విజయ వాడలో 2007 ఏళ్ళక్రితం ఆలయం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దుబాయ్ లో విశ్వనాధ్ కు బ్రహ్మానందం పాదాభి వందనం

వందనం… పాదాభివందనం

దుబాయ్‌లో శుక్రవారం జరిగిన గామా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు జీనన సాఫల్య పురస్కారం అందచేశారు. కృష్ణంరాజు, హాస్యనటుడు బ్రహ్మానందం సంయుక్తంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం శిరసు వంచి విశ్వనాథ్‌కు పాదాభివందనం చేయడం వేదికపైనున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కె.విశ్వనాథ్‌వంటి ధన్యజీవిని సత్కరించడం తెలుగు వారందరికీ జీవనసాఫల్య పురస్కారం వంటిదని సిరివెన్నెల సీతారామశాసి్త్ర వ్యాఖ్యానించారు. అనంతరం విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘ ‘‘నేను గొప్పవాడిని కాదు. అద్భుత శక్తులేమీ లేవు. చదుకున్నదీ అంతంత మాత్రమే. కానీ నా పని నేను చేసుకోవడం, నమ్మినదానికి కట్టుబడటం నా విజయ రహస్యం. తపస్సు అంటే దేవుడికోసం చేసేది కాదు. చేసే పనిని ఇష్టపడి, ప్రేమించి సంపూర్ణం చేసినవాడే తపస్వి’’ అని అన్నారు. . ఈ కార్యక్రమంలో కోటి, చిత్ర, దేవిశ్రీ ప్రసాద్‌, అల్లరి నరేష్‌, శర్వానంద్‌, ఎం.ఎం.శ్రీలేఖ, రఘు కుంచె, అలీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

33 కథల తర్వాత నచ్చిందిది.. ‘షమితాబ్‌’.

33 కథల తర్వాత నచ్చిందిది..
ఎనిమిదిన్నర నెలల గ్యాప్‌… 33 ిస్ర్కిప్టులు… ధను్‌షకు ఏవీ నచ్చలేదు. ఒకరోజు డైరెక్టర్‌ బాల్కీ నుంచి ఫోన్‌
వచ్చింది. స్టోరీ చెబితే వావ్‌ అన్నాడు. ఈ సినిమాలో ఇంకో పాత్ర చేసేది అమితాబచ్చన్‌ అని చెప్పేసరికి
మరుక్షణమే ఓకే చెప్పేశాడు. ఆ సినిమానే ‘షమితాబ్‌’. దాని ప్రమోషన్‌లో భాగంగా ధనుష్‌ హైదరాబాద్‌కు
వచ్చినపుడు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…
హైదరాబాద్‌కు మీరు తరచుగా వస్తుంటారా?
ఇక్కడ షూటింగ్‌ ఉన్నప్పుడు, స్నేహితులను కలవాలనుకున్నప్పుడు వస్తుంటాను. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. హైదరాబాదీలు చూపించే ఆప్యాయతను ఎప్పటికీ మరచిపోలేను. ఇక్కడి ఫుడ్‌ అన్నా కూడా నాకు చాలా ఇష్టం.
హిందీలో మీరు చేస్తున్న రెండో సినిమా ‘షమితాబ్‌’. ఆ సినిమా విశేషాలు ఏంటి? ఆ సినిమాను ఎంచుకోవడానికి కారణం ఏంటి? 
‘రాంజిహనా’ తరువాత సుమారు ఎనిమిదిన్నర నెలల పాటు 33 స్ర్కిప్టులు విన్నాను. కానీ ఏదీ నచ్చలేదు. ఫైనల్‌గా షమితాబ్‌ కథ బాగా నచ్చింది. ఎనిమిదిన్నర నెలల తరువాత ఒకరోజు బాల్కిగారు ఫోన్‌ చేసి ఒక సారి ఆఫీ్‌సకు రమ్మన్నారు. వెడితే కథ చెప్పారు. ఆయన స్టోరీ చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నాను. హిందీలో ఇదే నా రెండో సినిమా అని. పూర్తి ఫ్రెష్‌ కాన్సెప్ట్‌. ఈ సినిమాలో అమితాబ్‌ ఉన్నారని కూడా ఆయన చెప్పారు. వెంటనే ఓకె చెప్పాను.
‘షమితాబ్‌’ పేరు పెట్టడం వెనక ఏదైనా కారణం ఉందా? 
నా పేరు ధను్‌షలోని ‘ష్‌’, అమితాబ్‌ పేరు కలిపి టైటిల్‌ ఖరారు చేశారు. కానీ టైటిల్‌కు మరో ప్రాముఖ్యత కూడా ఉంది. బాల్కి తప్ప మరెవరూ ఇలాంటి టైటిల్‌ పెట్టలేరు. ఈ సినిమాలో నన్ను మాత్రం ధనుష్‌ అని పిలవరు. అది మాత్రం చెప్పగలను.
ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
నటుడు కావాలనే లక్ష్యంతో గ్రామం నుంచి పట్టణానికి వచ్చిన యువకుడి పాత్రను చేశాను. అతనికి మాటలు రావు. అమితాబ్‌ అతనికి వాయి్‌సను అందిస్తారు. వీళ్లద్దరి టాలెంట్స్‌ వృథా కానివ్వకూడదని కలిపే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్‌ అక్షర. అయితే వీళ్లిద్దరి ఇగోలు దెబ్బతిని క్లాషెస్‌ వస్తాయి. జీవితంలో సక్సెస్‌ కావాలంటే ఎందుకు కలిసి ఉండాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలియజేస్తుందీ చిత్రం.
మీ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు కదా! ఎలా ఫీలయ్యారు?
షమితాబ్‌ ఒక్కటే కాదు. నేను చేసిన ఏ సినిమా అయినా ఆయన సంగీతం నుంచి ఇనిస్పిరేషన్‌ పొందుతాను. ఆయన సంగీతం నుంచి సంతోషాన్ని, ప్రేమను పొందుతాను. ఇళయారాజా గారు తన సంగీతంతో షమితాబ్‌ను ఆశీర్వదించారు. తన పాటల ద్వారా స్టోరీ వెర్షన్‌ను చెబుతారు. షమితాబ్‌ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది.
తెలుగు బాగా మాట్లాడతారా?
తెలుగు నాకు బాగా అర్థమవుతుంది. మాట్లాడటం మాత్రమే రాదు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాటు లేదని గతంలా అన్నారు. ఎందుకు?
నిజంగా అది చాలా కష్టం. అందరూ ఎలా ఇస్తారో నాకు తెలియదు. ఒక్కో సినిమాకు మూడు నాలుగు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తోంది. అయితే ప్రతి సినిమాకు నాలుగైదు కామన్‌ క్వశ్చన్లు ఉంటున్నాయి.
ట్రేలర్‌లో అమితాబ్‌ కాలర్‌ పట్టుకుని లాగుతున్న సీన్‌ ఉంది. అలాంటి సీన్‌ చేయడం కష్టమనిపించిందా?
మీరు చెబుతున్న దాన్ని నేను కరెక్ట్‌ చేస్తాను. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్‌ మరో క్యారెక్టర్‌ కాలర్‌ పట్టుకుని లాగుతోంది. అంతే! ఒకవేళ నేను అమితాబ్‌గారి కాలర్‌ పట్టుకుని లాగుతున్నానని అనుకున్నట్లయితే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేను. కాబట్టి నేను ఎలాంటి సంకోచం లేకుండా చేశాను. ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ సినిమానే ముఖ్యం. అమితాబ్‌ సర్‌కి మేజర్‌ క్రెడిట్‌ దక్కుతుంది. ఎందుకంటే మేమందరం కంఫర్టబుల్‌గా నటించేలా చే శారు. ఈ సినిమాలో నాపాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను.
నార్త్‌ ఇండియాలోనూ, సౌత్‌ ఇండియాలోనూ హీరోలను ఫ్యాన్స్‌ ఆరాధించే విధానంలో తేడాను గమనించారా?
ఒకరోజు ఢిల్లీలో ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లాం. అమితాబ్‌ గారిని చూడటానికి చాలామంది ఎగబడ్డారు. అదే సీన్‌ దక్షిణాదిలోనూ కనిపిస్తుంది. ఒకవేళ రజనీ సర్‌ పబ్లిక్‌ ప్లేస్‌కి వెళితే సేమ్‌ సీన్‌ కనిపిస్తుంది. తేడా ఎక్కడ చూసానంటే మొదటి రోజు, మొదటి షో సెలబ్రేషన్‌లా ఉంటుంది. దాన్ని మీరు కూడా గమనించవచ్చు. కొందరి స్టార్స్‌ సినిమాలు రిలీజ్‌ అయిన రోజు పండగే. దీపావళి, దసరా ప్రతీ ఏడాది వస్తాయి. కానీ రజనీ సినిమా కోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు మనందరికీ పెద్ద పండగ.
మీ యంగర్‌ జనరేషన్‌లో హీరోలందరూ స్టార్స్‌గా ఫీలవుతున్నారా?
మేం కూడా స్టార్స్‌లా ఫీలయ్యేలా చేస్తుంటారు అభిమానులు. ఫ్యాన్స్‌ నుంచి లభించే ప్రేమ, మద్దతు మేం స్టార్స్‌ అనిపించేలా చేస్తాయి. దాన్ని మేం గౌరవంగా భావిస్తాం.
మీ డైరెక్టర్‌ బాల్కి గురించి చెప్పండి?
చాలా గొప్ప దర్శకుడు. ఆయనకు గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. దేశంలో ఉన్న గొప్ప దర్శకుల్లో అతనొకరు. షమితాబ్‌లో నాకు గొప్ప క్యారెక్టర్‌ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
అమితాబ్‌ గారే మీ పేరును బాల్కీకి సూచించారట. నిజమేనా?
నేననుకోవడం సౌత్‌లో ఈ సినిమా ఎవరు చేస్తే బాగుంటుందని బాల్కీగారు అమితాబ్‌ సర్‌ని అడిగి ఉంటారు. అప్పుడు అమితాబ్‌ గారు రజనీ సర్‌, ధనుష్‌ చేస్తే బాగుంటుందని చెప్పి ఉంటారు. ఆ తరువాత అమితాబ్‌గారే ధనుష్‌ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని ఉంటారు.
శృతిహాసన్‌, అక్షరహాసన్‌ ఇద్దరితో కలిసి పనిచేశారు కదా? ఇద్దరిలో తేడా ఏంటి?
ఇద్దరూ వేరీ టాలెంటెడ్‌. ఇద్దరూ ఇండివిడ్యువాలిటీ కోసం కష్టపడి పనిచేస్తారు.
 నేహారెడ్డి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతరిక్షం లో నాసా మెనూ

అంతరిక్షం లో నాసా మెనూ

ఆకలేస్తే- ఇంట్లో అయినా, ఆఫీసులో
అయినా ఏదో ఒకటి లాగించేస్తాం. అదే
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగా
ములయితే ఏం చేస్తారు? భూమికి 400
కిలోమీటర్లపైన ఎటువంటి గురుత్వాకర్షణ
శక్తి లేని వాతావరణంలో ఉండే వ్యోమగా
ములు ఎలాంటి ఆహారం తింటారు?వాళ్లూ
మనలాంటి ఆహారమే తింటారంటే ఆశ్చర్యంగా
అనిపిస్తుంది. ఇటీవలే అక్కడి వ్యోమగాముల
కోసం రకరకాల ఆహార పదార్థాలను తీసుకొని
ఒక వ్యోమనౌక వెళ్లింది కూడా..

ఇటీవల వర్జీనీయాలోని వాలప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ నుంచి ఒక వ్యోమనౌక ఐఎ్‌సఎస్‌కు బయలుదేరి వెళ్లింది. దీనిలో 3000 పౌండ్ల బరువైన ఆహార పదార్థాలు, ఇతర సరుకులు ఉన్నాయి. ఇవన్నీ ఐఎ్‌సఎ్‌సలో ఉండే వ్యోమగాములకు ఉపయోగపడేవే. ఇప్పటిదాకా ఐఎ్‌సఎ్‌సలో 15 దేశాలకు చెందిన 200 మంది వ్యోమగాములు నివసించారు. వీరికి అవసరమైన ఆహారపదార్థాలను సరఫరా చేసే బాధ్యత హుస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఆహార పదార్థాలంటే- ప్రతి రోజు మనం తినే వంటలు కావు. అవి ఆరునెలల పాటు తాజాగా ఉండాలి. వ్యోమగాములకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఐఎ్‌సఎ్‌సలో ఎక్కువ స్పేస్‌ ఉండదు కాబట్టి వీలైనంత తక్కువ పరిమాణంలో ఉండాలి. ఐఎ్‌సఎస్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. పౌష్టికాహార నిపుణుల అంచనాల ప్రకారం ఒక వ్యోమగామికి ప్రతి రోజు మూడువేల కాలరీలు అవసరమవుతాయి. దీనికి తగ్గట్టుగా జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లోని నిపుణులు ఆహారాన్ని తయారుచేస్తారు.
ఒకప్పుడు వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని పేస్ట్‌గా చేసి ట్యూబ్‌లలో పెట్టి పంపేవారు. అయితే వ్యోమగాములు ఆ ఆహారాన్ని తినటానికి ఎక్కువ ఇష్టపడేవారు కాదు. ఆహారం కేవలం శరీరానికి శక్తిని ఇవ్వటానికి మాత్రమే కాకుండా మంచి అనుభూతిని కూడా ఇవ్వటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత వ్యోమగాములకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలనే విషయంలో అనేక పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఐఎ్‌సఎ్‌సలో రిఫ్రిజిరేటర్లు ఉండవు కాబట్టి- ఆహారాన్ని ఎక్కువ కాలం ఎలా నిల్వ ఉంచాలనే సమస్య ప్రధానంగా ఎదురయింది. అందువల్ల ఆహారంలో ఉన్న తేమను పూర్తిగా తొలగించి అంతరిక్షంలోకి చిన్న సంచులలో పంపితే ఈ సమస్య తీరుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక వ్యోమగామికి ఎన్ని కేలరీలు అవసరమవుతాయో గమనించి దానికి తగినట్లు సంచులను తయారుచేయటం ప్రారంభించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన మెనూలో మన దేశానికి చెందిన చేపల కూర ఉండటం విశేషం. వ్యోమగాములకు రకరకాల ఆహార పదార్థాలతో పాటుగా చాక్‌లెట్‌ పుడ్డింగ్‌, లెమన్‌ కర్డ్‌ కేక్‌, అప్రికాట్‌ కాబ్లర్‌ వంటి తీపి పదార్థాలను కూడా పంపుతారు. వ్యోమగాముల పుట్టిన రోజులకు కేక్‌లను కూడా ఈ మధ్య పంపుతున్నారు. ఇటీవల కాలంలో వ్యోమగాములకు పంపే ఆహారంలో సోడియం పరిమాణాన్ని చాలా వరకు తగ్గించారు.
గురుత్వాకర్షణ శక్తి లేని ప్రాంతంలో ద్రవ పదార్థాలు కిందకు పడవు. గాలిలోనే తేలుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కాఫీ లేదా వేడి వేడి సూప్‌ను ఎలా తాగాలి? సా్ట్రతో తాగితే నోరు కాలిపోతుంది కాబట్టి పోర్ట్‌ల్యాండ్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన కప్పును తయారుచేశారు. చిన్న పిల్లలు వేసుకొనే బూట్ల మాదిరిగా ఉండే ఈ కప్పులో కాఫీని గురుత్వాకర్షణ శక్తి లేని ప్రదేశంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగచ్చు. అయితే ఈ కప్పు కూడా అంత సులభంగా తయారవలేదు. దీనిని రూపొందించటానికి లక్ష డాలర్ల (దాదాపు 63 లక్షల రూపాయలు) ఖర్చు అయింది. ఒకో కప్పు ఖరీదు దాదాపు 500 డాలర్లు (దాదాపు 30 వేల రూపాయలు) దాకా ఉంటుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏదండీ మహాభారతం! రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!

ఏదండీ మహాభారతం!

andhraprabha –   Mon, 2 Feb 2015, IST
  • రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!

మొన్న ‘రామాయణ విషవృక్షం’ రాసి, అఖండకీర్తి ప్రకీర్తుల్ని మూటగట్టుకొన్న రంగనాయకమ్మ ఇప్పుడు ‘ఇదండీ మహాభారతం’ అన్న ఉద్గ్రంధాన్ని రచించి, వ్యాసుని బొడ్లో వ్రేలెట్టి, నడిబజారులోకి ఈడుస్తోంది! శ్రీకృష్ణుణ్ణి, ధర్మజునీ, ద్రౌపదినీ కడిగేస్తోంది!

ఆమె మాటల్లోనే చెప్పాలంటే;

”మొగ్గా పువ్వూలేని, కాయా పండూ లేని మోడు/ మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్ధాల, కట్టుకథల, పుక్కిటి పురాణాల పుట్ట మహాభారతం!” (అట్టమీద)

ఇంతటి పనికిరాని చెత్తపుస్తకాన్ని ఇంతకాలంగా బుద్ధిలేని హైందవజాతి ఎలా తలెకెత్తుకు పూజిస్తోందీ అర్థంకావడం లేదు నాకు, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని, ఏ చెత్తకుండీలోనో, ఏ మూసీ నదిలోనో, ఏ మురిక్కాలవలోనో పారేసి, డెట్టాలుతో చేతుల్ని కడిగేసుకోవడం మంచిది.

చివరి మాటగా ఈ రచయిత్రి ఏమంటోందో చెప్పమంటారా?…

”మహాభారతం గురించి ఒక్కమాటతో చెప్పుకోవాలంటే, అది వ్యర్థమహాభారతం!” అని. (పి.474)

మన చెవిటి మేళానికి అనగా హైందవజాతికి ఈ మాట వినిపించిందో లేదో? ఈ పుస్తకం కనిపించిందో లేదో? కళ్ళూ, చెవులూ, ముక్కూ… పంచేంద్రియాలూ మూసుక్కుచుందో తెలీదు!

రామాయణ భారత భాగవతాదులూ, పురాణాలూ, జరిగిన కథలేననీ, చరిత్రలేననీ, చాలామంది అమాయకుల ప్రగాఢ విశ్వాసం. దాన్ని ‘క్యాష్‌’ చేసుకోవాలని చూస్తోంది ఈ నోటిదురుసు మేధావురాలు!

ఒకప్పుడు స్త్రీవాదులంటే వేశ్యలేనని అరచి గగ్గోలుపెట్టింది. మరోసారి హిందువులకు జుట్టెందుకు? బొట్టెందుకు? నామాలెందుకు? గడ్డాలూ మీసాలూ ఎందుకు? అంటూ వెక్కిరించింది, ఆ పై రామాయణాన్ని ‘విషవృక్ష’మంటూ ఖూనీ చేసింది. ఇప్పుడు ఏకంగా మహాభారతాన్నే ఖైమా చేసేస్తోంది. అఖిల భారత జనానీకం సాక్షిగా!

భేషు! రంగనాయకమ్మా! నీకు నీవేసాటి! మా మగధీరులంతా నీపాద గోటికి సరికారు!

భారతం ఒక చరిత్రనుకోవడం మన అమాయకత్వమే, విజ్ఞాన రాహిత్యమే. చివరికి రామాయణమైనా, పురాణాలైనా అంతే! అవి ప్రతీకాత్మక కావ్యాలు. అనగా మహాప్రహేళికలు.

అసలు పేరులోనే ఉంది అర్థం. భారతం (భా ్శ రతం) అంటే, కిరణాల క్రీడ! వెలుగూ చీకట్లయుద్ధం!

‘విశ్వమ్‌’ అంటే ‘శివమ్‌’ అనీ, ‘వేదమ్‌’ అంటే ‘దేవమ్‌’ అనీ, ‘కురుక్షేత్రం’మంటే ‘రుక్‌ క్షేత్రం’ (వేదభూమి) అనీ అర్థం చేసుకోవాలి.

‘ధృతరాష్ట్రుడు’ ఒక విశ్వప్రతీక. (దశరథుడూ అంతే!) అనగా ‘ధరించిన రాష్ట్రం కలవాడ’ని అర్థం. ‘రాష్ట్ర’ మనగా శరీరం, దేశం, విశ్వం. అందువల్ల ఇక్కడ ధృతరాష్ట్రుడనగా విశ్వాన్ని ధరించిన వాడన్న అర్థాన్ని చెప్పుకోవాలి. విశ్వంలో వెలుగులకన్నా చీకట్లే ఎక్కువ. అందుకే, అతడు పుట్టుగ్రుడ్డి.

‘దుర్యోధనాదులు’ కాలమేఘ ప్రతీకలు. వాళ్ళు నూరుగురు. అనగా మేఘాలు అనంతమని అర్థం.

‘శ్రీకృష్ణుడు’ సూర్యప్రతీక. ‘కృష్ణ’ శబ్దానికి నలుపులేదా నీలి రంగనీ, ‘ఆకర్షణ’ అనీ అర్థాలు. సూర్యుడు ‘నీలలోహిత కిరణుడు’, ఆపై ఆకర్షణ శక్తికలవాడు’ కదా? (సైన్సు) ‘పాండవులు’ చంద్రవంశం వారు. అనగా చంద్రప్రతీకలు. భీష్ముడు, కర్ణుడు, ధర్మజుడు, అభిమన్యుడు మొదలైనవారలంతా చంద్రప్రతీకలే!

పంచపాండవులు పంచభూతాలకు ప్రతీకలన్నది తప్పుడు అభిప్రాయం. మహాభారతం లోని ‘రాజసూయయాగ’ ఘట్టాన్ని చూస్తే, తెలుస్తుందది. ధర్మజుడు ‘ఇంద్రప్రస్థపురాన్ని’ (ఆకాశం లేదా అంతరిక్షాన్ని) ఏలుకొంటే, మిగతా నలుగురూ నాలుగు దిక్కుల్ని ఏలుకున్నారు. అనగా ఆ మిగతానలుగురు దిక్పాలకులని ధ్వని.

ద్రౌపది ధరిత్రీప్రతీక. అందుకే ఐదుగుర్నీ కట్టుకుంది. అలాగే కుంతీ, గాంధారీ, సత్యభామా మొదలైన పాత్రలూ భూప్రతీకలే!

అర్జునుడు సూర్యునకు వెనకనున్న ప్రకాశం. సూర్యుడు కదిలితేనే ఈ ప్రకాశం కదుల్తుంది. అందుకే, కృష్ణుడు ‘విజయసారధి’ కావడం.

బలరాముడు. సూర్యునకు ముందున్న ప్రకాశం. భూమ్మీద ముందుకాలు పెట్టేవాడు. అందుకే కృష్ణునికి అన్న.

ఇలా, ఇవి ‘మహాభారతం’లోని ప్రధాన పాత్రల వెనకనున్న ప్రతీకలు. ఆపై, వాల్మీక వ్యాసాది ఋషి, మునులంతా నక్షత్రప్రతీకలు. శ్రీకృష్ణుని అష్టభార్యలు సూర్యుని చుట్టూ తిరిగే అష్టగ్రహాలు. తెల్లనిమబ్బులు యక్ష, గంధర్వ, కిన్నెర కింపురష, అప్సరాదులు. పదహారు వేలమంది కన్యలూ నక్షత్ర ప్రతీకలే! ‘రాధ’ ఒకనక్షత్ర కాంతి ‘ధార’. ఈ విషయం ఎందరికి తెలుసు? ముఖ్యంగా ఈ రచయిత్రికి ఎంతవరకు తెలుసు? అన్నదే ప్రశ్న.

ఆమె మరో పెద్దపొరపాటే చేశారు. వ్యాసుని మూలగ్రంథాన్ని చూడలేదు. కవిత్రయ భారతాన్ని చూశారు. అది వ్యాసభారతానికి ఛాయామాత్రమే! ఆపై గంగూలీ గారి ఆంగ్లానువాదాన్నీ, పురిపండావారి వచన భారతాన్ని చూశారు. అవి ప్రచ్ఛాయలు మాత్రమే!

అనగా, నీడల్ని పట్టుకు వేలాడారన్నమాట. ‘యజ్ఞమంటే వీరికి సరియైన అవగాహన లేన’ట్టుగా ఉంది. అందుకే, యజ్ఞాలనీ తిట్టిపోసింది. క్యాపిటల్‌ (మూలధనం) అంటే పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్‌) అని తప్పుడర్థం చెబుతూ, సంపుటాలు సంపుటాలుగా వెలువరించిన ఘనత వీరిది? అంతటి పరిజ్ఞానం మనకెక్కడిది?

‘యజ్ఞా’నికి అనేకార్థాలున్నాయి. ‘ప్రకృతి యజ్ఞం’ ఒకటి, ‘వికృతి యజ్ఞం’ మరొకటి. ఆమె మాట్లాడేది వికృతి యజ్ఞాల గురించే. విశ్వమే ఒక యజ్ఞశాల యనీ, విశ్వవ్యాపారమే ఒక యజ్ఞమనీ, అణువణువూ యజ్ఞకుండమేననీ, చివరికి మనిషి కూడా ఒక యజ్ఞ కుండమేననీ, జీవితమే ఒక యజ్ఞమనీ, నేను చెబితే వీరికర్థమవుతుందా?…

నాకు తెలిసినంతవరకు దశరథుని యజ్ఞంలో కానీ, రాముని యజ్ఞంలో కానీ, (రామాయణం) చివరికి ధర్మజుని యజ్ఞం (భారతం)లో కానీ, జంతుబలి జరిగినట్లు చెప్పబడలేదు. వీరు ఏ రామాయణ భారతాల్ని తిరగేశారో నాకు తెలీదు.

ఇక ‘సతీ సహగమనం’ గూర్చి ఒకమాట. అది దురాచారమే. దాన్ని ఖండించాల్సిందే! కానీ, భారతంలో స్త్రీలతో బలవంతంగా సహగమనం చేయించినట్లు ఎక్కడా లేదు. మాద్రి తన యిష్టప్రకారం, తనకు తానుగా సహగమనం చేస్తే, కుంతి చేయనంది. చేయలేదు. ఈ విషయాన్ని మనం విస్మరిస్తే ఎలా?

చివరిగా ‘కులవ్యవస్థ’ గురించి మరోమాట. క్షసగశn|d ాు-|షా (పటిష్టమైన వ్యవస్థ)కు అది అవసరమే. కులవ్యవస్థలో తప్పులేదు. కులవివక్ష తప్పు. అంటరాని తనం తప్పు.

ఐనా, హిందువులు ఎంతో మారారు. జైన బౌద్ధమతాలనుండీ, ఆర్య సమాజం నుండీ ఎన్నో నేర్చుకున్నారు. ఇప్పుడు సతీసహగమనాలు లేవు. అంటరాని తనమూ లేదు. యజ్ఞాల్లో బలులూ లేవు. బాల్య వివాహాలూ తగ్గాయి. వితంతు వివాహాలూ కోకొల్లలు. ఆపై మతాంతర. కులాంతర వివాహాలకూ లెక్కలేదు. బ్రాహ్మణాధిపత్యమూ తగ్గింది. ఇవన్నీ మార్పులు కావా?… మనిషన్నవాడు రెండు కళ్ళతో చూడాలికదా?…

ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఋషి ప్రోక్తలైన వేదాలకీ, రామాయణ భారత భాగవతాది మహాకావ్యాలకీ నాలుగేసి అర్థాలుంటాయి. అవి (1) ఆదిభౌతిక (2) ఆధిదైవిక (3) ఆధ్యాత్మిక (4) ఆధియాజ్ఞిక దృక్కోణాలు వాటిని మనం విస్మరించకూడదు (వివరాలకు చూడుడు నా పరిశోధనలు (1) రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి? (2) కృష్ణాయనం ఒక నక్షత్ర మహాయానం (3) ఋషి హృదయం, (4) చతుర్వేద సాగర మధనం)

ఇక ద్వ్యర్థి, త్య్రర్థి కావ్యాలూ ఉన్నాయి. ఏకాక్షర రామాయణమూ ఉంది. ముందునుండి ఒక అర్థం, వెనకనుండి మరో అర్థం వచ్చే శ్లోకాలూ ఉన్నాయి. అవి మనకందుతాయా? మన మిడి మిడి జ్ఞానం సరిపోతుందా? అన్నవి ప్రశ్నలు.

వీరొకచోట ‘కుక్కతిట్లకి జడిసిన చక్రవర్తి’ (పి.36) అంటూ వెక్కిరించారు. ఇక్కడ కుక్కంటే కుక్కకాదు తల్లీ! అది నల్లని మేఘానికి సంకేతం. అది అరచిందంటే మేఘం గర్జించిందని ధ్వని. ఈ విషయం వేదాల్లోనూ ఉంది. ‘సోమరసాన్ని నల్లకుక్కకి దూరంగా, భద్రంగా ఉంచండి!’ అంటూ ఓ వేదమంత్రం (సామవేదంలో ఉంది. అక్కడా కుక్కంటే మేఘమే!

అమ్మా? తమరెక్కడ చదువుకున్నారు తల్లీ? శబ్దాలకి అనేకార్ధాలుంటాయి. ఒక్క వాచ్యార్థాన్నే పట్టుకుంటే ఎలా? అంతరార్థాల్నీ, ప్రతీకాత్మకతల్నీ, శ్లేషార్థాల్నీ, ధ్వనినీ విస్మరిస్తానంటే కూడదు తల్లీ?

ఇప్పటికైనా కళ్ళు తెరవండి! మన వేదాల్ని పాశ్చాత్యులు తలకెత్తుకుంటున్నారు. వాటిపై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిల్లో బోలెడు సైన్సుంది. మన రామాయణ భారత భాగవతాదులూ విశ్వవిఖ్యాతి నందాయి. గ్రీకుల ‘ఇలియడ్‌’ ‘ఒడిస్సీ’ గ్రంథాలు వీటికి ఛాయాప్రచ్ఛాయలని విదేశీ మేధావులే అంటున్నారు. ఆకాశమ్మీదా, నక్షత్రాలమీదా, సూర్యచంద్రులమీదా దోసిళ్ళకొద్దీ మట్టిపోస్తానంటే ఎలా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరీమళాల కథా పుష్ప వృక్షం

పరీమళాల కథా పుష్ప వృక్షం

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 07/02/2015
TAGS:

కథాకృతి-3
పరిచయాలు పరామర్శలు
రచన: విహారి;
పుటలు: 166,
వెల: రూ.100/-లు
ప్రతులకు: వేదగిరి
కమ్యూనికేషన్స్, బ్లాక్-6, ఫ్లాటు: 10, హెచ్‌ఐజి-1,
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాదు- 44

సమీక్షలు వ్రాసేటప్పుడు ఆ రచయితలతోను, ఆ రచనా ప్రకాశకులతోనూ సమీక్షకుడు తన సంబంధాల పెరుగుదలలు తరుగుదలలు గురించి ఆలోచించరాదు, సమీక్షల్నీ, సమీక్షకుల్నీ గమనిస్తూ ఆలోచనలతో ప్రశ్నించే పాఠక వ్యవస్థ ఒకటి వుందనుకుంటే మంచి సమీక్షలూ సమీక్షా గ్రంథాలూ వస్తాయి. అలా వచ్చిన మంచి ప్రయోజనాత్మక గ్రంథం ఈ కథాకృతి గ్రంథం. ఇది మూడవ భాగంగా పరిచయాలు, పరామర్శలుగా వచ్చింది ఏ భాగానికాభాగమే ప్రత్యేక గ్రంథంగా భాసించేదే.
మామూలు సమీక్షలకు భిన్నంగా కొత్తచూపులతో తమవైన బేరీజులతో 51 కథల ఆత్మీయకోణ ప్రదర్శనలతో విహారిగారు ఈ పుస్తకాన్ని సంతరించారు.
ఎ కంపేనియన్ ఆఫ్ ఇంగ్లీషు లిటరేచర్ అని ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంవారు, సాహిత్య కోశము (ప్రాచీనము), సాహిత్య కోశము (ఆధునికము) అని తెలుగు అకాడమీ వారు వేసిన గ్రంథాలు అవి పరిశోధక సంబంధాలు.
విహారిగారి ప్రణాళిక విభిన్నమైంది. పత్రికల్లో, కథాసంపుటాల్లో పుంఖానుపుంఖాలుగా కథలు వస్తున్నాయి. కథల పోటీలూ పెరిగాయి సాంవత్సరిక ప్రకిగణీయ కథాసంకలనాలు వ్యక్తులో విశ్వవిద్యాలయాలవారో వేస్తూనే వుంటున్నారు. మనం కొన్నిటిని చదివినా కొన్ని తప్పుకునే అవకాశాలుంటాయి.
సుప్రసిద్ధులు కథల్నే కాదు సుప్రసిద్ధులు కావలసిన కథారచయితల కథలూ ఎన్నో చదివి గుణకారణంగా కొన్నిటిని ఎంపికచేసుకుని హృదయాల్ని స్పృశించే కదిలించే విశేషాల్ని తెలపటం ఇందులో రచయితకు గల పండిన అనుభవం కనిపిస్తుంది.
ఈ పుస్తకం చదవడంవలన బహుళార్థసాధక ప్రయోజనాలున్నాయి. ఇందులో మనం చదివిన కథావిశే్లషణలుంటే- ఇందువలనా మనకీ కథ నచ్చింది అని క్రొత్తగా అనిపిస్తుంది. చదవని కథల పరామర్శల్ని చదివితే ఇంత మంచి కథగా మనం చదవలేదని కొత్తగా మనం వానిని చదివి తీరుతాం. ఇంత గొప్ప కథల్లో మనం కొన్నిటినైనా ఇతర భాషల్లోకి అనువదించుకోగలుగుతున్నామా అనే ఆవేదన కలుగుతుంది.
ఒక్కొక్క కథకు ఆత్మనే ఎక్సరే తీసి శీర్షిక పెట్టారా అనిపించేటంతగా ఉంటుంది శీర్షిక. రచయిత్రి లేక రచయిత జీవన పరిచయాలు కథారచనల కీర్తులతో జోడించి ఇచ్చిన తరువాత కథా ప్రధాన ఘట్టవిశేషాలు చెప్పడం కథారచనా రంగంలో ఆ కథల స్థారుూభేదాల్ని తార్కికంగా చెప్పడం ఈ గ్రంథ విశేషం.
దహనం, ఆకాశదేవర, దగ్ధగీతం, వీరుడు మహావీరుడు, అడుగు, వేషం వంటి కథలు ఎందువల్ల గొప్పవో విహారి చెప్పారు.
రాయలసీమ రైతు వెతల్ని జీవద్భాషలో రాసిన శాంతి నారాయణకథ ‘కల్లమయిపాయ’ కథకు సేద్యం బరువునుమోస్తూ విరిగిన జాతి వెనె్నముక’ అని శీర్షిక పెట్టడం కథను విశే్లషిస్తూ ఎవరి ఉటంకింపునోకాక రచయిత ఉటంకింపుగా కథ అంటే రాయటంకాదు, చెప్పడమూ కాదు. ప్రదర్శించడం’ అని ఇవ్వడం బాగుంది. ఇప్పటికే పేరున్న పాత కథల్ని వాటి విలువల్ని గౌరవిస్తూ, 21వ శతాబ్ద కథల్నీ అధ్యయనం చేసి రాయడంకి ఉదాహరణగా కాంతి అవరోధాన్ని కళ్ళముందు నిలబెట్టిన ఖదీర్‌బాబు కథానిక; గెట్ పబ్లిష్‌డ్‌ని చెప్పవచ్చు.
అందులో విహారిగారు ‘‘తెలుగు కథానిక పురోగమనం నూరేళ్ళకు పైగా సాగుతూ వుంది. ఈ సుదీర్ఘ జైత్రయాత్రలో ఎనె్నన్ని విజయాలు ఎనె్నన్ని మైలురాళ్ళు!… కథానిక పరిణామ వికాసాల్లో ఇరవై ఒకటో శతాబ్దం ఒక కొండ గుర్తుకానున్నది. దానికి సూచనగా ఈ పదేళ్ళ కాలంలోనూ చాలా గొప్ప కథలు వచ్చాయి. అవన్నీ దిగ్భ్రమ కలిగించే తేజోరేఖలు’ అని అన్నారు. అటువంటి తేజోరేఖల్ని దర్శింపజేయడానికి ఇటువంటి కథాకృతులు మరిన్ని విహారి వంటివారి లేఖినుల నుండి రావాలి.
ఆయా కథల గురించి రాస్తున్న సందర్భాలలో విహారి కథ/ కథానిక రచనా పరిణామ ప్రస్థానాలను అలవోకగా ఆలోచనాంశాలు చెప్పడం పాఠక ప్రయోజనదాయకం. ‘మానవీయ విలువల్ని’ వినిపించే కథలు డా.ఎన్. రామచంద్ర స్వప్నదారులు అనే రచనలో సందర్భశుద్ధిగా రామచంద్ర ఇలా అన్నారని చెప్పారు. ప్రజల అవసరాలు, ఆలోచనలు, అవకాశాలు, ఆవిష్కరణలు పెరిగాయి. బాహిరమైన భౌతికావసరాలతో పాటు, ఆంతరమైన తాత్త్విక ధోరణులు చర్చల్లో నిలబడ్డాయి. సాహిత్యానికి కేవలం స్థానికతేకాక కొంతవరకైనా సార్వకాలికత, సార్వజనీనత, సార్వదేశికతా స్పర్శ అవసరం లేకపోతే మూస రచనలే సాహిత్య వౌలికత అయి కూర్చుంటుంది. కరువులు, కక్షలు, మట్టిమనుషుల కష్టాలు, స్ర్తి అస్తిత్వ వేదనలు, ఉద్యమాలు, వాదాలు, వివాదాలు, మనిషి సమాజం ప్రకృతి అనే త్రిపుటి చుట్టూ పరిభ్రమణంతోపాటు మానవ జీవితంలోని సున్నిత పార్శ్వాలన్నీ స్పృశించవలసి వుంటుంది. కళాత్మకంగా రచయతలకు ఆత్మవిశ్వాసం కొరవడే గుంపులతత్వం త్వరగా సమసిపోతే సాహిత్యానికి మరింత ఆదరణ, గౌరవం వుంటుంది’. ఈ వాక్యాలు వర్తమాన సాహితీ లోకంలో ఆలోచనాత్మకాలే.
ప్రసిద్ధులు చెప్పే వాక్యాల్నేకాక సామాన్యులు చెప్పే అసామాన్య ఆలోచనా వాక్యాలకు విలువ ఇవ్వడం వాటిని పాఠకులకి అందించడం విహారిగారి రచనా విశేషం.
లోగడ కథాకృతి రెండు భాగాల్లోనూ వందేసి పరిచయాలుండగా ఈ మూడవ భాగంలో యాభై కథావిహారాలున్నాయి. ఈ గ్రంథాన్ని విలక్షణ సమీక్షాగ్రంథంగా, తేజోరేఖల పరామర్శల గ్రంథంగా చెప్పుకోవచ్చు.
చాలా ప్రక్రియల్లో రచయితగా, అర్ధశతాబ్దంగా కథారచనల అధ్యయనపరునిగా పేరుపొందిన విహారి మంచి కథల్ని ఈతరం పఠితల దృష్టికి పరిచయం చేయాలనే సంకల్పం గొప్పది. నవలల గురించీ ఇటువంటి గ్రంథాలు అవసరం. రచయిత ‘గుప్పెడు జ్ఞాపకాల పూలపొట్లంగా ఈ గ్రంథాన్ని అభివర్ణించుకున్నారు. మనం దీనిని పరీమళాల కథా పుష్ప వృక్షంగా భావిద్దా0

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళలు నిండిన జీవితం

కళలు నిండిన జీవితం

ANDHRAPRABHA –   Sun, 8 Feb 2015, IST

ప్రపంచంలోని మేధస్సుకు శిరోభాగం, సాహిత్యానికి హృదయ భాగం భారతదేశం. అద్భుతమైన శాస్త్రాలు, అనేకమైన సాహితీ సంపద ఎందరో మహానుభావుల కృషిఫలంగా సనాతన సంప్రదాయం వారసత్వ ధనాన్ని అందిస్తూనే ఉంది. సాహితీ సుహృదయులలో తన సుమధుర కవితాధారచే విరాజిల్లిన ఆప్తకవీశ్వరుడు. రాటుదేలిన కవిపండితుడు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ.

తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో జన్మించిన మధురకవి సాహిత్యోద్యమంలో అపారకృషి చేసిన మహానుభావులు. మామిడిపల్లి సాంబశివశర్మగారు అనేక గ్రంథ స్రష్టతా, ద్రష్టలు, బహుముఖ ప్రజ్ఞాధురీణులు. కమ్మని గానం రమ్యమైన గాత్రం మృదుమధురమైన హాస్యప్రియత్వం వారి సొంతం. వీరు కేవలం కవులే కాదు, నటకులు నాటక క్రోడీకర్తలు. గేయరచన, సంగీత దర్శకత్వం, నటనాదర్శకత్వం. రంగస్థల రచనా నైపుణ్యం. తెలుగు, హిందీ, సంస్కృత భాషలలో వైదుష్యం, ఉర్దూ పరిచయం, చక్కని వావదూకత, హరికథనం, పురాణ ప్రవచనం, భాషాంతరీకరణ సామర్థ్యం మొదలగునవి వీరి ప్రత్యేకత. స్వాతంత్య్ర సమరయోధులుగా పేరుగాంచినారు.

అనేక రేడియో కార్యక్రమాలు చేసిన ఘనులు. అష్టావధానం చేసిన సుప్రసిద్ధులు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ.

భగవంతుని మేల్కొలిపే సుమధుర సాహితీగానం సుప్రభాతం. మధురకవి రచనాధురి వివిధ సుప్రభాతాల వెల్లువై అలరారింది. లోకప్రసిద్ధమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమునూ, స్తోత్ర ప్రపత్తులనూ తలపించే రీతి మధురకవి శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతం రచించబడింది. దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో నేటికీ ఈ కవి వ్రాసిన శ్రీరాజ రాజేశ్వర సుప్రభాతం ఆలపించబడుతూ ప్రభాత వెలుగులను భాసింపచేస్తుంది. ఇదే కాకుండా కాళేశ్వరమునకు సంబంధించిన ముక్తేశ్వర సుప్రభాతం, బాసర సరస్వతీ సుప్రభాతం, గంగాసుప్రభాతం, శ్రీ గౌరీశంకర సుప్రభాతంత. శ్రీ ఆదిశంకర సుప్రభాతం వీరు రచించారు. కొమురవెల్లి మల్లన్న, సుప్రభాతం, బెల్లంపల్లి శ్రీరామచంద్ర సుప్రభాతం. బెజ్జంకి శ్రీ నృసింహసుప్రభాతం. సికింద్రాబాద్‌ మహంకాళి సుప్రభాతం మొదలగునవి కూడా వీరి కలం నుండి జాలువారినవే.

మధురకవి జయశ్రీ, ముక్తాహారం, కుంజవిహారం. శ్రీ రాజేశ్వర తారావళి అనే పద్యకావ్యాలు అద్భుతంగా రచించారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలతో ఈ కవి వ్రాసిన ద్విపద రామాయణం రామకథా సముద్రంలో ఓలలాడిన ఎందరో కవిపుంగవుల పంచన మధురకవినీ సత్కరించిందంటే అతిశయోక్తి లేదు. శ్రీ రాజరాజేశ్వర క్షేత్రమహత్యం, తరిగొండ వెంగమాంబ చరిత్ర హరికథలుగా, భద్రావతి, త్యాగయ్య నాటకాలుగా శ్రీ నృసింహశతకం శతకంగా, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, దీపావళి, బుర్రకథలుగా, మధుర ఝంకారం, భక్తిగీతాలు, మంగళహారతులు భజన కీర్తనలుగా, లోభసంహారం అనే విలక్షణ రచన అధిక్షేప కావ్యంగా మధురకవి రచనలు ప్రసిద్ధిగాంచాయి. జీవితకాలంలో అనేక రచనలు గావించి విభిన్న కళలలో విశేష ప్రజ్ఞను చెప్పకనే చాటిచెప్పిన నిరాడంబర సామాజిక కవి మధురకవి.

మామిడిపల్లి సాంబశివశర్మగారు సాంబకవిగా సుపరిచితులు సాంబకవి పవిత్ర కవితాజీవనులు. వీరి సాహితీ జీవనం సువిశాలమైంది. కవిసార్వభౌముడు శ్రీనాథుని పోలిన జీవితం వీరిది. సర్వసౌఖ్యాలూ, సత్కారాలూ, కష్టములూ అనుభవించారు. అనేకుల సహృదయ మన్ననలు పొందినవారై మధురకవి, విద్వత్కవి అనే బిరుదులను గ్రహించారు సాంబకవి. సాంప్రదాయ ఛాయలో అభ్యుదయ ఆలోచనలకు రూపమిచ్చిన పండితులు వీరు. ప్రాథమిక విద్యనే అభ్యసించిన ఈ కవి సరస్వతీ కఠాక్షంతో అనేక కావ్యరచనలు చేసారు.

మానవత్వాన్ని మోసం చేస్తున్నది దైవం కాదనీ, దానవత్వం ఆవహించిన మానవ సమాజమేననీ సమాజమేననీ గుర్తించిన సాంబకవి లోభసంహార కావ్యం ద్వారా సమసమాజ స్థితిగతులను వర్ణించారు. మనిషికి వివేకం నశింపజేసే ఒక్క లోభమే అనేక అనర్థాలకు కారణమైతే మిగతా కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు మానవులలో మూర్తీభవిస్తే మానవుల పరిస్థితేమిటోనని దిగులు పడుతూ తస్మాత్‌ జాగ్రత్త అంటూ సమాజానికి సందేశమిచ్చిన అద్భుత అభ్యుదయ కావ్యం లోభసంహారం.

సాంబకవి ప్రగతిశీలి. జీవితంలోని ఒడిదుకులను తట్టుకోలేక పరితపించినా ఎదుటివారికి జీవన పంథాను తన రచనల ద్వారా నిర్దేశించారు. తెలంగాణా కవులు నివురుగప్పిన నిప్పులని నిరూపించిన ధీరోధాత్తులు సాంబశివశర్మ బహుముఖ ప్రజ్ఞాపాండిత్యము గల అరుదైన కవులలో వీరూ ఒకరు. వీరి అప్రతిమ ప్రతిభావిశేషం ప్రాజ్ఞ ప్రశంసాపత్రమై అలరారుతుంది. కళాసాహితీరంగాలను బట్టి, చారిత్రక ఆధారాలను బట్టి ఇంతటి కళాకారుడు, కవిపుంగవుడు గత శతాబ్దకాలంలో ఉద్భవించిన దాఖలాలు లేవు అనలేక ఉండలేము.

అనంతమైన సాహితీ ప్రపంచంలో, కళాప్రకృతిలో రవిగాంచని మహా వట వృక్షంలాంటి కవిపుంగవుడు, సంస్థాస్వరూప వ్యక్తి, మహామనీషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. కళాతపస్వి, ధన్యజీవి, అమరజీవి మామిడిపల్లి సాంబశివశర్మ.

సరస కవిత్వంలో, గంభీర భావుకతలో, నటనా వైదుష్యంలో, నర్మగర్భ వ్యవహారశైలిలో, హరికథాకథన చాతుర్యంలో, వివిధ రచనా పటుత్వంలో సాంబకవికి సాంబకవే సాటి. సహజ పాండిత్య సంపన్నులై, సరస సద్గుణాలంకార శోభితులై, బహుముఖ ప్రజ్ఞాధురంధరులై విరాజిల్లిన మధురకవి రచనలు అమృత గుళికలు, ఆపాత మధురాలు.

దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీరాజరాజేశ్వరపురం వేములవాడలో సుప్రభారత గీతమై, విద్వద్వరేణ్యుల ప్రశంసలలో భాగమై, ముద్రిత రచనలలో చిక్కిన అక్షరమై అముద్రిత రచనల్లో కనిపించని భావమై శ్రీ మామిడిపల్లి సాంబశివశర్మ మధురకవిగా, సాంబకవిగా అలరారుతారు. కవితా సామ్రాజ్యానికి శాశ్వత చక్రవర్తియై వెలుగొందుతారు.

‘జయంతితే సుకృతి నోరససిద్ధా: కవీశ్వరా:

నాస్తిమేషాం యశ: కాయే జరామరణజం భయమ్‌.’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం

మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం

ANDHRAPRABHA –   Sun, 8 Feb 2015, IST

అమతుస్సలాం అన్ని కష్టాలను, నష్టాలను, అనారోగ్యాన్ని తన దృఢసంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురాలయ్యారు. మహాత్ముని ప్రియ పుత్రికగా ఖ్యాతి పొందారు. 1922లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో గాంధీజీ అనుమతితో ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె కూడాజైలు కెళ్లారు. స్వరాజ్యసాధనతో పాటు హిందూ -ముస్లింల ఐక్యత, హరిజనుల సంక్షేమం తన జీవితలక్ష్యమని ప్రకటించారు ఆమె.మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన బీబీ అమతుస్సలాం హిందూ-ముస్లిం ఐక్యతా చిహ్నమయ్యారు. మత కలహాలు నివారించేందుకు ఆమె నిరంతరం పాటు పడ్డారు. వాయువ్య సరిహద్దులు, సిందు నౌఖాళి ప్రాంతాలలో మత కలహాలు విజృంభించినప్పుడు సామరస్యం ప్రభోదించేందుకు తన ప్రత్యేక దూతగా గాంధీజీ ఆమెను పంపారు.

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భాగంగా పరాయి పాలకుల బానిసత్వం నుండి గాంధేయ మార్గాన మాత్రమే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధ్యమని భావించి మహాత్ముని సాన్నిత్యంలో జీవిత చరమాంకం వరకు గడిపిన మహత్తర చారిత్రక అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కింది. అటువంటి అద్భుత అవకావాన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతులలో ప్రముఖ స్థానమాక్ర మించారు ‘బీబీ అమత్సులాం’

భారత జాతీయోద్యమం పట్ల అపారగౌరవాభిమానాలను ఆచరణలో వ్యక్తం చేసిన పాటియాలా రాజపుఠాణా పరివారంలో 1907లో బీబీ అమతుల్సలాం జన్మించారు. తల్లిపేరు అమతుర్రెహమాన్‌, తండ్రి కల్నల్‌ అబ్దుల్‌ హమీద్‌ పాటియాలా సంస్థానంలో ఆర్థిక మంత్రి. ఆయన 1920 ప్రాంతంలో కన్నుమూసారు. ఆరుగురు అన్నదమ్ములకు ఏకైక చెల్లెలుగా అమతుస్సలాం గారా బంగా పెరిగారు.

చిన్ననాటి నుంచి స్వేచ్ఛా స్వభావాన్ని వ్యక్తం చేసేవారు. సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేసి పురాతన రీతి రివాజులను, అహేతుక అచార, సంప్రదాయాలను వ్యతిరేకించారు. సామాజిక, రాజకీయ సమస్యలపట్ల మంచి అవగాహన కలిగి ఉన్నా శారీరకంగా చాలా బలహీనం కావటంతో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు.

ఆమె 13 సంవత్సరాల వయసులోనే ఖురాన్‌ మజీద్‌ను అనువాదంతో సహా చదివారు. కొన్ని ధార్మిక గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. వారి కుటుంబంలో పర్దాను కఠినంగా అమలు చేసేవారు. స్వంత అన్నదమ్ముల ఎదుట కూడా సంచరించటానికి అనుమతి లభించేది కాదు. ఆకారణంగా స్కూలుకు వెళ్లే ప్రశ్నే తలెత్తలేదు. ఆమె తండ్రి అలీఘర్‌లోని బాలికల స్కూలుకు పంపాలనుకున్నారు. జాతి అభివృద్ధి కోసం సామాజిక ఆక్షలను ఉల్లంఘించగల సాహసం ఆయనకుంది. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో అవకాశం ఆమెకు లభించలేదు. ఆయన మరణం వల్ల ఆమె చదువు ఉర్దూ చదవటం, రాయటం వరకు పరిమితమైయింది. ఆమె పెద్దన్న మహమ్మద్‌ అబ్దుర్రషీద్‌ ఖాన్‌ జాతి జనుల సేవ చేయాలన్న ఆలోచనలు ఆమెలో కలిగించారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1920లో సాగిన ఖిలాఫత్‌ – సహాయం నిరాకరణ ఉద్యమంతో ఆయన పాల్గొన్నారు. త్వరితగతిన ఆమె పెళ్లి చేయాలన్న తల్లి ఆలోచనలను అన్న మాటలతో మార్చుకున్నారు. చిన్నప్పటి నుండి విలాసవంతంగా గడపడం, విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించడం అంటే అయిష్టతతో ఉండేది అమతుల్సలాం.

ఆమె పెద్దన్నయ్య అబ్దుర్రషీద్‌ ఖాన్‌ 1922లో జిల్లా కాంగ్రేసు కమిటి అధ్యక్షుడయ్యాడు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాలు జైలు శిక్షకు గురయ్యాడు. అమతుస్సలాం బుర్ఖా ధరించి అంబాలాలోని వీధుల్లో తిరిగి ఖద్దరు ప్రచారం చేయసాగారు. పలు సమావేశాలకు, సభలకు హాజరయ్యారు.

మహమ్మద్‌ అలీ జౌహర్‌, ఆయన తల్లి బీబీ అమ్మల పర్యటనలు తరచుగా పంజాబులో జరిగేవి. ఆ పర్యటన ప్రభావం ఆమె మీద ఉండేది. ప్రజాసేవ చేయాలన్న ఉత్సాంహం ఆమెలో పెరిగింది.

భిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా హిందూ ముస్లీంలో వ్యక్తమైన ఏకతా భావనను మరిచిపోలేనంటారు ఆమె. బాపు 21 రోజులపాటు నిర్వహించిన వ్రతం ఆమె హృదయంలో గాఢమైన ప్రభావం చూపింది. మహాత్ముడు నిర్వహిస్తున్న పలు ఆందోళనా కార్యక్రమాల గురించి ఆమె ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. బ్రిటీషు వారి బానిసత్వంలో న్యాయవాదవృత్తి చేయకూడదని ఆబ్దుర్రషీద్‌ నిర్ణయించుకున్నాడు. ఆయన స్నేహితుడు ఆయన్ను ఇండోరు మహా రాజు కార్యదర్శిగా ఇండోరు తీసుకెళ్లారు. జాతీయోద్యమం గురించిన విశేషాలను అన్నద్వారా తెలుసుకునేవారు. అనేక గ్రంథాలను, పత్రికలను చదివేవారు. మహాత్ముని అహింసా సిద్ధాంతంపట్ల అమతుస్సలాం ఆకర్షితులయ్యారు. మహాత్ముని బాటలో నడవాలని నిర్ణయించుకొని సబర్మతీ ఆశ్రమానికి వెళతానని అన్నకు తెలిపారు. ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆమె సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. కేవలం ఒక అతిథిగా కొన్నాళ్లు ఉండటానికి మాత్రమే గాంధీజీ అంగీకరించించారు.

ఆశ్రమ కఠిన నియమ నిబంధనలను పాటిస్తూ, అంకితభావంతో, నిబద్ధతతో, సేవాతత్పరతతో, చక్కని క్రమశిక్షణతో ఆశ్రమ వాసులలో ఒకరిగా ఇమిడిపోయారు. ఆమె కస్తూర్భా గాంధీజీలకు కన్నబిడ్డ సమానమయ్యారు. ఆశ్రమంలో అతిధిగా ఆహ్వానించబడ్డ ఆమె చివరకు ఆశ్రమ సేవికయ్యారు. ఒక ప్రసిద్ధ ముస్లిం రాజపుఠానా కుటుంబానికి చెందిన అమ్మాయి ఆశ్రమంలో చేరి అవివాహితగా జాతీయోద్యమానికి తనను తాను సమర్పించుకోవడం ఆనాడు ఊహించని సంఘటన.

స్వేచ్ఛా భారతం కోసం కలలు కన్న జాతీయోద్యమకారులు తాముకన్న కలలను భగ్నం చేస్తూ ఇండియా ముక్కలయ్యింది. ఆ విభజన కూడా మతం పేరిట సాగటం అమతుల్సలాం చలించిపోయారు. ఆ విఘాతం నుంచి బయటపడే లోపే గాంధీజీ హత్యకు గురి అవ్వడం ఆమె తట్టుకోలేకపోయారు. ఆ వేదన నుండి కొంత తేరుకున్న తర్వాత ఆమె పూర్తిగా పునరంకింతమయ్యారు.

మృదులా సారాబాయి, సుభద్రాజ్యోషిలతో కలసి అటు పాకిస్తాను ఇటు ఇండియా నుండి వేరు పడిన మహిళలను తమ వారున్న ప్రాంతాలకు చేర్చారు. దీని కోసం ఆమె తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తరువాత ఆమె పంజాబ్‌లోని రాజపూర్‌ గ్రామంలో కస్తూర్భా పేరిట ‘కస్తుర్భా మందిరం’ అనే ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ఆశ్రమంలో చేతివృత్తులు నేర్పటం, అక్షర జ్ఞానం అందించటం తదితర కార్యక్రమాలు చేపట్టారు. నిస్సాహాయులయిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పలు పథకాలు రూపొందించి అమలు చేశారు. ఆమె దళితలు, మహిళల సేవలకు అంకితమయ్యారు. అనితర సాధ్యమైన రీతిలో సేవ చేసిన గొప్ప మహిళామూర్తి బీబీ అమతుల్సలాం చివరి వరకు గాంధేయమార్గాన్ని వీడలేదు. సమరశీల జీవితాన్ని గడిపిన ఆ మహా మానవి 1985 అక్టోబర్‌ 29న తుది శ్వాస విడిచారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పగిలిన గాజుపలక ఆర్ కె లక్ష్మణ్ కు ప్రపంచాన్ని చూపిందట

rk1 001 rk2 001 rk3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ డైలాగే నాకు టర్నింగ్ – డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వగతం – ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు – డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఘంటసాల గారి మనవ రాలు

ఆ డైలాగే నాకు టర్నింగ్

 

‘‘కళ్ళతో కోటి భావాలు పలికిస్తే సరిపోదు.. ఉచ్ఛారణలో జ్ఞానాన్ని కూడా పలికిస్తేనే అదీ అసలైన నటన. అందుకే వాచికం సర్వవాంగ్మయం అన్నారు. ఇప్పటి కథానాయికల్లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన అందరి దృష్టి అభినయం, ఆహార్యంపైనే ఉంటుంది. వాచికంతో వాళ్ళకు పనిలేదు. ఇది బాధకరమైన విషయం. తెలుగురాని ఈ ముద్దుగుమ్మల పుణ్యమాని అందమైన హస్కీ వాయి్‌సలను వినే అవకాశం మన
ప్రేక్షకులకు దక్కింది. అలాంటి వాయిస్‌లతో తమన్నా, శ్రుతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, రెజీనా, నందితలకు డబ్బింగ్‌ చెబుతున్నది ఎవరో తెలుసా? హరిత. ఈ అమ్మాయి కోవలోనే ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాలో అదాశర్మతోపాటు అనుష్క, హన్సికల పాత్రలకు డబ్బింగ్‌ చెప్పిన మరో అమ్మాయి ఘంటసాల వీణ. డబ్బింగ్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న వారిద్దరే ఈ వారం మన సండే సెలబ్రిటీలు..
‘‘చెన్నైలో పుట్టాను. పాఠశాల చదువంతా అక్కడ, కాలేజీ చదువంతా హైదరాబాద్‌లో సాగింది. బీకామ్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. మా పిన్ని అనురాధ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. గతంలో చాలామంది నటీమణులకు ఆమె గొంతు అరువిచ్చారు. ప్రస్తుతం ‘చిన్నారి పెళ్లికూతురు’లో అవికాగోర్‌ బామ్మ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఆమె ప్రోత్సాహంతో నేనీ రంగంలోకి అడుగుపెట్టాను. చిన్నప్పటి నుంచే డబ్బింగ్‌ స్టూడియోలకు వెళ్ళి అన్నీ పరిశీలించేదాన్ని. 13 ఏళ్ళ వయసులో చిన్న క్యారెక్టర్లకు, సీరియల్‌ ఆర్టి్‌స్టలకు డబ్బింగ్‌ చెప్పాను. ‘ఛత్రపతి’ సినిమాలో అజయ్‌ చెల్లి పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. కాంచబాబుగారి ద్వారా ‘కొత్త బంగారులోకం’ ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడికొచ్చిన ముఫ్పై మందిలో నేనొకదాన్ని. నేను చెప్పిన ట్రాక్‌ నచ్చడంతో శ్వేతాబసు ప్రసాద్‌కి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ‘యే..కడా.. ఏ..పుడూ…’ (ఎక్కడ ఎప్పుడు) అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అవ్వడంతో తొలి సినిమాతోనే గుర్తింపు లభించింది. అక్కడి నుండి డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నా కెరీర్‌ ప్రారంభమైంది. ‘కిక్‌’తో ఇలియానాకు మొదలుపెట్టాను. ప్రస్తుతం తమన్నా, శ్రుతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, రెజీనా, నందితలకు రెగ్యులర్‌గా డబ్బింగ్‌ చెబుతున్నాను. అవికాగోర్‌, (లక్ష్మీ రావే మా ఇంటికి), పూజా హెగ్డే (ముకుంద), రాశిఖన్నా (జోరు), మిష్టీ (చిన్నదాన నీకోసం), ఎమీజాక్సన్‌ (ఐ), యామీగౌతమ్‌ (కొరియర్‌బాయ్‌ కల్యాణ్‌)కు కూడా డబ్బింగ్‌ చెప్పాను. ఇప్పటి వరకు 350 సినిమాలకు పనిచేశాను. ప్రస్తుతం మెటర్నటీ లీవ్‌లో ఉన్నాను. ఏప్రిల్‌ నుండి మళ్ళీ బిజీ అవుతాను.
పరకాయ ప్రవేశం చేస్తా
తెలియని వ్యక్తికి వాయిస్‌ ఇవ్వడం అంటే సవాల్‌తో కూడిన పనే. వాళ్ళ మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌ వేరుగా ఉంటాయి. వారు చేసిన పాత్రను, సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే డబ్బింగ్‌ చెప్పడం చాలా ఈజీ. నేనయితే చెప్పాల్సిన సన్నివేశాన్ని ఓసారి చూస్తే చాలు పట్టేస్తా. ఒక్కోసారి ఎమోషన్స్‌ సీన్స్‌లో హీరోయిన్లు హై లెవల్‌ ఎమోషన్స్‌ క్యారీ చేస్తారు. మేము కూడా ఆ ఎమోషన్స్‌ క్యారీ చేస్తూనే వాయిస్‌ తగ్గించి, ఇంకోసారి పెంచి చెప్పాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సెంటిమెంట్‌, కామెడీ, రొమాన్స్‌ ఏదైనా అలవోకగా చెప్పగలను. ఫన్నీ సీన్స్‌, ఎమోషన్‌ సీన్స్‌కి వాయిస్‌ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. హీరోయిన్‌ ఎవరైనా సరే వారి డైలాగ్‌లు ఒక్కసారి చదివితే చాలు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను, ఇలియానాకు డబ్బింగ్‌ చెబితే ఇలియానా, తమన్నాకు చెబితే తమన్నాగా మారిపోతా. చెన్నైలో పుట్టాను కాబట్టి మొదట్లో నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. ఐదేళ్ళ క్రితమే తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగులో పర్‌ఫెక్ట్‌ నేను.
డిమాండ్‌ను బట్టి పారితోషికం
ఎన్నో కెరీర్‌ల మాదిరి ఇది కూడా ఒక కెరీరే! ఆసక్తితో వచ్చాం కాబట్టి.. ఇష్టంగా పనిచేస్తున్నాను. ఇక, పారితోషికం సంగతికొస్తే – డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించిన పారితోషికాన్నే మేం తీసుకుంటాం. అది సినిమా మీద, క్యారెక్టర్‌ లెంగ్త్‌ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ను బట్టి డిమాండ్‌ ఉంటుంది. పెద్ద సినిమాలకు వారం రోజులు పనిచేయాల్సొస్తుంది. చిన్న సినిమాలకు రెండు, మూడు రోజులు, ఇంకొన్ని సినిమాలకైతే కేవలం ఒక్కరోజు చెప్పేస్తాను. కొందరు దర్శకులు సింగిల్‌ టేక్‌లో చెప్తే అంగీకరించరు. ఇంకా బెటర్‌మెంట్‌ కావాలంటారు. అలాంటప్పుడు కాస్త సమయం పడుతుంది. ఇటీవల కాలంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ‘చక్కిలిగింత’. డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నేను అందుకున్న తొలి పారితోషికం రూ.300. పదమూడేళ్ళ వయసులో అది.
ఊహించని నంది
నంది అవార్డ్‌ వంద సినిమాలు చేస్తే వస్తుందేమో అనుకునేదానిని. కానీ నా రెండో సినిమా ‘నచ్చావులే’కి తొలిసారి నంది అవార్డ్‌ రావడం మధురమైన జ్ఞాపకం. అసలు నేను ఊహించని అవార్డ్‌ అది. టీవీలో న్యూస్‌ చూసి మా అంకుల్‌ కాల్‌ చేసి ‘నీకు నంది అవార్డు వచ్చింది’ అని చెబితే నమ్మలేదు. న్యూస్‌ చూసి నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను. ఆ రోజు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అలాగే ‘రాధామధు’ సీరియల్‌కి కూడా ఓ నంది వరించింది. ఎప్పుడైతే నంది అవార్డ్‌ అందుకున్నానో అప్పటి నుంచి వృత్తిపై మరింత బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా వాయిస్‌ నచ్చి చాలామంది పాటలు పాడమని అడిగారు. సున్నితంగా తిరస్కరించా.
నచ్చిన సన్నివేశాలు
నేను డబ్బింగ్‌ చెప్పిన సినిమాల్లో ‘కొత్త బంగారులోకం’లో వరుణ్‌, శ్వేతా సినిమాకెళ్ళొచ్చి కాలేజీ టెర్రస్‌ మీద మాట్లాడుకొనే సందర్భం, ‘కిక్‌’లో ఇలియానా రవితేజను తిట్టే సన్నివేశం, ‘ఊసరవెల్లి’లో తమన్నా.. నాకు సహాయం చెయ్యి అనడిగే సీన్‌, ‘రేసుగుర్రం’లో శ్రుతిహాసన్‌ మనసులో నవ్వుకున్నాను అనే సీన్‌, ‘ఓ మై ఫ్రెండ్‌’లో వర్షం సీన్‌ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ డబ్బింగ్‌ చెబుతూ నేను ఎంజాయ్‌ చేసిన సన్నివేశాలు.
పర్సనల్‌ టచ్‌
అమ్మానాన్న చాలా సపోర్టివ్‌ పర్సన్స్‌. నాది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్ళి చేసుకున్నాము. ఆయన పేరు రఘు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే. అన్యోన్యమైన జంట మాది. ఖాళీ సమయంలో పాటలు ఎక్కువగా పాడతా. పజిల్స్‌, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడతాను. ఒకప్పుడు సౌందర్య, రమ్యకృష్ణలకు, ఇప్పుడు నదియాకు డబ్బింగ్‌ చెబుతున్న సరితగారు నాకు స్పూర్తి. అలాగే సునీతగారంటే చాలా ఇష్టం..’’
ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు
పదేళ్ళ వయసులోనే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించాను. చిన్నతనంలో నాన్నతోపాటు డబ్బింగ్‌ స్టూడియోలకు వెళ్ళేదాన్ని. అప్పుడు నాన్న ‘అభినందన’, ‘మౌనరాగం’, ‘రోజా’ చిత్రాలకు డబ్బింగ్‌ చెబుతున్నట్లు గుర్తుంది. నేను కూడా డబ్బింగ్‌ చెబుతా అని నాన్నని అడిగాను. తొలిసారి ‘మోగ్లీ’ సీరియల్‌కి నా గొంతు అరువిచ్చా. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సూర్యవంశం’ సీరియల్‌లో ఒక ప్రధాన పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. అలా చిన్నతనంలోనే డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభమైంది. తర్వాత వెన్నెలకంటి శశాంక్‌ పని చేసిన మాగ్జిమమ్‌ సినిమాలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను. బింధుమాధవి (సెగ), జెనీలియా (ఉరిమి), పియా బాజ్‌పయ్‌ (గోవా), కంగనారనౌత్‌, హన్సిక (బిరియాని), ‘ఏమాయ చేశావె’లో నాగచైతన్య సిస్టర్‌ పాత్రకు ఇలా చాలా సినిమాలకు పనిచేశాను. ఉరిమిలో ‘చిన్ని చిన్ని వెన్నెల’ ‘అందాల రాక్షసి’లో ‘నిన్ను చేరవచ్చేలా’ పాటలు కూడా పాడాను. నాన్న చదువు పూర్తి చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టు అనడంతో ఎమ్‌బీఏ పూర్తి చేశాను. నేను పనిచేసిన తొలి స్ర్టెయిట్‌ సినిమా ‘హార్ట్‌ ఎటాక్‌’. డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నాకెంతో గుర్తింపు, ఎన్నో అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ‘కరెంట్‌ తీగ’లో సన్నిలియోన్‌కి కూడా వాయిస్‌ నాదే.
నన్ను మార్చేద్దాం అన్నారు
డబ్బింగ్‌ పట్ల నాకున్న ఇంట్రెస్ట్‌ గురించి డబ్బింగ్‌ ఇంజనీర్‌ పప్పుగారి ముందుంచాను. ‘హార్ట్‌ ఎటాక్‌ ’ సినిమా హీరోయిన్‌కి ఓ ఫ్రెష్‌ వాయిస్‌ కోసం పూరీగారు ట్రై చేస్తున్నారని చెప్పి నన్ను సజెస్ట్‌ చేశారు. హయాతీ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాక కొత్త హీరోయిన్‌కి కొత్త డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సూట్‌ కాదు. రిస్క్‌ చేయడం ఎందుకు ఇంకెవరితోనైనా చెప్పిద్దాం అని చాలామంది పూరి జగన్నాథ్‌గారిని భయపెట్టారు. ఆయన మాత్రం నాతోనే చెప్పించారు. నేను పాటలు పాడతాను అని తెలిసుంటే ఇందులో ఓ పాట కూడా పాడించేవాణ్ణి.. అని ఆయన నాతో అన్నారు కూడా. సినిమా ప్రివ్యూ అయిన వెంటనే మా టీమంతా నన్ను మెచ్చుకున్నారు. మీ గొంతు సూపర్‌’ అని మెసేజ్‌లు, మెయిల్స్‌ రావడం నాకు మరింత బలానిచ్చింది. కొత్త ఆర్టి్‌స్టకి ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేం ఉంటుంది. అలాగే తొలిసాని ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ పనితనం గురించి పలు వెబ్‌సైట్లలో ప్రస్తావించడంతో నేను ఇక్కడ రాణించగలను అనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పటి వరకు డబ్బింగ్‌ చెప్పిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ‘హార్ట్‌ఎటాక్‌’ మరో ఎత్తు. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మొదలైంది. అందుకే పప్పుగారి దగ్గర డబ్బింగ్‌ మెళకువలు నేర్చుకున్నా.
తాతగారి పాటలే నాకు పాఠాలు
ఘంటసాల వారి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. తాతయ్యని నేను చూడకపోయినా సినీ పరిశ్రమలో ఆయన ఎలా నిలదొక్కుకున్నారనే విషయాన్ని నానమ్మ తరచూ చెబుతుండేవారు. ఆయన పాటలు వింటుంటాను. సంగీతం మీదు నాకు పట్టుంది. తాతగారి పాటలే ఈ రంగంలో నాకు పాఠాలు. తాతయ్య, నాన్న నాకు స్ఫూర్తి. వారిద్దరూ నా రియల్‌ లైఫ్‌ హీరోలు. చిన్నతనం నుంచే వారిద్దరిలా పేరు తెచ్చుకోవాలని ఆశ పడేదాన్ని. గాయనిగా తాతయ్య వారసత్వాన్ని, డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నాన్న వారసత్వాన్ని నిలబెట్టాలనేది నా తాపత్రయం. తెలుగు స్పష్టంగా మాట్లాడడం నా కుటుంబం నాకిచ్చిన గొప్ప బహుమతి. మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే నాన్న అస్సలు ఊరుకోరు. నాన్న గైడెన్స్‌ ఇవ్వరు. జస్ట్‌ ప్రీడమ్‌ ఇస్తారంతే.
నా వరకు రొమాంటిక్‌ సీన్స్‌కి డబ్బింగ్‌ చెప్పడం కాస్త కష్టంగా ఉంటుంది. ఏడుపు సన్నివేశాలను చాలా బాగా పండించగలను. అలాగే పాజిటివ్‌ సీన్స్‌కి కూడా చక్కగా చెప్పగలను. రొమాంటిక్‌ సినిమాలకు గౌతమ్‌మీనన్‌ పెట్టింది పేరు. తాజాగా ఆయన దర్శకత్వంలో అజిత్‌, అనుష్క, త్రిష నటించిన ‘ఎన్నై ఆరిందాళ్‌’ సినిమాలో అనుష్కకు నా వాయిస్‌ ఇచ్చాను..’’
 ఆలపాటి మధు, చిత్రజ్యోతి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకలు తీరిన యోధుడు -చారూ మజుందార్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

42ఏళ్ళక్రితం నాతొ పామర్రు లోను ,22ఏళ్ళ క్రితం నాదగ్గర అడ్డాడ హైస్కూల్ లోను రైటర్ గా పని చేసిన అంజిరెడ్డి మనవరాలి పెళ్లి పామర్రులో 7-2-15 శ్రీ సాయిబాబా దేవాలయ కళ్యాణ మందిరం లో జరిగిన సందర్భం గా  అంజిరెడ్డి తో నేను .

42ఏళ్ళక్రితం నాతొ పామర్రు లోను ,22ఏళ్ళ క్రితం నాదగ్గర అడ్డాడ హైస్కూల్ లోను రైటర్ గా పని చేసిన అంజిరెడ్డి మనవరాలి పెళ్లి పామర్రులో 7-2-15 శ్రీ సాయిబాబా దేవాలయ కళ్యాణ మందిరం లో జరిగిన సందర్భం గా  అంజిరెడ్డి తో నేను .DSCN0001 DSCN0003 DSCN0004 DSCN0005

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వజ్రోత్సవం లో బాలానందం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుచేల కుబేర వరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్రేజీ కేరజీ వాల్ -హస్తిన పీఠం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

చిత్రకారుడైన వీర్రాజు గారి మదిలో ఆ కళ’’రేఖలతో రేరంగులతో రేకులు తొడిగి రంగులతో పువ్వై మరిమళించింది’’  రాజమండ్రి పరిసరాలు స్పూర్తినిచ్చాయి ఎన్నో సార్లు ఈ అందాల్ని తన చిత్రాల్లో ఓంపుకున్నారు .రేఖల్లోఒదగదీసుకొన్నారు .అక్షరాల్లో విస్తరించారు .అందుకే తన రచనల్లో ప్రకృతి పరుచుకొని ఉంటుంది .ఇంటర్ పరీక్ష లెక్కల్లో పోయింది .ఇంట్లో వాళ్ళు ఏమీ అనక పోయినా మనసులో బాధ కెలక వేసింది .అడ్డమైన ప్రతివాడి  దగ్గరా ,అభిమానం చంపుకొని తలొంచుకొని అడ్డ దిడ్డ ప్రశ్నలకు జవాబులిస్తూ గడిపి ఉద్యోగం రాక స్వశక్తితో బి ఏ చదవాలని చేరారు .పరీక్ష ఒక సారి తప్పితే స్కాలర్షిప్ రాదనీ తెలుసుకొని ఒళ్ళు దగ్గరేట్టుకొని శ్రద్ధగా చదివారు .తండ్రి తల తాకట్టు పెట్టి తోలి తరం ఫీజు కట్టారు .మళ్ళీ ఎప్పుడూ వారి సాయం కోసం అర్రులు చాచలేదు .

అప్పుడప్పుడు వేసిన చిత్రాలకు ,బరికిన కధలకు డబ్బులోస్తే వాటితోనే గడిపారు ‘’’డబ్బున్న మిత్రుడు బసవ రాజు ‘’కు చిత్రాన్ని అమ్మి ఆయనిచ్చిన ‘’పచ్చనోటు ‘’తో కాలేజి ,వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక టరం ఫీజు డబ్బులు ముట్టాక ఇబ్బంది లేకుండా పోయింది తనపై తనకు నమ్మకం వచ్చింది .’’సంతోషం గుండెల్లోంచి ముఖం లోకి తన్ను కొచ్చింది ‘’ట.’’చరిత్ర గత కాలానికి ఆల్బం అయితే రాజకీయం వర్తమానానికి అద్దం’’అన్నారు .తన్ను అంటి పెట్టుకొని కనిపెట్టుకొన్న స్నేహితునికి ‘’కదక్ మిత్ర ‘’అని పేరుపెట్టి కాలేజీ రోజులు అతనితోనే గడిపారు .కాలేజీ లో సీనియర్ ‘’కనక ప్రవాసి ‘’అంటే శ్రీపాద వారి సాహిత్యాన్ని కూలం కషం గా అధ్యయనం చేసి ఎన్నో విషయాలు రాసినవాడు .తరుణ సాహితీ సభ ఏర్పాటు చేసి శీలా వారికి ఆహ్వానం పంపాడు .అదే ఆయనకోచ్చిన మొదటిదీ ,ఆఖరిదీ .’’జీవితం లోను ,సాహిత్యం లోను  నాకన్నా ముందుపుట్టిన రంది సోమరాజు ‘’తెలుగు స్వతంత్రలో దూసుకు పోతున్నాడు .’’సహ రచయితగా గుర్తించి ,-సాదరం గా ఆహ్వానించి –స్నేహహస్తం తో నావేళ్ళనే పెనవేసుకొన్నాడు ‘’అని కృతజ్ఞత తెల్పి ఆప్తుడైనారు .ఇంతకీరంది సోమరాజు ఎవరు –అని ప్రశ్నించుకొని సమాధానం మనకోసం చెప్పారు వీర్రాజుగారు ‘’రాజమండ్రిని రాజ మహేంద్ర వరం అని పిలవాలనే ఉద్యమాలతో –పాతకాలపు సాహిత్య వాతావరణం జీవనది గోదారిలా –సజావుగా సాగిపోతుంటే –ఆధునిక సాహిత్యం ఇంకా –కుంటి నడకలు నడుస్తుంటే –తొలిరోజుల్లో బొగ్గుల కుంపటి లా భగ్గున మండి –ఆ తర్వాత నివురు గప్పిన కదా సాహిత్యం –శ్రీపాద నుంచి అందుకొనే కొత్త తరం కోసం –దిక్కులు చూస్తున్నప్పుడు –కధను పట్టుకున్న మలితరం కధకుల్లో –రంది సోమరాజు ముఖ్యుడు ‘’అని ఆయన కదా నేపధ్యాన్ని వివరించారు .సోమరాజు అంటే అభిమానమే కాదు గౌరవంతో కూడిన ‘’రంధి’’కూడా ఏర్పడింది .ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తమ్ముడి కోసం వీర్రాజు గారి పుస్తకం అచ్చేసి అంకితం ఇద్దామని అనుకోని ఇంటికి పిలిపిస్తే వెళ్లి సమర్పిస్తే భోం చేయమని అడిగితె సరేనని ‘’వీధి అరుగు మీద  విస్తరేసి వడ్డించి తినమంటే –నేను చేసిన పొరపాటు తెలిసేదికాదు ‘’అహం ఆత్మ గౌరవాలు దెబ్బతిని కొన్ని మార్పులు చేసి ఇస్తానని బొంకి   స్క్రిప్ట్ తీసుకొని ‘’మళ్ళీ తిరిగి వెడితే ఒట్టు ‘’.ఇలాంటివి మరో రెండు సార్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది యెంత జాగ్రత్తగా ఉన్నా .’’మోటు దేరిన హృదయానికి –సున్నితత్వం ఇంకా  మిగిలి ఉంటుందా ?’’అని ప్రశ్నించారు .

బుచ్చి బాబు రాసిన ‘’అరకు లోయలో కూలిన శిఖరం ‘’కద చదివి ‘’అడవి గుండెల్లో దూరి-గుండె గుబుర్లోకి చూసి –గుబురు పొదల్లోకి నడిచి –దారుల్లేని అడవి నేలను –పాదాలతో తట్టి –చూపులతో చుట్టి –అడవి అందాన్ని మోపులకెత్తు కొని రావాలి ‘’అని ఆరాట పడ్డారు .దీన్ని గ్రహించిన మిత్రుడు తన ఊరికి ఆహ్వానిస్తే వెళ్లి ఆ సోయగాలను స్వయం గా అనుభవించి గుండెలో పదిలం గా భద్రపరచుకొన్నారు .బుచ్చిబాబు రచనా ప్రభావం అంతటిది .ఈ అనుభవం తో ‘’అస్తిపంజరం ‘’కద రూపు దిద్దుకోన్నది .తర్వాత సీరియస్ గా ‘’సమాధి ‘’ ,ముగ్గురు వ్యక్తుల విచిత్ర ప్రవర్తనకు అద్దం పట్టే ‘’విచిత్ర త్రయం ‘’కధలు రాశారు .మిత్రుడు ప్రకాశ రావు ‘’సమాధి ‘’ని లేపి సాహిత్యం లో నిలబెట్టాడు .అది అరడజను కధలకు జన్మనిచ్చింది .పత్రికలో మెచ్చుకోళ్ళు లభించాయి. ప్రతిఏడాది సాహిత్య సమీక్ష చేసి కొత్త వరవడి సృష్టించిన శ్రీ వాత్సవ ఘనం గా శ్లాఘించాడు .’’అనుకోని ప్రోత్సాహం –అన్ని కోణాల్లోనూ వర్షించింది ‘’

మాదేటి రాజాజీ అనే కొత్త మిత్రుడు పరిచయం అయాడు .ఇంతకీ రాజాజీ ఎవరు?’’వరదా వెంకటా రత్నం గారి శిష్య రికం తో –చెయ్యి తిరిగి –బొంబాయి జే జే స్కూల్ ఆఫ్ఆర్ట్స్ లో శిక్షణ పొంది –వచ్చిన ఉద్యోగాన్ని బేఖాతర్ చేసి –ఆర్టిస్ట్ డిప్లమా తో స్వస్థలం రాజ మండ్రి కి తిరిగొచ్చిన హీరో ‘’ ‘’డబ్బు సంపాదనకు దూరం గా నిలిచి –కళని అమ్మకానికి పెట్టక –కీర్తి ప్రతిష్టలకు దగ్గరి దారిపట్టక –నిరంతర విద్యార్ధిగా ఉన్నవాడు –చిత్ర కళ కే అంకితమైన అరుదైన వ్యక్తీ ‘’అని ఆరాధనా భావం ప్రకటించారు .ఆప్తుల్లో ఆప్తుడైనాడు’’ వీరాజీకి రాజాజీ ‘’.కాలేజీ లో సీనియర్ బసవ రాజు ‘సాహి త్యాభి రుచిన సెంటులా పూసుకొని –కళాభి రుచిని పౌడర్లా పూసుకొని –ఖరీదైన పెంటాక్స్ కెమెరా తో కాలేజీ కాంపౌండ్ ‘’లో తిరిగేవాడు ‘’ఘాటైన స్నేహ పరిమళాలు వెదజల్లేవాడు ‘’ఇదంతా పైకే ,కనిపించినప్పుడే అని అర్ధమైపోయింది వీరాజీకి .’’కనిపించినప్పుడు ఆప్యాయం గ అభిమానం తో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి –ఆ తర్వాత పూర్తిగా మరిచిపోయే వ్యక్తీ ‘’’’అది స్నేహం గా పరిగణించడం ఎలా ని బాధ పడ్డారు .కాలేజీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలలో నటుడు గా కూడా వీర్రాజు పాల్గొన్నారు .’’జీవితం లో కాస్తయినా నటించటం చేత నైతే –రంగ స్థలం మీద కొంతైనా రాణించే వాడిని ‘’అని నిజం ఒప్పుకొన్నారు .ఆఫీసర్ పాత్ర పోషించి డైలాగు చెప్పటం రాక అప్ప చెప్పేసి రసాభాస కాకుండా కాపాడుకోన్నానని  చెప్పారు .’’గతస్మృతులు ‘’చిత్రానికి ప్రధమ బహుమతిపొందారు. ప్రిన్సిపాల్ స్వయంగా పిలిచికాఫీ ఇచ్చి అభినందించారు .’’సమాధి ‘’కదాభిమాని గా వినుకొండ నాగ రాజు పరిచయమైనారు .అతని వలన ‘’బంగోరె ‘’పరిచయం కలిగింది .’’కాలేజి మేగజైన్ కోసం కవిత రాయక తప్ప లేదు’’.స్వతంత్ర పత్రిక పుణ్యమా అని ఆధునిక కవిత్వం పై అవగాహన కలిగింది .’’అసమర్ధుని ఆత్మకధ ‘’గేయం రాశారు .’’గతాన్నంతా తవ్వి గుట్టగా వేసి కొండలాంటి ఆ మేటను చూసి –నాగుండె గడియారం ముళ్ళు –వంద మైళ్ళ వేగం తో పరుగెత్తుతుంటే ‘’రాశానని అవే పంక్తుల్ని రాసి చెప్పారు .ఫినిషింగ్ టచ్ గా ‘’ ఈ విశాల పృధివిలో –నే కోరినదేమీ లేదు –నన్నూ నాఆశల్నీ కప్పెట్టే –ఆరడుగుల నేల తప్ప’’ అని ముగించారు దాన్ని .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ –  7-2-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -8

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -8

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్

పన్నెండు పేరు లేని కవితలతో వచ్చిన చిన్ని పుస్తకం ఒక సంస్కృతి బాటను  పూర్తిగా మార్చేసి  నూతన సంస్కృతి దారిపట్టించింది . ఈ చిన్ని పుస్తకం జులై 4 న  అమెరికా పరాయి పాలన నుండి విముక్తి చెంది స్వాతంత్ర్య డిక్లరేషన్  విడుదల చేసిన రోజునే  వెలువడటం యాద్రుచ్చికమే అయినా  ,అదే ప్రభావాన్ని సాహిత్యం లోనూ చూపటం విశేషం .అదే ప్రఖ్యాత అమెరికా కవి వాల్ట్ విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’కవితా సంపుటి .పాత సంప్రదాయాన్ని వదిలేసి కవిత్వం కొత్త సంప్రదాయాన్ని ఎన్నుకొని దారిచూపి ఆధునిక కవిత్వానికి మార్గ దర్శి అయ్యాడు విట్మన్ .అమెరికన్ దేశీయ కవిత్వం  విట్మన్ తో నే ప్రారంభమైంది .అప్పటిదాకా బ్రిటిష్ కవిత్వ ధోరణే అమెరికా కవిత్వం లో ప్రతిధ్వనించింది దీనితో పూర్తిగా స్వంత కాళ్ళపై అమెరికన్ కవిత్వం నిలబడింది. తన జాతి జీవనాన్ని జీవితాన్ని  ప్రపంచానికి చాటింది అందులోని జవసత్వాలను తెలియ జేసింది .అమెరికన్ ప్రజలే అందులో ప్రతిఫలించారు .వాళ్ళ వేషం భాషా అలవాట్లు వృత్తులు అన్నిటికీ ఆ కవిత్వం అద్దం పట్టింది . ఘన విజయాన్ని సాధించి అమెరికా జాతీయ కవిగా గుర్తింపు పొందాడు వాల్ట్ విట్మన్ .

తొమ్మిదిమంది సంతానం లో విట్మన్ రెండవ వాడు .తల్లి అంటే వీరాభిమానం ,ఆరాధన ఉన్నవాడు .క్వేకర్ ల మధ్య అమెరికా లాంగ్ ఐలాండ్ లో పెరిగాడు .సుఖమయ  బాల్యం గడపలేదు.తల్లి జబ్బు మనిషి .చదువులేనిది .తండ్రి ఇళ్ళు కట్టేవాడు   పెద్దగా అందులో బాగు పడిందేమీ లేదు . ఒక చెల్లెలు నరాల వ్యాధి తో బాధ పడేది .ఒక తమ్ముడు ప్రయోజకుడై ఇంజినీర్ అయ్యాడు .పదకొండేళ్ళకే స్కూలు చదువు అయిపొయింది .ఇక బతకటానికి ఏ పని దొరికితే అది చేసేవాడు .పన్నెండే ళ్ళకు ఒక ప్రింటర్ దగ్గర సహాయకుడి టైప్ చేయటం నేర్చాడు  .లాంగ్ ఐలాండ్ స్టార్ పత్రికలో ప్రెస్ లో కొద్దికాలం ఉన్నాడు .టీనేజి అంతా దొరికిన ప్రతి పనీ చేసి రేస్ట్లేస్ అయి ఊర్లు తిరగటం తో నే సరిపోయింది .తిరుగుడు వంట బట్టి జీవితమంతా అదే ధోరణిలో నడిచింది .’’బతకటం ‘’మాత్రమె తానూ చేస్తున్నానని చెప్పేవాడు .తర్వాత న్యు యార్క్ లో ప్రెస్ కంపోసిటర్ అయ్యాడు .ఇక జర్నలిజం మొహం మొత్తి టీచర్ కావలను కొన్నాడు . ఏడు పల్లెటూళ్ళ స్కూళ్ళలో చదువు చెప్పి యువ విట్మన్ ఆ బులపాటమూ తీర్చుకొన్నాడు .పిల్లల ఇంటిలోనే ఉండి భోజనం వసతి పొందేవాడు .

బుద్ధి మళ్ళీ మరి ఎడిటర్ అవ్వాలనిపించింది .ఒక చిన్న  ప్రెస్ కొని తన స్వగ్రామం హంటింగ్ టన్లో ‘’లాంగ్ ఐలాండర్ ‘’అనే స్వంత పత్రిక ప్రారంభించి నడిపాడు .కూర్పు ,ప్రింటింగ్ అన్నీ తానె చేసి పేపర్ రిలీజ్ చేసేవాడు .బోర్ కొట్టి చేతులుకాలి ఉద్యోగం కోసం వెతికాడు .ఆరేళ్ళు ఆరు వేర్వేరు పత్రికలలో పని చేసి బతకటానికి సంపాదించాడు .చివరికి ఎడిటర్ అవ్వాలన్న కోరిక  ఇరవై ఏడవ ఏట తీరి ‘’బ్రూక్లిన్ ఈగిల్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .అప్పటికే ఏదో  కవిత్వమో వచనమో రాస్తూ ఉండేవాడు .అవి ప్రచురణ భాగ్యమూ పొందాయికూడా .వాటిశీర్షికలూ  తమాషాగా నే పెట్టాడు అందులోకొన్ని –‘’వన్  వికేడ్ ఇమ్పల్స్ ‘’,’’డెత్ ఇన్ ది స్కూల్ రూమ్ ‘’,రివెంజ్ అండ్ రిక్విటల్’’,ఏ టేల్ ఆఫ్ ఏ మర్దరార్ ఎస్కేపేడ్ ‘’వగైరా .చెత్త కవిత్వాలే ఇవి సంప్రదాయ రైమ్ లోనే  రాశాడు.సెంటిమెంట్ వండాడు .టెక్నిక్ అంటూ ఏమీలేదు .

ముప్ఫై ఏళ్ళు వచ్చాక తండ్రి బిల్డింగ్ పనుల్లో సాయం  చేస్తూ తోచిందేదో రాస్తూ కాలక్షేపం చేశాడు .నాటక శాలలకు ,ఒపెరాలకు వెళ్ళేవాడు .సెంటిమెంట్ థ్రిల్లర్స్ కొన్ని రాశాడు .ఈ వయసులో ‘’సోగ్గాడు’’గా వేషంలో ఉండేవాడు ఫ్రాక్ కోట్ వేసి ,ఎత్తైన టోపీ పెట్టి చేతిలో చిన్న బెత్తం పట్టుకొని చొక్కా గుండీ దగ్గర పువ్వు పెట్టుకొనే వాడు .తమ్ముడు జెఫ్ ను వెంటేసుకొని అమెరికా దక్షిణ ప్రాంతం ఆల్ఘేరీస్ ,ఒహాయో మిసిసిపి తిరిగొచ్చాడు .న్యు ఆర్లియాన్స్ లోను ,క్రేసేంట్ పత్రికలోను ఏదో మొక్కుబడి జర్నలిస్ట్ ఉద్యాగాలే చేశాడు .ఏదీ కడుపు నిండా తిండి పెట్టినవికావు .ఆ అసంతృప్తి పీడిస్తోంది .మళ్ళీ బ్రూక్లిన్ చేరి ‘’ఫ్రీమాన్ ‘’వార పత్రిక ఎడిటర్ అయ్యాడు విట్మన్ ..హోమో సెక్సువల్ అయి అనామక పిల్లలతో సెక్స్ జరిపాడని అభియోగం ఎదుర్కొన్నాడు .’’డార్క్ లేడీ ‘’ తో గడిపాడని పుకార్లు రేగాయి కాని ఏవీ నిజం కాదని తేలిందని విట్మన్ చరిత్రకారుడు రాశాడు .

ముదురు ముప్ఫై వ ఏట కవిత్వపు శైలి విట్మన్ కు అలవడింది .అది అప్పటి కాలం లో కొత్తదికాకపోయినా విట్మన్ కు మాత్రం కొత్తదే .తానూ ఇదివరకు రాసిన వాటికి పూర్తిగా భిన్నం గా ఇప్పుడు రాస్తున్నాడు .విషయం లో స్వేచ్చ ఉంది లయలో మార్పు ఉంది అంత్యాను నుప్రాస కు మంగళం పాడాడు  .చెవులకు కింగ్ జేమ్స్ రాసిన బైబిల్ పాదాలలాగా వినిపించాయి .హీబ్రూ కవిత్వపు పోకడలు కన్పించాయి .ఛందో నియమ౦  ఏమీ పాటి౦చనే లేదు .35వ ఏట ఈ ప్రయోగాలన్నీ ఒక రూపు దాల్చి వాల్ట్ విట్మన్ కవిత్వం గా ముద్ర వేసుకొని ఉప్పొంగి ప్రవహించింది .అప్పటిదాకా  ‘’వాల్టర్ విట్మన్ జూనియర్ ‘’  గా ఉన్న పేరునూ  ‘’వాల్ట్ విట్మన్ ‘’గా మార్చుకొని కవిత్వం తో పాటు పేరులోనూ నూతన వరవడి సృష్టించాడు .ఈ పేరే నిలిచిపోయింది చిర స్థాయిగా .తండ్రిలో కొంత అంశాన్ని తీసుకొని మిగిలినదంతా నూతన విధానాన్ని ఆవిష్కరింప జేసుకొన్నాడు .దీనితోనే ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’ను బ్రూక్లిన్ ప్రింట్ షాప్ లో ప్రింట్ చేసి దేశం మీదికి వదిలాడు .అమెరికా ఆత్మ తో మమేకం అయి ప్రజాస్వామ్య పచ్చిక మొలిపించాడు. ప్రజాస్వామ్య మూలికల దివ్యౌషధం  (డెమోక్రాటిక్ హీర్బెజ్) జనాలకు అందజేశాడు .ఈ పుస్తకం ముఖ చిత్రం లోనూ విట్మన్ కవి బాహ్య స్వరూపం పూర్తిగా మారిపోయింది .ఫ్రాక్ కోట్ ,చేతిలో బెత్తం మాయమైనాయి .ముతక కార్మికుల బట్టలేసుకొన్నాడు .ట్రౌజర్కు బెల్ట్ పెట్టుకొన్నాడు .హిప్ బూట్లు ధరించాడు .కేర్లెస్ పోజ్ తో కోటు లేకుండా మెడ దగ్గర చొక్కా ఓపెన్ అయి ,లోపలి రంగు అండర్ షర్ట్ కనిపిస్తూ  బెఫర్వాగా దర్శన మిచ్చాడు .దీనితో’’ వాల్ట్ విట్మన్ కల్చర్ ‘’ప్రారంభమైంది ఆరాధనీయుడయ్యాడు . ఐడల్ అనిపించుకొన్నాడు.రోల్ మోడల్ గా మారాడు .కవిత్వం తోబాటు వేష భాషలన్నిటి లోనూ సమూలమైన మార్పు మార్పు రావాలని చెప్పటమే కాదు తానూ ఆచరించి చూపి మార్గ దర్శి అయ్యాడు విట్మన్ .అదీ’’విట్మనీయం ‘’.

తాను  కార్మిక సోదరుడిని చేలికాడిని స్నేహితుడిని అని చెప్పుకొన్నాడు .అక్షరజ్ఞానం లేని వారి సహచరుడిని అని ప్రకటించుకొన్నాడు .వారి ఆత్మీయుడిని అన్నాడు .తనను తానూ పరిచయం చేసుకొంటూ ‘’of pure American breed ,large and lusty –age thirty six years –never once using medicine-never dressed in black ,always dressed freshly ,and cleanly in strong clothes –neck open ,shirt collar flat ,and broad ,red beard with white hair ike hay beloved and looked toward especially by young men and the illiterate –one who does not associate with literary people –never on platforms amid the crowds of clergy men or aldermen or professors ,rather down ni the bay with fishers in the fishing smacks or riding on Broadway omnibus ,side by side with the driver or with a band of loungers over the open grounds of the country .Has the easy fascination of what is homely and accustomed –as of something you knew before and waiting for –there you have Walt Whitman ,the begetter of a new offspring in literature ‘’అని తెలియ జేసుకొన్నాడు .ఇది చదివి జనాల ‘’మైండ్ బ్లాక్ ‘’అయింది .తమవాడు ,తాము కావాలనుకొన్నవాడు ,తమకోసం వచ్చాడని మురిసిపోయారు .అదీ విట్మన్ సాధించిన నూతనత్వం .ఇప్పటిదాకా కార్మిక కర్షక వర్గాన్ని పట్టించుకొన్న అమెరికన్ కవే లేడు .ఇప్పుడు వారి బాధలను గాధుగా చెప్పెఆత్మీయుడు  లభించాడన్న పరమానందాన్ని ప్రజలు పొందారు ఆరాధించారు .తమ కోసమే కలంపట్టిన వీరుడని కీర్తించారు .ఇదొక చారిత్రాత్మక విప్లవమే అమెరికన్ సాహిత్యం లో ముఖ్యం గా కవిత్వం లో .

If you are American, then Walt Whitman is your imaginative father and mother, even if, like myself, you have never composed a line of verse. You can nominate a fair number of literary works as candidates for the secular Scripture of the United States. They might include Melville’s Moby-DickTwain’sAdventures of Huckleberry Finn, and Emerson’s two series of Essays and The Conduct of Life. None of those, not even Emerson’s, are as central as the first edition of Leaves of Grass.

అని ప్రముఖ అమెరికన్ విమర్శకుడు హోరాల్ద్ బ్లూమ్ విట్మన్ ను ఆవిష్కరించి సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో తెలియ జేశాడు .

Walt Whitman - George Collins Cox.jpg

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దారులేసిన అక్షరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా దొడ్లో పూసిన దేవ గన్నేరు ,అమెరికా మెట్టతామర ,నీల౦ పూలు 

DSCN9981 DSCN9982 DSCN9983(1) DSCN9983 DSCN9984 DSCN9985 DSCN9986 DSCN9987మా దొడ్లో పూసిన దేవ గన్నేరు ,అమెరికా మెట్టతామర ,నీల౦  పూలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చరిత్ర చదువుదాం (భారతీయం)

 

చరిత్ర చదువుదాం (భారతీయం)

పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్‌ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్‌, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి కూడా మనం చూడలేం. ఒకప్పటి మన సంప్రదాయం చూస్తే మన ప్రాచీనులు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎదుటివారి సిద్ధాంతాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిలోని దోషాల్ని చూపి తమ సిద్ధాంతాల్ని చెప్పేవారని తెలుస్తుంది. ఈ పరంపర, శ్రద్ధ మనలో లోపించడం మన పండిత వర్గానికి చాలా అవమానకరం.
ఇప్పుడు మన దేశంలో వేడివేడిగా జరుగుతున్న చర్చల్లో చరిత్ర పుస్తకాల్ని సరిచేయడం అనేది ఒకటి. చరిత్రను తిరిగి రాయటం ఎందుకు అని మనకు వెంటనే అర్థం కాదు. మనమిప్పుడు చదువుతున్న చరిత్ర అంతా మన పాలకులైన ఆంగ్లేయులు రాసిందే. మనకు రాజతరంగిణి, హర్షచరితము, ప్రతాపరుద్రీయం లాంటి పుస్తకాలు, ఇతర చారిత్రక ప్రబంధాలు చాలా ఉన్నా వాటిని ఆస్థానకవులు రాయడం వల్ల చరిత్ర కొంత తెలిసినా, దానిలో కల్పనలు, అతిశయోక్తుల పాలు ఎక్కువ. వాటిని చరిత్రగా భావించలేం. విదేశీ పర్యాటకులు, మొగల్‌
దర్బారులో చరిత్రకారులు రాసిన విషయాలు కొంతవరకు ఉపయోగపడతాయి..
చరిత్ర అంటే మనందరికీ చిన్న చూపే. అయినా చరిత్ర దాని పని అది చేసుకుపోతుంది. ‘A nation which does not know history is condemned to repeat it’’ అంటాడు అమెరికన్‌ తత్త్వవేత్త జార్జి శాంటయనా. అందువల్ల కనీసం విద్యావంతులైనా చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది.
‘The most effective way to destroy people is to deny and obliterate their understanding of their own history’’ అని ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జి ఆర్వెల్‌ చెప్పారు. చరిత్ర మనకు స్ఫూర్తినీ ఇవ్వగలదు, మనల్ని మనమే చరిత్రహీనులుగా నిందించుకునే స్థితికి తేగలదు. చరిత్రను కంట్రోల్‌ చేసినవారు ప్రజలను కంట్రోల్‌ చేయగలరు. చరిత్రను ఎలా రాయాలో, దాని ద్వారా ఎలా ప్రజలను అదుపులో ఉంచుకోవాలో, ఒక దేశ ప్రజల్ని ఎలా మేధోపరమైన బానిసలుగా చేయాలో బ్రిటీ్‌షవారికంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. మొట్టమొదటగా మన చరిత్రను పాశ్చాత్యులే రాశారు. వారి పాలనకు అనుకూలంగా ఉండటానికి, వారి సంస్కృతిని గొప్పదిగా నిరూపించడానికి మన సంస్కృతిలో కొన్ని విషయాల్ని దాచడం, కొన్నింటిని వక్రీకరించి వివరించడం ద్వారా విద్యావంతుల్ని తమ భావజాలానికి అనుగుణంగా మార్చుకోగలిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పాశ్చాత్య భావజాలంలో ఉన్న రచయితలే చరిత్ర పుస్తకాలు రాయడం వల్ల నిజంగా మన చరిత్రలో ఏం జరిగిందో మనకు తెలిసే అవకాశం లేకపోయింది.
ఒక జాతి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఆ జాతి, లేదా సంస్కృతి ప్రపంచానికి ఎలాంటి విజ్ఞానాన్ని అందించింది అన్నది ఒక కొలబద్ద. ఒక సంస్కృతిలో రూపొందిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు, ధర్మాధర్మాలకు సంబంధించిన విషయాలు, ఆ సంస్కృతిలో ఉన్న సాహిత్యం – వీటన్నింటినీ కలిపి సమగ్రంగా మూల్యాంకనం చేస్తే అది ఆ సంస్కృతి యొక్క సారాంశంగా ఉంటుంది. దీన్ని ఇటీవల కాలంలో ఒక జాతి యొక్క మెటా నెరేటివ్‌ లేదా గ్రాండ్‌ నెరేటివ్‌ అంటున్నారు. మన దురదృష్టవశాత్తు మన జాతి మెటా నెరేటివ్‌. అంతా మరెవరో రాసి మనకందించారే కాని మనం స్వంతంగా తయారుచేయలేదు.
ఎందుకు అలా జరిగింది? యూరోపియన్‌ సామ్రాజ్యవాదులు 15వ శతాబ్దంలో మొదలుగా ప్రపంచంలోని అన్ని దేశాల్ని లొంగదీసుకుంటూ వెళ్లడంతో పాటు ఆయా దేశాల సంస్కృతుల్ని కూడా అధ్యయనం చేస్తూ వెళ్లారు. ప్రపంచంలో అన్ని దేశాల నెరెటివ్‌ కూడా పాశ్చాత్యుల దృష్టికోణం నుంచే తయారుచేయబడింది. సామ్రాజ్యవాదంతో పాటు వారి మతాన్ని కూడా స్థాపించడం అనే ఉద్దేశ్యం ఉండడం వల్ల తాము అడుగుపెట్టిన దేశాల్లోని సంస్కృతుల్ని పూర్తిగా అధ్యయనం చేసి వాటిని అవహేళన చేసి ఆయాదేశ ప్రజలకు తమ తమ సంస్కృతిపైనే ఏహ్యభావం వచ్చేట్లు రచనలు చేశారు. ఇలా చేయడంలో వారు మిగతా దేశాల్లో విజయం సాధించినా మన దేశ సంస్కృతిని పూర్తిగా తృణీకరించలేకపోయారు. మనల్ని చాలాకాలం ఏలినవారు బ్రిటీష్‌ వారు. వారి ప్రభుత్వ ఉద్దేశాలు ఉలా ఉన్నా ఆ దేశ విద్వాంసులు మాత్రం సత్యాన్ని కప్పిపుచ్చలేకపోయారు. కొందరు గొప్పగా ప్రశంసించారు కూడా. అయినా మరికొందరు రంగు కళ్ళద్దాల ద్వారా మనకు మన సంస్కృతిని చూపించారు.
దాదాపు 130 సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మన దేశ సంస్కృతిని గురించి మ్యాక్స్‌ ముల్లర్‌ ఆనాటి ఐ.సి.ఎస్‌ ఆఫీసర్లను ఉద్దేశించి కొన్ని ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలు-  ‘India what it can Teach Us ’’ అనే పుస్తక రూపంలో వచ్చాయి. ఈ పుస్తకం మనదేశం యొక్క తొలి మెటా నెరేటివ్‌ లాంటిది. వేదాలకాలం నుంచి చర్చిస్తూ అనేక విషయాల్లో భారతదేశం ఎంత పురోగమించింది.. అన్నది ఒక వైపు చెబుతూనే మరో వైపు దేశప్రజల్ని జాతుల పేరిట విడగొట్టడానికి ఎన్ని బీజాలు నాటాల్నో అన్నీ నాటాడు. వందలాది పాశ్చాత్య పండితులు సంస్కృతంలోని మూల గ్రంథాలను చదివి వాటిపై ఇంగ్లీషులో పుస్తకాలు రాశారు. ఇలాంటి పుస్తకాలు వచ్చే వరకూ జనసామాన్యానికి మన పుస్తకాల్లో ఏముందో తెలియకపోవడం, మన పండితులకు ఆధునిక దృక్పథం లేకపోవడం వల్ల పాశ్చాత్యుల ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం దురదృష్టం. ప్రతి సంస్కృతిలోనూ సమాజాన్ని సంఘటిత పరిచే అంశాలూ, సమాజాన్ని బలహీనపరిచే అంశాలు ఉంటాయి. మన బలహీనతల్ని మాత్రమే వివరిస్తూ వచ్చిన గ్రంథాలు మన సమాజాన్ని ప్రభావితం చేశాయి.
గత రెండు శతాబ్దాలుగా విద్యాధికులందరూ ఇంగ్లీషు మాధ్యమంలోకి వెళ్ళడంతో అందరికీ పాశ్చాత్యులు రాసిన పుస్తకాలే ప్రామాణిక గ్రంథాలయ్యాయి. ఈ పుస్తకాల్లో సత్యం ఎంతవరకూ ఉంది అని తెలుసుకోవాలంటే సంస్కృతభాష తెలిసి ఉండాలి. ఈ శ్రద్ధ దురదృష్టవశాత్తూ మన మేధావులకు కలగడం లేదు.
పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్‌ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్‌, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి కూడా మనం చూడలేం. ఒకప్పటి మన సంప్రదాయం చూస్తే మన ప్రాచీనులు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎదుటివారి సిద్ధాంతాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిలోని దోషాల్ని చూపి తమ సిద్ధాంతాల్ని చెప్పేవారని తెలుస్తుంది. ఈ పరంపర, శ్రద్ధ మనలో లోపించడం మన పండిత వర్గానికి చాలా అవమానకరం.
మన దేశ చరిత్రను సవరించాలంటే దృక్పథంతో ప్రస్తుత చరిత్రకారులు ప్రయత్నం చేస్తున్నారు. మన చరిత్ర ఎలా ఉన్నా మనం ప్రపంచ చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ మొదలైన మాధ్యమాల వల్ల ప్రపంచ చరిత్ర అంతా మన ముందున్నది. అందులో ప్రామాణికంగా, నిబద్ధతతో పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. చాలా కాలం క్రితం నేను పోలీసు అకాడమీలో ఉన్నప్పుడు ’’A history of Torture Throughout the Ages ‘ అనే పుస్తకాన్ని చూశాను. వివిధ రకాల చిత్రహింసల్ని కనిపెట్టిన ఘనత అతి పవిత్రమైన మత సంస్థలకే ఉందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే మనకు నీతులు చెప్పే దేశాలు ఎలా మారణకాండ చేశాయి, ఎలా కొన్ని సంస్కృతుల్ని నిర్మూలించాయి అని తెలుసుకోవడానికే ‘History of Genocide’, ‘History of Slavery’, మొదలైన పుస్తకాల్ని చదవాలి. మనకు సెక్యులరిజం గురించి చెప్పేవారి గురించి ‘History of Inquisition’ లాంటి పుస్తకాలలో చదవగలం. బ్రిటీష్‌ వారి క్రూర పాలనకు ఉదాహరణ కావాలంటే ‘Impeachment of Warren Hastings’
గూర్చి Edmund burke ఏమి చెప్పాడో చూడాలి. వీటి నేపథ్యంలో మన చరిత్రను అమెరికన్‌ తత్త్వవేత్త Will Durant రాసిన ‘Story of Civilization’ లో చూస్తే మనమెంతో గర్వంతో ఉండగలం. మన యొక్క తప్పుల్ని సవరించుకునే శక్తి మన సంస్కృతిలోనే ఉంది.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com కు పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధిల్లీ ఎన్నికల ముఖ చిత్రాలు -మోడీ ఫ్లాప్ షో తో సహా

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

కదా లేఖన పోటీ లో పాల్గొని ‘’పోటీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక నోటు పుస్తకం నిండా సాగి- అన్న ప్రాసన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర పడ్డారు .ఆ ‘’నవలా కద’’ పత్రికకు పంపిస్తే అడ్రస్ గల్లంతయ్యింది .ఆని నిరాశపడలేదు .’’ముడుచుకొన్న ఆలోచనల్లో చురుకుదనం పుష్పించి –అభిరుచుల్లో –కొత్తదనం అల్లు కుంటోంది ‘’అని ముచ్చటపడ్డారు .తెలుగు స్వతంత్రలో రెందోపెజీ లోపడే కవిత్వాలు చూసి కవిత్వపఠనం పై దృష్టి మళ్ళింది .బహుమతులు ప్రతిభకు కొలబద్దలూ అద్దాలు కాక కపొవచ్చు కాని  ‘’ప్రోత్సాహానికి ప్రేరకాలు ‘’అని నమ్మారు .జిళ్ళా యువజనోత్సవ  చిత్ర లేఖన పోటీలలో ‘’పొందిన ప్రధమ బహుమతి కేటలిస్ట్  అయి,కళా రంగం లో ముందుకు కదిలించింది ‘’.ఆ బహుమతి డాక్టర్ గరిక పాటి రాజా రావు గారి చేతులమీదుగాగ్రహించటం గౌరవం, చిరస్మరణీయం అయింది .

తాము ఉండే పేటలో కాంగ్రెస్ జండా ఎగరగా ఎన్నడూ చూడలేదట వీర్రాజుగారు .ఎక్కడ చూసినా ‘’యెర్ర జండేర్ర జండా  ఎర్రెర్రని జెండా ఎర్రజండా ‘’అని నారాయణ మూర్తి పాటలాగా రెప రెప లాడేవి .’’పార్టీ మీద నిషేధం ఉక్కు పాదమై వాలినప్పుడు –ఇంటిమీది జెండా పీకేసుకోన్నారుకాని –పార్టీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు ‘’అని పార్టీపై  తన అభిమానాన్నితెలిపారు .కమ్యూనిస్ట్ మిత్రుడు కుందుం ప్రకాశ రావు  ఆప్తమిత్రుడు .’’నా అక్షర గమనానికి ప్రత్యక్ష కారణం అతనే ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఆవంత్స సోమ సుందర్ ఆధునిక సాహిత్య పరిచయం చేశాడు .’’రచన బాగోగులని తూకం వేసే తూనిక రాళ్ళూ యేవో అతని దగ్గరున్నాయి ‘’అని ఆయన ప్రతిభను కీర్తించారు .’’నన్ను రచయితగా శిల్పించిన వాడు అక్షరాలా అతనే ‘’అని అన్నారు.’’వయసు పెరుగుతున్న కొద్దీ –ఇంటి పరిస్తితులు అర్ధమై –మనసులో చిక్క పడి –బాల్యం మెల మెల్లగా పట్టు సడలించుకొని –‘’దూరం గా జరిగిపోయింది .

నూనుగు మీసాలు తేనే రంగులో మెరుస్తున్నప్పుడు –‘’అందం అప్పుడు కాంటాక్ట్ లెన్స్ అయి –నాకళ్ళల్లో అమరిందేమో ?’’అన్నారు యవ్వన ప్రాదుర్భవాన్ని కవిత్వం లో ఒలక బోస్తూ .వందేళ్ళ చరిత్రగల కాలేజి లో చేరి ‘’ఆనంద గర్వాలు –మనసును ఉయ్యాల లూపాయి ‘’.అంటారు .దీనికి కారణం ‘’ఓ చారిత్రిక వార సత్వపు స్రవంతిలో –నేనో బిందు వౌతున్నందుకు ‘’పొందిన గర్వం అది .సంస్కృతీ వారసత్వానికి ముచ్చట అది .పెదనాన్న ఇల్లు గుల్ల చేసుకొని ,నిండు దరిద్రం తో మంచాన పదడి చనిపోతే ,పెద్దమ్మ  భారమూ తండ్రిమీద పడి నా తండ్రిబెదరలేదట .తల్లి ఒంటిమీద నగ నట్రా కాళ్ళోచ్చి కదిలిపోయాయి .పెదమామయ్య సాయమే దిక్కైంది.స్కాలర్ షిప్ అంది తల్లి చేతుల్లో డబ్బు పెడితే ‘’తన కలల సాకారానికి –వర్తమాన చిత్రం –ఆమె మనసులో –అస్పష్టంగా కదిలి ఉండాలి ‘’అని ఊహించారు .

కాలేజిలో పై ఖర్చులకు గాను ఊళ్ళో చిన్న పత్రికలకు కోరిన బొమ్మలేసి చిలక్కొట్టుడు డబ్బు సంపాదిస్తూ కుటుంబం పై భారం పడ కుండా చూసుకొన్నారు.దామెర్ల రామా రావు గారంటే ‘’అజంతా చిత్రాల రేఖల లాలిత్యానికి –దాని సమవర్ణ లేపన సౌందర్యానికి –పాశ్చాత్య దేశాల అంగ సౌష్టవాన్ని జోడించి –వంగ దేశపు వాష్ టెక్నిక్ ను మేళవించి –సరి కొత్త ఆంద్ర చిత్రకళా శైలిని  సృష్టించిన ‘’మహానుభావుడు అని కీర్తి కిరీటం చిత్రకళా భాష లో చెప్పి, పెట్టారు .’’ఆంద్ర చిత్ర కళా పునరుజ్జీవన వైతాళికుడు ‘’అన్నారు .మూడు పదుల వయసులోనే నూరేళ్ళు నిండిన  దురదృష్ట వంతుడు రామారావు . ఆయన స్మ్రుతి చిహ్నమే రాజమండ్రి లో వెలసిన ‘’కళా గౌతమి ‘.’రామారావు ఆప్తమిత్రుడు ,చిత్రకళలో మరో మేరువు అయిన వరదా వెంకట రత్నం గారి శిక్షణలో వీర్రాజు గారు చిత్రకళా రహస్యాలు తెలుసుకొన్నారు .స్కెచ్ పుస్తకాలను చిత్రాలతో నింపి వేళ్ళకు రేఖా సోయగాన్ని సమకూర్చుకొన్నారు .

చిత్రాల్లో జీవాన్ని ,చైతన్యాన్ని వేగాన్ని ని౦పు కొంటూ వెలుగు నీడల సహజ సౌందర్యాన్ని అడ్డుకొంటూ తనను తానూ చిత్రకారుడిగా ఆవిష్కరించుకొన్నారు వీర్రాజు గారు .తన ప్రయతనం కీర్తికోసం కాదని ఆర్దికావసారలకోసమే నని నిజాయితీ గా చెప్పారు .ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి చేతులమీదుగా చిత్రకార సన్మానం అందుకొని పులకించారు .అప్పటికి వయసు పద్దెనిమిదే అన్నది కొసమెరుపు .

‘’బిడియానికి పై తొడుగు మౌనం .చొరవకు పై తొడుగు మాటకారి తనం ‘’అని చక్కని అర్ధం చెప్పారు .ఆ రెండూ తనకు లేవు .’’గుండేల్లోతుల్లోకి తొంగి చూస్తె కాని అర్ధం కాని వాడిని ‘’అని ఆవిష్కరించుకొన్నారు తన్ను తాను .కాలేజీ తెలుగు శాఖ ఆహ్వానంపై వచ్చిన బాల బంధు బి. వి .నరసింహా రావు గారు ‘’ఆడుతూ పాడుతూ –హావ భావాతో చేసిన ఉపన్యాసం ‘’ఆకట్టుకొని ప్రేరణ కల్గించి ,ఎప్పటికైనా ఆ కాలేజీ వేదికపై ఓసాహిత్యో పన్యాసాన్నివ్వాలని ‘కోరిక ‘’మనసు పొరల్ని తోలుచుకొని –బీజ దళం లోంచి –చిగురాకై విచ్చుకొంది’’అని బయాలజీ భాష లో బాగా చెప్పారు .’’చప్పట్ల అభినందన హారం –మెళ్ళో వేసుకోవాలని ‘’ఆశ పడ్డారు .కాని ఆ అవకాశమే రాలేదట .

శరత్ సాహిత్యం చదివి అదే మూసలో అవే పాత్రల్ని మూస పోసి అచ్చులు పోసుకొని నవల రాశారు .’’చిదికే వరకు సెగ్గడ్డ సలపరం పెట్టి నట్లు ఆలోచనలు అక్షరాలై కాగితం మీద రాలే వరకు –మనసుకు పట్టిన జ్వరం –నిమ్మళించి తేలిక పడనే లేదు ‘’ఆయనకు .ప్రజా మత వార పత్రిక దీన్ని సీరియల్ ప్రచురించి గుర్తింపు పొంది’’ రచయిత గా చెప్పుకొనే వీలిచ్చింది ‘’అది మరోకొత్త నవలకు ఊపు నిచ్చింది .అప్పటికి అయన ఇంటర్ రాసిన విద్యార్ధి మాత్రమే .

 

 

వరదా వెంకట రత్నం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

     గీర్వాణ కవుల కవితా గీర్వాణం

            నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

—                        

   ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” ,

“పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ ఎప్పటి కప్పుడు 
శ్రీ దుర్గాప్రసాద్ గారు నాకు అంకితమివ్వాలనుకో వటo , నేను వాటి
స్వీకర్తులుగా సరియైనవారిని సూచించటం , వారు దానికి అంగీకరించటం
జరిగిపోయాయి . ఇప్పుడు “గీర్వాణకవుల కవితా గీర్వాణం” అంతర్జాలంలో
ధారావాహికంగా ప్రచురించిన దానిని నా ప్రమేయం లేకుండానే నాకు అంకిత
మివ్వటo నన్ను అమితాశ్చర్యాలకు గురిచేసింది . ఇంతటి పవిత్రమైన అమృతంలాoటి
రచనకు స్వీకర్త గా నాకున్న అర్హత శ్రీ దుర్గాప్రసాద్ గారికి నాయందున్న
అభిమానం మాత్రమే నని నా నిశ్చితాభిప్రాయం  .
తదుపరి , ఈవిషయాన్ని గురించి మేనకోడలు జ్యోతి తో సంభాషిస్తున్న సందర్భంలో
, జ్యోతి ఉత్సాహానికి నా ప్రోత్సాహం తోడై ఈ మహోన్నత విలువైన రచనను
పుస్తకరూపంగా ప్రచురిoచాలని, అందుకు జ్యోతి తoడ్రి గా రైన , మా పెద్దబావగారు
డా :  రాచకొండ నరసింహశర్మ గారి ఆశీస్సులతో ,అన్న సుధాకర్ , తమ్ముడు రమేష్,
చెల్లెలు సంధ్య(అంతా అమెరికా వాసులు ) లను కలుపుకొని సమిష్టిగా
ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహించాలనుకొవటo , ఈసూచనకు శ్రీ
దుర్గాప్రసాద్ గారు  పచ్చజెండా ఊపటం ఒకదానివెంట ఒకటి దైవనిర్ణ యాలు గా
జరిగిపోయాయి.  వీరందరికీ నా ధన్యవాదాలు .

                                 –మైనేని గోపాలకృష్ణ-  హన్ట్స్ హిల్  -అలబామా -యు ఎస్ ఏ –

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -7

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -7

4- సామ్య వాద మహర్షి –కారల్ మార్క్స్

జీవితం లో ఎక్కువ భాగం లైబ్రరీలలో గడిపి ,యదార్ధ వాదాన్ని రొమాంటిక్ వాదానికి వ్యతిరేకం గా వ్యాప్తి  చేసి ,తన జీవితాన్ని మాత్రం ‘’నిత్య పెళ్లి కొడుకు ‘’గా అనుభవించిన వాడు కారల్ మార్క్స్ .హృదయం లేని వాడు ,అవతల వాడి గోడు పట్టించుకోని రకం .తన భావాలను వ్యతిరేకించే వారిని సహించని మనస్తత్వం .మధ్య తరగతి మహా రచయిత,ఆలోచనా పరుడు .ఏనాడూ కనీసం కూలి పనికూడా చేయని కార్మిక నాయకుడు .మొదటి ప్రపంచ కార్మిక సంఘానికి అధ్యక్షుడు  .పుట్టింది జర్మనీలో అయినా ఎక్కువకాలం జీవితాన్ని గడిపింది ఇంగ్లాండ్ లో .ఇన్ని వైరుధ్యాలున్న మనిషి మార్క్స్ .ఆయన ప్రభావం రష్యాలోను  దూర ప్రాచ్య దేశాలలో ను ఎక్కువ .అయన రాసినఉద్గ్రంధం   ఆధునిక చరిత్రను మలుపు తిప్పింది  .కాని దాన్ని  ఎవరూ చదివిన దాఖలాలు లేవు .

అసలుపేరు హీన్రిచ్ కారల్ మార్క్స్ .యూదు కుటుంబం .లా చదివినా వారికి కోర్టులో ప్రవేశం లేకపోవటం తో క్రైస్తవం తీసుకొన్నారు .పెద్దకుటుంబం లో రెండవ వాడు .కొడుకు కవి గా వెలగాలని కోరుకొన్నాడు .బాన్ యూనివర్సిటీలో చేరి గురువు గార్గ్ విత్లెం హెగెల్ ప్రేరణతో దియాలజీ తీసుకొన్నాడు .మతం కంటే న్యాయ శాస్త్రం మీద మక్కువెక్కువ .తీసుకొన్న చాయిస్, గురూజీ సెలెక్షన్ రెండూ నచ్చలేదని పించింది ..యుక్త వయసు రాక ముందే చిన్న నాటి స్నేహితురాలు అందకత్తె తనకంటే నాలుగేళ్ళ పెద్ద అమ్మాయి ని వలచి ,ఆమె ప్రేమకూ లైన్ క్లియర్ తెచ్చుకొన్నాడు .ఆమె ఎందరో ప్రేమికుల్ని ఇతనికోసం వదిలేసింది .కాని ఆమె తండ్రికి ఇష్టం లేక పోవటం తో ఆరేళ్ళు ఆగి ఆయనా పచ్చజెండా ఊపిన తర్వాత పెళ్లి చేసుకోన్నారిద్దరూ .

దేనిలోనూ సరిగా ఇమడలేక తండ్రి మనసు  బాధపెట్టాడు కారల్ .బెర్లిన్ పంపితే వెళ్లి ధర్మ శాస్త్రం (జూరిస్పుడేన్స్)చదివి ప్రాక్టిస్ చేయటం ఇష్టం లేక చరిత్ర ,తత్వ శాస్త్రం  లో పడ్డాడు .క్రమంగా హెగెల్ చెప్పిన హేతువాదం పై ఆకర్షణ పెంచుకొన్నాడు .హెగెల్ భావ పరిధిని దాటి ముందుకు దూసుకు పోయాడు ‘’డయలేక్టిక్ మెటీరియలిజం’’ వ్యాప్తికి కారకుడయ్యాడు .జీవితం లో చావు దాక్కుని ఉంది అన్నది హెగెల్   భావన .దీన్ని ఆర్ధిక ,తాత్విక తత్వ శాస్త్రాలకు అనుసంధించాడు .భావాలను వాటిప్రభావాలను మరువలేదు .ఉన్నది ఉన్నట్లుగా నే ఉండాలి అన్న దానిపై పునరాలోచన చేశాడు .యేవో అస్పస్తాభావాలున్నాయికాని అవి స్పష్టం కావటం లేదు .కాని నోట్సుపుస్తకాలన్నీ తన ప్రియురాలిపై కవిత్వం తో మాత్రం నింపి పారేశాడు .టీచర్ అవాలనే కోరిక ఉండేది .తత్వ శాస్త్రం లో డాక్టరేట్ పొందాడు. కాని ఇతని విపరీత భావనలకు ఏ యూని వర్సిటీ అతనికి ఉద్యోగం ఇచ్చే సాహసం చేయలేదు .తత్వ శాస్త్రం కూడు గుడ్డ సమకూర్చదని గ్రహించి జర్నలిజం లో వేలుపెట్టాడు .రాడికల్ జర్నల్స్ ఆతను రాసినవి బాగానే ప్రచురించి వ్యాప్తి చెందించాయి .కాని తన సిద్ధాంతాలకు ఒక రూపం ఇవ్వాలనే తలంపుతో పారిస్ వెళ్ళాడు .

పారిస్ లో తనకన్నా రెండేళ్ళు చిన్న వాడైన  ఫ్రెడరిక్ ఎంగెల్స్కు శిష్యుడైనాడు .కలిసిపని చేశాడు చివరికి మార్క్స్  మరణానంతర సాహిత్యాన్నిఏంగిల్స్  ప్రచురించాడుకూడా .ఎంగెల్స్ సంపన్నుడు .మార్క్స్ ఆలోచనా పరంపరకు మద్దతు నిచ్చి ప్రోత్సహించాడు .సంపన్నులు పేదకార్మికుల  పోట్టకోడుతున్నారని ఇద్దరూ ఆలోచించారు.దీనికి భరత వాక్యంపలకాలని భావించారు    .కారల్ మార్క్స్ ఇక్కడే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచన ప్రారంభించాడు .అందులో ప్రసిద్ధ వాక్యం ‘’All history is the history of class struggle ‘’.పారిస్ నగర జీవితం రాజకీయం గా అస్పష్టం గా ఇబ్బందిగా  ఉంది .ఇక్కడే మొదటికూతురు పుట్టింది .పరిస్తితులు అనుకూలించక బ్రసెల్స్ వెళ్లి ఎంగెల్స్ నుకలిశాడు .జర్మన్  వర్కింగ్ మెన్ అసోసియేషన్ ఏర్పడటం లోఎంగేల్ కు   భాగ స్వామి అయ్యాడు .మొదటిసారిగా కమ్యూనిస్ట్ మాని ఫెస్టో ‘’అంతర్జాతీయ సామ్యవాదం ‘’విడుదల చేశాడు .ఫ్రెంచ్ భాషలో ఫ్రెంచ్ ఆర్ధిక వేత్త ప్రౌధాన్ రాసిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పావర్టి ‘’గ్రంధానికి జవాబుగా మార్క్స్ ఫ్రెంచ్ భాషలోనే ‘’ది పావర్టి ఆఫ్ ఫిలాసఫీ ‘’రాశాడు .

ఫ్రాన్స్ లో విప్లవం 1848లో అణగారిపోయింది .కాని రాజకీయ పరిస్తితులు దారుణమైనాయి.సోషలిస్టు భావ వ్యాప్తి చేసినవారిపై నిఘా పెరగటం తో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ మాత్రమె శరణ్యం అయ్యాయి  .బలీయ మైన ప్రష్యన్ సైన్యం అడుగడుగునా జల్లెడ పడుతోంది .మార్క్స్ తో సహా సోషలిస్టూలను అరెస్ట్ చేసి జైల్లో వేశారు .దేశ ద్రోహం నేరం మోపారు .కాని రుజువుకాక వదిలేసినా ప్రష్యా అధికారం లో ఉన్న భూమి నుండి బహిష్కరించారు .మళ్ళీ పారిసే  గతి అయింది . ఏదో ఒక చిన్న ప్రాంతం లో ఉండటమో లేక ఫ్రాన్స్ వదిలే పెట్టి వెళ్ళటమో  తేల్చుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది .గత్యంతరం లేక కుటుంబం తో ఇంగ్లాండ్ వెళ్లి జీవితాంతం అక్కడే ఉండిపోయాడు .

మార్క్స్ గొప్ప వక్త కాదు .నెమ్మదిగా పొడి పొడి వాక్యాలతో మాట్లాడేవాడు .అవతలివాడు చెప్పింది వినే తత్త్వం లేదు తను చెప్పిందే చివరిమాట అనే ధోరణిలో ప్రసంగాలు చేసేవాడు .’’దాస్ కాపిటల్ ‘’గ్రంధం రాసి 1867లో ప్రచురిస్తే మార్క్స్ మరణానంతరం ఎంగెల్స్ 1885లో మిగిలిన భాగాలను ప్రచురించాడు .మార్క్స్ ఒక’’ రాజకీ య ఆర్ధిక వేత్త’’.ఇంకోరకం గా ప్రాఫెట్ –దార్శనికుడు .తత్వ వేత్త మాత్రం కాదు. భార్య మరణం తో కుంగి పోయాడు .  .పార్శ్వ నేప్పితో బాధ పడ్డాడు .లండన్ లో అరవై అయిదవ ఏట 14-3-1883 నమార్క్స్ మరణించాడు .జన్మ దినం 5-5-1818.

సత్యాన్వేషకుడు అని అనుయాయులు ఆరాధిస్తే ‘’అబద్దాల పిత ‘’ అని నిందించారు గిట్టనివాళ్ళు .కార్మికుల పాలిటి దేవుడు- మెసయ్యా అని కొందరంటే క్రైస్తవ విరోధి అన్నారు మరికొందరు .మార్క్సిస్టులు ‘’దాస్ కాపిటల్ ‘’ను’’ ఆధునిక టేస్తామేంట్ ‘’అన్నారు .అయిదవ భాగం బాగా రాయలేదన్నారు .అందులో పద్ధతీ పాడూ ఏమీ లేదన్నారు .కొందరు దాన్ని ‘’కార్మికుల బైబిల్ ‘అని ఆకాశానికి ఎత్తేశారు .భవిష్యత్తును బాగా ఊహించాడు అని అంటే ఆయన చెప్పింది ఇంగ్లాండ్ లోనే జరగలేదు అని చెవులు కొరుక్కున్నారు .రష్యాలోని బోల్షేవిక్కులు దాస్ కాపిటల్ ను తిరస్కరించారు .ఏమైనా ఆయన భావాలకు ‘’మార్క్సిజం ‘’అనే ముద్ర పడి సజీవం గా నే ఉన్నాయి .మానవ చరిత్రలో అత్యధిక ప్రభావ శీలి కారల్ మార్క్స్ అన్నది నిర్వివాదం .ప్రపంచ వ్యాప్త కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మార్క్స్ ప్రభావానికి లోని పని చేశాయి ,చేస్తున్నాయి .

Communism is for us not a state of affairs which is to be established, an ideal to which reality will have to adjust itself. We call communism the real movement which abolishes the present state of things. The conditions of this movement result from the premises now in existence.”

Inline image 1Inline image 2

అని కమ్యూనిజం గురించి మార్క్స్ వివరించాడు .మార్క్స్ ను ప్రభావితం చేసిన వారిలో హేగేల్స్ ,ఆడం స్మిత్ ,రూసో .మార్క్స్ ప్రభావితం చేయని రంగమే లేదు .మానవ ప్రకృతిని బాగా అర్ధం చేసుకొన్న వాడు మార్క్స్ .

మరో మహానుభావుడితో మళ్ళీ  కలుద్దాం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల లో మనవరాలు రమ్య తో మామ్మ, తాత తో సహా మిగిలిన దృశ్యాలు 

4-2-15 బుధవారం శ్రీ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల లో మనవరాలు రమ్య తో మామ్మ, తాత  తో సహా మిగిలిన దృశ్యాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పీడిత ప్రజల పక్షపాతి – అమ్మంగి వేణుగోపాల్‌

పీడిత ప్రజల పక్షపాతి – అమ్మంగి వేణుగోపాల్‌

 


వట్టికోట ఆళ్వారుస్వామి ప్రత్యేకమైన రచయిత. లేదా అనేక ప్రత్యేకతలున్న విశిష్ట రచయిత. ఆళ్వారుస్వామి వంటి రచయిత మరొకరు లేకపోవటమే గొప్ప ప్రత్యేకత. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు తలవొంచిన గడ్డిపోచగా కనిపిస్తూనే, ఉధృతి తగ్గగానే తలెత్తుకు నిలబడ్డ దేవదారువుగా కనిపిస్తారు ఆళ్వారుస్వామి. అవాంతరాలు వచ్చి వుండవచ్చు, కాని అదే ని బద్ధతతో చివరి నిమిషం దాకా తన కార్యక్రమాలను కొనసాగించారు. ఉదాహరణకు-1938లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి కొన్ని పుస్తకాలు వేసిన తర్వాత వారు జైలుకు వెళ్ళినప్పుడు ఆ ప్రచురణలు ఆగిపోయాయి. మళ్ళీ 1951లో విడుదలైన తర్వాత కొనసాగించారు. జైల్లో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించిన వారు గాని, 1961లో వారు చనిపోయిన తర్వాత చేపట్టిన వారు గాని ఎవరూ లేరు. పట్టుదల వున్నవాళ్ళెవరైనా పుస్తకాలు ప్రచురించి వుండేవారేమో. కాని ఊరూరు తిరిగి అమ్మే మార్కెటింగ్‌ శక్తి ఆళ్వారుస్వామి సొంతం.
గ్రామీణ ప్రాంతపు సమస్యల వలయంలో చిక్కుకున్న రైతుకూలీల బతుకువెతల పట్ల అవగాహన, నగరప్రాంతపు జీవిత చక్రాల కింద పడి నలుగుతున్న కార్మికుల జీవిత సమస్యల అవగాహన- పరస్పర పూరకంగా ఉన్నవారు ఆళ్వారుస్వామి…. రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలతో బయలుదేరారో ఆ ఆశయాలు ఆచరణలో పదునెక్కాయి. మాటలో, రాతలో, ఆచరణలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ రచయితగా ఆళ్వారుస్వామి స్థానం అందుకే ప్రత్యేకమైంది.
గ్రామీణ ప్రాంతపు సమస్యల వలయంలో చిక్కుకున్న రైతుకూలీల బతుకువెతల పట్ల అవగాహన, నగరప్రాంతపు జీవిత చక్రాల కింద పడి నలుగుతున్న కార్మికుల జీవిత సమస్యల అవగాహన- పరస్పర పూరకంగా ఉన్నవారు ఆళ్వారుస్వామి. కర్షక కార్మికులు ఇద్దరూ శ్రామికులే అయినా వాళ్ళను నియంత్రించే శక్తులు భిన్నమైనవి. ఆళ్వారుస్వామి ప్రధానమైన సృజనాత్మక రచనలన్నీ గ్రామీణ ప్రాంతానికి చెందినవే. అయితే, ఒక కార్యకర్తగా కార్మికసంఘాల నాయకునిగా వారి కార్యక్షేత్రం హైదరాబాదు సికిందరాబాదు జంటనగరాలే.
కడివెండిలో విసునూరు దేశ్‌ముఖ్‌ గూండాల చేతిలో 1946 జూలైలో దొడ్డికొమరయ్య హత్యజరిగిన తర్వాత, నిజనిర్ధారణ సంఘ సభ్యునిగా వెళ్ళినప్పుడు, బద్దం ఎల్లారెడ్డితో కలిసి గద్వాల ప్రాంతం పర్యటించి భూస్వాములకు వ్యతిరేకంగా సంచలనాత్మక నివేదికలిచ్చారు. వారి నివేదికల మూలంగానే ప్రపంచానికి వాస్తవాలు తెలిశాయి.
నగర ప్రాంతంలో వారు నిర్వహించిన ఉద్యమాల్లో గుమస్తాల సంక్షేమం కోసం 1944లో ప్రారంభించిన ఉద్యమం, 1946లో రిక్షా కార్మికుల కోసం చేసిన ఉద్యమం ప్రధానమైనవి. గుమాస్తాల కోసం చేసిన ఉద్యమం ప్రత్యక్షంగా ఆయా యాజమాన్యాలతో ఘర్షణ. గుమాస్తాలు మిలిటెంట్‌గా ఉండరు. వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భయపెట్టినా లొంగిపోతారు. అయినా, వాళ్ళనందరినీ ఆళ్వారుస్వామి సమైక్యంగా తమతో నడిపించగలిగారంటే, అది చిన్న విషయం కాదు. వారి పోరాటాల ఫలితంగా 1944 డిసెంబర్‌ 25 నుంచి గుమాస్తాలకు వారానికొక సెలవు అమలులోనికి వచ్చింది. వాళ్ళలో చైతన్యం పెంచటానికి ‘గుమాస్తా’ పత్రికను వారు నడిపించారు.
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత 1946లో మనుషులు లాగే రిక్షాలను రద్దుచేయాలని నిజాం ప్రభుత్వం ప్రకటించటంతో జంట నగరాల్లోని వేలాది రిక్షా కార్మికుల్లో అభద్రత ఏర్పడింది. అప్పుడు రిక్షాకార్మికుల సంఘాన్ని ముందుకు తీసుకుపోయింది ఆళ్వారుస్వామే. ఏరోజుకారోజు సంపాదించి బతికే రిక్షా కార్మికుల్లో అభద్రత వల్ల ఆవేశం ఎక్కువ. ఈ వర్గంలో ముస్లింలు ఎక్కువే. హిందూ ముస్లిం విభేదాలు సృష్టించిగాని, మరో ముస్లింనాయకుణ్ణి ప్రోత్సహించిగాని ప్రభుత్వం ఆళ్వారుస్వామి ప్రాముఖ్యం తగ్గించివుండవచ్చు. కాని అట్లా జరగలేదు. గుమాస్తాలసంఘం నేతగా ఆళ్వారుస్వామి సాధించిన విజయం రిక్షా కార్మికులకు వారిలో విశ్వాసం కలిగించి వుంటుంది. అట్లా మరోవిజయం సాధించారు ఆళ్వారుస్వామి. నిజాం రైల్వేలో రిట్రెంచి అయిన కార్మికులకోసం కూడా వారు ఉద్యమం నడిపారు. జీవి తం అట్టడుగు స్థాయిలో ప్రారంభమైనప్పుడు పునాదులు గట్టిగానే పడతాయి. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడే ఆళ్వారుస్వామిలో ఉదాత్తమైన లక్ష్యాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గ్రంథపఠనం, చుట్టూరావున్న గ్రంథాలయోద్యమం. జైలును కూడా వారు స్కూల్‌గానే భావించారు. పుస్తకాల నుంచి ఎంత నేర్చుకున్నారో, జీవితం నుంచి, జీవితంలో ఎదురైన ఘట్టాల నుంచి అంతకంటే ఎక్కువగా నేర్చుకున్నారు.
1937 డిసెంబర్‌ 6, 7, 8 తేదీల్లో నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలలో రాజ్యాంగ సంస్కరణల మీద, గష్తీ నిషాన్‌ 53 మీద జరిగిన చర్చోపచర్చల ప్రభావం మూలంగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాల విలువలను ఆళ్వారుస్వామి గ్రహించగలిగారు. ఆ మరుసటి సంవత్సరం వారు దేశోద్ధారక గ్రంథమాల పక్షాన ప్రచురించిన రెండవ పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ప్రాథమిక స్వత్వములు’ కావటం యాదృచ్ఛికం కాదు.
వారు ప్రచురించిన 33 పుస్తకాలలో 6 మాత్రమే కవిత్వానికి సంబంధించినవి. తక్కినవి వచన గ్రంథాలే. అప్పటికే కొమర్రాజు, సురవరం, ఆదిరాజు వీరభద్రరావు వచనానికి పెద్దపీట వేయటం సాహిత్య చరిత్రలో భాగమైంది. ఆ వైతాళికుల వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికి వచన మాధ్యమాన్నే ఎన్నుకోవటం ఆళ్వారుస్వామి ఆధునిక సంస్కారానికి నిదర్శనం. ‘సాలార్జంగ్‌ మ్యూజియం’ వంటి కొన్ని కవితలను మినహాయిస్తే, వారు వచన సాహిత్యాన్నే సృష్టించటం గమనార్హం.
కాళోజీ, దాశరథి వంటి అగ్రశ్రేణి రచయితలెవ్వరూ ఉండ నంత కాలం సుమారు ఆరేళ్ళు వారు జైల్లో వున్నారు. 1948 సెప్టెంబర్‌ పోలీస్‌యాక్షన్‌ తర్వాత చాలామంది విడుదల య్యారు. కాని ఆళ్వారుస్వామి విడుదల కాలేదు. ఇక్కడ నారాయణరావు పవార్‌ ప్రస్తావన అవసరం. 1947 డిసెంబర్‌ 4 నాడు నిజాం తన తల్లి సమాధిని దర్శించుకోవటానికి వెళ్తుంటే, ఆయన కారుమీద నారాయణరావు పవార్‌ బాంబు వేశాడు. నిజాం తప్పించుకున్నాడు. పవార్‌కు ఉరిశిక్ష పడింది. పోలీస్‌ యాక్షన్‌ కారణంగా అది యావజ్జీవ కారాగారవాసంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వారు రామానంద తీర్థ నాయకత్వంలో ఒత్తిడి తేవటంతో 1949 ఆగస్టులో పవార్‌ విడుదలయ్యారు. బహుశా ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ కూడా మంజూరయి వుంటుంది. రాజుమీద బాంబు వేసినవాడు విడుదలయ్యాడు కాని; కమ్యూనిస్టు కావటం వల్ల, గుమాస్తాల కోసం, కార్మికుల కోసం ఉద్యమాలు నడిపిన కారణంగా ఆళ్వారుస్వామి 1951 దాకా నిర్బంధంలోనే వున్నారు.
ఆళ్వారుస్వామి రచనల్లో కనిపించే ఒక అంశం – సన్నివేశాలను, సంఘటనలను, పాత్రలను చరిత్రతో కలిపే ప్రయత్నం. ఆళ్వారుస్వామి స్వయంగా గ్రంథాలయోద్యమంతో ప్రభావితులై ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ‘ప్రజలమనిషి’ నాయకుడు కంఠీరవం గ్రంథాలయం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధించి, భూస్వామ్య వ్యవస్థతో పోరాటం చేస్తాడు. ఆంధ్ర మహాసభల్లో తమతమ గ్రామాల్లో దౌర్జన్యాలు చేసిన భూస్వాములను కీలక హోదాలలో చూసిన ఆళ్వారుస్వామి, తన నవలల్లో రావుభూపాలరావును, జగ్గయ్యదొరను, వెంకటరావును సృష్టించారు. 1938లో స్టేట్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొన్ని కార్యకర్తల బృందాలు సత్యాగ్రహం చేసి అరెస్టుకావటం చరిత్ర. ‘ప్రజలమనిషి’ నవల ముగింపులో వెంకటేశ్వరరావు నాయకత్వంలో బషీరు, కంఠీరవం, పరంధాములు సత్యాగ్రహం చేసి అరెస్టవుతారు. ఈ రకంగా తన నవలలో ఆళ్వారుస్వామి రాజకీయ వాస్తవికతను సాధించారు.
1952లో పుస్తకరూపంలో వచ్చిన ‘జైలులోపల’ కథలు ఆరూ ప్రస్తావించదగ్గవే. ఇక్కడ ఒక్క ‘పతితుని హృదయం’ కథ మాత్రమే ప్రస్తావించటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం ఉరితీయబడ్డ 25 ఏళ్ళ యువకుడి కోసం సాటి ఖైదీలు తల్లడిల్లే ఘట్టంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ఉరితో తీవ్రంగా ప్రభావితుడైన గండయ్య అనే మరోఖైదీ జైలు అధికారులకు ఎదురు తిరుగుతాడు. ‘ఒకమనిషిని చంపటమే తప్పంటున్న భానూను ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది?’ అన్న పెద్దప్రశ్న, బహుశా జవాబులేని ప్రశ్నను లేవదీసి ఉరిశిక్షను ప్రశ్నిస్తాడు. ఉరికి గురయిన యువకుడి గతం గూర్చి గాని, శిక్షకు కారణమైన నేరం గూర్చిగాని ప్రస్తావన లేదు. ఉరికి వేలాడి ప్రాణాలు విడవడమే ఆ తర్వాతి కథను నడిపిస్తుంది. అతని ఊరూ పేరూ లేవు. అంటే ప్రాంతం, కులం, మతం లేకపోవటంతో అతడు అందరివాడయ్యాడు. అతని జీవిత కథ లేనందువల్ల ఈ కథానికలోనూ పెద్దగా కథ లేదు. ఈ ఉరి వాతపడ్డ మనిషే ప్రతి పదంలోనూ, వాక్యంలోనూ వెంటాడుతుంటాడు. అందుకు ఈ యువకుడే ఈ కథానాయకుడనిపిస్తుంది.
వైరుధ్యాల కోణంలో రచనను నడిపించటం, మానవ భావోద్వేగాల పరంగా కథనం చేయటం ఆళ్వారుస్వామి రచనా శిల్పం. ‘ప్రజల మనిషి’నవల ప్రారంభంలోనే దొరకు, సామాన్య రైతు కోటయ్య కొడుకు కొమరయ్య మధ్య వైరుధ్యాన్ని సూచిస్తారు. ఆవుదూడలను దొరకు ఇవ్వటం ఏమాత్రం ఇష్టంలేని కొమరయ్య దుఃఖాన్ని ఎంతో సహజంగా చిత్రించటం మూలం గా దొర అసహజప్రవర్తన, దౌష్ట్యం పాఠకుని మనసులో ఇంకుతాయి. ‘గంగు’ నవల ప్రారంభంలో కూడా జగ్గయ్య దొర అంతమ్మ అన్న వివాహిత పట్ల కామవాంఛను ప్రదర్శించటం, స్ర్తీ సహజమైన అభద్రతకు లోనవుతూనే తన వైముఖ్యాన్ని, అస హ్యాన్ని ప్రదర్శించటాన్ని తగినంత కాన్వాసుమీద రచయిత చూపించారు. నవల మొదట్లోనే పడ్డ వర్గవైరుధ్య బీజం క్రమపరిణామం చెందుతుంది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములైన కంఠీరవం, వెంకటాచార్యుల మధ్య, మతపరంగా దొరకు, దొర పెద్ద గుమాస్తా హైదరాలీకి మధ్య ఉన్న వైరుధ్యాలను కూడా రచయిత కథావసరాలకు అనుగుణంగా సమర్థంగా వాడుకున్నారు. ఒక్కోసారి భిన్నంగా కూడా ఇది వుండవచ్చు. ‘అవకాశమిస్తే’ కథలో భార్యాభర్తల సరససంభాషణ రూపంలో ‘స్వేచ్ఛ’ ను ప్రకటించిన రచయిత అదే కథలోని అంతరకథలో యువ పఠాన్‌ ‘నిర్బంధాన్ని’ జైలులోపటి జైలుగా కథనం చేశారు. ‘పతి తుని హృదయం’ కథలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ గండ య్య సంస్కరణోన్ముఖంగా ఆలోచిస్తుంటే, జైలుఅధికారులు అతన్ని మరింతగా నేరకూపంలోకి తోసేయటానికి ప్రయత్నిస్తారు.
1956, 57 నాటికి దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెనుమార్పులు సంభవించాయి. ఆచరణలో నిజాయితీని ప్రదర్శించాల్సిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకులు ప్రజావ్యతిరేకులుగా మారుతున్నారు. విద్యావంతుల్లో రాజకీయ వ్యవస్థ పట్ల సందేహాలు ఏర్పడుతున్నాయి. సైద్ధాంతిక ఖాళీ ఏర్పడుతున్న వాతావరణంలో ఒక ద్వైధీ భావం కూడా ఏర్పడుతున్నది. కొంత కమ్యూనిస్టుగా, కొంత గాంధీయిస్టుగా సగటు మేధావి రూపొందుతున్నాడు.
‘రామప్ప రభస’లోని వ్యాసాల్లో రామప్ప ప్రదర్శించే ఆదర్శవాదంలో గాంధీతత్వం, తిరుగుబాటు ధోరణిలో కమ్యూనిజం కనిపిస్తాయి. ఆళ్వారుస్వామి నిజాయితీ చెక్కుచెదరలేదు. రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలతో బయలుదేరారో ఆ ఆశయాలు ఆచరణలో పదునెక్కాయి. తన ప్రతిబింబాలను సమాజంలో దర్శించాలన్న కల సాకారం కాలేదు. అది వారి వైఫల్యంకాదు. వ్యవస్థవైఫల్యమే. ‘రామప్ప రభస’ ఆళ్వారుస్వామి ఆత్మకథలోని 16 అధ్యాయాలే కాదు, ఒక ఆదర్శ పౌరసమాజం కోసం కలలుకన్న స్వాప్నికుడి అక్షర సంపుటి కూడా. ఆళ్వారుస్వామి కంటే గొప్పరచయితలు తెలుగులో చాలా మందే ఉండవచ్చు కానీ, ఆయనతో సమానులు మాత్రం ఎవరూ లేరు. మాటలో, రాతలో, ఆచరణలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ రచయితగా ఆళ్వారుస్వామి స్థానం అందుకే ప్రత్యేకమైంది.
 అమ్మంగి వేణుగోపాల్‌
9441054637
(నేడు వట్టికోట ఆళ్వారుస్వామి 54వ వర్ధంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం – 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 12015)                          

 

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ

ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $58

 

మొట్ట మొదటి రచనా విభాగం” –6 వ సారి పోటీ నిర్వహణ

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ):  $116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $58

యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ

ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ  (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is:  March  1, 2015

Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha2012@gmail.com  &  vangurifoundation@gmail.com

 

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

హ్యూస్టన్ & హైదరాబాద్

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

www.vangurifoundation.blogspot.com

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2

దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొట్లాలు కట్టి –రాత్రంతా విష్ణు చక్రాల్లా ‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదోఅరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొట్టీ నాటకాలు వేసి –అట్టకిరీటాలకు, కత్తులకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రాజు గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే వేడుక కాదు .పది మంది కలిసి చేసే వేడుక ‘’అని చక్కని అర్ధం చెప్పారు .శివరాత్రి ఉత్సవాల్లో పౌరాణిక జానపద సాంఘిక నాటకాలాడటం చూశారు .తోలుబొమ్మలాట మొదటి సారి చూసి కేతిగాడు –బంగారక్క కడుపుబ్బా నవ్వించటం తో మురిసిపోయారు .’’గొనె పట్టాలు చంకనేసుకెళ్ళి ముందు వరుసలలో పరుచుకొని –చివరికంటా మేలుకొని చూశారు .

బంధువులతో ఉప్పాడ సముద్రం చూసి ‘’మా ఊరి గోదారినే తన చట్రాల్లో బిగిన్చుకోలేని కళ్ళు –ఇంత విశాల సముద్రాన్ని ని౦పు కోటానికి –దృశ్య దృశ్యాలుగా పలు ఫ్రేముల్లోకి కత్తి రించుకొన్నారు ‘’.అసలే ఇల్లు ఇరుకు అందులో పూర్వకాలపు భోషాణం సగం స్థలాన్ని ఆక్రమించేసింది .ఇక హాలె అందరికి శరణ్యం .వానా కాలం శీతాకాలం అందులోనే అందరూ ‘’నత్త గుల్లలు ‘అయ్యేవారట .పెదనాన్న గౌరవం ఆస్తితో బాటు ‘’అనులో మాను పాతమైంది ‘’అంటారు .ఉమ్మడికుటుంబం .ఇల్లు ఒక్కటే ‘’కాని కుంపట్లు వేరు ‘’పెదనాన్న గదిలో ఉన్న రవివర్మ ప్రింటులు సీనరీ పటాలు ,’’బట్టల్లేని ఆడామే పాల రాతి విగ్రహం ‘’పాతకాలపు అందమైన పాత్ర సామాను ఉండేదట .పెదనాన్న పెంచుకొనే నెమలిని చూసి వీర్రాజు గారిమనసు నాట్యమే చేసేది .దాన్ని పిల్లి కరిచి తినేస్తే ‘’మనాది ‘’తో మూడు రోజులు బడికి ఎగగోట్టారు .పెదనాన్న గదిలో బొమ్మలే ‘’మనసుకు దారేయ్యక పొతే –ఇప్పటి ఈ నాబొమ్మలకొలువు ఇంట్లో వెలసేదే కాదు ‘’అని ఆస్పూర్తికి కృతజ్ఞతలు ఘటించారు .

బుల్లి వీర్రాజు గారి నెత్తిన చేయి పెడితే అదొక గొప్ప శుభ సూచకమని అందరూ అభిమానం గా దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా హత్తుకోనేవారట . బల్లి పడిన  దోష నివారణ చేసుకొనే వారట .కంచి బంగారు, వెండి బల్ల్లులను తన చిన్నారి చేతులతో తాకించిన ఫైలితమే ఇది అంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును గుర్తుకు చేసుకొని ఆరోజు ‘’ప్రతి చెట్టూ –త్రివర్ణ పతాకల ను పూసింది –ప్రతికొమ్మా –రంగుల తోరణాలను కాసింది ‘’అని భావ గర్భంగా చెప్పారు .కొత్త బట్టలు కట్టుకొని ,చొక్కాలకు జెండా బిళ్ళల్ని తగిలించుకొని ‘’కాగితం జెండాల్ని వెదురు బద్దల మీద ఎగరేసుకొంటూ బడికి వెళ్ళారు ‘’.

‘’ ఎదిగిన కొద్దీ ఎదురు దెబ్బలు తగిలి –అనుభవం పండిన కొద్దీ వాస్తవం తెలిసి వచ్చి –హైస్కూలు రోజుల్నాటికే –కళ్ళ ముందు –మేడిపండు కనిపించి వెక్కిరించింది ‘’అని జీవితం లోని బోలుతనాన్ని చెప్పారు .

క్రమంగా బొమ్మలపై ఆసక్తి ‘’రేఖలతో బాటు –రంగుల్నీ రంగరించటం మొదలు పెట్టాయి వేళ్ళు ‘’.పిల్లల రాతపత్రిక ‘’బాల సేన ‘’లో బొమ్మల్ని గీసి గీసి –నా వేళ్ళు నడకలు నేర్చుకోన్నాయి ‘’అని తన ప్రోగ్రెస్ తెలిపారు .’’కుల వ్రుత్తి చేనేతకు –మినియేచర్ రూపం –నవారు నేత నేర్చుకుంటున్నప్పుడు –నారక్తం లో ఆ పని తనం ఇంకా ఇగిరిపోక –జీవించి ప్రవహిస్తూ ఉందేమో మరి ‘’అంటూ ‘’వెళ్ళు చక చకా సాగి లాంగ్ బెల్ కొట్టేసరికి –అడుగున్నర నవారు తయారైంది ‘’అని స్కూల్ లో క్రాఫ్ట్ పీరియడ్ లో నవారు నేత నేసిన అనుభవాన్ని కవిత్వీకరించారు .

‘’నా బడి పుస్తకాలు తప్ప –రామాయణ భారతాలైనా లేని ఇంట –జోలపాటలే తప్ప –ఊర్మిళాదేవి నిద్రాలూ ,రుక్మణీ కళ్యాణాలు –వినిపించే అవకాశం లేని చోట మేగజైన్లేకాదు –దినపత్రికలూ కలికానికి కూడా  కనీ పించని ఇంట ‘’పుట్టిన తనకు పుస్తక పఠనం పిచ్చి ఎందుకు ఎలా పట్టిందో !అని ఆశ్చర్యపోయారు వీర్రాజు గారు .అర్ధణాకి అణాకి పిల్లల పుస్తకాలు కొని మిత్రులంతా వంతులవారీగా చదివే వారట .ఇక్కడే ‘’నా భవిష్యత్ సాహిత్య జీవితానికి –తోలి బీజంఇలా   పడి ఉండచ్చు ‘’అని ఊహించారు .

వేసవి తీవ్రతను చెబుతూ ‘’చెమటలో తడిసి ముద్దయిన పగటిని –గోదారి గట్టున రైలింగ్స్ మీద ఆర బెట్టుకోవ టానికి –పనిగట్టుకు వచ్చే –వేలాది ఊరి జనానికి –గోదావరి –విసన కర్ర అయ్యేది ‘అద్భుత భావ చిత్రమిది .’’చల్లని చూపుల్తో స్వాగతం పలికే స్నేహ మూర్తి అయింది  ‘’అని గోదావరిమాతకు క్రుతజ్ఞాతాంజలి పట్టారు కవిత్వం తో .సూర్యాస్తమయం ఆయనకు ఎలా ఉందొ తెలుసా?’’కొవ్వూరు  కొబ్బరి తోటల గూట్లోకి –చల్లగా సూర్యుడు దూరి తలుపేసుకోన్నట్లు ‘’ఉంది వేసవి గోదావరి వర్షాకాల గోదారి ఎలా కన్పించాయి వీర్రాజుగారికి ?’’వేసవిలో మన్ను తిన్న జెర్రి గొడ్డైన గోదావరి –వర్షాకాలం వచ్చేసరికి –కోడె తాచై బుసలుకోట్టేది ‘’వరద గోదారి భీభత్సాన్ని వర్ణిస్తూ ‘’గట్లని ఢీకొని –మట్టిని కరగించుకొని –యెగిరి పడుతూ –సుళ్ళు తిరుగుతూ –కూకటి వేళ్ళతో కూల్చిన చెట్లని –జుత్తట్టుకొని ఈడ్చుకు పోతోంది .‘మనుషుల శవాల్ని సైతం –సాగర శ్మశానానికి మోసుకుపోయే’’శవ వాహికగా కనిపించింది .చూడ వచ్చిన జనం తో తానూ ‘’గట్టున ప్రతిష్టించిన రాతి బొమ్మ ‘’అయ్యేవాడట .’’తాటేత్తు నీటిలో మునిగి-కలప దుంగలు నీటి వరవడికి –ఇళ్ళమీద విరుచుకు పడ్డప్పుడు –‘’విలాసాలు ‘’లేని దుంగలు వీదిజనాల పాలై –నాన్న వ్యాపారం గంగ పాలైంది ‘’అని మొత్తు కొన్నారు .పెదమామయ్య  తన తండ్రికి డబ్బిచ్చి కిరాణా కొట్టు పెట్టిస్తే  ఆరు నెలల్లో మూతపడింది .గోదావరి వరద మహాత్యం తో  కుటుంబం  ఆర్ధికం గా చితికి పోయింది .వెన్ను విరిగిపోయింది

Inline image 1

బాల్యం లో ధవళేశ్వరం ఆనకట్ట చూసి భావ కవిత్వం మనసులో పొంగి ‘’నీలం రంగు పులుముకొన్న నీలాకాశం –పై నించి కిందికి దిగి వచ్చి –ఆకాశమూ భూమీ ఒకటై –కళ్ళ ముందంతా –ఒకే రంగు పరచుకొని –కళ్ళల్లో ప్రతిఫలించిన నీలం రంగుకి –మా కళ్ళే నీలాలై మెరిసిపోయాయి ‘’మరో కృష్ణ శాస్త్రి మనకిక్కడ దర్శన మిస్తాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం,

 

కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం, మంగళవారం నాడు శ్రీ వీరభద్ర పళ్ళెం కార్యక్రమాన్ని భక్తి శ్రధలతో పురోహితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయితీ చైర్మెన్ శ్రీ జంపాన పూర్ణ చంద్రరావు , నూకల సాంబశివరావు, మేడి శెట్టి మస్తాన్ సహకారంతో గూడూరు సత్యనారాయణ కుందుర్తి సత్యనారాయణ మూర్తి, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చక్కని పద్యాల సాహిత్యపు ముచ్చట్లు

కెసిఆర్ ఓ పిచ్చి తుగ్లక్..!

  • 04/02/2015
TAGS:

మహబూబాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఖరి పిచ్చి తుగ్లక్‌లా ఉందని.. త్వరలోనే ఆయన పిచ్చాసుపత్రికి వెళ్ల్లే రోజులు వస్తాయని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్ల్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా విమర్శించారు. వరంగల్ జిల్లా మానుకోటలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేవలం మాటల గారడీతో.. తెలంగా ణ ఉద్యమ సెంటిమెంట్ బలంతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పటికీ పిట్టలదొర మాటలు విడవడంలేదన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తా, వరంగల్‌ను లండన్ చేస్తా.. హుసేన్‌సాగర్‌ను సముద్రం చేస్తానంటూ ఇష్టమొచ్చినట్లు మాటలు చెప్పడమేతప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదన్నారు. బలమైన కార్యకర్తలు, అంకితభావం ఉన్న నాయకులు ఉన్న తెలుగుదేశంతోనే తన పార్టీకి ప్రమాదం అనే ఆలోచనతోనే కెసిఆర్ టిడిపిని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తున్న కెసిఆర్, మంత్రు లు కడియం శ్రీహరి, చందులాల్ వంటి నాయకులు రాజకీయంగా ఎక్కడ పుట్టారో మరిచిపోవద్దన్నారు. బజారుల్లో అడ్రస్ కూడా లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు పచ్చ చొక్కాలు తొడిగి.. అధికారం ప్రసాదించి.. సమాజంలో నిలబెట్టిన తల్లిలాంటి పార్టీ తెలుగుదేశం అని మరిచిపోవద్దన్నారు.
కరెంట్ ఇవ్వడానికి
చంద్రబాబు సిద్ధమే…
కెసిఆర్ ముందుచూపు లేని ముఖ్యమంత్రి అని, ఒక్కమాటలో చెప్పాలంటే ఇంత చిల్లర ముఖ్యమంత్రిని తానెప్పుడు చూడలేదన్నారు. తెలంగాణ ప్రజలు విద్యుత్ కోతల మూలంగా ప్రాణాలు కోల్పోతుంటే అప్పుడు హడావిడిగా లేచిన కెసిఆర్ పరుగున ఛత్తీస్‌గఢ్ వెళ్లారని, కరెంట్ ఇవ్వడానికి కాలం పడుతుందని అక్కడ చెప్పడంతో తిరుగుముఖం పట్టారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అడిగితే తెలంగాణకు విద్యుత్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారని, కానీ కెసిఆర్ అడగడం లేదన్నారు. మానుకోటను జిల్లా కేంద్రం చేయాల్పిందేనని, మాట ఇచ్చిన కెసిఆర్ మరిచిపోవాలని చూస్తే టిడిపి తరపున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాలుచౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి మోహన్‌లాల్, మాజీ ఎమ్మెల్యేలు వేంనరేందర్‌రెడ్డి, సీతక్క, పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ, ఈగ మల్లేశం, భూపతి మల్లయ్య, సునిత, సంజీవరెడ్డి, రాంచందర్‌రావు, ఎడ్ల రమేష్, తెళ్ళ శ్రీనివాస్, మార్నెని రఘు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం… సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి ఫ్ల్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు

చక్కని పద్యాల సాహిత్యపు ముచ్చట్లు

  • – శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
  • 31/01/2015
TAGS:

‘పద్య కథాపరిమళము’- -డా.కపిలవాయి
లింగమూర్తి;
వాణీ ప్రచురణలు,
నాగర్‌కర్నూలు, పుటలు: 100; వెల: 70రూ./-;
ప్రతులకు: 1) కపిలవాయి సంధ్య అశోక్
ఇంటి నెం.17-110, వాణీసదనం, విద్యానగర్ కాలనీ, నాగర్‌కర్నూలు- 509 209
2) అన్ని విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు

విస్తృత అధ్యయన- రచనలలో తలపండిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తిగారి ఇటీవలి రచన ‘పద్యకథా పరిమళము’. ఇది ఒక ‘చల్లని పిల్లతెమ్మెర.’
ఇందులో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన మొదలైన కవుల కొన్ని ప్రసిద్ధ పద్య సందర్భాల ముచ్చట్లు, ప్రఖ్యాత సంస్కృత కవులైన భారవి, బిల్హణుల వృత్తాంతాలు, నాల్గణాల శ్లోకం అనే ఒక చమత్కార కథానిక – ఇలాంటివన్నీ కలిపి మొత్తం పదహారు అంశాలున్నాయి. దేనికవి చాలా పొందికగా సరళమైన భాషా వాక్యవిన్యాసంతో ఒప్పారింది.
‘‘తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే! (ఓ పూర్ణచంద్ర వదనా! త్వరగా ఇంత సున్నం తీసుకురా)’’అనే సంస్కృత వాక్యంలో మూడు ‘ణ’లు ఉన్నాయి. కానీ ‘‘పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాయతలోచనే! (నిడుద కన్నుల దానా! బంగారు రంగు తమలపాకులు నాలుగు తెచ్చిపెట్టు’’ అనే వాక్యంలో నాలుగు ‘ణ’లు ఉన్నాయి. ‘ణ’ను తెలుగు పిల్లలు ‘అణా’అంటారు. రెండో సంస్కృత వాక్యంలో ఈ ‘అణా’లు నాలుగు ఉన్నాయి. కనుక ఆ వాక్యం అన్నదానికే ఎక్కువ విలువ, ప్రాధాన్యం దక్కాయి అనే చమత్కార భావ పూర్వక కథ బాగుంది.
భారవి, బిల్హణుల కథలను చాలా చక్కగా ఉత్కంఠ భరితంగాను, రసవత్తరంగాను రాశారు రచయిత. సాహిత్యం అంటే హితం కూర్చేది, మేలు చేసేది; సాహితీపరుడు ఒక ముని, ఒక యోగిలాంటివాడు అని తెలియజెప్పే వస్త్ధ్వునితో భారవి కథను చెప్పటంలోని కథన శిల్పం అనల్పం.
రమణులకు వన దశలో వక్షమ క్రింది నడుము సన్నబడిపోవటం అనే లలిత సుందర శారీరక పరిణామాన్ని పెద్దనాదుల వంటి ఆస్థాన విద్వాంసుల మధ్య తనలాంటి పేరులేని పెద్దయ్య నిలవలేడు (ఆశ్రయం దొరకదు)అనే బాధాకర అనుభవీయతకు ఉపమానంగా చెప్పటంలో సంకుసాల నృసింహకవి యొక్క ధ్వని ప్రధాన రీతిని, వ్యంగ్య వైభవ సహిత భావగాంభీర్య, సాదృశ్యాలను సుందరంగా ఆవిష్కరించారు లింగమూర్తిగారు. విషాదాన్ని కూడా శృంగారోపమానంతో చెప్పటం సంకుసాల కవి ప్రతిభకు దర్పణంగా చూపారు కపిలవాయి వారు.
నన్నయగారి భారతం మానవ నాయకం కనుక అది రాజాంకితం చేయనగును. కానీ భాగవత కథానాయకుడు నారాయణుడు కనుక దానిని మానవ మాత్రునికి అంకితం ఇవ్వలేను అంటూ పోతన తలపోసినట్లు ఆ మహాకవి అంతరంగాన్ని చాలా అర్థవంతంగా విశదీకరించారు.
‘‘రసికులైనవారు రమణులకు ఒకింత వంగియుండుట ధర్మవర్తనము- నారివైపుకు విల్లు వంగదా?’’ అంటూ ‘్ధర్మ’పదానికి, ‘నారి’ శబ్దానికీ ఉన్న ధనుస్సు, స్ర్తిఅనే అర్థాలతో అక్కడి శే్లషను వివరించటం మనోహరం.
‘పోతన రాసిన భాగవతంలోని గజేంద్రుడు పూర్వజన్మలో ఒక రాజు. కానీ, మనం ఈ జన్మలోనే గజేంద్రులం. గజం అంటే మదించి ఉండేది అని వ్యుత్పత్తి. కుల మదం, ధన మదం, విద్యామదం, రూప మదం, వన వదం- ఇలా అనేక మదాలతో ఉన్నాం’ అంటూ ప్రస్తుత సమాజం మీద ఒక చుఱక గూడా వేశారు.
చారిత్రక ప్రామాణికత, వాస్తవికతల తర్కాన్ని కొంచెంసేపు పక్కనబెట్టి, ఒక సాహిత్యపు పేరంటంలో కూర్చున్నాము అనే భావనతో చదివి ఆనందింపదగిన పుస్తకం ఇది.
సాహిత్య కథానికలు అల్లటానికి సాధనచేసే వాళ్ళకు ఈ పుస్తకం ఒక స్ఫూర్తిని, ఊపును, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరణను ఇస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మశ్రీ నోరికి సత్కారం -కొత్త చుట్టాలు కొంగలు


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జపాన్ భాష నేర్చుకో -ఉద్యోగం పట్టుకో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అకాడెమీల పునరుద్ధరణ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నింగి నుంచి నే లకు దిగిన మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేజ్రీ వాల్ వోట్లు చీల్చే కాంగ్రెస్ పైనే కమలం ఆశలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భావకవిత్వ మేస్త్రి –కృష్ణ శాస్త్రిగారి 35వ వర్ధంతి సభ

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

భావకవిత్వ మేస్త్రి –కృష్ణ శాస్త్రిగారి  35వ వర్ధంతి సభ

75 వ సమావేశం –ఆహ్వానం

‘’భావకవిత్వానికి మేస్త్రి -ఆంధ్రా షెల్లీ’’  స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి  గారి  వర్ధంతి సందర్భం గా విద్యార్ధులకు కృష్ణ శాస్త్రి గారి జీవితం ,కవిత్వం, రచనలు ,పాటలపై అవగాహన కల్పించటానికి ఉయ్యూరు కాకాని వెంకట రత్నం కాలనీ లో ఉన్న అమరవాణీ హైస్కూల్ లో 25-2-15 బుధవారం ఉదయం 10 గం.లకు సరసభారతి ,స్థానిక అమరవాణీ హైస్కూల్ సంయుక్తం గా సభ నిర్వహిస్తున్నాము .

.శ్రీమతి కావూరి సత్యవతి –(రిటైర్డ్ ప్రదానోపాధ్యాయురాలు ,తెలుగు పండిట్, కవి  విమర్శకురాలు-విజయవాడ) )మరియు శ్రీమతి మందరపు హైమవతి –(తెలుగు ఉపాధ్యాయురాలు ,కవి విమర్శకులు –విజయ వాడ )ఆత్మీయ అతిధులుగా విచ్చేసి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం ,జీవితం పై ప్రసంగిస్తారు .

కృష్ణ శాస్త్రి గారి జాతీయ గీతం –‘’జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ‘ పాట గానం  ,కృష్ణ శాస్త్రి గారి జీవితం పై వ్యాస రచన  ,కృష్ణశాస్త్రి గారి కవిత్వం పై వక్తృత్వం పోటీలలో విజేతలైన విద్యార్ధులకు బహుమతి ప్రదానం జరుగుతుంది .

సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

పి .నాగ రాజు                                                              గబ్బిట దుర్గా ప్రసాద్

ప్రిన్సిపాల్ –అమరవాణీ హైస్కూల్                                     సరసభారతి అధ్యక్షులు

నిర్వహణ సహకారం –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి-సరసభారతి కార్య దర్శి

గబ్బట  వెంకట రమణ -కోశాధికారి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోయల”మాఘ పున్నమి జాతర”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో నవ్యాంధ్ర టెర్మినల్ మోడల్

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో నవ్యాంధ్ర టెర్మినల్ మోడల్

terminal 001

 

 

 

malam 001
terminal 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1

 

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1

 

ప్రముఖ చిత్రకారులు ,కవి, నవలా, కదా రచయిత సమాచార శాఖోద్యోగి,ఆంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రాజుగారికి  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచి సరసభారతిద్వారా మూడు నెలల క్రితం 21-9-14 బందరులో  అందజేసిన’’ బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’ప్రదానంచేసిన  రోజున రెండో సారి సన్నిహితం గా చూసి మాట్లాడే అవకాశం లభించింది .ఆనాడు ఆ దంపతులు ఇచ్చిన ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’అనే పుస్తకం  నాలుగు రోజుల క్రితమే చదివే వీలు కలిగి చదివి ముగ్దుడినయ్యా . అది  బాల్యం నుండి వివాహం దాకా వీర్రాజుగారి జీవిత చరిత్ర .దీర్ఘ కవిత .ఇందులో ఆయన కన్నీళ్లు కస్టాలు సుఖాలు దుఖాలు స్నేహాలు మానాలు అవమానాలు పురస్కారాలు ప్రోత్సాహాలు ,ఎక్కిన శిఖరాలు పడదోసిన అంశాలు అన్నీ పడుగూ పేకల్లా అల్లి రాసిన మనోహర కవిత .అన్నీ యదార్ధ సంఘటనలే .ప్రతి పదం శిల్పమే .ప్రతి వాక్యం చిత్రమే .ప్రతి పేజీ అనుభవానికి అద్దమే.నాకు ఏంతో నచ్చి మీలో ఎక్కువమంది చదివి ఉండరనే ఉద్దేశ్యం తో మీకు అందులోని స్వారస్యాన్ని అందజేయాలని  రాస్తున్న నా చాపల్యం ఇది .ఎక్కువగా వీర్రాజుగారి  మాటలనే ఉటంకిస్తూ ఆసొగసును అనుభవైక వేద్యం చేస్తున్నా .

తన పుట్టిన నేపధ్యాన్ని ముందుగా చెబుతూ రెండో ప్రపంచ యుద్ధం మరో  అయిదు  రోజుల్లో భూమిని ఆకాశాన్నీ ఏకం చేసే భయం తో విరుచుకు పడే ముందు రాజమండ్రి లో ‘’ఆసుకండేల పరుగులకీ –రాట్నం చక్రాల తిరుగుళ్ళకీ మధ్య నేత మగ్గాల రాత్రిం బవళ్ళ కదలికలకీ నిలయమైన ఓ చిరుగుల చేనేత పేటలో –హరికేన్  లాంతరు వెలుగులో’’ పుట్టానన్నారు .అప్పుడు ఆ వెలుతురూ ఇన్ని రంగుల్ని దాచిందని ,ఇంత అందం భూమ్మీద పరచుకుని ఉందని తెలీదట .ప్రతి శబ్దం లో సంగీతం ఒదిగిఉన్దని తెలీదు .అటక దూలానికి కట్టిన ఉయ్యాలలో ఊగానని ,అప్పుడే తొలిసారి సంగీతం విన్నాననీ ,నాన్న బుజం పై పడుకొని మొదటిసారి రంగుల ప్రపంచాన్ని చూశారు .మేనత్త చంకనేసుకొని తిప్పినప్పుడు ప్రపంచ అందాలు చూశారు .అన్నప్రాసనప్పుడు ఇష్టమైన పుస్తకాన్నే పట్టుకొన్నారు ‘’.ఊహ  వచ్చాక బాల్యం రెక్కల గుర్రమైంది . వేళ్ళ సందుల్లోంచి జారిపోయి కాలం వెంట పరుగిడింది ‘’.

‘’ఉత్తరాంధ్రలో విజీనగరం’’నగరం అవతల నిత్యం నిద్రపోయే ‘’జామి ‘’కుగ్రామం నుండి వీరి పెద్దలు పందొమ్మిదో శతాబ్దం లో పాతిక చేనేత కుటుంబాలతో  వలస వచ్చి రాజమండ్రి చేరి ‘’జాన్ దొర ‘’దయతో ఊరవతల ఊసర క్షేత్రం లో ఇల్లుకట్టుకొని కృతజ్ఞతగా ‘’జామ్ పేట ‘’అని ఎరుపెట్టుకొన్నారు ఆ ప్రాంతాన్ని .కులవృత్తి అయిన నేతను పక్కకు పెట్టి తాతలు వ్యవసాయం చేసి కూడబెట్టిన దాన్ని తండ్రులు హారతి కర్పూరం చేశారు .’’నేను అడుగు పెట్టేసరికి పూర్నానుస్వారమైంది ‘’అని గోడు వెళ్ళ బోశారు .కాకిపిల్ల కాకి కి ముద్దు అయినట్లు ఎవరిబాల్యం వారికి ముద్దే కదా .ముచ్చటేకదా ‘’బాల్యం అంటే జ్ఞాపకాల పొరల మధ్య దాచుకొన్న నెమలి కన్ను ‘’అన్నారు .అది చైతన్యం తో మెరుపు జలతారై తనను అలరిస్తూనే ఉందనిసంబరపడ్డారు .గోదారి తనకు పరుగు నేర్పిందట .ఏపని చెప్పినా పరిగెత్తుకు వెళ్లి చేసేయ్యటం ,రివర్స్ గేర్ లో వెనక్కి పరుగు పరుగున రావటం అలవాటై స్కూలు పరుగుపందాల్లో బహుమతులకు తోడ్పడింది .మన బాల్యమూ ఇలానే గడిచింది .రాళ్ళు తగిలి తూలిపడి మోకాలి చిప్పలు డొక్కు పోయాయి ఎన్నో సార్లు .ఆ మచ్చలు లు నేటికీ సాక్ష్యాలు .అక్షరాభ్యాసం నాడు ఆర్భాటం గా రిక్షాలో ఊరేగి స్కూల్ కు వెళ్ళారు. అది తమకు తలకు మించిన ఖర్చే అయినా ‘’చదువుకొని ఆఫీసరై కడుపులో చల్ల కదల కుండా తమని కూచో బెట్టి ఉద్ధరించి ఊళ్లేలుతాడని ‘’ తండ్రి  అంతటిఖర్చు చేశారట .కాని ఆనాడు ‘’చదువూ అర్హతా ఉన్నా ,ప్రమోషన్ లకు సవా లక్ష అడ్డంకులు ఉంటాయని –ఇతరేతర అర్హతలతో ఈజీగా నిచ్చేన్లేక్కి పోవచ్చని ‘’ఆ నాడు తన తండ్రికి తెలీదన్నారు .’’తమ ‘’బంగారు కొండ ‘’ఎంజీవోగా చేరి ఎంజీవోగానే పదవీ విరమణ చెయ్యాల్సి వస్తుందని సత్తెకాలపు మనిషి పాపం !నాన్నకి తెలీదు ‘’అన్నారు .

‘’యుద్ధాన్ని రెక్కల మీద మోసుకు పోతున్న విమానాల్ని చూసి –కళ్ళల్లో కాంతి మలగి –‘’భయం తో మాటిమాటికీ ఆకాశాన్ని చూసే పెద్దల ను చూసిన తనలాంటి పిల్లలకు ఆశ్చర్యమే .వారి ఆందోళనలు వీరికి తెలీని విషయాలు .ఎప్పుడూ చూడని ‘’లోహ పక్షులు ‘’ఈ అక్కు పక్షుల అక్షులకు వినోదం .’’కోడి గుడ్డు బుడ్డి  కిరసనాయిలు దీపం వెలుగులోనే కునికిపాట్లు పడుతూ సాగింది ‘’ఆయన చదువు .ఆనాటి మనకూ అంతేగా .ఇంట్లో హరికేను లాంతర్ ఉన్నా ‘’అది కిరసనాయిలు తాగు బోతు’’అని దాన్ని వెలిగించేవారు కాదు .పెద్దాబాల శిక్షతో వేసిన చదువు పునాది బలంగానే పడిందట .

‘’జన్మన్ సిల్వర్ పాత్రల పోతలతో ,శ్రమ జీవుల చెమట పూతలతో  ఎప్పుడూ హడావిడిగా ఉండే బస్తీలో ‘’నిదానం గా చదువుల ప్రస్తానం సాగింది .రామమూర్తి మేస్టారికి అర్ధో రూపాయో నెలసరి జీతం తో అక్షరాభ్యాసం ఆరంభమై నాలుగులో ప్రైవేటు చదువు మొదలై టైం మిగిలితే బొమ్మలేయించేవారు మేష్టారు. అప్పుడే ‘’ఎదుట ఉన్న మునిసిపాలిటీ వీధి లాంతర్ని చూసి అప్పుడే ఆకాశం లో ఎగిరిన విమానాన్ని గుర్తించి ఆ రెంటి మధ్యా ఒక ఇల్లు సృష్టించి ‘’పంతులుగారికి చూపి మెప్పుపొంది అరచేతిలో ‘’శ్రీ మార్కు ‘’పడటం అంబరాన్ని అంటే సంబరాన్ని కల్గించి అ పలకను పదిలంగా ఇంటికట్టుకెళ్ళిఅమ్మానాన్న మేనత్త ల అభినందన చూపుకు పులకించారు .పెదనాన్న చేతిలో పెట్టిన ‘’ప్రైజ్ మనీ అణాకాసు ‘’కు మురిసిపోయారు.ఆయన   రంగు పెన్సిళ్ళు రెండు  కొనిచ్చిన ప్రోత్సాహం తో బొమ్మలపై విజ్రుమ్భించారు .అప్పుడే తెలిసిందట ‘’నాచేతిలో బొమ్మల గీత ఉన్దని ,ఓపిగ్గా కూచుని వేస్తె పొందిగ్గా రేఖలు కుదురుతాయని ,చక్కగా బొమ్మలు  వేయ గలను ‘’అని .చిన్న ప్రోత్సాహం ఎంతటి బలీయమైన ఆలోచనకు పునాది అయిందో తెలుస్తున్దిమనకి .padugupeka 001

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-15- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6

ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -4(చివరి భాగం )

ఇంత చేసినా వాగ్నర్ సంగీతం ‘’కళకు  ,సౌందర్యానికి వ్యతిరేకమే కాక కామన్ సెన్స్ కు కూడా వ్యతిరేకమే ‘’అన్నారు విమర్శకులు .’’టాన్ హీసర్ ‘’కు కూర్చిన సంగీతం అంతా రణగొణ ద్వనియే’’అందిలండన్  టై మ్స్ పత్రిక .’’ట్రిస్టాన్ కు చేసిన సంగీతం ‘’ఒక బాంబు పేలి సంగీత స్వరరాగాలను విచ్చిన్నం చేసి నట్లుంది ‘’అన్నది .జర్మన్ విమర్శకుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి వాగ్నర్ సమకూర్చినది ఏదీ మిగలదు నిలవదు అని ఖచ్చితం గా చెప్పాడు .చార్లటాన్’’హంబగ్ ‘’-కౌంటర్ పాయింట్ ను విషపూరితం చేశాడు –సంగీత విద్యా మూర్ఖుడు, శత్రువు ‘’అని శాపనార్ధాలు పెట్టాడు .’’ఇంపు సోంపు పిచ్చి చేష్టలకు బలైనాయి ‘’అన్నాడొక ప్రబుద్ధుడు .వాగ్నర్ కు సంగీత వరస కట్టటం రాదనీ  ,అతనిలో హాస్య ప్రియత్వం లేదని ,అణకువ అసలే ఉండదని ,ప్రతిదాని లోను రూపాన్ని రూప  శూన్యం లోకి లాక్కేళ్ళాడని ,అతనిదంతా పెద్ద మోత తప్ప చెవులకు  ఇంపైనది ఏదీ లేదన్నాడు బెక్ మేసర్ .’’it could be cruel to judge such trash by any known literary standard ‘’అని ‘’విమర్శ కుండ ‘’పగల కొట్టాడు స్టాతాన్ .

వాగ్నర్ భార్య హార్ట్ అటాక్ తో  చనిపోయింది .పెళ్ళాడిన కోసిమా ఇతనికి ముగ్గురు పిల్లని కనిపెట్టింది .కోసిమాలో ప్రేమ ఆపేక్ష కనిపించాయి .ఆమె ఆరాధనకు మురిసిపోయాడు. పిల్లలకు తన సంగీత పాత్రల పేర్లు –ఐసాల్ద్ ,ఈవా ,సీగ్  ఫ్రీడ్ అని పెట్టుకొన్నాడు  . అనూహ్యం గా వాగ్నర్ కు కొండంత అండగా నిలబడ్డాడు ప్రఖ్యాత ఫిలాసఫర్ ‘’Friedrich Neitzsche ‘’‘’ ‘’వాగ్నర్ విశ్వాన్ని అతి సూక్షం గా చేశాడు ‘’అని కీర్తించాడు .ఈ ఇద్దరి మధ్య అపూర్వ ఆకర్షణ ఏర్పడింది .నీషే క్రిష్టియానిటికి వ్యతిరేకం గా ఉన్నాడు .వాగ్నర్ కూడా అలాగే చేశాడని భావించాడు .వాగ్నర్ సంగీతం ప్రజలకు తీయని మత్తు మందు అని సంస్కృతికి ద్రోహం చేస్తున్నదని ,మత్తు మందు తో మభ్య పెడుతున్నాడని దియేటర్ యజమాలు గోల పెట్టారు ..

ఇంతటి వ్యతిరేక పరిస్తితులలో వాగ్నర్ కు విజయాలు నెమ్మదిగా చేరువైనాయి .జర్మనీ లో ఇమ్పీరియలిజం వ్యాపించింది .తమ గడ్డపై జన్మించిన వాడిని గౌరవించాలన్న బలమైన కోరిక ఏర్పడి అతని ప్రదర్శనలు బ్రహ్మ రధం పట్టటం ప్రారంభించారు .59వ ఏట ‘’బే రూత్ ఫెస్ట్ ఫీలస్ ‘’ కు సంకు స్థాపన చేశాడు .అరవై మూడవ ఏట బేరూత్ ఉత్సవాలు ఘనం గా నిర్వహింప బడ్డాయి .ఇద్దరు చక్ర వర్తులు, ఒక రాజు కొందరు ఉన్నతాధికారుల  సమక్షం లో రింగ్ సర్కిల్(దిరింగ్ ఆఫ్ దినీబే లంగ్స్ ‘’ ప్రదర్శించాడు  . ఇది అత్యంత విజయవంతం అయింది .అయినా అప్పుల్లో మునిగి ,తీర్చటానికి  కచేరీలకోసం దేశాటన చేశాడు .అప్పటికే జీవితం లో ఆసిపోయాడు .కాని మత ఉత్సవానికి సరిపడా ఆలోచనలతో ‘పార్సీ ఫాల్ ‘’చేయాలని బుర్రనిండా ఆలోచనలతో ఉన్నాడు .

పర్సిఫాల్ ఉపోద్ఘాతం ను ప్రదర్శించే టప్పుడు వాగ్నర్ వయసు అరవై అయిదు .నరాల వ్యాధి వచ్చింది .గుండె జబ్బు చోటు చేసుకొన్నది .దద్దుర్లు వచ్చాయి ఒళ్ళంతా .ఇటలీ లోని ప్రశాంత చల్లని వాతావరణం లో ఉండాలని వెళ్ళాడు ముందు నేపుల్స్ చేరి తర్వాత పలేర్మో వెళ్లి అక్కడ పార్సిఫాల్ సంగీతం పూర్తీ చేశాడు .అక్కాడ హార్ట్ ఏటాకులు వచ్చి మళ్ళీ జర్మనీ వచ్చేశాడు .ఉండలేక వెనిస్ వెళ్ళాడు .అక్కడ వెండ్రామిని పాలెస్ లో ‘’సింఫనీ ఇన్ సి ‘’మీద పని చేసి ‘’ఆన్ ది ఫెమినైన్ ఇన్ హ్యూమన్ నేచర్ ‘’పై ఒక కరపత్రం రాశాడు .తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండగా చివరిసారిగా గుండెపోటు వచ్చి 13-2-1883 న వాగ్నర్ 70 వ ఏట మరణించాడు .అతని నోటి వెంట వచ్చిన చివరిమాటలు ‘’’’లీబ్ –ట్రాజిక్ ‘’ అంటే ప్రేమ- విషాదం ‘’అనే మాటలు .ఈ రెండే అతని జీవితం లో పెనవేసుకొన్న విషయాలు

వాగ్నర్ లోని రచయితను అతనిలోని సంగీతాన్ని వివిడిగా చూడలేము .’’the poet is a poor second best ‘’అన్నారు అందుకే .పురాతన ఉత్తర గాధా కవిత్వాన్నిఎంచుకొని ,స్కోపెంహార్ ఫాటలిజం అంటే విదిబలీయం ,జరిగేది జరక్క మానదు అనేదాన్ని కలిపాడు .అతని సంగీతాన్ని ‘’instinctive antipathy ‘ అన్నారు అతనికవిత్వం లో మార్మికత  ఎక్కువై ప్రజలకు సన్నిహితం కాలేక పోయిందన్నారు .కొన్ని సందర్భాలలో జర్మన్ ఫిలాసఫర్ కవి’’ గోదే ‘’ను కూడా మించి ముందుకు వెళ్ళాడు .కాని అతని సంగీతం ప్రపంచాన్ని ముంచేసింది .ముఖ్యం గా ఒపేరా సంగీతానికి కొత్త ద్వారాలు తెరిచాడు .అంతకు పూర్వం ఎన్నడూ లేని మహోన్నత వైభవాన్ని సాధించి దిగ్భ్రాంతి కల్గించాడు .తరువాతి వారు మొదట్లో అతని శైలిని కాదనుకొన్నా అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు .వాగ్నర్ స్టైల్ కు ఉన్న శక్తి అమోఘం .ఆర్కేస్త్రాకు ఉన్న వనరులనన్నిటినీ విస్తృత పరచాడు .సృజనాత్మక కళకు ప్రాదాన్యమిచ్చాడు .మానసికం గా గుండేలోతుల్ని స్పృశించింది వాగ్నర్ సంగీతం .కొత్త సంగీత రూపాన్ని ఆవిష్కరించి సంగీతానికి అర్కేస్ట్రాకు ప్రాధాన్యత తెచ్చి మార్గ దర్శి అనిపించుకొన్నాడు .’’The establishment of ‘’’.a new musical form ,the invention of a vast musical language ,and the total splendor of his achievement have the assurance of timelessness ‘’అలాంటి కాలాతీత సంగీతాన్ని అందించి చిరస్మరణీయుడైనాడు రిచార్డ్ వాగ్నర్ .

వాగ్నర్ మధుర శ్రావ్య సౌష్టవ  సమ్మేళనాన్ని  సాధించాడు సంగీతం లో .సాంప్రదాయక ధ్వని వాచ్యాల పరిధులను విస్తరింప జేశాడు .తాళానికి స్వరానికి ప్రాధాన్యతనిచ్చాడు .వాటి ఉనికికి కొత్త అర్ధాలు వెతికి ప్రదర్శించాడు .ఇదే ఇరవై వ శతాబ్దపు ‘’ఎటోనాలిటీ’’అయింది అంటే సంప్రదాయ స్వరాలకు మంగళం పాడి స్వర రాహిత్యానికి పట్టాభిషేకం చేశాడన్నమాట .అందుకే ఆధునిక పాశ్చాత్య సంగీతానికి వాగ్నర్ జనకుడు  అని,అతని  ట్రీస్టాన్న్ ‘’లో దీన్ని సృష్టించాడని అన్నారు .అందుకని దీన్ని ‘’త్రీస్టాన్ కార్డ్ ‘’అన్నారు .అంటే’’ త్రీస్టాన్ శృతి అన్నమాట .

వాగ్నర్ కచేరీల నిర్వహణలో  అభ్యాసం లో ప్రదర్శనలో ఉత్తమ విలువలతో కూడిన సిద్ధాంతాలను జోడించి ఆదర్శం గా నిలిచాడు .సంగీత సమ్మేళనం తో ఒక అపూర్వమైన అభిరుచిని ఆనందాన్ని మానసిక తృప్తిని ,పరిధికి మించిన అలౌకిక ఆనందాన్ని కల్గించాడు .అతనంటే ఇష్టపడని వాళ్ళే అతని ప్రతిభకు జోహార్లు పలికి అంతకంటే ఇంక ఏమీ లేదని చెంపలేసుకొన్నారు జర్మన్ బ్యాండ్ రామేస్తీన్ ఎలెక్ట్రానిక్ కంపోజర్ క్లాస్ శుజ్ మొదలైన వారందరూ వాగ్నర్ ను అనుసరించిన వారే .

[Wagner’s] protean abundance meant that he could inspire the use of literary motif in many a novel employing interior monologue; … the Symbolists saw him as a mystic hierophant; the Decadents found many a frisson in his work.

వాగ్నర్ సంగీత ప్రభావం 20 21 శతాబ్దపు సినిమా పై విపరీతం .హిట్లర్ స్వయం గా వాగ్నర్ కచేరీలకు హాజరై అందాన్ని అనుభవించేవాడు .తానుకోరుకొంటున్న జర్మనీని వాగ్నర్ సంగీతం లో సృస్తిస్తున్నాడని మెచ్చాడు .వాగ్నర్ భావాలు నాజీలు అనుకరించారు .1933-34లో నాజి కాన్సన్ ట్రేషన్ కాంప్ లలో వాగ్నర్ సంగీతాన్ని వినిపించి బంధితుల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చి వారిలో జాతీయ భావం కలిగించేవారట .రెండవ ప్రపంచ యుద్ధ నాజీ డెత్ కాంప్ లలో వాగ్నర్ సంగీతం వినిపించేవారట .ఇదీ ఆధునిక సంగీత సృష్టికర్త రిచార్డ్ వాగ్నర్ జీవితం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్ – 2019 లో ఒకరోజు సరదా కద –

1919 001

ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్ vahida1 001 vahida2 001 vahida3 001

Posted in సినిమా | Tagged | Leave a comment

7వ సోమేపల్లి కదా పురస్కార సభా దృశ్యాలు -1-2-15 ఆదివారం -ప్రెస్ క్లబ్ -విజయ వాడ 

7వ సోమేపల్లి కదా పురస్కార సభా దృశ్యాలు -1-2-15 ఆదివారం -ప్రెస్ క్లబ్  -విజయ వాడ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ప్రాంతీయ అస్తిత్వం – కోస్తాంధ్ర కథ – వాసిరెడ్డి నవీన్‌

ప్రాంతీయ అస్తిత్వం – కోస్తాంధ్ర కథ – వాసిరెడ్డి నవీన్‌

పోలవరపు కోటేశ్వరరావు, అక్కినేని కుటుంబ రావు రాసిన కథల్లో మాత్రమే ఒకటి రెండు మాండలికాలను వెతుక్కో        వలసి రావటం ఈ ప్రాంత అస్తిత్వవేదన కాక మరేమిటి?
సుమారు 80ల్లో ప్రారంభమైన అస్తిత్వవాద సిద్ధాంతాన్ని 80ల ముందు వచ్చిన కథలకు అన్వయించి చర్చించటం – అదీ కోస్తాంధ్ర ప్రాంత కథలకు అన్వయించటం సాహసమే అవుతుంది. అయితే ఇతర ప్రాంతాలకు ఉన్నట్లే కోస్తాంధ్ర ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ముద్ర కలిగిన, స్థానీయ వాస్తవికతతో ముడిపడిన వస్తువుతో వచ్చిన కథలను పరిగణనలోకి తీసుకుని వాటిని చర్చించటం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా కథల్లో అక్కడక్కడా తొంగి చూసే అస్తిత్వవాద ఛాయల్ని పసికట్టి వాటి మూలాలను శోధించి చర్చించటం కొంతవరకు సబబు.
ఇలా చర్చించటం, విశ్లేషించటం ఈ ఒక్క వ్యాసంలో అయ్యే పనికాదు. ఆ చర్చకు ఈ వ్యాసం ఏ మాత్రం దోహదం చేసినా చాలు. తొలి నుంచీ తెలుగు సమాజంలో జరిగిన ఉద్యమాలు, స్థానీయ పరిణామాలు సాహిత్యానికి ప్రేరణగానో, మార్గదర్శకంగానో నిలిచినట్లే కథా సాహిత్యానికీ నిలిచాయి. కథా వికాసానికి దోహదం చేశాయి. స్థానీయ సమస్యల చిత్రణతో రాసిన రచనలు, అందులోని పాత్రలు విశ్వజనీనతను సంతరించుకోవటం ఈ పరిణామంలో గుర్తించదగిన అంశం. అందుకు ముఖ్యమైన ఉదాహరణ కన్యాశుల్కం నాటకం. విజయనగర సంస్థానంలో కొన్ని బ్రాహ్మణ అగ్రహారాలకి మాత్రమే పరిమితమైన కన్యాశుల్క దురాచారాన్ని నిరసిస్తూ గురజాడ అప్పారావు 1908 (మలిముద్రణ) లో రాసిన ఈ నాటకం ఆ సమస్యలేని ప్రాంతాల్లోనే కాక (వర విక్రయ ఆచారం ఉన్న ప్రాంతాల్లో కూడా) నూరు సంవత్సరాలు దాటినా నేటికీ సజీవంగా నిలబడింది. ఆయనే రాసిన ‘దేవుళ్లారా మీ పేరేమిటి’ కథ కూడా అంతే. అండప్రాయమైన చిన్న విషయంతో ప్రారంభమైన ఈ కథ మూఢాచారాలను నిరసించటంతో పాటు మరో 30 ఏళ్ళ తర్వాత మొదలైన స్ర్తీ స్వేచ్ఛ అనే విస్తృతాంశాన్ని ఆనాడే చర్చించి-వస్తువుకి విశ్వజనీనతను సంతరించి పెట్టింది. ఇలా స్థానీయత నుంచి విశ్వజనీనతకు విస్తరించటంలో తెలుగు సాహితీ ప్రక్రియల ఆరంభ దశ ఒక అద్భుతమైన చారిత్రక పరిణామంగా భావించవచ్చు.
ఉత్తరాంధ్రలో ప్రారంభమైన ఈ సాహితీ ప్రాభవం నెమ్మదిగా దక్షిణాంధ్రకూ విస్తరించింది. దీనికి కొంతకాలం గోదావరి మండలం, తర్వాత నెల్లూరు, గుంటూరు మండలాలు, అనంతరకాలంలో కృష్ణా తీర ప్రాంతాలు ఆలవాలమైనా యి. ఈ ఆధునిక సాంస్కృతిక భావజాలం ముందుగా గోదావరి మండలాలకు తాకటానికి ఉన్న చారిత్రక కారణలను ఒకసారి పరిశీలిద్దాం.
1832లో గోదావరి మండలాన్ని కుదిపేసిన నందన కరవు (నందన నామ సంవత్సరంలో వచ్చిన) వందలాది ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తర్వాత సర్‌ ఆర్థర్‌ కాటన్‌ చొరవతో 1850లో పూర్తయిన గోదావరిపై ఆనకట్ట (ధవళేశ్వరం ఆనకట్ట) ఆ ప్రాంతపు రూపు రేఖలను సమూలంగా మార్చివేసింది. వ్యవసాయ పద్ధతులు మారాయి. చిత్తడినేలల వ్యవసాయం కాలవ నీళ్ళ వ్యవసాయంగా మారింది. ప్రజల జీవన స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఇదే కాలంలో ఈ ప్రాంతంలో కొత్తగా స్థాపించబడిన వందలాది పాఠశాలలు ఒక తరం ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసాయి. దీనికితోడు క్రైస్తవ మత ప్రచారం ఊపందుకుంది. దళిత, బహుజన కుటుంబాల్లో చైతన్య దీప్తి ఆరంభమయింది. వ్యాపార పంటలతో సంపద పోగుపడింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో సంపర్కం ఏర్పడింది. ముఖ్యంగా బెంగాలు ప్రాంతంతో, అక్కడి నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న సాంసం్కృతిక పునరుజ్జీవనపు ఆధునిక పోకడలకు తోడు అభ్యుదయ భావజాలానికి గోదావరి మండలం నెలవయింది. ఈ మొత్తం పరిణామం సీ్త్ర విద్య, స్ర్తీ పునర్వివాహం, సీ్త్రస్వేచ్ఛ, దళిత బహుజన కులాల ఆత్మ స్థైర్యం మొదలైన సామాజికాంశాలకు ఊపిరులూందింది. ఈ క్రమంలో వచ్చిన కథా సాహి త్యం తెలుగు కథా సాహితీ వికాసానికి మార్గదర్శి అయింది. ఈ దశలో స్థానీయ సమస్యలను చిత్రంచిన కథలు విశ్వజనీన దృక్పథాన్ని సంతరించుకున్నాయి. తొలినాళ్ళలో శ్రీపాద ‘అలాంటి తవ్వాయి వస్తే’, ‘అరికాళ్ల క్రింది మంటలు’, ‘కొత్త చూపు’, ‘మార్గదర్శి’ కథలు ఆధునిక భావజాల పునాదిపై నిర్మించిన కథలుగా కలకాలం నిలబడిపోతాయి. అంటరానితనాన్ని నిరసించటం, సీ్త్ర పునర్వివాహం, వ్యాపార దృక్పథం వస్తువుగా వచ్చిన ఈ కథలతో పాటు చింతా దీక్షితులు, ముద్దు కృష్ణ రాసిన కథలు ఈ కాలానికి ప్రతీకలు. నేటికీ అవి కొత్త కథలుగానే అనిపిస్తాయి. వాటికున్న విశ్వజనీనత అది.
కోస్తాంధ్ర ప్రాంతానికి నదులు ఆభరణాలు, ఆ నదుల చుట్టూ ఎంతో సంస్కృతి, జీవన విధానం అల్లుకుని ఉన్నాయి. అటు నెల్లూరు మండలంలోని పెన్నానది, ఇటు గోదావరి, కృష్ణానదులు, ఈ ప్రాంతాలకు జీవధారలు. వీటిమీద ఆనకట్టలు కట్టాక చుట్టూ కాలువలు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత చేతివృత్తులు…వచ్చిన పంటలు ద్వారా పోగుపడిన సంపద, దాని ద్వారా అభివృద్ధి అయిన వ్యాపారం.. ఇలా మొత్తం కోస్తాంధ్ర సంస్కృతీ వికాసానికి నదులు పట్టుకొమ్మలుగా నిలిచాయి. నదీపరీవాహక ప్రాంతాల జీవన సంస్కృతి మీద ఎన్నో కథలు వచ్చాయి. ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకతలు ఒడిసి పట్టుకున్నాయి. అలా వచ్చిన కథల్లో నదుల అందాలను వర్ణించినవీ, వరదకాలపు కష్టాలను చిత్రించినవీ, నదులను ఆరాధించినవీ, నదితో పంచుకున్న జీవితానుభవాలను పంచినవీ ఎన్నో  కథలున్నాయి.
కవికొండల వెంకటరావు గోదావరి వరద కష్టాలను కళ్ళ ముందుంచితే, కళ్ళు చెదిరే గోదావరి అందాలను బి.వి.ఎస్‌. రామారావు గోదావరి కథలుగా తీర్చిదిద్దితే, ఈ అందాలకు మానవ ప్రవృత్తిలోని మౌలిక లక్షణాలను జోడించి పాలగుమ్మి పద్మరాజు తాత్వ్తిక కోణాన్ని చూపించారు. గోదావరి తీర ప్రాంతం మీద డజన్ల కొద్దీ కథలు రాసిన వంశీ (80ల తర్వాత) రాసిన కథలో పోలవరం ప్రాజెక్టు కట్టాక భవిష్యత్‌ గోదావరిని ఆవిష్కరించారు. తొలితరంలో గౌతమీ గాథలను ఆవిష్కరించిన ఇంద్రగంటి హనుమత్‌చ్ఛాసి్త్రనీ మర్చిపోలేం. స్వాతంత్ర్యానంతరం గోదావరి నదిపై డజన్ల కథలు వెలువడ్డాయంటే అతిశయోక్తి కాదు.
తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేవి సాహిత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు. ఇవి ప్రధానంగా కృష్ణా తీర కథలు. వీటిల్లో రచయిత ప్రతిపాదించిన మానవతా విలువలు, సంప్రదాయక ఆధునిక భావజాలాల మేలు కలయక పాఠకులను తామెక్కడివారైనా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తాయి. కృష్ణానది సముద్రంలో కలిసేప్రాంతంలో ఏర్పడిన లంకల్లోని ప్రజల జీవన స్థితిగతులను, విలువలను చిత్రించి పోలవరపు కోటేశ్వరరావు కృష్ణాతీరం కథలు తీర జీవనానికి మంచి వ్యాఖ్యానాలు. పెన్నాతీరం, గుండ్లకమ్మ తీరం కూడా కథావస్తువయింది. ఇవన్నీ ఈ ప్రాంత అస్తిత్వ సూచికలు. స్థానీయ వస్తువుతో రాసిన ఈ కథలన్నీ సార్వజనీనమైన మానవతా విలువలను, విలువల వైరుధ్యాలలోని సున్నితత్వాన్ని, వాటి సాంఘిక నేపథ్యాన్ని ప్రతిపాదించాయి. వీటన్నిటిలో అంతర్లీనంగా కనబడే పాత్ర నది. తెలుగు కథా సాహిత్యంలో కోస్తాంధ్ర ముద్ర స్పష్టంగా కనబడే కథలివి. నదుల కథలపై ప్రత్యేక అధ్యయనం అవసరం.
నీళ్ళు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి కారణమైన ఈ సందర్భంలో తప్పనిసరిగా ఉదహరించవలసిన కథ నీళ్ళు. రచయిత పెద్ధిభొట్ల సుబ్బరామయ్య. నీటి కొరత తెచ్చిపెట్టే ‘అనాగరిక’ జీవనానికి, నీరే సంస్కృతిగా భాసిల్లే ‘నాగరిక’ జీవనానికి మధ్య సాగిన అంతర్గత వైరుధ్యాల సమరం ఈ కథ. నీటికి నాగరికతకు ఉన్న సంబంధాన్ని నీటికొరత ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన యువకుడి కోణం నుంచి చెప్పిన కథ. అంతేకాదు, నీటిపై పెత్తనాన్ని నీటి నాగరికత ద్వారా ఏర్ప డిన దురహంకార భావజాలాన్ని ప్రశ్నించిన కథగా కూడా దీన్ని ఉదహరించవచ్చు. (ఆశ్చర్యమేమంటే ఈ కథలోని రెండు పాత్రలు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే కావటం) ఈ ప్రశ్న నెమ్మదిగా ప్రాంతీయ అస్తిత్వవాద రూపును సంతరించుకున్న ఉద్యమాన్ని నడిపించింది.
కోస్తాంధ్ర ప్రాంతం మీద ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. మరీ ముఖ్యంగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఈ రెండున్నర జిల్లాల భాషను ఆధిపత్యవాద దురహంకారంతో మొత్తం తెలుగు భాషగా ప్రామాణీకరించారని. అంటే ఇప్పుడు పత్రికల్లో, సినిమాల్లో, ఇతర మాధ్యమాల్లో వాడుతున్న భాష అంతా ఈ రెండున్నర జిల్లాలదని దీనర్థం. ఈ క్రమంలో ఇతర ప్రాంత మాండలికాలు దెబ్బతిన్నాయనేది ఈ ఆరోపణల్లో ప్రధానాంశం. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను కాసేపు పక్కనబెట్టి ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరించాలి. ప్రసార మాధ్యమాల్లో ఇతర ప్రాంత మాండలికాలను అవహేళన చెయ్యటం, తక్కువ పాత్రలకు ఆపాదించటం వెనక దురంహంకారం, ఆధిపత్యం ధోరణి ప్రస్ఫుటంగానే కనబడుతుంది. ఈ ఆరోపణల్లో తప్పిపోయిన మరో ముఖ్య విషయం- రెండున్నర జిల్లాలు ఈ ప్రామాణీకరణ క్రమంలో తమ తమ మాండలికాలను దారుణంగా పోగొట్టుకున్నాయన్నది. అక్కడక్కడ, అప్పుడప్పుడు గుంటూరు మాండలికం కనబడుతుంది కానీ కృష్ణా, గోదావరి (పశ్చిమ) మాండలికాలు ఏమయ్యాయో అంతు చిక్కదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే..
వ్యాపారీకరణ సూత్రంగా ఎదిగిన, కోస్తా ప్రాంతాల పెట్టుబడిదారులు, ప్రసారమాధ్యమాల ద్వారా ప్రామాణీకరించిన భాష నిజానికి రెండున్నర జిల్లాల భాష కాదు. ఈ ప్రామాణీకరణ క్రమంలో ఈ రెండున్నర జిల్లాల సొంపైన మాండలికాలెన్నో కాలగర్భంలో కలిసిపోవటం వాస్తవమైన విషాదం. మాండలిక భాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న సాహిత్యాభిమానులకు ఈ ప్రాంత మాండలికాలు కనుమరుగై పోయాయన్న ఆవేదనతో పాటు, రెండున్నర జిల్లాల ఆధిపత్య వాదులుగా (భాష విషయంలో) ముద్ర వేయించుకోవటం మరింత బాధాకరం.
ఇటీవల అక్కినేని కుటుంబరావు నవల కొల్లేటి జాడలు లోని మాండలిక పదాలను చదువుతోంటే ఒళ్ళు పులకరించి పోయింది. తెలంగాణ, రాయలసీమ, ఉత్త రాంధ్ర మాండలికాలను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకున్న నా బోటివాడికి నా మాండలికం నాకు తెలియకపోవడం, రాయలేకపోవటం, ఆత్మహత్యా సదృశ్యమైన విషాదం. దీనికి కారణాలేమిటి?
కరుణకుమార నెల్లూరు మాండలికంలోను, మా గోఖలే గుంటూరు మాండలికంలోను కథలు రాసిన రోజుల్లోనే కృష్ణా, గోదావరి జిల్లాల రచయితలెవరూ ఆయా మాండలికాల్లో రాయలేకపోవటానికి ఏ పెట్టుబడి దానిని మింగేసిందో ఆలోచించాలి. (ఒకటి రెండు కథలు రాసిన కొసరాజు-అవును ఏరువాక సాగాలో.. పాట రాసిన కొసరాజే-దీనికి మినహాయింపే) ఇటీవల పోలవరపు కోటేశ్వరరావు, అక్కినేని కుటుంబ రావు రాసిన కథల్లో మాత్రమే ఒకటి రెండు మాండలికాలను వెతుక్కోవలసి రావటం ఈ ప్రాంత అస్తిత్వవేదన కాక మరేమిటి?
ఈ వేదనలోంచి భాష విషయంలోనైనా అస్తిత్వ చైతన్యం, ఉద్యమం ఈ ప్రాంతంలో మొదలవుతాయేమో చూద్దాం!
 వాసిరెడ్డి నవీన్‌
(‘తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం’ సంచికలో               ‘ప్రాంతీయ అస్తిత్వ మూలాల వెలుగులో కోస్తాంధ్ర కథ (1948-80)’ శీర్షికతో రాసిన సుదీర్ఘ వ్యాసంలోని కొన్ని భాగాలు)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకు తెలిసిన ఆర్ కే లక్ష్మణ్ – కె. సదాశివరావు

నాకు తెలిసిన ఆర్ కే లక్ష్మణ్ – కె. సదాశివరావు

నేను ఆర్కే లక్ష్మణ్‌ దంపతులను మొదటిసారి        కలిసినది వైస్రాయ్‌ హోటల్‌లో ‘మీట్‌ ది ఆధర్‌’కార్యక్రమంలో. ఇది నాకు గుర్తుచేసింది అశోక్‌
(అశోక్‌ బుక్స్‌, విజయవాడ). లక్ష్మణ్‌ దంపతులు తర్వాత గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో బస చేశారు. మర్నాడు లంచ్‌కి బయటకు వెళ్దామని లక్ష్మణ్‌           దంపతులను తీసుకు వెళ్ళటానికి మేమిద్దరం వెళ్ళాము. నన్ను చూడగానే లక్ష్మణ్‌ ‘వాట్‌ పోలీస్‌ మన్‌! నన్ను అరెస్ట్‌ చేయటానికి వచ్చారా?’’ అన్నారు.
‘‘అవును, ఎక్కువ నవలలు రాయనందుకు మిమ్మల్ని నిజంగా అరెస్ట్‌ చేయవలసిందే’’నన్నాను.
లక్ష్మణ్‌, కమల, అశోక్‌… అందరూ నవ్వారు.
తర్వాత అక్కడే కూర్చుందామని నిర్ణయించుకుని లాంజ్‌లో కూర్చుని బీర్‌ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం. మా బీర్‌ కార్యక్రమం సమయంలో కమల, అశోక్‌ బయటకు వెళ్ళి లంచ్‌ సమయానికి వచ్చారు. తర్వాత కూడా లక్ష్మణ్‌ దంపతులను కలియటం జరిగింది. మేం మాట్లాడుకున్న విషయాలు ఎన్నో…
పంచ్‌ మాగజైన్‌ కార్టూనిస్టులూ… న్యూయార్కర్‌ కార్టూనిస్టులూ… ప్రపంచంలోని ముఖ్యమైన పొలిటికల్‌ కార్టూనిస్టులు ఇన్‌ జనరల్‌… డేవిడ్‌లో… ఓలిఫాంట్‌… ఇంకా ఎందరో. ఆయనకి బ్రిటిష్‌ కార్టూనిస్టులు… పంచ్‌ మాగజైన్‌తో విరివిగా వేస్తుండే ధెల్‌వెల్‌ (ఇతడి బొమ్మల్లో బొద్దుగా వుండే పిల్లలూ, బొద్దు గా వుండే పొట్టి గుర్రాలూ)…. రొనాల్డ్‌ సియిర్ల్‌… అంటే ఇష్టమని చెప్పారు.. న్యూయార్కర్‌ కార్టూనిస్టులలో జేమ్స్‌ దర్బర్‌… ఇంకా ఎందరినో ఆయన మెచ్చుకున్నారు.
‘‘స్టీన్‌బెర్గ్‌ ఎలా వుంటాయి’ అని అడిగాను.
‘‘బావుంటాయి కాని చాలా సొఫిస్టికేటెడ్‌… ఆబ్‌స్ర్టాక్‌’’ అన్నారు.
రచనల మీదకు మాటలు మళ్ళాయి. ఆయన ఆధునిక నవలలు… మంచివి దాదాపు చదువుతూనే వుంటానన్నారు. ముఖ్యంగా గ్రాహం గ్రీన్‌.
బైర్ట్రండ్‌ రసెల్‌ని కలసిన రోజున ఏం జరిగిందో చెప్పారు.
“You indians Discovered Nothing” అన్నాడు రసెల్‌. లక్ష్మణ్‌కి అర్థం కాలేదు. రసెల్‌ కాస్త రూడ్‌గా ఇన్‌సల్టింగ్‌గా మాట్లాడినట్లు అనిపించింది. కాని వెంటనే రసెల్‌ ‘‘మీరు గణితంలోని జీరోని కనుగొన్నవారు. గ్రేట్‌ కాంట్రిబ్యూషన్‌ టు మాధమెటిక్స్‌’’ అన్న తర్వాత అర్థమయింది రసెల్‌ పొగిడాడని.
ఆయనకీ కాకులకీ వున్న అవినాభావ సంబంధం గురించి బాగా చెప్పారు. ఉదయం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసుకి వెళ్ళి తన రూమ్‌లో కూర్చుని టీ తాగి అక్కడ వున్న అన్ని న్యూస్‌ పేపర్లని తిరగేయటం మొదటి కార్యక్రమం. దేశ కాల పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలను గురించి ఆలోచిస్తూ తన గది బయట వున్న చెట్టు మీద వాలి వుండే కాకుల మందలను చూస్తూ ఐడియాల కోసం ఎదురు చూసేవారు. మెల్లగా ఒకటో రెండో కార్టూన్‌ ఐడియాలు వస్తే రఫ్‌ స్కెచ్‌లను వేసి మళ్ళీ కాకుల విన్యాసాలను చూస్తూ గడపటం… కాస్త సమయం తర్వాత వచ్చిన ఐడియాలతో మళ్ళీ కొన్ని రఫ్‌ స్కెచ్‌ లు వేయటం- ఇలా జరిగేది. లంచ్‌ తర్వాత ఈ రఫ్‌ స్కెచ్‌ల నుండి పుట్టిన కార్టూనులు రెండో మూడో వేస్తే అవి ఎడిటర్‌ రూమ్‌కి వెళ్ళి తిరిగి వచ్చేవి. వాటికి కేప్షన్స్‌ రాసి ఫైనల్‌ డ్రాయింగ్‌ అయిపోతే రోజు పని పూర్తవుతుంది.
తన కార్టూన్ల సృష్టిలో బయట చెట్టు మీద సందడి చేస్తున్న కాకుల మందల విన్యాసాలు తన ఆలోచనలు ఓ దారికి రావటానికి దోహదం చేసేవని లక్ష్మణ్‌ అన్నారు. కాకులంటే లక్ష్మణ్‌కి ఎంతో ప్రేమ. వాటిని ఎన్నో మూడ్స్‌లో… ఎన్నో వేల బొమ్మలు వేశారాయన. ఆయన నాకు నాలుగు బొమ్మలు వేసి ఇచ్చారు. అవి (1) కామన్‌ మాన్‌ (2) కామన్‌ వుమన్‌ (3) గణేశుడు (4) కాకి. ఆ నాలుగు వేసి ఇచ్చాక నన్ను అడిగారు.
‘‘అవి ఎంత ఖరీదు వుంటాయో తెలుసా?’’
‘‘తెలియదు. బహుశా ప్రైస్‌ లెస్‌’’ అన్నాను
నవ్వి ఇలా చెప్పారు.
‘‘ఓ ఆరు నెలల నాడు బొంబాయిలో ఓ రోటరీ క్లబ్‌ సమావేశంలో నన్ను పిలచి మాట్లాడమని అడిగారు. ప్రసంగం పూర్తయ్యాక ఓ బొమ్మ వేయమని కోరారు. నేను ఓ బొమ్మ వేసి ఇచ్చాను. వెంటనే దానిని అక్కడ వేలానికి పెడితే క్లబ్‌కి ఓ యాభై వేలు వచ్చింది’’ అన్నారు.
‘‘థాంక్స్‌ ఫర్‌ మేకింగ్‌ మి రిచ్‌’’ అన్నాను. నవ్వేశారు లక్ష్మణ్‌. ఆ బొమ్మలు మా పిల్లలతో ప్రస్తుతం అమెరికాలో వున్నాయి.
ఓ సారి బాపు నన్ను అడిగారు.
‘‘లక్ష్మణ్‌ని నీ కారికేచర్‌ వేయమని ఎందుకు అడగలేదు?’’
‘‘నాకు అడగాలని తోచలేదు బాపూ’’ అని చెప్పాను.
ఎన్నో ఏళ్ళనాడు ఆర్కే లక్ష్మణ్‌ రెండు నవలలు కూడా రాయటం జరిగింది.
అవి (1) ది హోటెల్‌ రివియెరా (2) ది మెసెంజర్‌
ఆనాటి విమర్శకులు ఈ నవలలని సోదరుడు ఆర్‌.కె. నారాయణ్‌ నవలల తో పోల్చే ప్రయత్నం చేయటంతో నవలలు రాయటం విరమించుకుని కేవ లం డ్రాయింగ్స్‌, కార్టూన్ల మీద తన దృష్టిని కేంద్రీకరించటం జరిగింది. ఆర్‌.కె. నారాయణ్‌ రాసిన నవలలకీ కథలకీ, వాటి మీద ఆధారపడి తీసిన టీవీ సీరియల్స్‌కీ లక్ష్మణ్‌ వేసిన బొమ్మలతో వాటిలోని పాత్రలూ జీవం పోసుకుని ఆనా టి సమాజాన్ని, మనుషుల్ని ఎంతో ప్రతిభావంతంగా రూపొందటంలో భాగస్వాములయ్యాయి. నారాయణ్‌ వూహలకి లక్ష్మణ్‌ రూపాల్ని కల్పించటంలో వాటిలోని దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు అద్భుతంగా ప్రత్యక్షమవుతాయి. మాల్గుడీ వూహా ప్రపంచంలోని మనుషులూ, ఇళ్ళూ వాకిళ్ళూ, బజారులూ అన్నీ మనకి స్పష్టంగా కనిపించి నారాయణ్‌ సృష్టించిన సాహిత్య ప్రపంచం మనకి అర్థమవుతుంది. పధ్నాలుగు ముఖ్య భాషలూ, ఇంకా ఎన్నెన్నో భాషలూ, 130 కోట్ల జనం వున్న ఈ దేశంలోని వైవిధ్యం, వైరుధ్యం అన్నీ ప్రస్ఫుటంగా నిత్యమూ చూపించటంలో లక్ష్మణ్‌ కృతకృత్యుడయ్యాడని వొప్పుకోక తప్పదు. అదే మన బలం… మన ఐక్యత..
అధికారగణాలలో, రాజకీయ వాదులలో, పారిశ్రామికాధిపతులలో, బ్యూరోక్రసీలలోని అన్ని లెవెల్స్‌లో వుండే రుగ్మతలూ, అధికార దాహంతో రాజకీయ నాయకులు చేపట్టే రధ యాత్రలూ, పాదయాత్రలూ, నిరాహార దీక్షలూ, ప్రజలను మభ్యపెట్టే ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలనూ – వీటన్నింటినీ నమ్మి ఓట్లు వేసి మళ్ళీ అధికారాలను కట్టబెట్టి తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి అన్ని వేళలా వుంటున్నది. అంతులేని అవినీతికి అడ్డుకట్టలు వేయటం ఎలాగో ఎవరికీ తెలియదు. ఇవన్నీ మనం అందరం నిత్యమూ అనుభవించేవే…ఇవన్నీ లక్ష్మణ్‌ కార్టూన్లకి మూల ధాతువు. మనందరి నిత్య జీవితాలనుండే ఈ సమస్యలన్నీ పుట్టాయన్న సంగతి మనకి తెలియదు.
మేం మాట్లాడుతున్న సమయంలో లక్ష్మణ్‌ – నాన్‌సెన్స్‌ కవితలు, వాటికి బొమ్మలు వేసిన ఆంగ్ల కవిని ప్రస్తావించారు. కాని మా ఇద్దరికీ ఆ పేరు గుర్తుకు రాలేదు. కాసేపు ప్రయత్నించి కవితల్ని గురించి మాట్లాడుకున్నాము. ఆ రోజు రాత్రి నాకు కవి పేరు గుర్తుకు వచ్చింది.
అది ఎడ్వర్డ్‌ లియర్‌. మర్నాడు మేం ఇద్దరం కలిసినప్పుడు వచ్చిన మొదటి మాట ‘‘ఎడ్వర్డ్‌ లియర్‌’’ అని ఇద్దరం ఒక్కసారి అన్నాం. తర్వాత నవ్వులు.
ఆయన పూర్తిగా రిలాక్స్‌ అయితే చెప్పే విషయాలు ఎంతో ఆత్మీయంగా, ఫన్నీగా వుంటాయి. ఆయనకి జపనీస్‌ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా అకీరా కురసోవా. ఆ సినిమాలలో ఎక్కువగా నటించే ప్రముఖ నటుడు తోషిరో మిఫునె కోపం వస్తే జపనీ్‌సలో ఎలా మాట్లాడేవాడో లక్ష్మణ్‌ మిమిక్‌ చేస్తే చూడటం ఓ అపురూపమైన అనుభవం. ఆ భాష జపనీస్‌ కాదు.. జపనీస్‌ లాంటి జిబరిష్‌. కాని, జపనీ్‌సలా అనిపించి మనకి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. ఆయన మిమిక్రీ అద్భుతం.
ఇంతకీ కామన్‌ మాన్‌ ఎవరు? ఈ ప్రశ్నని నేను లక్ష్మణ్‌ని అడిగాను.ఆయన ఎనిగ్మాటిక్‌గా నవ్వారు.
మళ్ళీ దగ్గరున్న కార్టూన్‌ పుస్తకాలను ఓ సారి తిరిగేస్తే తోచింది- లక్ష్మణ్‌ సృష్టించిన కామన్‌ మాన్‌, అతని భార్య కామన్‌ వుమన్‌- మన వూహా ప్రపంచంలో భాగాలైపోయారు. కామన్‌ మాన్‌ సమస్యలు నిజానికి మన అందరి సమస్యలు అన్న భావన కలిగించటంలో లక్ష్మణ్‌ ప్రతి దినమూ ప్రయత్నం చేసేవారు. కామన్‌ మాన్‌ అసహాయత, కామన్‌ వుమన్‌ మాటలలో వుండే వ్యంగ్యం, వెటకారం గిలిగింతలు కలిగిస్తాయి. లక్ష్మణ్‌ కార్టూన్లని చూసే ప్రతి మనిషికీ తన జీవితంలోని పలు సందర్భాలలో తారసపడే మనుషులూ, గతుకుల రోడ్లూ, త్రవ్వేసి మళ్ళీ రిపేర్‌ చేయని పట్టణాల వీధులూ, రాజకీయ నాయకుల తెలివితక్కువ తనం, వారి వివిధ కార్యక్రమాలూ, కష్టాలూ, కన్నీళ్ళూ… ఇవన్నీ ఇలాగే వుంటాయి, మనం భరించక తప్పదు సుమా అన్నట్లు. ఆ సందర్భాలలో హాస్యాన్ని ఆస్వాదించటం మినహా ఏం చేయాలో తోచని పరిస్థితి అది. అందుకే ఆ కార్టూన్లు సందర్భోచితంగా, టైమ్‌ లెస్‌గా ఎంతకాలం గడిచినా రెలెవెంట్‌గా వుంటాయి.
దానికి గల ముఖ్యకారణం కామన్‌ మాన్‌ మనమే కాబట్టి.
నేను… మీరు…. మీరు… మనం అందరం…. ఆ కార్టూన్లన్నీ మన మీదే…
లక్ష్మణ్‌ లేరన్న మాట తెలిశాక పూనె  ఫోన్‌ చేసి కమలా లక్ష్మణ్‌తో మాట్లాడాను.  ‘‘అంతా అయిపోయింది. నేను అలసిపోయాను’’ అన్నారు.
ధైర్యం చెప్పి పెట్టేశాను.
ఎదురుగా వున్నాయి- లక్ష్మణ్‌ పుస్తకాలు
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వారు ఎంతో ప్రేమతో, ఎంతో ఆనందంగా ముద్రించిన లక్ష్మణ్‌ కార్టూన్ల నిధి.
అవి తరతరాలకూ ఆహ్లాదాన్నీ ఆలోచనలనీ కలిగించే గని.
మనం వాటిని చూస్తూ ఆనందిస్తే లక్ష్మణ్‌కి అది నివాళి.
ఎందరో రానున్న యువ కార్టూనిస్టులకి మార్గదర్శకత్వం ఇస్తాయని నా నమ్మకం.
థాంక్‌ యూ ఆర్కే లక్ష్మణ్‌!
 కె. సదాశివరావు
9848034662

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

1- లల్లేశ్వరి

కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి వేదాంత ధోరణిలో కవిత్వం రాసినా పరమత సహనం బోధించి గుర్తింపు పొందింది .14 వ శతాబ్ది మధ్యలో చ్నాష్టియన్ యుగం లో జన్మించింది .ఆకాలం లో కాశ్మీర్ రాజకీయ మత సంఘర్షణలతో అట్టుడికి పోతోంది .కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు అయిదు కిలో మీటర్ల దూరం లో ఉన్న పండ్రెంధాన్ శాంపూర్ లో ఆమె తలిదండ్రులు ఉండేవారు .లల్లేశ్వరికి బాల్యం లోనే వివాహం జరిగింది.పామ్పూర్ లోని అత్త వారింటికి కాపురానికి వెళ్ళింది .అక్కడ అత్తగారు విపరీతం గా ఆరళ్ళు పెట్టెది . మనిషికిచ్చేకనీస మర్యాదకూడా ఇవ్వక అత్తగారు కర్కోటకురాలై ఎన్నో ఇబ్బందులు పెట్టింది అవన్నీ సహనం తో భరించింది . తిండి పెట్ట్టకుండా మాడ్చింది కొత్త కోడలిని. .అన్నీ తట్టుకోన్నది ఆ మహా సహన శీలి .ఎన్నడూ అత్తను ఎదిరించలేదు .

ఒక రోజు అత్తగారింట్లో గొప్ప విందు ఏర్పాటు చేశారు .ఊరందరిని భోజనాలకు పిలిచారు .ఈమె నదికి వెళ్లి కడవలతో నీళ్ళు మోసింది . అక్కడ ఆడంగులు ఆమెతో ‘’ఈ రోజున మీ ఇంట్లో గొప్ప విందు కదా .రాత్రికి నీకు కడుపునిండా షడ్ర సోపేత భోజన పదార్ధాలు పెడతారులే ‘’అన్నారు .నిజమే నని నమ్మింది లల్లేశ్వరి’.మా ఇంట్లో ఎంతపెద్ద విందు జరిగినా నాకు పెట్టేది పెద్ద రాయి మాత్రమే ‘’అని జవాబు చెప్పింది .రోజూ ఆమె భోజన పళ్ళెం లో ఒక పెద్ద రాయి పెట్టి ,దానిపై కొద్దిగా బియ్యం ‘’ధాలి ‘’వేసి కప్పి ఏంతో పెద్ద భోజనం పెడుతున్నట్లు అత్తగారు అందరినీ భ్రమింప జేసేది .

ఇక అత్త వారింట్లో తట్టుకొనే ఓపిక లేక ఇల్లు వదిలి సన్యాసిని గా మారింది .గొప్ప సంస్కృత విద్వాంసుడైన ‘’సీదా బాయు ‘’శిష్యురాలైనది ‘గురువు వద్ద యోగా ,ధ్యానం నేర్చుకొని గురువును మించిన శిష్యురాలని పించుకొంది.ఇలా ఉండగా ఇరాక్ నుండి వచ్చిన సయ్యద్ లతో పరిచయం ఏర్పడింది .వారితో సుదీర్ఘం గా మత విషయాలపై చర్చించేది .అన్ని వేదాంత గ్రంధాలలోని మంచి విషయాలను సేకరించి బోధించేది . మతాలన్నీ ఒకే భగ వంతుని చేరే వేరు వేరు మార్గాలు అని నమ్మింది .హిందూ ముస్లిం ల మధ్య భేదాన్ని ఆమె పాటించ లేదు .సమానం గా సమాదరించింది .అన్నిమతాలు ఒకే సత్యాన్ని బోధిస్తాయని తెలియ జెప్పేది .

ఆహార పానీయాల విషయం లో నియమాలు పాటించాలని ఉద్బోధించింది .మితిమీరి ఏదీ చేయరాదని హితవు చెప్పింది .ప్రతి వ్యక్తీ ఆత్మ జ్ఞాన సంపన్నుడు కావాలని అదే అసలైన భగవంతుని కి చెందిన జ్ఞానమని చెప్పేది .మనిషి దుఖాలకు, బాధలకు కారణం అహంకారమే నని దాన్ని వదలించుకొంటే ముక్తి పొందటం తేలిక అని తెలియ జెప్పేది .అతి తిండి అనర్ధ దాయకం అన్నది .నిరాహారమూ మంచిదికాదని సరిపడా దేహ పోషణకోసం తినాలని హితవు చెప్పింది. మనిషి జీవించి ఉండగానే దైవాన్ని గురించి తెలుసుకోలేక పొతే మరణించాక ఎలా సాధ్యం అని ప్రశ్నించింది.ఆమె జీవితం లో ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినట్లు కధనాలున్నాయి .అవన్నీ ఆమెపై హిందూ ముస్లిం లకు ఏర్పడిన వీర అభిమానమే కారణం .కాశ్మీర్ ప్రసిద్ధ రుషికవి ,చార్ ఏ –షరీఫ్ కు చెందిన నంద రుషి కి లల్లేశ్వరి అంటే విపరీత మైన గౌరవం, ఆరాధనా భావం ఉన్నాయి .ఆమె కాశ్మీరీ భాషలో రచించిన పదాలు(వాక్స్ ) పాడుతూ తరలాలకు వ్యాప్తి చెందారు కాశ్మీరీ ప్రజలు .ఈనాటికీ ఆమె పాటలు పాడుకొంటూ స్మరిస్తారు .కృతజ్ఞతను ప్రకటిస్తారు . ఆమె ను హిందూ ముస్లిం లు సమానం గా ఆదరించి సోదరభావాన్ని చాటుకొన్నారు .

2. రూపా భవానీ
1624లో సంస్కృత మహా పండితుడు మాధవ జూదార్ కు రూపా భవానీ కుమార్తె .పండిట్జీ కుటుంబం కాశ్మీర్ లో సఫా కదార్ దగ్గరున్న మొహల్లా ఖానాఖి సోక్తలో నివాసం ఉండేది .తండ్రి నిత్యం హరి పర్బాత్ సేవలో శారికాదేవి పూజలో ఉండేవాడు .ఆ దేవతానుగ్రహం లో రూప జన్మించటం తో ఆమెలో దైవీ లక్షణాలు చిన్నప్పటి నుండే కనిపించేవి .యుక్త వయసులో ఆమెను సప్రూ కుటుంబ యువకునికిచ్చివివాహం చేశారు .పెళ్లి ఆమె పాలిటి వరం కాకుండా శాపమే అయింది అత్తా ,భర్తా ఆమెను విపరీతం గా బాధ పెట్టేవారు .ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక భావాలను వారిద్దరూ అర్ధం చేసుకోలేక పోయారు .ఈ సంసారలంపటం లో కూరుకు పోవటం ఇష్టం లేని రూప బయటికి వచ్చి సన్యాసినిగా మారిపోయింది .

వేదాంతాన్ని, యోగ శాస్త్రాన్ని మిగిలిన ఆధ్యాత్మ గ్రంధాలన్నీ చదివి విజ్ఞానం పెంచుకొన్నది .ఆమె గురువు తండ్రి అవటం బాగా కలిసి వచ్చింది .కాశ్మీర్ లోయ అంతటా పర్య తీస్తూ సాధువులతో ,సన్యాసులతో ,దర్వేష్ లతో ఆధ్యాత్మిక చర్చలు చేసేది .నిరంతర సాధన వల్లఆమెలో అలౌకిక దివ్య శక్తులెన్నో ఏర్పడ్డాయి .వాటిని సద్వినియోగంచేసింది అందులకు దృష్టిని ప్రసాదించింది .మనిగాం గ్రామం లో అగ్ని ప్రమాద౦ సంభవిస్తే కంటి చూపు తో ఆర్పి వేసింది ఈ నాటి కాశ్మీర్ రాజ భవన్ వద్ద ఉన్న అద్భుత ప్రక్రుతి సౌందర్యం మధ్య వాస్కూరా లోను ,చాష్మా సాహిలోను ధ్యానం లో కాలం గడిపింది .అక్కడికి చేరే భక్త జనాలకు ఆధ్యాత్మిక ప్రబోధం చేసేది .దీనితో హిందువులే కాక ముస్లిములు కూడా రూపా భవానీ కి భక్తులైపోయారు .కులమత భేదాలు లేకుండా అందరిని కన్న పిల్లలలాగా ఆదరించి వారి యోగ క్షేమాలను చూసేది .ఆమెను శారికా దేవి అవతారం గా కాశ్మీరీ ప్రజలు భావించి ఆరాధించేవారు .ఈ ప్రపంచానికి ఏకైక ప్రభువు భగవంతుడే నని నమ్మి అందరికి ఆ విషయాన్ని ప్రబోధించింది .

రూపా భవాని కి సంస్కృత ,పర్షియన్ భాషలలో అపార పాండిత్యం ఉన్నా కాశ్మీరీ భాషలోనే సరళం గా రాసేది ప్రసంగించేది . .ఆ నాటి ముస్లిం ఫకీర్ షా షాదిక్ కలందార్ కు రూపా భవానీ అంటే విపరీత మైన గౌరవం, భక్తీ ఉండేవి .ఆయనే ఆమె జీవిత చరిత్రను ,మరణం జరిగిన తేదీలను రాసి భద్రపరచాడు .మాఘమాసం కృష్ణ పక్ష సప్తమి నాడు-జనవరి నెలలో రూపా భవానీ భౌతిక శరీరాన్ని97 ఏడేళ్ళ వయసు లో విసర్జించి పరమాత్మ సన్నిధానం చేరింది .ఆమె మరణించిన సప్తమి తిధిని ఆనాటి నుండి ఈ నాటివరకు సుమారు 370 ఏళ్ళుగా ‘’సాహిబ్ సప్తమి ‘’పేరిట సంస్మరణ దినోత్సవం జరుపుతూ ఉండటం విశేషం .

రూపా భవానీ పేరిట వాస్కూరా ,మనిగాం,సఫా కదల్ మొదలైన చోట్ల ఆశ్రమాలను నిర్మించారు .’’రూపా భవనీఅలక్ సాహిబా ట్రస్ట్ ‘’ను ఏర్పరచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఈ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆమె వర్ధంతిని మహా వైభవం గాయజ్ఞం చేసి నిర్వహిస్తున్నారు .ముస్లిములందరూ పూలు ,పళ్ళు పాలు స్వీట్లు ఆ రోజున భక్తులకు అమ్మి తమ వంతు భక్తిని ప్రకటించుకొంటారు. కాని ఉగ్రవాదుల దాడులతో అల్లాడిపోతున్న కాశ్మీర్ లో ఈ ఉత్సవం 1989-90నుండి ప్రజాక్షేమ దృష్ట్యా రద్దు చేశారు .ఉగ్రవాదుల దాడులకు అనేక ఇబ్బందులకు లోనైనా కాశ్మీరీ పండిట్స్ 1990 ఫిబ్రవరి –మార్చి నెలలలో కాశ్మీర్ నుండి భారీగా జమ్మూ కు వలసపోయారు .ఆమె జ్ఞాపకార్ధం జమ్మూ లో తాలాబ్ తిల్లో అనే ప్రదేశం లో రూపా భవానీ ఆశ్రమం నిర్మించుకొని పూజలు ఉత్సవాలు చేస్తున్నారు .ఇక్కడే ఆమె వర్ధంతిని యజ్న౦ తో నిర్వహిస్తున్నారు .వేలాది కాశ్మీరీ పండిట్ లు ఈ కార్యక్రమం లోపాల్గొని రూపా భవానీ ని సంస్మరిస్తారు .

కాశ్మీర్ లో హిందూ ముస్లిం సఖ్యత కోసం లల్లేశ్వరి ,రూపా భవానీ చేసిన సేవలు చిరస్మరణీయం ఆదర్శ ప్రాయం .నేటి కల్లోల కాశ్మీర్ కు వారిద్దరి స్మరణ .మార్గ దర్శనం చేస్తాయి .

– గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment