్ర సంవాద౦’’ను 263శ్లోకాలో రచించిన ప్రతిభ ఉన్నవాడు. 12 .ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ వివరణతో ప్రచురితమైంది  .పద్మానికి చంద్రునికి జరిగే సంభాషణ ఇది .ఒక ప్రశాంత వెన్నెల రాత్రిలో పద్మం ముకుళిత మై విచారంగా ఉండటం చంద్రుడు చూసి ,ఆమె బాధను పోగొట్టటానికి మాటలతో రంగం లో దిగాడు .చంద్ర ప్రవర్తన నచ్చని పద్మం ఏవ గి౦చు కొంటు౦ది .ఆమె మనసును గెలువలేక పోయిన చంద్రుడు ,హంసలా మారు వేషం లోవచ్చి బలవంతంగా ఎత్తుకు పోతుంటే రక్షించమని పద్మ బాంధవుడు సూర్యుని ఎలుగెత్తి పిలుస్తుంది .సూర్యుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై చంద్రుని శిక్షిస్తారు .మొత్తం మీద చక్కని నీతిబోధక కధనం .సంభాషణలు రసవత్తరంగా చేశాడు కవి .మొదటి శ్లోకం –

‘’గీర్గాన వీణా కవితా రుతేషు ,మయూర హంసేషు పితమహాక్కే –సితారవిన్దేషు చ పుస్తకేషు ,విరాజమానేభ్య మయి ప్రసీద ‘’

అగ్ర కులాల హీన ప్రవృత్తిని చెబుతూ –

‘’యధాపి కేచిత్ త్ప్రభు తాధనాంద ఉపానసత్తాః పరదారాసక్తాః-కేచిచ్వ వ్ద్వద్గురు దండినస్య మిధ్యాప్రభావా న్దధియో వినీతాః’’

చంద్రుడు స్వంత డబ్బా కొట్టుకోవటం –

‘’జ్యోత్స్నా ప్రవాహేన జగత్కరోమి పీయూష ధారా భిరివా భి షిక్తం –ఉల్లాస యన్మన్మద చేస్టితాని ,సంభోగ సౌఖ్యానుభవాయ యూనాన్ ‘’

కైలాస శుభ్రా శామతలయమానాః భాస్మత్య శైవావయ యామనానః –తపోధనానం హృదయాయ మానాః వారాంగనా రమ్య హసా యమానాః’’

‘అంతఃపుర స్త్రీల వలననేచంద్రునికి వైభవం దక్కింది అని పద్మిని దెప్పి పొడిచింది    –

‘’విభ్రాజితాన్తః పురకామినీనాంరత్న ప్రభా భాసుర చంద్ర హారః –భూత్వా చరన్ పీన కుచాగ్ర భాగే తత్కంఠమాలింగ్యతదిపి శోభనం ‘’‘’.హంస రూపం లో చంద్రమాన్ పద్మినిని ఎత్తుకుపోయే సందర్భం –

రవి-సా స్యాన్నభో జలనిదౌ ప్రతి బిమ్బితాభూః-

లక్ష్మీ-కిం వా జయధ్వ జపటీసమరాన్గల నౌకా

రవి-హంసీ బిసం స కమలం కిముతోన్న య౦ తీ

సర-మత్పుత్రికాం హారతి జాన్త్రిక ఇందు చోరః ‘’

95-గోవర్ధనం వెంకట నరసింహా చార్య (1856-1935)

శ్రీవత్స గోత్రానికి చెందినా గోవర్ధనం వెంకట నరసింహా చార్య నల్గొండ జిల్లా మిర్యాల గూడ తాలూకా విభురం పేట నివాసి కాలం 1856-1935..తల్లి రామానుజమ్మ తండ్రి రామానుజా చారి .తెలుగు సంస్కృత పర్షియన్ భాషా ప్రవీణుడు .సంస్కృతం లో మట్టపల్లి లక్ష్మీనరసింహ స్తోత్ర నవ రత్న మాలిక ,తెలుగులో పంచ ముఖ హనుమస్తోత్రం రాశాడు .నవరత్నమాలిక 9శార్దూల శ్లోకాలు కలది .

‘’శ్రీ లక్ష్మీ భూమి నీలా ముఖాయువతి ముఖామ్భోజ దీప్తార్క బింబం –సాధ్యః ఖద్యోతమాలా నిభ మండి భ్రుద్వేమ దీప్యా త్కిరీటిం’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

86-రామ సూరి (19శతాబ్దం )

ఆత్రేయ గోత్రీకుడు  బొబ్బిలి కి చెందినకృష్ణ గోపాల కుమారుడు రామ సూరి .19వ శతాబ్ది మధ్య వాడు .13అధ్యాయాల గోపాల క్షేత్ర మాహాత్మ్యం ను బొబ్బిలి లోని గోపాల క్షేత్రం పై రచించాడు .ఈ క్షేత్రం గోస్తనీ –వేగావతి లమధ్య విలసిల్లుతోంది ..కధను భవిష్యోత్తర పురాణం నుంచి గ్రహించాడు .ముందుగా ప్రార్ధన శ్లోకం –

‘’శ్రీ లక్ష్మీశం శివ మజం రామం గౌరిం సరస్వతీం –ధ్యాత్వా గణానాధిపం ప్రణమ్య గ్రహనాయకం ‘’.క్షేత్రానికున్న పూర్వనామం గురించితెలియ జేస్తూ –‘’

తస్మాద్దుర్గ సుసంపన్నా పురీ దేశీయ భాషయా –బొబ్బిలీతి ప్రసిద్ధా సా దక్షినార్దేన భోగిలా ‘’

బొబ్బిలిని ఉజ్జయిని తో పోలుస్తూ –

‘’విశాలాయాం దుర్గ వతాచిక భాగేన నిశ్చితా-యదా చోజ్జయినీ సా స్యాంత దాసౌ బొబ్బిలీ పురీ ‘’

రచనా కాలాన్ని తెలియ జేస్తూ-వ్యయాబ్దాశ్వ యుజాంత మారవారే లిఖాదత్రిజః –గోపాల క్షేత్రమహాత్మ్యంరామసూరిస్సవయం కృతం .’’అంటే 12-10-1406 లేక 26-10-1886 అని తెలుస్తోంది .ఆరవారం మంగళవారం .

రామసూరి మరో రచన ‘’భావ మ౦జరి ‘’.మూడు అధ్యాయాలు సర్దా నీతికవిత్వం .-కొన్ని మచ్చులు –

శ్రీరామో మాధవ స్ఫూర్తిః పాయాన్నో భావ మంజరీం –చంద్రానాలోజ్జ లన్నేత్రం గాత్రం యన్న ప్రభాసతే ‘’-కొన్ని నీతులు –

‘’శరణార్ధి మనః పూర్తీ శరణ్య యేన భావేద్యాది –శోణాదామ సుధా దామ్నోనిర్ధమత్వం న కిం భవేత్ ‘’

‘’హంసానాం జలదద్వాన న్నాసకరం వరం –హృదస్త దంబు పూర్ణాహిపురా పద్మాశ్రియమ వహా ‘’

చివరి శ్లోకాలలో వేదాంతం ఉంది –‘’హ్రుదాంబుజే బిందు మరంద తుందిలేకళా రుచి స్ఫీత సుషుమ్నా మందిరే

స్ఫురన్మహా నాద వినోద మంబరం నమామి విశ్వంభర మిందిరా పతిం ‘’

87-కందుకూరి రామేశ్వర

కృష్ణాజిల్లా కళ్ళేపల్లి పార్వతీ పరమేశ్వర భక్తుడు కందుకూరి రామేశ్వరుడు ‘’పార్వతీ పరిణయ చంపు ‘’రాశాడు .కాలాదులు అలభ్యం .రెండు స్తబకాల అసంపూర్తి రచన .ప్రార్ధన శ్లోకం –

‘’శ్రేయః కరోతు సతతం మమ చంద్రమౌళేః పాదాబ్జ యుగ్మ మధసంజయ నాశ నిధ్వం

మేరేంద్ర ముఖ్య సుస్వందిత గీయమాన౦ చన్నానుక౦పిసమతత్వ దురంధారం తత్ ‘’

కవి వినయ విదేయతలను ప్రకటించుకొన్నాడు –

‘’కాహం విద్వాన్ గ్రంధ కర్తృత్వ బుద్ధిః జానన్ ద్విన్నాన్ యానికాని ప్రకుర్వే –నానా విద్యా భూషితానాం తధాపి గ్రంధం విద్వాన్మనుషాణాం మూదే చ ‘’

హిమాలయ వర్ణన –‘’హిమాలయో గోత్ర రాజశ్చతుస్సాముద్ర పర్వంత భువో మాన దండ ఇవ స్థితః –బభౌ స హిమవాన్రాజా కాంచీ కృతమ హార్నవః ‘’

తారకాసురుని చేత పరాభావిమ్పబ్డిన ఇంద్రుని దైన్యం –

‘’తారకాఖ్య కరవాల విభిన్న బాహు శాస్విభవాదిజితాశాః –తత్ప్రుతా ముకిలీకృత నేత్రా బ్రహ్మ లోక మగామన్ సురరాజః ‘’

88-కొర్ర పాడు లక్ష్మణ కవి

రామానుజ ,రమలపుత్రుడు కొర్రపాడు లక్ష్మణ కవి ..తాత తెలున్గార్య చేన్జి దైవంవిలాస కృష్ణ కావ్యం రాశాడు ..ఇందులోని మూడు స్తబకాలలో మొదటిది పూర్తిగా మిగిలిన రెండు అసంపూర్తిగా నాలుగోది చివరలేకుండా అయిదోది అసంపూర్ణంగా  ఉన్నాయి .జెంజి కృష్ణ రాజు ఆస్థానకవి కనుక ఆయనపై రాసిన శ్లోకం –

‘’తత్వ విరాసీ త్తత కౌతుక శ్రీర్విలాస కృష్ణో విహతిం చికేర్షుః-క్రుతాశ్రియం కృష్ణ నృపం విధాతుం ,స్వనామ భాజం ప్రధిత స్వచిహ్నం ‘’

పూర్వీకుల గురించి –‘’శ్రీ కోర్పాడు తెలున్గార్ధ తనూభావస్య రామానుజస్య తన యేన సమావరస్య –శ్రీ లక్ష్మణేన కవినా  జయతు ప్రణీతః క్రుష్ణానుజేన నవ కృష్ణ విలాస ఏషః ‘’

89-ఓరుగంటి లక్ష్మణ సోమయాజి (16శతాబ్దం )

ఓరుగంటి శంకర సోమయాజి  పుత్రుడు లక్ష్మణ సోమయాజి 12అధ్యాయాల ‘’సేతారామ విహార కావ్యం ‘’రాశాడు .ఓరుగంటివారు వరంగల్ ,కరీంనగర్ విశాఖ గుంటూరు జిల్లాలో ఉన్నారు .ఈకవి 16వశతాబ్దం లో వరంగల్ వాసి అయి ఉంటాడు .దీనిపై తత్సత్ వైద్యనాధ రాసిన ‘’చంద్రిక ‘’,అవసస్తి భగీరధ రాసిన ‘’తత్వ ప్రకాశ ‘’వ్యాఖ్యానాలున్నాయి .వీరిద్దరూ ఆంధ్రేతరులే కావటం విశేషం .మన సోమయాజి కవిమేదా దక్షిణామూర్తి ఉపాసకుడు .స్వామియే స్వయంగాకలలో మంత్రాన్నిచ్చి సాధన చేయమన్నాడు .కనుక తన రచనను ఆస్వామి దక్షిణా మూర్తియే రాశాడని వినయంగా చెప్పాడు .

‘’స్వప్నే సాక్షాత్క్రుతౌ యః ప్రధమ ముపా దిశన్ దక్షిణా మూర్తి మంత్ర౦ –పస్చాదాజ్నా పయంచ స్వమహిమ కలితం పంజరంయః పఠేతి’’

ఇదికాక యింకా 5రచనలు చేశాడు .’’కై యాటవివరణ అనే వ్యాకరణ గ్రంధం ,గీతారమ ,చమత్కార లహరి ,గీతామహేశ్వర ,అనే కవిత్వం ,న్యాయ శాస్త్రం పై ‘’సంగతి లక్షణ ‘’రచించాడు ఆంధ్రుడు కనుక కవిత్వం లో తెలుగుదనాన్ని చూపాడు .అయోధ్య వర్ణన –

‘’ఏ మాముపాస్చిత్య వసంతి సర్వే జానా ఇహముత్ర చ పాలనీయాః-ఇతీ బద్ధం పరిఖాచ్చలేన పాదే యయా కంకణామివ భాటి ‘’

అన్నం వార్చి ‘’వారుపన్నం ‘’వండటం చెప్పాడు –

‘’చిత్రం యాత్ర ప్రముగ్దా బహుతర ఖాదిరాన్గారబుద్ధ్యా మణీనాం—సాఘం నిక్షిప్య చుల్లయాం తదుపరి కలశే చంద్ర కాంతా వనేద్వే

తోయం జలాన్టారా లస్తిత శశి కిరణైర్వర్ధమానం హిరాత్రీ –దుగ్ధ్వా పాకర్య మేతత్ కలశ గత జలే తండులాన్ ప్రక్షి పంతి’’

కొన్ని చోట్ల శంకరాచార్యుల శివానంద లహరి లాంటి శ్లోకాలున్నాయి –

‘’ఇమాం సర్వం కలయ మమ సర్వోత్తమ విభో –సదాపూర్వం సుర వినుత చార్వంకి కమలం

స్థిరో భూత్వా తవ పదమ భీత్వా చ విహారే ‘’

కవిపై కాళిదాసప్రభావం బాగా ఉంది ,కన్పిస్తుంది .తెలుగులో రామరాజ భూషణుని వసు చరిత్ర ప్రవాహం లోనూ కవి కొంత దూరం కొట్టుకు పోయాడు .

చంద్ర వర్ణన –‘’రాజా దోషాకర ఖ్యాతో ,దోషాణామాక్రో హిసహః –పద్మినీ చక్ర కాన్తాశ్చ,బాధతే స్వోదయే యతః ‘’

సీతాదేవి నాసాభరణాన్ని చంద్రునితో బృహస్పతితో పోల్చటం మహాద్భుతం –

‘’సుహ్రుత్త బాహ్వో ర్వలయా ను రజ్జితా విశాల కేయూర యుగోజ్జ్వల ద్భుజః –నిశీధినీ చారి గురూపమోజ్జ్వల ద్విశా ద్వనా భరణేనభాసురా ‘’

90-మంగు లక్ష్మీ నారాయణ (1660)

‘’గంగావతార చంపు ‘’రాసిన మంగు లక్ష్మీ నారాయణ  1682-1689 ప్రాంత రాజైన మధుర రంగాదిపునికి అంకిత మిచ్చాడు .ఇందులో నాలుగు తరంగాలున్నాయి .మొదటి శ్లోకం-

‘’అవ్యడా వ్యాజ కారుణ్య భావ్యాయ తనతన్వయం –అధ్యాహతర మాసేవ్యమధ్యా హిత పదం మహః

శంతనుని పొగుడుతూ –‘’పితా  ప్రతీపోపి గుణే రనూనః  స్తుతోపి భీష్మః సుజనాగ్ర గణ్యః-బలాత్మికాపి ప్రమాదా తిమన్యేత్యహో మహాన్ శంతన భాగ్య సారః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

11th January 2016 పాడుతా తీయగా – వంశి పాడిన గబ్బిత వెంకట్రావు గారి పద్యం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

81-కిడాంబి రాఘవాచార్య

ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో సంస్కృతం లో ‘’కురుమూర్తి వైభవం లేక శ్రీనివాస పాదుకార్పణ నాటకం ,శ్రవణానంద ప్రేక్షణీకం ,మాణిక్య నగర వైభవ ప్రేక్షణీకం ,కోదండరామ ప్రతిస్టాపనాప్రేక్షణీకం,లక్ష్మీధ్యాన సోపానం ,లక్ష్మీ మంగళాస్తుతి ,అహోబిల గురు వైభవ స్తుతి ఉన్నాయి .

కురుమూరర్తి వైభవ నాటకం 6అంకాలు .మహబూబ్ నగర్ జిల్లా అమర చింత లో సంస్థానం లో ఆత్మకూరు రాజు రాజా రామ భూపాలుడు వజ్రాల పాదుకలను కురుమూర్తి గుట్ట పై వెలసిన శ్రీనివాసునికి సమర్పించటం కధ.శాంత రస ప్రధానం .ఇది దాదాపు శ్రవ్య నాటకం .1906లోకురుమూర్తిలో చిత్రోత్సవం నాడురాజు గారి పట్టాభిషేకమహోత్సవానికి  ప్రదర్శింప బడింది .ఈ నాటకం లో రాజు గారి బంధువులు పాత్ర దారులవటం విశేషం జమీందారి సమకాలీన చరిత్రను తెలియ జేస్తుంది .నాలుగవ అంకం లో మలయాళీలు గుజరాతీయులు ,అంగ వంగ దేశేయులు ఉంటారు .ఇది విశ్వ గుణాదర్శం లో లాగా ఉంటుంది .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .

‘’ఆత్రేయ వంశ కలశోదధీ శీత భాసా గోపాల నామ విబుధాగ్ర భువా సహర్షం –శ్రీ శ్రీనివాస బుధ వార్య తనూ భవేన శ్రీ రాఘవార్య విదుషా రచితప్రబందః ‘

కవి ప్రతిభకు గుర్తుగా నిలిచే శ్లోకాలు –

‘’ఆభాతి పంకజ ముఖీ సరసీమ్రుణాల శైవాలసైకత భుజాల కసంనితంబా –ఆవార్త నాభి రిహ మీనా పయోజ కేశా ,చక్షుఃపయోధర యుతావనితేవ లోకే ‘’

కురుమూర్తి శ్రీనివాస రధోత్సవ వర్ణన –

‘’యత్కామినీ ముఖ జిత రరాశభ్రుక్త్రు శాంగః –స్తప్యాత్ససౌ సుర ధునీ శతటేగిరీశే

జ్యోత్స్నాపి తస్మిత ధుతాభి ముఖం సిషేవే-నాసాగ్ర లోల నవ మౌక్తిక డింభ నామ్నా ‘’

లక్ష్మీ ధ్యాన సోపాన స్తుతి 10శ్లోకాల కావ్యం .

‘’ద్వంద్వే దేవ్యా రుచిరపదయోరున్మిషత్పంచబుదుధ్యా-రేలంబత్వం వహతి కుతుకాన్ మానసం మామకీనం

లక్ష్మీ మంగళస్తుతి 8శ్లోకాలు

82-రామ కవి

ఆత్రేయ గోత్రీకుడు రామకవి ‘’సిద్ధాంత సంగ్రహం ‘’రాశాడు .శివుడిని బ్రహ్మం గా భావించి రాసిన కావ్యం .నూజి వీడుప్రభువు శోభనాద్రి అప్పారావు ఆస్థానకవి .దీనికి బహుశా కవేవ్యాఖ్యానమూ రాశాడు .ప్రారంభ శ్లోకం –

‘’విద్వాత్కల్ప తరో విష్ణు సమారాధన తత్పరాత్ –దీనావన సమాసక్తా చ్చత్రుతాశానాత్

నూజి వీటి పురాధీశాచ్చోభానా ద్రప్పారాయతః –అనాయాసేన సంలబ్ద జీవన స్థిరసన్మతిః’’

శివుని గురించి వర్ణన –

‘’త్వమారాధ్యాశ్శంభో సహృదయ హృదయాకాశావివరే – తతో బ్రహ్మాదీనాం యదసి పరమం కారణామితి

శ్రుతిః స్తోతి త్వాతో సుమతి మఘమమ్యాహి కృపయా –న చేదేవం చాహం నరక భవనః స్యాం హర విభో ‘’

సోపద్రుస్టః పరబ్రహ్మ గురుం సిద్ధాంత సంగ్రహం –యువాద్ధ ఊర్జే రాకాయాం రామస్వామ్య లిఖత్ స్మరన్ ‘’

83-పుల్లెల రామ చంద్ర కవి

కవికాలాదులు తెలియవు కాని కౌండిన్య గోత్రీకుదని ‘’పౌలస్త్య రాఘవీయం ‘’రాశాడని తెలుస్తోంది. 20సర్గాలున్నాయి .రామాయణమే .పుల్లెలవారు అమలాపురం లో ఉన్నారు పుల్లెల శ్రీరామ చంద్రుడు గొప్ప సంస్క్రుతాచార్యుడు కవి విమర్శకుడు అని మనకుతెలుసు  ఏఎకవి వీరి తాతగారో లేక పై తరం వారో ?ఒక శ్లోకం

‘’వినాయకం పదసరోజ యుగం మునీంద్ర హ్రుత్కేర వైఘా విదు బిమ్బమహం భాజిశ్యే

విఘ్నౌఘ కుద్ర దలనే శతకోటి సారం సారం గిరామజ ముఖాబ్జ వినిస్సృత నాం’’

చివరి శ్లోకం –

‘’రఘుపతిస్య పంపాంవీక్ష్య చంచాత్తరంగాం-ధ్వనిమపి పీక శబ్ద౦ నీల కంఠోఘలాస్యం

మధుకర మదరావం తత్ర సంవీక్ష్య రామః –శృతి హృదయ వినోదాంనాట్య లక్ష్మీం సమేనే ‘’

బాలకాండ లో ఆరు సర్గలు  అయోధ్య నాలుగు ,అరణ్య నాలుగు కండలు కొన్ని బంధ శ్లోకాలూ రాశాడు .

84-చంపక రామ చంద్ర

వైకుంఠ పతికోడుకే రామచంద్ర ‘’సర్వమాన్య చంపు ‘’రాశాడు .చందాసాహేబ్ కు ఫతే సింగ్ కు మధ్య ఉన్న వైరాన్ని గూర్చి రాసిన చారిత్రిక గాధ..18శతాబ్దిలో జరిగిన కర్నాటక యుద్ధాలు వర్ణించాడు .18వ శతాబ్దం లో ఆర్కాట్ నవాబు చందా సాహెబ్ .మధుర నాయక రాజ్యం కూలిపోవటానికి కారకుడు .తర్వాత కర్నాటక నవాబు అయ్యాడు .ఆతను చేసిన హింసా దుష్క్రుత్యాలన్నీ వివరంగా రాశాడు కవి . 10వేల సైన్యం తో నాజర్ జంగ్ సాహెబ్ పై  దండయాత్ర చేస్తుంటే మహారాష్ట్ర మిలితరీఆఫీసర్ మురారి సహాయం చేశాడు  .తర్వాత ఈ మురారి గవర్నర్ అయి శాంతి స్థాపన చేశాడు .మురారి ప్రోద్బలం తో కవి ఈ రచన చేశాడు .మధుర సైన్యాధికారి ఫతే సింగ్ చందా సాహెబ్ ను 1752జూన్ లో చంపేసి హీరో అయ్యాడు .

అనేక మంది ఆంధ్రులలాగానే కవికూడా మధుర నాయకుల పాలనలో తమిళనాడులోని కురుకనగరం లో ఉన్నాడు  .సంస్కృతాంధ్రాలలో ద్విభాషకవిని అని చెప్పుకొన్నాడు .ఇతనికవిత్వం మధురా విజయం రాసిన గంగాదేవి కవిత్వం లాగా ఉంటుంది .కర్నాటక రక్షకులైన ఫతెసి౦గ్  ,మురారిలా వర్ణన శ్లోకం –

‘’తదను విహిత ఫత్తేసింగు ధర్మోపదేశ స్సమను రచిత విద్వజ్జజ్జాలాచి తర ప్రమోదః –సన్యవతిపాండంచక్షోనణీ చక్రం మురారి ప్రభు ర్యామితి వార్తా దిక్షు ప్రవృత్తా ‘’.-చివరి శ్లోకం –

‘’దిస్త్యా మహా రాష్ట్ర భటైర్విశస్తా స్సాధ్యప్రశస్తా యవనాస్సమస్తాః-డిస్త్యామురారి ప్రభురేషజాతః పాండ్య క్షమా మండల మండనశ్రీ

దత్తే కవిభ్యో దయమాన చేతా –మురారి నేతా ముహురీ ప్సితార్ధాన్ –వయం ప్రయామ స్త్రిశిరః పురీం తాం ప్రకాశ యామః పటు వాఖిలాసాన్ ‘’

85-రామయ

రామరాయ లేక రామయ కవి గురించి వివరాలు తెలియవు .ఆరు అంకాల ’’యయాతి నాటకం ‘’రాశాడు అదీదాదాపు శిదిలమే .మొదటి శ్లోకం –

‘’లక్ష్మ్యా లీలాకలహ కుతుక స్వాప భాజో నిచోలం –మోత్రుం ముక్త సార రుచిమయం  మొఘ యత్నేమురారే ‘’

సూత్రధారుడు కదని ,కవిని పరిచయం చేస్తాడు –

‘’నాన్విదమేవ ప్రతిపన్న దాసి త్వాంమామాశ్వాసయితుం ప్రవృత్తం యుష్మద్వచనం స్మర్యతి

శ్రీ రామయ కవేః కృతిం యయాత౦ నామ నాటకం –యాత్ర శర్మిస్టాయా దాసీత్వమపి శ్లధనీయం ‘’

చివరగా –‘’

‘’చూడాన్దోలితనీడ దాడిమ వాణీ కుంజా౦త రాలే మనా –గున్మీలక్త లవి౦ఖ మండలగల ద్రోణా ద్రుత ప్రచ్యుతః

విశ్వాండమూర్చిత పశ్య విశ్వవిజయ –స్వేరహ్వోత్కార కింకిణీకలకలా త్కారా నుకరీ రవః’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

77-పింగళి ముత్తాజి మంత్రి

భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు –

‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ –జల్పాకి చతురాననస్య వనితా భాగీరధీ భంగ భాక్ ‘’

సోయం మజ్జనకో నమజ్జన దయాశాలీ దిశాలీవలత్ –తేజో భాను భుజోత్తమో విజయతాం శశ్వంతరాం శ్రేయం ‘’.

ముత్తాజీ కవి పండిత ప్రకాండుడు మాత్రమె కాదు ఎందరో విద్వాంసులను ఆదరించి సన్మానించిన వాడు .వ్యాఖ్యాత కృష్ణ సూది దక్షిణామూర్తి భక్తుడు .విశ్వేశ్వర పండితుడినీ పేర్కొన్నాడు .సాయమాంబ  విషయమోచ్చింది ఆవిడ ఏ ప్రాంతాన్ని పాలించిందో తెలియదు .జా౦బవతి, శ్రీకృష్ణుల పుత్రుడు సా౦బు ని కధ ఇది .కృష్ణ జా౦బవతుల వివాహం తర్వాత చాలాభాగం రచన లోపించింది .ద్వారక వర్ణనతో కావ్యప్రారంభం జరిగింది –

‘’ఆస్తి ప్రశస్త తర వస్తుభిరుల్లసంతీపూద్వారకా జగతి మందిరా మందిరాయాః–తర్కో మమ స్పూరతినూనా మనూన లక్ష్మ్యా యస్సాస్సురేంద్ర నగరీ న గరీయ సీతి’’

శ్రీకృష్ణుని బల శౌర్య పరాక్రమ వర్ణన –‘’కీర్తి ప్రతాపో  కిల దంప తీవ త్రైలోక్య సౌదే లతతస్మ తరస్య –శంఖే శార్జ్న ద్రుమణీతనూజౌ తయోరిమౌ పాండుర చండ రూపౌ ‘’

జాంబవతి ముందు నారదుడు కృష్ణుని స్తోత్రం చేస్తాడు ఇది లీలాశుకుని కృష్ణ కర్ణామృత  శ్లోకాలు లాగా మధురంగా ఉంటాయి

‘’మందాకినీ కనదావలీషు మందార భూమీరుహ పల్లవేషు –తత్పద పీఠీ సుషమా సమృద్ధం ,విలోక యామో వయ మాదరేణ’’

జాంబవతి ప్రణయాన్ని ముగ్ధ మనోహరంగా వర్ణించాడు –‘

‘’చిత్రే చిత్రే రచిత ముచితం రూపదేయం మురారే –ర్దర్షీ ర్దర్షీ నిమిషా రహితైరీక్షితైరీక్ష ణీయం’’

స్ఫీతం జాతం విపుల పులక వ్రాత మస్యాఃప్రకామం –మారోదారప్రహరణాదియా నిర్మితం వర్మ శంఖోః’’

ఒకేసర్గలో వివిధ ఛందస్సులను పాతకవులకు భిన్నంగా ఉపయోగించాడు

78-నిశ్శంక మృత్యుంజయ భూపాలుడు

పెద్దన్న నిశ్శంక భూపాలుని కుమారుడు ,వెంకట నిశ్శంక భూపాలుని మనవడు ,విశాఖ జిల్లా  సంగమ వలస జమీందారు మృత్యుంజయ భూపాలుడు .కవిపండితవిద్వా౦సులకు అండా దండా గా ఉన్నాడు .స్వయంగా కవి .నీతి శాస్త్ర సారం అనే 35శ్లోకాల గ్రంధం రాశాడు దీనికి అదే ఆస్థానపుకవి ఆకెళ్ళ వెంకట శాస్త్రి తెలుగు వ్యాఖ్యానం రాశాడు .మొదటి శ్లోకం

‘’శ్రీ కైలాస పయోరాశీ యయోస్సుప్రు టతరాలయో – భక్త్యాహం ప్రత్యహం నౌమి పార్వతీ పరమేశ్వరౌ ‘’

ఇందులో చాలా నీతులు బోధించాడు –మచ్చుకి కొన్ని –

‘’పురోగతస్య లోకస్య ప్రియం సత్యం వరం వదేత్ –నైచే త్రూష్నీం వర్తితవ్యం సభాయాం సతతం సతా ‘’

సుసుతః క కుల దీపాంశ్చసుయోషా గృహ దీపికా –వనానాం చందనో దీపౌ రాజా దీపౌ పురస్స్య చ ‘’

మృత్యుంజయుడు కాళిదాసరచనలపై వ్యాఖ్యానాలు కూడా రాశాడు .శాకుంతలం పై ‘’పూర్ణ చంద్రిక ‘’,విక్రమోర్వశీయం పై ‘’రత్న దీపిక ‘’మాలవికపై ‘’’’విబుధ రంజని ‘’వ్యాఖ్యానాలు రచించాడు .ఏడవ ఎడ్వర్డ్ రాజు రాయల్ ఏషియాటిక్ సొసైటీ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మృత్యుంజయ భూపాలుని సంస్కృత సాహితీ సేవను గుర్తించి మెచ్చి అందులో మెంబర్ గా ఎంపిక చేసి గౌరవించాడు

79-నాదెళ్ళ మేధా దక్షిణ మూర్తి శాస్త్రి (26-1-1894-27-11-1938)

నాదెళ్ళ పురుషోత్తమ కవి ముక్తికాంతామణి దంపతుల కుమారుడు మేధా దక్షిణా  మూర్తి శాస్త్రి .హరితస గోత్రం .26-1-1894లో మచిలీపట్నం లో జన్మించాడు . -27-11-1938న మరణించాడు .గీర్వాణ,ఆంద్ర హిందీ  పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు .,కవి రచయిత .ఖగోళం ధర్మ శాస్త్రాలపై గ్రంధాలు రాశాడు .తెలుగులో 30,సంస్కృతం లో 3రాశాడు .సంస్కృతం లో ‘’ఆత్రేయశ్రోత్రా నందం ,అస్టకమాల ,నానా దేవతా స్తోత్రం రాశాడు .మొదటి దానిలో 108శ్లోకాలున్నాయి .ఛందో వైవిధ్యం పాటించాడు .దత్తాత్రేయ అవతార గొప్పతనాన్ని ఇందులో వర్ణించాడు .ముందుగా తండ్రి పురుషోత్తమ శాస్త్రి కి పద్య నివాళి సమర్పించాడు –

‘’శ్రీ దక్షిణాస్య విమలా౦ఘ్రిద్రసరోజ భ్రున్గః శ్రీమద్గురు ర్జయతు తత్పురుషోత్తమాఖ్యః

యధ్యాన మాత్ర రసనాత్తకవిత్వ శక్తిః సత్కావ్య జాల రచనాల్లభతే సుకీర్తిం ‘’

తన వంశ చరిత్రను చెప్పుకొన్నాడు .కవి తన తల్లిగారిపై తెలుగులో ముక్తి కాంతా శతకం చెప్పాడు .ఇందులో 19సంస్కృత శ్లోకాలున్నాయి –

‘’గోమాననీయ పద సోమా ర్కవహ్నినయనోమా సతీపతి మజం –వాగార్ధ భాగ మణిదామాభి రామనిజ భామా మణీయుత తనుం .

చివరి శ్లోకం –‘’స్తవ్య సౌశీల్య సౌభాగ్య సద్రూపిణీం నిత్య హ్రుల్లగ్న భర్త్రింఘ్రి పంకేరుహం –భవ్యా విద్యా వతీం దీమతీం శ్రీమతీ మాశ్రయే మాతరం ముక్తి కాంతామణీం’’

మాత్రు దేవత ముక్తికాంత ను సంస్మరించటం మేదా దక్షిణామూర్తి గారికి ముక్తికాంతా దర్శనానికి సోపానమై ఉంటుంది .

80-రత్నారాధ్య

ఆంద్ర దేశానికి చెందిన వీరశైవ బ్రాహ్మణకవి రత్నారాధ్యుడు .కాలాదులు లేవు .’’దారుక వన విలాసం ‘’సంస్కృతం లో రాసినట్లు ఉన్నది .దారుకా వనం లో శివ క్రీడల వర్ణన –మొదటి శ్లోకం –

‘’శ్రీరాధ్యార్చిత పాద పంకజ ముమాకాంతం కటాక్షావిత్ –త్రైలోక్యం ముని మానససైక నిలయం దేవం సమస్తాధికం ‘’

వేద్యం ప్రత్న వచః శిరోభి తతులం మృత్యుంజయం మానసే –ధ్యాయాయామ్య న్వహమాశ్రితామర తరుం తమ్భూయసే శ్రేయసే ‘’

శ్రీ మద్రౌప్య గిరీ శివా తను రధం భద్రాసనే సుస్తితం –పాయాత్తోషితయా సమం గిరిజయా బాలేందు చూడామణిః’’

కవే దీనికి వ్యాఖ్యానం కూడా రాసినట్లుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

73-రావు భాస్కర రాయ (1840-)

పశ్చిమ గోదావరి జిల్లా పాండుర గ్రామానికి చెందినవాడు పిఠా పురం వెలమ దొరల బంధువు ,రావు వెంకమ్మ ,రామరాయల సుపుత్రుడే భాస్కర రాయ .1840లో జన్మించి 20వ శతాబ్ద ప్రారంభం లో మరణించాడు .తత్వ వ్యాకరణ ,పురాణ ,స్మ్రుతి నీటి శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్న వాడు .విశిస్టాద్వైతి అయినప్పటికీ అద్వైతాన్ని అవపోసన పట్టాడు .40వ ఏట ‘’అద్వైత సారం ‘’సంస్కృతం లో రాశాడు .ఆంద్ర గీర్వాణాలలో చాలా రాశాడని చెబుతున్నా సంస్కృతం లో లభించినవి రెండే రెండు .అవి రామ ధాటి శ్లోకం ,కుమార శతకం

రామదాటి 21శ్లోకాల రచన .ఇందులో రావు వంశం గొప్పతనాన్ని వర్ణించాడు .దీనిని పిఠాపురం రాజు రాజా వెంకట కుమార మహీపతి సూర్యా రావు బహద్దర్ కు అంకితమిచ్చాడు –ఇందులో మొదటి శ్లోకం –

‘’కళ్యాణదం భవతు వస్తు కిమష్య జసం స్త్రీ పు౦సా రూప మతిలోక మనంత్య మాఘం

రాజ్య శ్రియః కృతి పతే సస వాసు రూప మేవం సంబోధయన్నవనవాభ్యుదయాయ రాజః ‘’

వెలమ వంశా రంభాన్ని వివరిస్తూ శ్లోకం చెప్పాడు .సూర్యారావు బహద్దూర్ దాన వితరణ పై –

‘’వనీపకానామ వనీపకానాం విపర్యయస్స్యా ద్విహి తోషి వృత్తౌ –అస్మిన్ భువం బిభ్రతి సూర్య రాయే ,దానేన శౌర్యేనజగత్ప్రసిద్దే’’

చివరి శ్లోకం లో రామదాటి ని 21శ్లోకాలలో రాశానని ,ఇది పరశురాముడుక్షత్రియులపై చేసిన  21దండ యాత్రలను సూచిస్తుందని తెలిపాడు .

‘’శ్లోకా స్శ్రీసూర్య రాయస్యాభ్యుదయ ప్రతిపాదకాః-ద్విషన్మనోభిదో రామ ,దాటీ వచ్చైకా విమ్శతిః’’

కుమార శతకం వంద శ్లోకాలతో ఉంది .ప్రతిశ్లోకం లో కుమా శబ్దం వచ్చేట్లు రాసి కుమార రాజా కు అంకితమిచ్చాడు

‘’మాతా మంగామ్బికా యస్య పితా రామ మహేశ్వరః –కుమారాత్కుమారోయం ద్రాజ్య యత్వరి మండలం ‘’

చాలా లోతైన భావం తో ఉత్కృష్ట రచన చేసిన పద్యాలు ఎక్కువగా ఉన్నాయి .కొన్ని –

సాన్త్వం మాన్యే,దనం దీనే ,శటేభేద మరౌ దమం –కుమార!పాతయ దియా విమృశ్య గురు లాఘవం ‘’

న నీచ మాధికం కుర్యాన్నాధికం నీచ మప్యతః –యదార్హం స్తాపయేద్రాజా ,కుమార !స్వార్ధ తత్పరః ‘’.

దీన్ని 1890లో రాసి 1897లో కుమారా మహీపతికి అంకితమిచ్చాడు .

74-చాగంటి మల్లినారాధ్యుడు

మల్లారి ఆరాధ్య పేరున్న ఈ కవి చాగంటి శరభానారాధ్య కుమారుడు ‘’శివలింగ సూర్యోదయం ‘’రాశాడు .ప్రబోధ చంద్రోదయం సంకల్ప సూర్యోదయం లాగా నే నడిపించాడు .వీరశైవాన్ని సుప్రతిస్టితంచేశాడు .బసవేశ్వరుని గూర్చి వర్ణన ఉంది .కవి చెప్పిన బసవేశ్వరుడు వీరశైవ ప్రాపకుడు బసవన మంత్రి ఒక్కరుగానే కనిపిస్తారు .పెనుగొండ ఎపిగ్రాఫ్ లో కందుకూరి బసవ రాజు గోదావరి జిల్లా ఏలూరు కు దేశ పా౦ డ్యుడుఅని తెలుస్తోంది .1429ప్రాంతం వాడు .దేవిది ,ఉర్లాం జమీందార్ .ఇదే సద్గురు శివానంద మూర్తిగారి వంశం .మొదటి శ్లోకం –

‘’శ్రీమత్పర్వత పట్టసాగ్రవిలాస త్సౌవర్ణ సౌదాస్థలీ –నానా రత్న విచిత్ర కాంతి రచిత ప్రోత్తన్గురా వేదాన్తరే

బ్రహ్మో పెంద్ర హరాఖ్యాయ పర్వతాతియుక్సిమ్హాసనే సుస్తితం –వీరేశం విప దంద కార మిహిరం పశ్యేయ మంతర్దాశా ‘’

చివరి శ్లోకం లో తన పేరు వగైరా చెప్పుకొన్నాడు –

‘’చాగంట్వన్వయా సింధు శీత కరుణా శ్రీ శరభారాధ్య స –త్పుత్రాయామల సద్గుణా య కలయే మల్లెశ్వరాఖ్యాయ చ

ద్రస్టూనాంశివ లింగ దర్శన సముద్ భూత ప్రమోదాత్మనాం-భూయాల్లింగ కటాక్ష వీక్షణావశాత్ గోబ్రాహ్మణేభ్యశ్శుభం’’

75-మల్లికార్జున భట్టు (1280-1330)

భాస్కరకవి కొడుకైన మల్లికార్జున భట్టు కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానకవి మణులలో ఒకడు .’’నిర్యోస్ట్య రామాయణం ‘’రాశాడని పేరు .సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’అబిషిక్త రాఘవం , సరస్వతి చంద్రిక కు కూడా ఈ కవే కర్త అన్నారు .తెలుగులోభాస్కరరామాయణం లో  కిష్కింద సుందర కాండలు రాశాడు.ఆశ్వాసాంత గద్యం లో –

‘శ్రీ మదస్ట భాషా  కవిమిత్ర కుల పవిత్ర భాస్కర సత్కవి పుత్రమల్లికార్జున భట్ట ‘’అని రాశాడు .చాగంటి శేషయ్యగారి కధనం ప్రకారం ఈ భాస్కరుడు హుళక్కి భాస్కరుడు .కనుక మల్లికార్జునకవి కాలం 1280-1330.ఈ కవి ఉదార రాఘవ కర్త సాకవెల్లి మల్లికార్జున భట్టుఅని కొందరు పొరబడ్డారు .ఇద్దరూ ఒకరు కాదు వేరు వేరుకవులు .దురదృష్ట వశాత్తు ఈ మల్లికార్జున భట్ట సంస్కృత రచనలు లభించలేదు .

76-సాకల్య మల్లు భట్టు

మల్లు భట్టు లేక కవి మల్లయచార్య శకవల్లి  ఇంటిపేరున్న మధ్వుడు .ప్రతాపరుద్రుని ఆస్థాన కవి .కాకతి రాజ్య పతనం తర్వాత రాచ కొండ వెళ్ళాడు .శ్రింగార భూపాలుని ఆస్థానం లో ఉన్నాడు .గురుపరంపర లో ప్రభావ మల్లు భట్టు అనే పూర్తీ అద్వైతి.నయనాచార్య చేతిలో వాదం లో ఓడిపోయి వైష్ణవం స్వీకరించి ప్రచారం చేశాడు .దీని వెనుక ఒక కద ఉంది .సాకల్యుడు తన వైష్ణవ విరోదిపై బేతాలుడిని ప్రయోగింఛి విరోధి పల్లకి ని మోసే బోయీగా ఉండమన్నాడు .పల్లకీలోని స్వామిని మట్టు బెట్టె ప్రయత్నం లో ఉండగా ఆయన గ్రహించి మంత్రం ప్రయోగం తో ఈ బేతాలుడిని దారికి తెచ్చ్చి నిజంగానే తన పల్లకీని మోయించాడు  .సాకల్యుడు వైష్ణవుని చేతిలో ఓడిపోయి మతం పుచ్చ్చుకొన్నాడు .

సాకల్య మల్లుడు సంస్కృతం లో నిర్యోస్త్య రామాయణం రాశాడు .కాని 16శతాబ్ది మధ్యలోనే అది కనుమరుగైంది 16శతాబ్దం చివరలో   గోల్కొండ రాజు వద్ద ఉన్న మరిగంటి సిన్గానాచార్య దీని విషయమ తెలిపాడు .అప్పకవి కూడా ఈ కవి వ్యాకరణ శాస్త్రం రాశాడని చెప్పాడు .సాకల్యుడు ‘’అవ్యయ సంగ్రహ నిఘంటు ‘’కూర్చాడు .-

‘’ప్రణమ్య శిరసా దేవం భద్రాద్రి నిలయం హరిం –అధవ్యయాని కచితిసంగ్రుహాంతే యధాశ్రుతం

ఆః యాస్బెదే నిషేదార్ధం స్వల్పే చాప్యానృతా ర్దికే –అస్తు సంతాపనే కోపెప్యాంగ చ స్యాదీషదర్ధకే ‘’

చివరగా –‘’సమన్తతః సర్వ తోర్దే శోభనాంత సుధాన్తయోః –ఉపాన్తతః పురోర్ధ చ స్యాదార్ధ్యార్ధ గ్రవాచాయే ‘’

ఈ నిఘంటువే కవి చివరి రచన .’’చతుర్భాషా కవితా పితామహ ‘’అనే బిరుదున్నవాడు .ఇతని రచనలలో ఉదార రాఘవం ఒకటే లభించింది .మొదటి ,చివరి శ్లోకాలను చూద్దాం –

‘’ఆస్తి ప్రశస్తః ప్రక్రుతేః పరస్తా దాఘః పుమాన్ కేవలాచిత్స్వరూపః –ఆనంద పూర్ణః సద సత్ప్రపంచ బాహ్వంతర వ్యాప్త భుప్రకారః ‘’

సాదిస్ట మాత్ర క్షుభితాత్మ నీనా మాయా గుణోర్ధైరమః దాడి తత్వైః-ప్రారబ్ధ మండంసామాను ప్రవిశ్య ప్రావర్తయామాస భవత్ప్రపంచం .

రాముని శివ ధనుర్భంగ వార్తను జనకుడు దశరధునికి తెలియే జేసే శ్లోకం –

‘’విశిఖే ధనుర్భజి తదార్వ భీత్యా ,చలితే రదే రధినితడధ్వని హ్రుస్టే-గుణాసరదీ చ శరమాన విషాతాం శ్యానాత్మ జావితి దదుః శుభ లేఖం ‘’

తెలుగు పలుకు బడులను సంస్కృతీకరించి రాశాడు .భోజ చంపు ను వాడుకొన్నాడు .ఈ కవి కవిత్వాన్ని అల్లసానిపెద్దన కూడా అనుసరించి శ్రావ్యత కల్గించాడు మను చరిత్రలో .సీత దృష్టిలో లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడో చెప్పే శ్లోకం బాగుంటుంది –

‘’గురురేషపిటేశ ,పుత్రఏష స్వజన శాచైష సర్వేష భ్రుత్య ఏషః –ఇతి దేవరి లక్ష్మణేను కంపాః విదధే నిఃస్వసితా విదేహ పుత్రీ ‘’’ఉదార రాఘవం లో కొన్ని సూక్తులు –

‘’ప్రత్యక్షతః స్వర్గ సుఖం విహాయ ,పరోక్షతః కిం నరకాద్విభీయం

ముగ్ధే కిమప్యాంబ న  వేస్తి దగ్దే ,కుక్షౌ క్షుదాకాం జన మాక్షిణ దదాత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )

షాహాజి మహా రాజు ప్రాపకం లో ఉన్న కౌశిక గోత్రీకుడు శ్రీధర వేంకటేశ వేంకటాంబ ల పుత్రుడే శ్రీధరుడు .రాజు చేత షాజీ రాజ పురాగ్రహారాన్ని పొందాడు .18వ శతాబ్ది ప్రారంభం వాడు .వ్యాకరణం లో అఖండ ప్రజ్ఞావంతుడై నందున’’ నవీన పతంజలి’’ బిరుదు నందుకొన్నాడు .వ్యాకరణ, నాటక ,కావ్య, రచయిత..

సూరి ‘’వసుమంగల నాటకం ‘’అయిదు అన్కాలలో రాశాడు .గిరికా వసురాజుల ప్రేమ కద..మధుర మీనాక్షి ఉత్సవాలలో ప్రదర్శించేవారు .రామ రాజ భూషణుని వసు చరిత్ర ఆధారం .ఈ నాటకానికి వ్యాఖ్యానం కూడా ఉంది .రచయిత పేరు తెలియదు .ప్రారంభ శ్లోకం –

‘’అస్టాభిఃస్వకలాభి రేవ రమణీ రూపాభి రాపాదితా –ముధద్ర త్నఘటీ వినిస్సృత మణీదారాభి షేక శ్రియం

కొటీరోపరిమాణ్య  ప్రణయినీ రాగ ప్రణాలీమివ –స్తేమా కశ్చిదుదేతుమంగళ పరీఖండాను ష౦గా యనః ‘’

తర్వాత శ్లోకాలలో కవి వంశ ప్రస్తావన ,రచనల వివరం ఉన్నాయి .సంస్కృతం లో– పేరు సూరి శ్రీ రామ చంద్ర విజయం ,భరతాభ్యుదయం ,చకోర సందేశం ,వెంకటభాణం కూడా రాశాడు .ఇందులో చకోర సందేశమొక్కటే దొరికింది. ఇదీ అసంపూర్ణమే .మేఘ సందేశానికి నకలు మందా క్రాంత వృత్త విన్యాసం .కైలాసానికి మీనాక్షీ సుందరేశ దర్శనానికి  వచ్చిదంపతులు  వ్యాఘ్రపాదుని శాపానికి గురై చకోరం తో అచ్చోడ సరస్సునుండి సందేశం పంపిస్తాడు .ఇందులో ప్రేయసి ప్రియుల పేర్లు లేవు .-మొదటి శ్లోకం –

‘’కర్తుం సేవా ముపగత వతా సుందరేశోప కంఠం-ప్రత్యుత్దాన ప్రణతి విదురో వ్యాఘ్ర పాదేన శాపః

కామీ కరిచత్ పశు పతి పాదాంభోజ విన్యాస ధన్యే –కైలాసాద్రీస్థితి మతనుత ప్రేయసీ విపర యుక్తః

మొదటి సగం చివర –‘’ఇతి శ్రీ ధర వంశ శిఖావతంస,వైదుష్య సింహాసనాదీశ్వర పద వాక్య ప్రమాణ కూలంకష సాహిత్య మర్యాదాదురంధర  నవీన పతంజలి బిరుద సంభావిత శ్రీ పేరు సూరి విరచితే చకోర సందేశ మహా కావ్యే పూర్వస్సందేశాస్సమాప్తః ‘’

చకోరం కైలాస గిరి నుండి పాండ్య దేశం లోని హాలస్య నగరికి ప్రయాణం చేసింది .మధ్యలో ఉన్న నదులు నగరాలను వర్ణించాడు .గోదావరి నది బ్రాహ్మణాగ్రహార వర్ణన –

‘’మజ్జత్కాంతా జన కుఛ తటీ హార దీప్తి ప్రరోహే –గచ్చాచ్చానామల దుప యసామపత ౦త్యః ప్రవాహైః

గోదావర్యాస్తట భువి తతః ప్రేక్ష్య విప్రాగ్రహరాన్ –ప్రాయస్తాంస్తాం ద్విజ వర హృది స్నేహ ముచ్చే ర్భాజేధాః’’

అంతర్వేది నృసింహ, శ్రీశైల క్షేత్రాలను చూపించాడు .వియోగ బాధను వెళ్ళ గక్కించాడు –

‘’సా చన్ద్రస్య చపల నాయనా కంబు కంఠీ సుకేశీ –ముగ్దా లాపా మధుర హసితా మంద యానన

స్సాజాత్యేన త్వితర వనితా రత్వేకషస్త  త్ప్రయోగః ‘’

69-ఎల కూచి బాల సరస్వతి (17శతాబ్దం )

కౌండిన్య గోత్రానికి చెందిన ఎలకూచి కృష్ణ దేవుని పుత్రుడు ,భైరవార్య మనవడు బాల సరస్వతికవి .17వ శతాబ్దం వాడు .తెలుగుసంస్కృతాలలో లో చాలా రాశాడు .మహోపాధ్యాయ బిరుదున్నవాడు .మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థాన కవి .వ్యాకరణ పండితుడు. రాఘవ యాదవ పాండవీయ త్ర్యర్ది కావ్యం రాశాడు .భర్త్రు హరి సుభాషితాలను తెలుగు చేసి సురభి మల్ల భూపాలుడికి అంకిత మిచ్చాడు ..ఈకవి సంస్కృతం లో ‘’దశావ తార స్తోత్రం ‘’రాశాడు చాల క్లిస్టాన్వయం తో ఉంటుంది .ప్రతి శ్లోకాన్ని ఒకే సమాసం తో రాయటం బాల సరస్వతి ప్రత్యేకత –

‘’సాదీయో ముఖ పూరితో ద్వమి తతాసత్యోద్వ గోదన్వద-ర్ణాధారా ౦తరటక్తిమంగల ప్రోద్దాన నిధ్యానల

బ్ధ్వాదీశ ప్రభుతాస్వ భాగ హరణార్యయాయీ హ్రుజ్ఝాన్కరీ –ప్రాదాన్యాటి విలోల లవాద్రు గబట  బ్రహ్మాన్ స్తుమస్త్వా మనున్ ‘’

చివరగా

‘’స్వ మహా బహు కృపాణక్రుత్తగల గుంచా మ్లోచ్చా వీరచ్చితే—త్క్రణాపాదిన పంక్తి నీరమణామధ్యాచ్చ్రిద్ కష్యామికో

ద్రమక్లుప్తా సమయే పరాగమతి కక్ష్మాస్తాన గంగానదీ –భ్రమ కృ త్తిక కల్కి మూర్తేక పరబ్రహ్మాన్ స్తుమాస్తస్త్వా మనున్ .’’

తెలుగులో లాగానే యతి ప్రాసలను పాటించాడు .దీనికి సంస్కృతం లో కురవి రామ కవి వ్యాఖ్యానం రాశాడు .

70-చెరుకూరి బ్రహ్మ సూరి

నరసా౦బా  సర్వేశ్వర భట్ట లకుమారుడు బ్రహ్మ సూరి. చెరుకూరి ఇంటిపేరు  .ఉత్తర కాండ చంపు సంస్కృతం లో రాశాడు .16వ శతాబ్దం నుంచి చెరుకూరి వంశం వారు గొప్ప కవి పండితులుగా ప్రసిద్ధులు ..స్వర్ణ మంజరి ,రసమంజరి మొదలైనవి రాసిన చెరుకూరి లక్ష్మీ ధరుడు విజయనగరరాజు తిరుమల దేవరాయ ఆస్థానకవి .మనకవి కాలం తెలియలేదు .చెరుకూరు కృష్ణా జిల్లా గ్రామం .మొదటి శ్లోకం –

‘’ఆనంద కంద లితయ చ్చరణారవి౦ద ,నిష్యన్దమాన మకరంద నిపాత పూతా –దివ్యాన్గనా జనిశిలశ్యాభి వంద నీయ ,వందామి తమ్ రఘుపతిమిందిరాయాః ‘’

రాముడు సీతను అడవికి పంపమని ఇచ్చిన ఆజ్న-

‘’’’భో భో భ్రాతరః శ్రుణుత మద్వచనం –మాబ్రూత్ ప్రతి వచనం –

‘’సీతాపి తాపస నివాస విలోకనాయ మామద్వ యాచిత వతీ గమనం చిరాయ –త్వాం త్వక్తు ముధ్యాతమనా అఃహ మష్య భూవం కర్మాను కూల రచన స్సామయో యమస్మిన్ ‘’

కావ్యమంతటా సున్నిత పదాలతో ప్రవాహంగా సాగటం ప్రత్యేకత .చివరి శ్లోకం లో తన వంశాన్ని వర్ణించాడు .

‘’చేరుకూరన్వ య దుగ్ధ సాగర విదుస్సర్వే శ్వరా వ్యయః పితా –జననీ యస్య నృసింహ నామ కలితా సూర్యస్సుదీ రోగ్రజః

పర మధ్యు త్తర  కాండ మభ్య చరిత౦ శ్రీ రామ చంద్రాఖిల –వ్యవహార ప్రధన స్సమ గ్రమభవతద్బ్రహ్మ సూరేః కృతౌ ‘’.

71-నేపాల్ రాజ గురువు ఆస్థానకవి నడిమింటి భగవత్పతంజలి శాస్త్రి (18౦౦ -1872)

శ్రీకాకుళం జిల్లా నాగూరు గ్రామ వాసి నడిమింటి సర్వ మంగళ శాస్త్రి గారి కుమారుడే పతంజలి శాస్త్రి .1800-1872కాలం లోని వాడు తండ్రి వలే యోగ ,మంత్రం శాస్త్రాలలో నిష్ణాతుడు .కాశీ లో ఉండగా నేపాల్ రాజుకు గురువై ,రాజు కోరికపై నేపాల్ వెళ్లి రాజాస్థానం లో 1830-40మధ్య ఉన్నాడు .తండ్రి మరణం తో స్వదేశానికి స్వగ్రామంకి తిరిగి వచ్చాడు .నేపాల్ లో ఉండగానే ‘’గాయత్రి మహిమ ‘’పరమ పురుషాధ్యయనం ‘’సంస్కృతం లో రాశాడు .దీనిలోంచి శ్లోకాలు –

‘’చిదాత్మా చిన్మాయా౦ ప్రక్రుతి మభి సృజ్జో ద్భవవతాం-నివేశ్యస్యాం శ్వాసం పునరపి యదా పూర్వక భవత్

తత స్స్రస్టా జీవ ప్రకర ఇతి తస్యా నుజనితౌ –తమో౦ఘై తత్నాద్య స్తపదఘ స తేన ప్రభుదితః ‘’

పతంజలి శాస్త్రి నేపాల్ లో ఒక సంస్కృత పాఠశాల స్థాపించాడు..భారత్ కు తిరిగి వచ్చాక సంస్కృత సేవ చేయలేక పోయాడు .కారణం విజయ నగర సంస్థాన లిటిగేషన్లను  తీర్చటానికే సమయమంతా సరిపోయేది .లభించిన ఆధారాలను బట్టి యోగ శాస్త్రం లో పతంజలి అంతటి ప్రతిభ ఉన్న భగవత్పతంజలి శాస్త్రి యోగాభ్యాసం తో తన శరీరాన్ని మహా వృక్షమంత ఎత్తుకు లేపేవాడు .చనిపోయే దాకా నేపాల్ రాజుల గౌరవ సత్కార కానుకలను అందుకొంటూనే ఉండేవాడు .కురుపాం జమీందారు అగ్రహారాలు  దానం చేశాడు .

72-చర్ల భాష్యకార శాస్త్రి (20శతాబ్ది )

లోహిత గోత్రీకుడు ,వెంకటాద్రీయం రాసిన చర్ల వెంకట శాస్త్రి మనవడు భాష్యకార శాస్త్రి .పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రులో 20వ శతాబ్దం లో ఉండేవాడు .సంస్కృతం లో ఉద్దండుడు .శాస్త్రాలలో అద్వితీయుడు .వ్యాకరణం లో దిట్ట .నిఘంటు నిర్మాత .అన్నిటా సాటిలేని వాడు .రచనలలో మేధావిగా దర్శన మిస్తాడు .సంస్కృతం లో 20గ్రంధాలు రాశాడు .’’మేకాదీశ శబ్ద రత్నాకర కల్ప తరువు అనే అలంకార శాస్త్రం ఒక శబ్దాన్ని విడగొడితే వెయ్యి అర్దాలోచ్చేట్లు రాసిన ఘనుడు .దీనిపై వ్యాఖ్య కూడా రాశాడు –

‘’ఏ శబ్దార్ధ విచార తత్పరాదియో ఏ యా గుణాలంక్రియా  –దోషాసక్త హృదే విచిత్ర కవనే యేవా ద్వనా వ్రుత్సుఖాః’’

మేకాదీశ శబ్దార్ధ శతకోటి ,మేకాదీశ శబ్ద శతకోటి లలో కూడా ఇలాంటి ఫీట్లు చాలా చేశాడు .నూజి వీడు ప్రభువు మేకా రంగయ్యప్పారావు చరిత్ర తో సంబంధమున్న రచనలివి .కవి ప్రతిభా వైదుష్యానికి  ఆటపట్లు.

మేకాదీశ రామాయణం16అక్షరాల  ఏకశ్లోకి .వీటి పెర్ముటేషన్,కాంబి నేషన్ లతో రామాయణం అంతా దిగుమతి అవుతుంది .అదీ గొప్ప .

32అక్షరాలతో ‘’కనక బంధ రామాయణం ‘’కూడా చిత్రిక పట్టాడు .అక్షరాలు  చేతి గాజు లా ఉండి,ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు కూరిస్తే 64శ్లోకాలేర్పడతాయి .ఏర్పడిన ప్రతిశ్లోకానికి రెండు అర్ధాలు చెప్పాడు కవి .అంటే మొత్తం 128 శ్లోకాలయ్యా యన్నమాట .రుచికి –

‘’రామానా తాభాస ,చారా వారా గోపదారా –ధారా ధారా భీమకారా ,పారావారా సీతారామా ‘

ఈ కంకణబంధ కవిత్వం మొట్ట మొదట 1780-1870వాడైన శిస్టు కృష్ణ మూర్తి శాస్త్రి ప్రయోగించాడు. రెండవ కవి భాష్యకారుడుదీన్ని మెరుగు పరచాడు .

‘’వినాయక చరిత’’ లో శ్యమ౦తకోపాఖ్యానం చెప్పాడు .’’నృసింహ దండకం ‘’,గౌతమీ దండకం ,వ్యాప్తి చింతామణి రామాయణం శ్రీరామ విజయవ్యాయోగం కూడా రాశాడు. వ్యాయోగం లో నటి  నాందిలో ఎడారి లాంటి వ్యాకరణ శాస్త్రం లో కవి మాస్టరీ చేశాడని చెబుతుంది .‘’తర్క వ్యాకరణ ప్రబంధ కవనైః కర్కస్యయుక్తా ప్యసౌ –వాణీ కావ్య వశాత్ప్ర సాదా గుణ తస్సవైః ప్రశస్య భవేత్

సూర్యో గ్రీష్మ హాత పవ శాదత్య న్యంతతీక్ష్నోఫై సన్-వర్షాకాల వశాత్సమస్తజగతస్స౦తోష కారీ భవేత్ ‘’

‘’చతురక్షర గీత సారం ‘’లో నాలుగక్షరాలతో సర్కస్ ఫీట్లు చేసి చూపాడు .ఇవికాక రాజ్య లక్ష్మీ పరిణయం ,భువన గుణ మహా దర్పణం ,సనాతన ధర్మ విజయ వ్యాయోగం ,వర్ణమాలా రామాయణం ,విజయ విలాసం ,దండక రామాయణం ,సూర్య దండకం ,హనుమద్దందకం ,కృష్ణ ప్రసాదీయం అనే అలంకార శాస్త్రం కూడా భాష్యకార శాస్త్రి రచనలే.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 64-ఉద్దేమర్రి పాపయ

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

64-ఉద్దేమర్రి పాపయ

ఈ కవికాలాదులు తెలియవు కాని చిన్న దదైన ‘’రాఘవాస్టకం ‘’శ్రీరమునిపై రాశాడు .కొన్ని శ్లోకాలు –

‘’అ౦బువాహనీల దేహ ,మంబు జాక్ష మవ్యయం –మందమంద గౌర హస మిందు సుందరానననం ‘’

పద్మ జాత పూజితాంఘ్రిపంకజాత యుగ్మ-మ౦బాధమరాధవం సదా శివార్చితం భజే ‘’

సప్త సప్తి రాజ రాజ లోచనా కమోచనం –నిత్య పద్మ సద్మ పద్మ  పద్మచిత్త మోషకం ‘’

సర్వ భక్త జాత జాత గంధీ  శీత గంధి-మంబలాద మఘనం  సదాశివార్చితం భజే ‘’

ఆశ్వాసాంత గద్య  –‘’సర్వ వాంచితా ర్య కల్పవృక్ష ముద్రేమారిపా –ప్యా నామకో త్తరాఘవాస్టకం పఠంతియే

భక్తీ తశ్చ సంతత౦ చ భోజనాది కోయవా –ముక్త కిల్బిషా  భవంతి మోక్ష మాపను వంతితే’’

65-ములుమూడి పిచ్చి రెడ్డి (19శతాబ్ది చివర )

నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాలెం కు చెందిన వెంకా౦బికా ,వరద రెడ్డి ల కుమారుడు పిచ్చి రెడ్డి .’’శ్రీ వెంకటేశ్వర కర్ణామృత స్తోత్రం ‘’రాశాడు .దీనికే వెంకట నరసింహ శార్దూల స్తోత్రం ‘’అనే పేరుంది నృసింహ స్వామి పై రాసిన స్తోత్రం .108శార్దూల శ్లోకాలతో ఈఅష్టకం రాశాడు .ముందు తన గురించి తర్వాత గురువు గురించి చెప్పాడు .గురువు కామాక్షి ,శేషుల పుత్రుడు  తమన వెంకవెంకటేశ్వర.గురుపత్ని మంగా౦బి క .కవితాధార సరళంగా సాగి చదివించే లక్షణం ఉన్నది –

‘’శ్రీమద్వేంకట నాయకం మునినుతం సేవ్యాన్ఘ్ర పంకద్వయం –పాపాన్ధం కరుణాకరం భవ హరం  బాలేందు చూడార్చితం

పద్మాక్షం జగదేక వీర మదిపం బ్రహ్మ స్వరూపం హరిం –కామాక్షీ ప్రియ సోదరం నర మ్రుగాకారం  భజేహం సదా ‘’

తెలుగు శతకం లాగానే నాలుగోపాదం గా మకుటం ఉంటుంది .కామాక్షీ అమ్మవారంటే భక్తివలన ఆపేరునూ చేర్చాడు .చివర ఆర్యా శ్లోకాలలో ఫలశ్రుతి రాశాడు

66-పుణ్య కోటి(18శతాబ్ది )

బోధానంద ఘనేద్ర యోగి శిష్యుడైన పుణ్య కోటి 11సర్గల  ‘’కృష్ణ విలాసం ‘’అనే కావ్యం రాశాడు ..ఇది భాగవత దశమ స్కంద కద.దీనిపై అజ్ఞాతకవి రాసిన వ్యాఖ్యానం ఉంది .కవి జీవిత చరిత్ర ఎక్కడా లేదు .కావ్యాన్ని ఇలా ప్రారంభించాడు –

‘’మార్గెంత ర్నాలి నొల్ల సన్నిజ ముఖం సప్రేమ హాసం హ్రియా –పశ్యన్తిం నయనాన్జలాంజ లకచాం యాంతీంశనై రుక్మిణీం

గురువును గురించి –‘’వాచం యస్య  నిశమ్య శేష ఫణి రాట్ పాతాలమాప హ్రియా-మౌనం గౌతమ జైమినీ కిల రాతౌ భట్ట స్సుదా ర్మాగతః –వ్యాసాధ్యః కమలాసనస్య భవనం యాతాః సమె సద్గురుః-బోధానంద ఘనేంద్ర యోగ యతి రాట్ జాజాయతాంమానసే’’

బోదా నందుడు కొట్లూరి రాజశేఖర కవికి కూడా గురువే కనుక మనకవి 18వ శతాబ్దివాడు .

67- ఏలేశ్వరపు పెద్దిభట్ట  (1500)

గోదావరి జిల్లా ఏలేశ్వరం నివాసి వెలనాటి బ్రాహ్మణుడుఏలేశ్వరపు  పెద్ది భట్ట .’’సూక్తి వారిది ‘’రచయిత..తాను  ఏలేశ్వర మహోపాధ్యాయ వంశానికిచెందిన వాడినని వేద,శాస్త్రాలలో అఖండ పాండిత్యం  ఉన్నవాడినని కవి చెప్పాడు .1700కాలపు కవి .కాని ఇంకా పూర్వీకుడే అని అనుమానం .16వ శతాబ్ది పూర్వార్ధపు కవి సంకుసాల నృసింహ కవి ఈ కవిని ఉదాహరించాడు .కనుక  పెద్ది భట్టు  కాలం 15వ శతాబ్దం అయి ఉండాలి .

సూక్తి వారిది 13అధ్యాయాలకావ్యం. కాని అయిదవ అధ్యాయం వైరాగ్య శతకం ,ఆరవది –దాన శతకం ,7వదిరాజ శతకం ,8వదైన సజ్జన శతకం ,9-దుర్యాన శతకం ,13వదైనధర్మ శతకం మాత్రమే లభ్యం .భర్త్రు హరి కవిపై అపార గౌరవం ఉన్నందున నీటి శతక౦ లో ఆయన స్తుతి చేశాడు –

‘’ఆశాయా దశా ఏతే దాసః సర్వ లోకస్య –ఆశా దాసీ యేషాం దాసయతే లోకః

అవశ్యం యాతార శ్చిరతరముషిత్వాపి విషయా –వియోగే కో భేద సత్యజతిన జానో యత్ స్వయమ్మూన్ .’’

చివరగా –‘’ఆసతో తృప్తి మాస్తాయ విద్యా లేశేన కేచన్ –భేకాఃకూప జలేనేవ సోకస్సంతో ష కారిణః’’

‘’ఇతి శ్రీమత్ ఏలేశ్వరపుర వర మహోపాధ్యాయ వంశోద్దారకేణ విరచితే –సూక్తి వారిధీ సుభాషిత గ్రందే త్రయోదశాధ్యాయః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో 8 వ చిన్న కధల పోటీ విజేతలకు

somepalli2 001 somepalli1 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

భరద్వాజ గోత్రీకుడు కామశాస్త్రి కుమారుడు పద్మనాభుడు .గోదావరిజిల్లా కోటిపల్లి లో జన్మించాడు. అక్కడి దైవం సోమేశ్వరుడు అంటే అవ్యాజభక్తి ఉన్నవాడు .సంస్కృతం లో ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’రాశాడు కోటిపల్లి తిరుణాల లలో దీన్ని ప్రదర్శించేవారు ..శివుడు త్రిపురాసురులను వధించిన కధ.-ప్రారంభ శ్లోకం –

‘దేవఃస్వార్ధ శివానవాను నయ స౦పూ త్కొత్తమంగ నయనాత్ –గంగా భు వ్యపవాహ్నగౌతమ తపస్సి ద్దిచ్చలా దుత్సుతః

ఇయం బుద్వదిఏవ కోటి పల్లి సంస్తానే నిరూద్వస్తయా  -పార్శ్వ దక్షిణామాప్తయోభయ తరస్సోమేశ్వరః పాతు నః’’

సూత్రధార, నటి లమధ్య సంభాషణలో కవి చరిత్ర తెలుస్తుంది .భారద్వాజ గోత్రీకుడైన ఎల్లావధాని కి పద్మనాభ కుమారుడు ఈయనకు కామ శాస్త్రి కొడుకు ఈయనకోడుకే పద్మనాభ కవి .గంగాధర గురువు అనుగ్రహం తో కవికి సకలశాస్త్రాలు వచ్చాయి .గంగాధరుడు అంటే శివుడుకావచ్చు అదే పేరున్న గురువూ కావచ్చు .త్రిపుర సంహారం కోసం పరామేశ్వరుడు రధం పై బయల్దేరిన యుద్దోత్తతి వర్ణ న ఇలా సాగింది –

‘’ఛందో  హాటక ఘోటక ప్రఘటితం చందః శిరః ప్రగ్రహం –వాణీ వల్లభ సారధి ప్రచరితం సర్వం సహా స్యందనం

చండా చండ మయూఖ మండల మహా చక్ర ద్వాయోపస్థితం—వై గానాయత మదద్భుతెన భగవానారుహ్య నిర్గచ్చతి ‘’

62-మరో పద్మనాభుడు ‘(18శతాబ్దం )

కాలం వగైరాలేవీ తలియని ఈ పద్మనాభుడు వేంకటాంబ ,లక్ష్మణ దంపతులకొడుకు .’’లీలా దర్పణ భాణం’’రాశాడు .ఇది శృంగారం రంగరించిన నాటకం .నాయకుడు లీలా శేఖరుడు ,నాయిక లీలావతి .ఈమె తొలినాట్యాన్ని తిలకించిన హీరో ప్రేమలో పడిపోయాడు .దీనికి ‘’మదన లీలా దర్పణ భాణం’’అనే పేరూ ఉంది .అసంపూర్తి రచన .కాశీకి వెళ్లి కవి దీన్ని రాసి ఉండాలి లేక ఊహించి రాసైన ఉండవచ్చు .ప్రారంభం అలాఅలా సాగిపోతుంది –

‘’లీలాలాలస మానసాభి రభి రభితో గోపీభి రంతః పురే –వ్యాలిప్తో మృదు చందనేన దిశతు శ్రేయస్సమే శ్రీ పతిః

నాంది తర్వాత శ్లోకం –‘’చలత్తిమిర చుమ్బితాంబురుహ విరీ బిమ్బోల్లాస –చ్చకారే మద కాలికొచ్చలితచక్రనృత్త క్రమైః’’

ప్రస్తావనలో పది శ్లోకాలు వంశ వర్ణ న ఉంది .వంశ క్రమం –గణపతి –పద్మనాభ –లక్ష్మణ భార్య ,వెంకమాంబ –సుబ్రహ్మణ్య-,పద్మనాభకవి .సూత్ర దారుడు కవిని వంశాన్ని పరిచయం చేస్తాడు –

‘’శ్రీమాన్ శ్రీమదుమార్ద దేహ   కరుణా పూర్ణాజ్వలప్రేక్షణ –ప్రాప్త శ్రీ కవితామృతాబ్దిలహరీ సంతోషిత శ్రేకవిః

శేషా శేష వచో విశేష విలస త్సౌర సౌభాగ్య భ్-ద్వాక్య్ప శ్రీ రధ పద్మనాభ సుకృతీ శ్రీ పద్మ నాభోపమః ‘’

ఘన చిద్బోదాయతి మనకవి గురువు అని తెలుస్తోంది .ఈయనే కొల్లూరి రాజశేఖరుని గురువు బోధానంద ఘనే౦ద్ర గురు అయి ఉండవచ్చు .కనుక కవి 18శతాబ్ది వాడు .

63-అవసరాల పద్మ రాజు

గోల్కొండ నియోగి అవసార పద్మ రాజు ,పిఠాపురం రాజు నీలాద్రి రావు మంత్రి .అయిడుకా౦డలలో భాగవత చంపు రాశాడు కవికి అంభోజ ,వర్నాధిక కాంభోజ అనే పేర్లూ ఉన్నాయి –ప్రారంభ శ్లోకం –

‘’శ్రియః కటాక్షః స తనోతు నః శివం విదిత్సునా యస్యద్వశం నవోత్పలం –వితన్యతే స్మిన్ విధినా దివా నిశం నిమేలినోన్మీ లన సంత తౌఘం ‘’

పద్మ రాజు శైలికి గద్య ఉదాహరణ –యాఃసలీలమ పుర స్కృత జీమూతా సౌదామిన్య ఇవ కామిన్యః కమనీయ తర కబరీ భరాఃపరి వవ్రు రనంతః పురగత మనవరతమఖిల భువనాదార నిజోదరం శ్రీ రోరాది ప్రణయినం ధనమేనం –‘’ఇలా సాగుతుంది

ఆ కాలపు అలవాటు ప్రకారం శృంగారాన్ని బాగా దట్టించాడు .బాలకృష్ణుని వర్ణన –‘’త్వం దృష్టా హి పరున్మాయా రరస మొరస్కా ధృవం కందుక –ద్వంద్వం మే గలితం చిరాయ నిహితం  గూడం త్వయా కంచుకే ‘’

గోపికా వస్త్రాపహరణం చేస్తున్న కన్నయ్య –

‘’నాభి దఘ్న మభావన్నత యామునం సలిలామంతరీయ తాం –ఉత్తరీయ మనురూప ముల్లస త్కేశం సంహితర భూద్విసరితా ‘’

అసలైన రాసక్రీడా  వర్ణన –

‘’అవిరలోభయ పార్శ్వ లసత్తరూప యుభయ పార్శ్వ గత స్వతం నూక్రుతే-మధు జిదంతర రాజత మండలే ,స్వయ మసౌ పరిదావివ చంద్రమాః ‘

చివరి శ్లోకం –చిరమాదిగతామ్రుద్ధిం లుమ్పంపలాశ తతోర్భుశం –సపది రచయన్నామోదా౦చన్ద్రీ రయ౦ సుమనా శ్చయ౦

దీనిపైదేవులపల్లి రామ సూరి రాసిన  సుది చంద్రిక ,రాఘవాచార్య రచించిన కవి రంజని వ్యాఖ్యానాలున్నాయి .కాని అచ్చు కాలేదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి నరసింహ విద్వన్మణి (1817-1873)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

59-మతుకు మల్లి  నరసింహ విద్వన్మణి (1817-1873)

కృష్ణా జిల్లా వల్లూరు సంస్థాన కవిగా ఉన్న మతుకుమల్లి నరసింహ కవి గుంటూరు జిల్లా తెనాలి వాడు .తండ్రి, తాత కనకాద్రి శాస్త్రి నరసింహ శాస్త్రులు మహా పండితులు .తల్లి జానకమ్మ తెలుగు కవయిత్రి ..కవి నృసింహ స్వామికి మహా భక్తుడు .సంస్క్రుతంద్రాలలో చాలా రాశాడు .అందులో తెలుగులో లో ఇందుమతీ పరిణయం లేక అజ చరితం ,చెన్నపురి విలాసం ,జలక్రీడలు రచించాడు .సంస్కృతం లో ‘’పుండ్ర నిర్ణయ చంద్రిక ,పుండ్ర  సూర్యోదయ కాల మహా దుర్దినం ,లక్ష్మీ నరసింహ స్తుతి స్తోత్రం రాశాడు ..ఇందులో సోత్రం ౩౦౦శ్లోకాలు ,6 అద్యాయాలతో ఉన్నది .వీటికి స్తంభోద్భవోధ్యాయం ,గండ భేరు౦ డాధ్యాయం ,నృసి౦హా ధ్యాయం ,సౌ౦ద ర్యాధ్యాయం ,దశావతారాధ్యాయం ,మాతృకాధ్యాయం అని పేర్లు పెట్టాడు .ఉగ్ర నరసిమ వృత్తాంతమే అయినా శ్లోకాలు చాల సరళం గా ఉండటం ప్రత్యేకత ..మచ్చుకి ఒకటి రెండు –

‘’చంద్ర రేఖా చమత్కార రాచంవదాంగి నఖాన్చలః –సుపర్వమకుటోగ్ధర్ష స్పురన్నఖ మణిధృణిః’’

శణార వి౦ద స్ఫర్గులు శోభమాన పదాంబుజః –శృతి సీమంత సీమాగ్ర సింధూర చరణా ధ్రుతిః’’

కమలా కటి సంవాస కమనీయా౦క  పాలికః –నిలి౦పాద్రినితంబ తట సున్దరః ‘

’60-కాకతి రుద్రమ గురువు నృసి౦ హర్షి

కాకతి గణపతి దేవ ,రాణి రుద్రమ దేవి ,ప్రతాపరుద్రుల ఆస్థాన గురువు నృసిం హర్షి..అనేక కావ్య శాస్త్ర గ్రంధ రచయిత.ఋగ్వేదానికి భాష్యం రాశాడు .ఈ కవిప్రతిభకు తార్కాణగా చాలా శ్లోకాలున్నాయి .వీటిని పరిశీలిస్తే ఋగ్వేదానికి ఛాయఅనే వ్యాఖ్యానం రాసి నట్లు తెలుస్తుంది .కాకతీయ చరితలో ఓరుగల్లు ,ఏకశిలా నగరం అనే పేర్లు ఎందుకు వచ్చాయో వివరించాడు .పది రూపకాలు రాసినట్లు ఉంది .విష్ణు అవతారాలలో నరసింహా వతారనికే ప్రాదాన్యమిచ్చాడు కవి .రచనలన్నీ తాటాకులపైనే రాశాడు .అవన్నీ కాలం లో కలిసిపోయాయి .శిలమీద ఎక్కినవే మిగిలాయి .వరంగల్ దగ్గర చిన్న గ్రామం ‘’ఉర్స్ ‘’ఉంది .దాని దగ్గర ఉన్న చిన్న కొండను’’ ఉర్సు గుట్ట’’ అంటారు .దానిమీద కాళిదాసు మేఘ సందేశాన్ని అనుకరిస్తూనృసిం హర్షి రాసిన కవిత్వం చెక్కబడింది .దానిలో 62శ్లోకాలున్నాయి .అవి మృదుమధురంగా కర్ణ పేయంగా ఉంటాయి .ఇందులో 60శార్దూల వృత్తాలు .మిగిలిన రెండు స్రగ్ధరా వృత్తాలు .మొదటి నాలుగు శ్లోకాలు ఉపోద్ఘాతం   లా ఉంటాయి .తర్వాత అంతా  సిద్ధుల ప్రేమ సందేశమే .వారిద్దరి వివాహం ,సంభోగ శృంగారం ,ఎడబాటు ,మళ్ళీ కలవటం వర్ణించ బడి ఉంది .మొదటి శ్లోకం –

‘’కస్మిస్సిద్ధ యువా సమంద యాతయా స్స్టైస్త్రోతసే సైకతే-రాగాందో రమ మాణయేవ లిఖితే కారండ వనాంతయా ‘’

సూర్యాస్స్తమయ ,చంద్రోదయా వర్ణన –‘’కాలేస్మిన్ పుట పాక తప్త కనకాకారేణలొలాక్రుతిః

సంధ్యా మేఘన వప్రవామ్ష్య నయనం రాగీ సమాసేదివాన్ ‘’

నాయిక తొట్రుపాటు కంగారును వర్ణిస్తూ –‘’తిష్టత్యుచ్వ లతిప్రయాతి సంభాషతే

తూష్ణీం భావ ముపైతి పశ్యతి దిశః స౦ మీల యత్యక్షిణీ’’

పెళ్లి లో ఇద్దరూ కలుసు కోవవటాన్ని చెబుతూ –‘’వేదీ మధ్య నివేషితం హుతవహం కృత్వా విదేస్సాక్షిణ౦

స్వేదాంభః  కణికాభిర౦ గుళిముఖా ద్వాంతా భి రాద్రస్తవః

రతిక్రీడలో నాయిపొందిన ఆనంద వర్ణన –‘’మ్లానం చాపి వికాసి చాపి వదనం వేణీ చ వదనం వేణీ చ వేష్టశ్లదా

భాలశ్చశ్రమ వారి మృస్టతిలకో  హాసశ్చసంజాయతే ‘’

హనుమ కొండలో’’ సిద్దేశ్వర గుట్ట ‘’మీద ఇంకొక కవిత కనిపిస్తుంది .కవిపేరు లేదు .ఇదీ నృసింహ కవిదా కాదా అని తేలలేదు .37శ్లోకాల అసంపూర్తి కావ్యం ఇది ..ఆంద్ర దేశం పంట పొలాలు తోటల వర్ణన ఉంది. అనుప్రాసతో సరళంగా సాగిన కవిత్వం ఇది –

‘’ఆంధ్రస్సంతి గరీయంసః కాన్చనాధ్యాయ శాలయః –తదా హాటక శైలస్య కటకా రత్న శాలినః

కేదారా యత్ర శాలీనం తరంగిత జలంత రాః-కృష్ణా౦గ ఛాయహరితా తదా జలనిదే స్తటాః

కానీనికా కలంకిన్యా కాంతి చంద్రికయా స్త్రియః –ఆహార యాంతి యత్రత్య శ్చ౦ద్రికా హారిణః ఖగం ‘’

ఈ శ్లోకాలను 1891లోడా.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారు  సేకరించిన శాసన లిపులనుండి తాను తీసుకొని ఉదాహరించానని డా బిరుద రాజు రామ రాజు గారు తెలియ జేశారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

కౌశిక గోత్రీకుడు పశుపతి కి కుమారుడే నాగనాధుడు .చమత్కార మంజరి రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు .రాచకొండ రాజులు అనపోత ,శృంగార భూపాల రాజుల ఆస్థానకవి .సంస్కృత విష్ణు పురాణాన్ని తెలుగు చేశాడు .సంస్కృతం లో మదన విలాస భాణంరాశాడు .ఇందులో కొద్దిభాగమే లభ్యమవటం దురదృష్టం .’

‘’అవ్యాత్ప్రకృతి మనోజ్ఞం నవ్యం తరుణ సౌరభం శంభో –శృంగార జీవనైషధమ౦గ౦ కారుణ్య రంగ భూర్యుష్మాన్ ‘’

‘’లోలాలాలకాన్చిత సమంచిత ఫాల భాగం ధర్మంబు బిందు పరి మండిత గండ మూలం

వల్గాత్కుచం తను రణత్కల కంఠ మూలం మోదం తనోతు సురతం మదిరేక్షణాయః ‘’

ఈ భాణాన్ని సర్వజ్న సింగుని కుమారుడు మేచయ గౌరవార్ధం రాశాడు .అంటే నాగనాధకవి మూడు తరాల రాజుల ప్రాపకం లో ఉన్నాడన్న మాట .రాచర్ల రాజులలోనూ ఈ పేర్లున్నవారున్నారు .సింగని కొడుకు అనపోతుని కి సమకాలికుడని తెలిపేఆధారం ఉంది

‘’రేచర్ల వంశ రత్నకరేణ—-శ్రీ సింహ భూపాల పూర్వాచల ప్రభాకరేణ కేశమామ్బికా కల్ప ప్రసూన గుచ్చేన —శ్రీ అన పోత భూపాలేన సతత సన్నిదీకృత కళ్యాణ నారాయణస్య వసంతోత్సవ —భరద్వాజాన్వయ పరి పూర్ణ రాత్నాకరస్య గురు విశ్వేశ్వర కవి చంద్రస్య ప్రియ శిష్యో నాగానాదః కవిః’’

శింగ భూపాలుడు అంటే రసార్నవ సుధాకరం రాసిన కవి రాజు ,అనపోతుని కుమారుడు అని చరిత్రకారుల భావన .మనకవి విశ్వేశ్వరుని శిష్యుడన్నదిఖాయమే మరి ఇక్కడికెలా వచ్చాడు ?విశ్వేశ్వరుడు సిన్గభూపాలుని ఆస్థానం లో ఉండి ఉంటాడు .వరంగల్ జిల్లా ఐనవోలు లో నాగానాధుడు రాసిన 1369నాటి శాసనం ఉంది .ఇది మొదటి అనపోతునికాలానికి చెందింది .రాజు దాన వివరం ఉంది –

‘’ఉర్వీ ముద్వరతే బిభార్తి చ కుతామ్నాయస్థితి వైరిహ –ద్వేదీ విశ్రుత విక్రమో హతా రిపు క్షత్రాన్వయ  స్స్తోతుమాన్ ‘’

దానం 1369లో అంటే శక వత్సరం 1291లో ఇచ్చినట్లు ఉంది .శాసనం చివర తన గోత్రాదులు చెప్పుకొన్నాడు .కనుక 14 వ శతాబ్దానికి చెందిన అనపోతనాయకుని కాలం లో ని వాడే  .విశ్వేశ్వరుడు అనపోతుని కొడుకు మొదటి రెండవ  సింగ భూపాలుని ఆస్థానం లోని వాడు .ఇతడే చివరి కాకతీయ సామ్రాజ్యాధిపతి ప్రతాప రుద్రుని సమకాలికుడు కూడా .రాచకొండను 1384-1399లో ఏలిన రెండవ సింగమ నాయకుని కొలువులోనూ ఉన్నాడు .అంటే విశ్వేశ్వరుని జీవితకాలం చాలా సుదీర్ఘం అని ,రాచకొండ వెలమ ప్రభువుల మూడు తరాలలోను ఉన్నాడని ఆచార్య బిరుద రాజు రామరాజు గారు తేల్చి చెప్పారు .

57-కందుకూరి నాగ నాద సూరి

కాలాదులు తెలియని ఈ కవి నియోగి బ్రాహ్మణుడని ‘’మీనాక్షి కళ్యాణ చంపు ‘’,రామ విజయ ‘’కావ్యాలు రాశాడని తెలుస్తోంది చంపువు లోకవి వివరాలేమీలేవు .రెండవ దానిలో ఆశ్వాశాంతా గద్యలో కొన్ని వివరాలున్నాయి

‘’యత్కటాక్షోప విక్షిప్త నిరూఢ నిజ సంపదః –ప్రత్యూహ విన వర్తింతేకలయే తంవినాయకం

కులశేఖరుదు మలయా ధ్వజుని  కూతురు మీనాక్షికి  మధురానధుడు శివునికి జరిగిన వివాహమే ఇతి వృత్తం కులశేఖరుడు ప్రాచీన కల్యానపురిని ఏలిన రాజు .ఒక రోజు రాజుకు శివుడు కలలో కనిపించి తానూ నగరానికి పడమరలో ఉన్న చిన్న ఆలయం లో ఉన్నానని ,తనకు నగరం మధ్యలో మంచి ఆలయం నిర్మిచి పూజించమని కోరాడు .శివ సన్నిధిని రాజు గుర్తించి కొత్త రాజధాని కట్టి మధుర అని పేరెట్టి ఆలయం నిర్మించి శివుని ప్రతిష్టించి భక్తీ తో అర్చించాడు .దీనికి ఆధారం హాలస్య మహాత్మ్యం ‘’

రామాయణాన్ని ఆరుకా౦డలలో రామ విజయం గా రాశాడు .మొదటిశ్లోకం సరిగ్గా లేదుకాని అందులో చంద్ర మౌళి కుమారుడు విష్ణు రాజును ప్రస్తుతించాడు .దీన్ని రాయటానికి  కారణం చెప్పుకొన్నాడు –

‘’కచ ప్రబంధ రచనకాహ మత్యల్పసంమతిః-చంద్ర దానే యదా బాలౌ విధాతుం తమహం యతే ‘’

ఆశ్వాసాంత గద్యం లో –‘’ఇతి కందుకూరి చొక్కనాద శిష్య శేషమాంబా గర్భ సంభవ నాగ నాద విరచితే రామ విజయేయుద్ధ కా౦డః

58- మోక్ష గుండం నారాయణ (18వ శతాబ్ది మధ్యకాలం )

మైసూర్ రాష్ట్రం లో మోక్ష గుండం ఇంటిపేరున్న బ్రాహ్మణ కవి నారాయణ .తండ్రి వెంకటార్య 18శతాబ్దం లో జీవించాడు నారాయణ కవి హరిశ్చంద్ర చంపు రాశాడు .ఇది పద్య ,గద్యాత్మకం . సూర్య వంశజుడైన  సత్య హరిశ్చంద్రుని కద.మూడు విలాసాల తర్వాత కద తెలియదు .శ్రీ కృష్ణ ప్రార్ధనతో ప్రారంభించాడుకవి –

‘’వందే త0 దేవకీ పుత్రం మందేతర గుణార్నవం –వందారు ముని బృందార వృందా వన పరాయణం ‘’

తన కుటుంబాన్ని సవివరంగా తెలియ జేశాడు .సమకాలీన రాజునూ పేర్కొన్నాడు .ఆయన రాసిన దానిప్రకారం గౌతమ గోత్రానికి చెందిన మోక్ష గుండం సర్వ సూరి  .ఆయనకు కామయ కొడుకు .ఈయన భార్య లలితాంబ ..వీరి కొడుకు హోన్నయ్య ,కోడలు వెంగమాంబ .వీరి పుత్రుడు వెంకట రాయ .ఈయన మొదటిభార్య కృష్ణ మాంబ రెండవ భార్య సీతమ్మ .మొదటి భార్య కుమారుడే మనకవి నారాయణ .రెండవ భార్య కుమారుడిపేరు కూడా నారాయణ .మోక్షగుండం వారికి రత్న గిరి వీరరాజుపోషకుడు .ఈ వంశం మూల పురుషుడు  17౦౦-1759కాలపు చిక్కదేవరాయ రాజు వద్ద సైన్యాధ్యక్షుడు మంత్రి అయిన  కలువే వీరారాజు .కనుక మనకవి 18వ శతాబ్ది మధ్యవాడు ..పింగల నామ సంవత్సర విజయ దశమినాడు ఈ కావ్యం రాసినట్లు తెలుస్తోంది .

‘’యస్మిన్  కృష్ణ కృపా ఝరీ  భర పరీత పాంచ సౌదా పగా—రింగత్తురంగశీకర కణాఃకల్ప ప్రసూనాయతే

తన్నారాయణ ధీమత  స్సురుచిరో కావ్యామృతే చాదిమః-చంపూ నామని సంవిదాంకృత సముల్లాసో విలాసోగమత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

 

 

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

19వ శతాబ్ది చివరిభాగం లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించాడు.తెలుగు సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు ,కవి .’’వసంత విలాస భాణం’’,మిత్ర భాషితం ‘’రాసి ముద్రించాడు .కాళిదాసమహా కవి మేఘ సందేశ కావ్యానికి అనుకరణగా ‘’శుక సందేశం ‘’రాశాడు సింహాచల రాణి చిలుక ద్వారా మద్రాస్ లో ని లాయర్ కు పంపిన సందేశం ఇది .మందా క్రాంత వ్రుతాలలో రెండు ఆశ్వాసాలలో 179శ్లోకాల తో ఉన్న కావ్యం .కొన్ని శ్లోకాలు మాత్రమె లభ్యం -.

‘’కాచిన్మోచత రుసి రుచిరే సింహ శైలస్య కూటే-ప్రజ్ఞా రాజ్ఞీ వసతి మకరో ద్దూర దేశాప్రచారం ‘’

ఘీన్కారో ద్యమ్నదకారి ఘటా కింతు భీత ప్రదాత్రీ –స్పూర్జర్గర్జ నినాద కలితా నీల కాదంబినీ వా ‘’

ఆధునిక జీవితాన్ని ప్రాచీన ఛందస్సు లో ఇంత గొప్పగా చెప్పటం కవి ప్రతిభకు తార్కాణ.ఇందులో మద్రాస్ సెంట్రల్ స్టేషన్ వర్ణన ఉంది .రైలు పట్టాలు ,దాని దగ్గర హెడ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ ,వెయిటింగ్  రూమ్ ,మెషీన్ లతో లిఫ్ట్ తో పనిచేసే విధానం , పైకి వెళ్ళే ఏర్పాటు .స్టేషన్ బంగాళాఖాతాని కి దగ్గరగా ఉండటం ,ఏనుగుల మేఘ ధ్వనుల వంటి ఘీంకారాలు ,వరుస ఇళ్ళు ,నల్లని మేఘాలు ,వేగం గా దూసుకు పోయే రైళ్ళు అన్నీ స్పష్టంగా వర్ణించాడు .

‘’రైలేలీలా నరా మృగ పతేః కుత్ర చిత్ తత్ర కానౌ –పాంసు క్రీడాప్రవణ వయసం ప్పుత్ర మ౦ఖే వహంతీ

తత్తన్మాయా వచన రచనో పక్రమైః ఖేల యంతీ-కీరం స్వేరం స్వయముపగతం రాజ పత్నీదదర్శ ‘’

55-శిష్టానరసింహ శాస్త్రి

కాశ్యప గోత్రేకుడు సేతారామ శాస్త్రి కుమారుడు నరసింహ శాస్త్రి .షట్ దర్శనాలలో మహా ప్రావీణ్యు డు..తర్కం లో అవక్ర పరాక్రముడు కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజి లో తెలుగు సంస్కృత ఉపాధ్యాయునిగా పని చేశాడు .తండ్రి కూడా గొప్ప విద్వాంసుడు .తండ్రి దగ్గరే విద్య నేర్చాడు .కాళిదాసు మేఘ సందేశ కావ్యాన్ని తెలుగు చేశాడు .’’సర్వ తంత్ర విద్వర ‘’,విద్వన్మణి,మహాపాధ్యాయ బిరుదాంకితుడు .

ఈయన సంస్కృత కావ్యాలు –ఇందిరా పరిణయం అనే 5అంకాల నాటకం ,ఆరు సర్గల శ్రీ కృష్ణోదయ మహా కావ్యం ,శృతి రత్న దీపం ,వివస్వ ప్రభ అనే బ్రహ్మ సూత్రాభాష్యానికి వ్యాఖ్యానం  .ఇందిరా పరిణయ నాటకం  సముద్ర మధనం తో ప్రారంభ మవుతుంది.నృసింహావతారం తో సమాప్తమౌతుంది .సంస్కృతం పై మంచి పట్టు ఉన్నకవి .నందన వన వర్ణన బాగా చేశాడు –

‘’కీరాఃకోర కితేషు కల్ప తరుషుప్రారబ్ధ వేదాక్షరా –వాతస్చందన వాటి కాంగణచలద్రంగా పరామ్భ స్ప్రుశః

కిజ్వేతే విరు వంతి పంచమ రవం చూతేషు  పుంస్కోకిలాః-కున్జ్జేషు ప్రతి బద్వఝాంక్రుతి రవా దావంత్యమీ షట్పదాః’’

శ్రీ కృష్ణోదయ మహా కావ్యం లో ఆరు సర్గలున్నాయి.భాగవత క్రిష్ణావార కద.క్రిష్ణలీలలను కవితాత్మకంగా వర్ణించాడు .

గర్భిణిగా ఉన్న దేవకీదేవి  పృధు పయోధరాలను వర్ణించాడు –

‘’హారి నీలామణిధ్రుతిర్హరిః  సుదతీ గర్భ ముపాగామస్తతః –కుఛ మధ్యా వినిర్గాతా హరే స్తను  కాంతిః కిము చుంచు కాశ్రితా ‘’

ఇందులోని కొన్నిలీలా శుకుని  శ్రీ కృష్ణ కర్ణామృతం ను పోలి ఉంటాయి .తాను  రాసిన ఇతర క్రుతులనూ చెప్పుకొన్నాడు .శ్రీ కృష్ణ వర్ణనలో –

‘’శ్రీ కృష్ణ పదా౦చిత  శాద్వలేషు గతాగతం క్రిష్ణామ్రుగా న చక్రుః-తదీయ భక్త్యా నిజ నామ రూపే జగత్సు క్రిష్ణాత్మ కతావ గత్యా’’

93శ్లోకాల శృతి రత్న దీపం అద్వైత సారాంశం .మొదటి శ్లోక౦-

‘’జ్యోతిర్వేదే యదిందుద్రుతికలిత జటా బద్ధ లేలీహనే౦ద్రః-తద్భోగా రబ్ధానిద్రా పరి చయ చతురం చాపి లక్ష్మీసనాధం ‘’

ఆశ్వాసాంత గద్యం –‘’శిష్టా న్వయేన నరసింహ సమాశ్ర యేన శ్రీ కాశ్యపేన రచితే శృతి రత్న దీపే మయావభాస యియతా ప్రధమః పరస్య నారాయణస్య చరణామ్బుజయో ర్పితో భూత్’’

నరసింహ శాస్త్రి కృతులలో వివస్వప్రభ కవి ప్రతిభకు పట్టం కట్టిన రచన .వివిధ శాస్త్ర పరిజ్ఞానం లోక జ్ఞానం రాశీభూతమై దర్శనమిస్తుంది .ఇది శంకరాచార్య స్వామి బ్రహ్మ సూత్ర భాష్యానికి మహా వ్యాఖ్యానం  .శంకర భాష్యాన్ని సమర్ధించిన  భట్ట పాద ,శబర స్వామి ,పాణిని .పతంజలి ,కాశిక యాస్క ,మణి దీధితి ,గదాధరులను గట్టిగా సమర్ధిస్తూ రామానుజ భాష్యాన్ని తూర్పార బట్టిన గొప్ప రచన .తన వ్యాఖ్యానంపై కవి స్పందిస్తూ –

‘’ప్రౌడ ద్వాంతిరాస్క్రుత శృతి రివసిద్ధాంత ఘంటా పద –స్పూర్త్యై ర్నిర్మల చేత సా మియమభూదద్దేతా భాష్యోపరీ

శ్రీమత్పండిత పుండరీక పరిషద్విఖ్యాతశిష్టాన్వయ –శ్రీ విద్వన్నర సింహ తార్కిక మణోవ్యాఖ్యా వివస్పత్ప్రభా ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment