ఆకాశ దీప మహాత్మ్యం -చాగంటి

ఆకాశదీప మహాత్మ్యం

కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః 

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేఇ కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.
అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా మరణానికి ముగింపులేదు -రెహనా ఉరి తర్వాత విడుదల చేసిన ఉత్తరం

నా మరణానికి ముగింపులేదు

రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ సంఘటనపై అంతర్జాతీయంగా పెనుతుపాను చెలరేగింది. ఈ నేపథ్యంలో- తనకు మరణ శిక్ష పడిందని తెలిసిన తర్వాత రెహనా తన తల్లికి ఒక వాయిస్‌ మెసేజ్‌ను పంపింది. గత శనివారం ఆమెను ఉరితీసిన తర్వాత అధికారులు దీనిని విడుదల చేశారు. భగవంతుడి న్యాయస్థానంలో మనం ముద్దాయిలం కాదు అని తన తల్లికి ధైర్యం చెప్పటానికి ప్రయత్నించిన రెహనా తన శరీర అవయవాలను దానం చేయమని కూడా కోరింది. కరుడుగట్టిన హృదయాలను సైతం కరిగించే ఆమె పంపిన సందేశానికి తెలుగు అనువాదమిది.. 
డియర్‌ షోలి,
నేను క్విసాస్‌ (ఇరాన్‌ న్యాయవ్యవస్థలో ఒక అంశం)ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందనే విషయం ఈ రోజే నాకు తెలిసింది. ఈ విషయాన్ని నువ్వే నాకు చెప్పి ఉండాల్సింది. నా జీవితంలో ఆఖరి అధ్యాయానికి చేరుకున్నానని తెలిసిన తర్వాత నువ్వు నాకు ఈ విషయం చెప్పకపోవటం బాధ కలిగించింది. నాకు ఈ విషయం తెలుస్తుందని నువ్వు అనుకోలేదా? నువ్వు విషాదంగా ఉన్నావనే ఆలోచనే నన్ను ఇబ్బంది పెడుతోంది.. నీ చేతిని, నాన్న చేతిని ముద్దాడే అవకాశాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు.? ఈ ప్రపంచం నన్ను 19 ఏళ్లు బతకనిచ్చింది. నన్ను చంపేసి నా శరీరాన్ని నగరంలో ఏ మూలో విసిరేసి.. కొద్ది రోజుల తర్వాత మార్చురీలో నా శవాన్ని గుర్తించమని నిన్ను తీసుకువెళ్లేవారు. నన్ను రేప్‌ చేశారనే విషయం కూడా నీకు అప్పుడే తెలిసేది. నన్ను చంపిన వ్యక్తి ఎవరో కూడా ఎవ్వరికి తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే- వాళ్ల దగ్గర ఉన్నంత సంపద, శక్తి మన దగ్గర లేదు. ఆ తర్వాత నువ్వు సిగ్గుతో తలదించుకొని జీవితాన్ని గడపాల్సి వచ్చేది.. అలా గడిపి.. గడిపి.. బాధతో కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా మరణించి ఉండేదానివి. కథ అక్కడితో ముగిసిపోయి ఉండేది.
అయితే ఒక్క దెబ్బతో మొత్తం కథంతా మారిపోయింది. నా శరీరాన్ని నగరంలో ఏ మూలో పడేయలేదు. మొదట ఈవిన్‌ జైలులోను, ఇప్పుడు శ్మశానంలాంటి షరార్‌ ఈ రే జైలులోను ఉంచారు. అయితే ఈ విషయాలు వేటికీ నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదు. జీవితానికి మరణం ఒకటే ముగింపు కాదనే విషయం నీకు కూడా తెలుసు. ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను సంపాదించుకోవటానికి, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవటానికి, కొన్ని బాధ్యతలు నెరవేర్చటానికి వస్తాడని నువ్వు నాకు చెప్పేదానివి. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు మనం పోరాడాల్సి వస్తుందనే విషయాన్ని నేను నేర్చుకున్నా. నన్ను ఒక వ్యక్తి కొరడాతో కొట్టినప్పుడు అక్కడే ఉన్న మరొక వ్యక్తి ప్రతిఘటించాడు. అతనిని కూడా కొరడాతో కొడితే ఆ దెబ్బలకు అతను మరణించాడని నువ్వు నాకు చెప్పావు. ఒక వ్యక్తి చనిపోయినా పర్వాలేదు.. కానీ ఈ మరణం వెనకున్న కారణం, దానికున్న విలువ గురించి అందరికీ తెలియాలి.
స్కూలుకు వెళ్లినప్పుడు, దెబ్బలాటలు వస్తాయని.. ఫిర్యాదులు చేస్తూ ఉంటారని- వాటిని మనం ఎదుర్కోవాలని నువ్వు చెబుతూ ఉండేదానివి. మా ప్రవర్తనకు నువ్వు ఎంత ప్రాధాన్యం ఇచ్చేదానివో గుర్తుందా? అయితే నీ అనుభవం తప్పు. నన్ను ఒక వ్యక్తి రేప్‌ చేయటానికి ప్రయత్నించినప్పుడు నీ పాఠాలేమి పనిచేయలేదు. కోర్టులో హంతకురాలిగా చిత్రీకరించినప్పుడు అవి నన్ను కాపాడలేదు. కోర్టులో నన్ను ఒక హంతకురాలిగా చిత్రీకరించారు. నేను కోర్టులో ఏడ్వలేదు. నన్ను క్షమించమని ప్రాధేయపడలేదు. నేను న్యాయాన్ని నమ్మాను. అందుకే ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చలేదు. నేను ఎప్పుడూ దోమలను కూడా చంపలేదని నీకు తెలుసు. బొద్దింకలను కూడా వాటి మీసాలు పట్టుకొని బయటపడేసేదాన్ని. అంతే తప్ప చంపేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ఒక కరుడుకట్టిన హంతకురాలిని అయిపోయాను. నాపై రకరకాల ఆరోపణలు మోపారు. న్యాయమూర్తుల దగ్గర నుంచి న్యాయం ఆశించటం కూడా ఆశావాద థృక్పథమేమో అనిపిస్తుంది. న్యాయమూర్తి నన్ను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నన్ను ఇంటరాగేషన్‌ సమయంలో కొడుతున్నప్పుడు.. అత్యంత హీనంగా దుర్భాషలాడుతున్నప్పుడు ఎవ్వరూ నా వైపు మాట్లాడలేదు. నా అందానికి చిహ్నంగా నేను భావించే జుట్టును తీసేసి గుండు చేయించినప్పుడు నాకు దక్కిన బహుమానం ఏమిటో తెలుసా- జైలులో 11 రోజుల ఏకాంత నిర్భందం.
ఇదంతా వింటూ నువ్వు ఏడవకు. మొదటి రోజు పోలీసు ఆఫీసులో ఒక పెళ్లికాని ముసలి పోలీసు నా గోళ్లను విరిచేశాడు. అప్పుడు అందాన్ని ఇక్కడ హర్షించరనే విషయం అర్థమయింది. ఒక అందమైన ఆకృతి, అందమైన ఆలోచన, అందమైన భావన, అందమైన రాత, అందమైన చూపు, అందమైన గొంతు- వీటి వేటికి ఇక్కడ విలువ లేదు. అమ్మా, నా ఆలోచనా విధానం మారిపోయిందేమిటా అనుకోకు. దానికి నువ్వు బాధ్యురాలివి కావు. నా మనసులోంచి అనేక మాటలు ప్రవాహంలా వస్తున్నాయి. నువ్వు లేకుండా, నీకు తెలియకుండా నన్ను ఉరితీసినప్పుడు- నా జ్ఞాపకాలుగా నీకు మిగిలేవి ఈ మాటలే. నేను మరణించే ముందు నాదో కోరిక.. నీ శక్తిమేరకు దాని కోసం ప్రయత్నించు. నేను నిన్ను, ఈ దేశాన్ని కోరేది ఇదొక్కటే. దీనిని సాధించాలంటే కొంత సమయం పడుతుందని నాకు తెలుసు. అమ్మా.. ఏడవకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక విల్లు రాయాలనుకుంటున్నా. జైలులో ఉత్తరం రాయాలన్నా అధికారి అనుమతి కావాలి. అందువల్ల నువ్వు కోర్టుకు వెళ్లి నా తరపున అభ్యర్థనను వారి ముందు ఉంచు. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావనే భావనే నన్ను ఇబ్బంది పెడుతోంది. అమ్మా.. నేను నిన్ను అభ్యర్థించేది ఇది ఒక్కటే. కోర్టులో నాకు శిక్ష వేయవద్దని న్యాయమూర్తులను అభ్యర్థించమని చాలా సార్లు చెప్పావు. కానీ నేను అంగీకరించలేదు. కానీ నా ఈ చివరి అభ్యర్థనను మాత్రం నువ్వు మన్నించాలి. అమ్మా.. నువ్వు నాకు నా జీవితం కన్నా ఎక్కువ. అందుకే నువ్వు నాకీ పని చేసిపెట్టాలి. మరణించిన తర్వాత నా శరీరం మట్టిలో కలిసిపోకూడదు. నా అందమైన కళ్లు, చలాకీగా పనిచేసే నా గుండె ఎందుకూ పనికిరాకుండా పోకూడదు. అందువల్ల- నన్ను ఉరితీసిన వెంటనే నా గుండె, కాలేయం, కళ్లు- ఇలా- అవయవ మార్పిడికి పనికొచ్చే అవయవాలన్నింటినీ ఈ ప్రపంచానికి నా బహుమతిగా ఇచ్చేయండి. అవి అమర్చిన వారికి నా పేరు తెలియనివ్వకండి. అంతే కాదు. నాకు నువ్వు సమాధి కట్టద్దు. దాని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. నా కోసం నువ్వు నల్లబట్టలు వేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను కష్టపడిన రోజులన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించు.
ఈ ప్రపంచం మనల్ని ప్రేమించలేదు. అందుకే నేను మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నాను. భగవంతుడి న్యాయస్థానంలో- నన్ను కొట్టినందుకు ఇన్‌స్పెక్టర్‌ షామోలపైన, అతనిని నివారించలేకపోయినందుకు సుప్రీం కోర్టు జడ్జీలపైన కేసు పెడతాను. అదే కోర్టులో నా హక్కులను హరించినందుకు డాక్టర్‌ ఫార్వాడిపైన, ఖాసీం షబానీపైన కేసులు పెడతాను. కొన్ని సార్లు మనం నిజమనుకున్నదంతా నిజం కాదు. అమ్మా.. ఆ సృష్టికర్త ప్రపంచంలో నువ్వు నేను ఒకటి. మనం ముద్దాయిలం కాదు. మనపై ఫిర్యాదులు చేసిన వారందరూ ముద్దాయిలు. భగవంతుడు ఏం చేస్తాడో అప్పుడు చూద్దాం.. నేను మరణించేదాకా నిన్ను కౌగిలించుకోవాలని ఉంది. ఐ లవ్‌ యూ..
ఇట్లు…
నీ రెహనా
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు

నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని తీర్ధుల వారు రాశారు .శ్రీకృష్ణుని చరిత్రకావ్యం ఇది .రుక్మిణీ కల్యాణం వరకు ఇందులో ఉంది .పన్నెండు తరంగాలున్నాయి .శ్లోకాలు సంగీతాత్మకం గా నాద వినోదాన్ని చేకూరుస్తాయి .సంగీత నాట్య శాస్త్రాలలో నిధి .చిన్నతనం లోనే సన్యాసి అయి భక్తీ సామ్రాజ్యాన్ని పాలించాడు .ముప్ఫై నాలుగు ప్రసిద్ధ రాగాలను ఉపయోగించాడు .త్రిపుట ,అది జంప ,ఏకఅట తాళాలను ఉపయోగించారు .హ్గాద్యం పద్యం మహా హృదయం గా రాశారు తీర్ధులు .అనుష్టుప్ భుజంగ ప్రయాతం ఆర్యా వసంత తిలక పృథ్వి వృత్తాలు విరివిగా వాడారు .పదాల లాగా పాడుతుంటారు .నాట్యం చేస్తూ అభినయించే వీలు ఉన్న తరంగాలు .ఆంద్ర దేశం లో బాగా ప్రచారం లో నారాయణ తీర్ధుల తరంగాలు ఉన్నాయి .లీలా తరంగిణి లో పన్నెండునూట యాభై పాటలు ,మూడు వందల రెండు శ్లోకాలు ,ముప్ఫై ఒక్క చూర్నికలు ఉన్నాయి . తరంగాలు ,తీర్ధుల వారు ‘’హరి భక్తీ సుదార్నవం ‘’అనే మరో రచనా చేశారు భాగవత దశమ స్కంద ఇతి వృత్తం .మొత్తం పదిహేను రచనలు చేశారు బెనారస్ హిందూ యూని వర్సిటిలో అవి లభ్యమవుతాయి .

72   ‘’నాయన ‘-’-కావ్య కంఠ వాసిష్ట గణపతి

రమణ మహర్షి చేత’’ నాయన ‘’అని పించుకొన్న మహా భక్తుడు, దేశ భక్తుడు అయిన అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి .విద్వత్తు వలన పొందిన బిరుదే వాశిష్ట గణపతి .ఉత్తరాంధ్ర దేశం లో బొబ్బిలి దగ్గర కలువ రాయి లో 1878లో జన్మించారు ,పండిత కుటుంబం .పడవ ఏటనే ‘’పాండవ దార్త రాష్ట్ర సంభవ ‘’అనే ఖండకావ్యం రాసిన ప్రతిభా శాలి .వ్యాకరణం జ్యోతిషం ,ఆయుర్వేద దర్శన  విద్యల్లో మహా పండితుడు .మహా మంత్రం శాస్త్ర వేత్త .ఇంద్రాణీ సప్త స్తుతి ,చండీత్రిశతి ,వివిధ చందస్సులతో రాసిన ‘’ఉమా సహస్రం ‘’మొదలైన సంస్కృత కావ్యాలు రాశారు. మహా ఉపాసకులు .విశ్వ మీమాంస ,సదా చార బోధిని ,గాయత్రి వ్యాఖ్యానం రాశారు ‘’పూర్ణ ‘’నవలను సంస్కృతం లో రాశారు .మొత్తం మీద డెబ్భై అయిదుకు పైగా రచనలు చేశారు .గణపతి మునిగా ప్రసిద్ధులు .ఆత్మా విచారం లో అద్వితీయంగా ముందడుగు వేశారు భారత స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు .

73కావ్య శాస్త్ర కర్త–హేమ చంద్రా చార్యుడు

పదకొండవ శతాబ్దికి చెందిన వాడు హేమ చంద్రుడు .కవి ,వ్యాకరణ వేత్త ,అలంకారికుడు గుజరాతు రాజు ‘’అన్హిల వాడ చాళుక్య రాజు కుమార పాలుడి చరిత్రను ‘’కుమార పాల చరిత్ర’కావ్యం ’గా రాశాడు .సంస్కృత ,ప్రాకృత వ్యాకరణాలను రచించాడు .కుమార చరిత్ర ఇరవై ఎనిమిది సర్గల కావ్యం .మొదటి ఇరవై స్సంస్క్రుతం లో మిగిలిన ఎనిమిది సర్గలు ప్రాకృతం లో రాసిన సవ్య సాచి .ఇందులోతన వ్యాకరణ పాండిత్యాన్ని అంతా గుప్పించాడు .అందుకే ఇది కావ్య శాస్త్రం అయింది ..ద్వాశ్రయం  ‘’అన్నారు .ఈ కావ్యం లో సంస్కృత భాగానికి ‘’అభయ తిలక గణి’’వ్యాఖ్యానం రాస్తే ప్రాకృత భాగానికి ‘’పూర్ణ కలశ గణి’’వ్యాఖ్యానం చేశాడు కావ్యం వీర రస ప్రధానం .ఒక సర్గ అంతా రాత్రినే వర్ణించటం విశేషం .సోమనాధజ్యోతిర్లింగ మహా భక్తుడు కవి .జైన హిందూమత సామరస్యాన్ని గుజరాత్ లో సాధించిన ఘనత హేమ చంద్రుడిది .

హేమ చంద్రుని విజ్ఞానం అపారమైనది .అతని శబ్ద భాండారం అంతులేనిది .కొత్త కొత్త శబ్దాలను సృష్టించి ప్రయోగించి గౌడీ రీతిలో కావ్యాన్ని రాశాడు .వ్యాకరణాన్ని కావ్య లక్షణాలపై జోడు గుర్రాల సవారీని సమర్ధ వంతం గా చేసి సుభాష్ అని పించుకొన్నాడు .అన్ని రకాల అలంకారాలు వాడాడు .చాళుక్యులు మూడు వందల ఏళ్ళు గుజరాతు లోని కదియ వాడును పాలించారు .చాళుక్య మూల పురుషుడడి తో ప్రారంభించి కుమార పాలుని చరిత్ర తో ముగించాడు .కుమారుడు  ముసలి సలితనం లో హేమ చంద్రుని ప్రోద్బలం తో జైన మతాన్ని స్వీకరించటం తో ముగింపు పలికాడు  .రాజు  జీవించి ఉండగానే  హేమ చంద్రా చార్యుడు 1172 లో మరణించాడు . .

74-పృధ్వీ రాజ చరిత్ర కర్త-జయాంకుడు

అజ్మీరు ధిల్లీ రాజ్యాలను పరిపాలించిన పృధ్వీ రాజ్ చోహన్ చరిత్రను కావ్యం  రాసిన వాడు జయాంకుడు .కాశ్మీర దేశం లో శిధిలావస్థ లో ఉన్న ఈ కావ్యాన్ని ‘’బ్యూలర్’’కనుగోన్నాడు . అసం పూర్తీ కావ్యమే .పన్నెండు సర్గలున్నాయి .పృధ్వీ రాజు మహమ్మదీయ రాజులను జయించే వృత్తాంతం తో బాటు ఆయన పట్టాభిషేకం ఉంటుంది .జయాంకుడు  పృధ్వీ రాజు ఆస్థాన కవి .కనుక కాశ్మీరీ అని అనుకో వచ్చు .బిల్హనుడి శైలితో రాసిన కావ్యం ఇది జాన రాజు అనే కాశ్మీర కవి దీనికి  వ్యాఖ్యానం రాశాడు .1193కు పూర్వమే కావ్యాన్ని రాశాడు .కారణం 1191లో పృధ్వీ రాజు షహబుద్దీన్ ఘోరిని ఓడిస్తే 1193లో గోరీ ఇతన్ని ఓడించి చంపాడు .

కవితా జయాంకం

జయాంకుడి కి వేద,పురాణ ,మహా కావ్య ,న్యాయ ,వ్యాకరణ జ్యోతిస్శాస్త్రాలలో నిష్ణాతుడు .కావ్యం లో రామాయణ మహా భారత గాధలను ఉటం కించాడు  .పూర్వ కవుల ప్రభావం బాగా ఉన్న వాడు .పాంచాలీ గౌడీ రీతుల్లో అలంకార యుక్తం గా కావ్యం రాశాడు .చౌహాన్ రాజ వంశ చరిత్ర గురించి తెలియ జెప్పే చారిత్రిక కావ్యం ఇది ఈ వంశం లో పృధ్వీ రాజు మూడవ రాజు .అవి ఇతన్ని విష్ణువు అంశం గా భావించాడు .చివరీ ఘోరీతో జరిగిన యుద్ధ ప్రస్తావన ఇందులో లేక పోవటం ఆశ్చర్యమే .

75- హోయసల రాజ చరిత్ర రాసిన -సకల విద్యాచక్ర వర్తి

కర్నాటక  హోసల రాజు రెండవ నరసింహ సోమేశ్వరుని ఆస్థాన కవి ‘’సకల విద్యా చక్ర వర్తి ‘’.ఇది అతని పాండిత్యానికి పొందిన బిరుదు .ఇతడిని రెండవ విద్యా చక్ర వర్తి గా గుర్తించారు .మూడవ చక్ర వర్తి రుయ్యకుడి అలంకార సర్వస్వ గ్రంధానికి సంజీవిని టీక రాశాడు .మనకవి గద్యం లో ‘’గద్య కర్ణామృతం ‘’రాశాడు .హోయసల వంశ రాజుల చరిత్రను ఆవిష్కరించే గ్రంధం ఇది .చారిత్రిక సత్య సమన్వితం .హోయసల రాజులకు చాళుక్య రాజులకు మధ్య జరిగిన యుద్ధాల వివరాలున్నాయి .సోమేశ్వర రాజు  చాళుక్య రాకుమారి దేవిక ను పెళ్లి చేసుకోవటం ముఖ్య వృత్తాంతం .బాణుడు రాసిన హర్ష చరిత్రను  స్పూర్తిగా దీన్ని రాశాడు .ఇందులో శైలి అర్ధ పౌరాణికం అర్ధ ఐతిహాసిం . వాల్మీకి కాళిదాసాదుల ధోరణిలోకావ్యం రాశాడు  .

76- హమ్మీర చరిత్ర కర్త-నయ చంద్ర సూరి

చౌహాన్ రాజు ‘’హమ్మీరు’’ని చరిత్రను ‘’హమ్మీర కావ్యం ‘’రాశాడు సూరి .జయ సింహ సూరి మనవడు .ఇది 1456లో రాసిన కావ్యం .తండ్రి జయ సింహ సూరి ‘’హమ్మీరమద మర్దనం ‘’అనే నాటకాన్ని రాశాడు .దీనిలో వస్తుపాల ,తేజ పాల చరిత్రలున్నాయి .పద్నాలుగు సర్గల కావ్యం ..అవి మహా పండితుడు. శాస్త్రాలన్నీ నేర్చి పండిపోయి సూరి అయ్యాడు రాజనీతి యుద్ధ రీతి తెలిసిన వాడు .వైదర్భీరీతిలో ప్రసన్న మాధుర్యం గా రాశాడు జలక్రీడలు యుద్ధాలు ఋతువులు వర్ణించాడు అపహ్నుతి ,యమా అలంకారాలను సందర్భాన్ని బట్టి వాడాడు .వీర రస ప్రధాన కావ్యం .అల్లాఉద్దీన్ తన సైన్యాలను హంమీరుడి సోదరుడి మీదకు పంపితే వారు అతన్ని ఓడిస్తే రాజు స్వయంగా యుద్ధానీకి దిగాడు . అతని సైనికులే నమ్మక ద్రోహం చేశారు .తెలిసిన హమ్మీరుడు రాణి వాస స్త్రీలను అగ్ని ప్రవేశం చేయమని కబురు చేసి ఘోర యుద్ధం లో పాల్గొని ప్రాణాలు వదిలి వీర మరణం పొందాడు .ఇది పదమూడవ సర్గలో వర్ణించాడు .పద్నాలుగవ సర్గలో హంమీర పరాక్రమాన్ని వంశ చరిత్రను రాసి కావ్యాన్ని ముగించాడు .

77-రాణికవయిత్రి -గంగా దేవి

విజయ నగర రాజు రెండవ బుక్క రాయల రెండవ కొడుకు కంపరాయల భార్య గంగా దేవి .1361-1374లో యువరాజుగా ఉన్నాడు .మధురమీద దాడి చేసి తురుష్కులను ఓడించి1371లో  విజయం సాధించాడు .ఈ ఇతి వృత్తాన్ని తీసుకుని గంగా దేవి ‘’మధురా విజయం ‘’కావ్యం సంస్కృతం లో రాసింది .దీనికి  ‘’వీరకంప రాయ చరిత్ర ‘’అనే పేరూ ఉంది .ఏడవ సర్గలో తానూ కంపరాయల భార్యనని చెప్పుకొన్నది .

కవితా గంగాలహరి

విదుషీమణి అయిన గంగాదేవి కావ్యాల అధ్యాయాన్ని క్షుణ్ణం గా  చేసింది .ఆ ప్రభావం కావ్యం మీద ప్రసరించింది .తెలుగు సాహిత్యం తో పరిచయం కూడా బాగా ఉన్నట్లు గోచరిస్తుంది .ఇది కూడా వీరరస కావ్యం .పుర ఋతు ,జలక్రీడ ,సూర్యాస్తమయ ,చంద్రోదయాలను కావ్య రీతిలో వర్ణించింది .అయిదవ సర్గ వర్ణనా మయం .గణేశ ప్రార్ధన చేసి కావ్యం ప్రారంభించి మిగిలిన దేవతలనూ స్తుతించింది .ముఖ్యం గా ‘’క్రియా శక్తిని ‘’ ని వర్ణించటం విశేషం .ప్రతి సర్గ లో రాబోయే సర్గలోని విషయాలను చెప్పింది .

మొదటి సర్గలో విజయ నగర వర్ణనను సహజ సుందరం గా చేసింది .కావ్యం లో వైదర్భీరీతి కనిపిస్తుంది .భాష పరిపక్వం గా ఉంటుంది ,

‘’హిమ భర విహతః కమలా కరో మృదిత కాంతి రభూన్మ్రుగ లామ్చనః-వాదన మేవ నరేంద్ర నాథ భ్రువాను భజత శ్రియమ ప్రతి శాసనః ‘’అని వసంత రుతువును గంగా దేవి వర్ణించింది –భావం –కమలాలు మంచుతో కప్పు బడ్డాయి చంద్రుడుకాంతి  పోగొట్టు కొన్నాడు .రాజు గారి ప్రియురాలు ముహం ఒక్కటే కాంతి తో ఉంది ‘’అలాగే సూర్యస్తమయాన్నీ మనోహరం గా వర్ణిస్తుంది –

‘’ప్రతి బింబ పరం పరామ్బుదే పవనోద్భూత తరంగా సంగినః –నభాసో వాతారిష్య తో  రవేర్మణిసోపాన ధియం వ్యభావయత్ ‘’-అంటే ఆఆశం నుంచి దిగుతూ ఉన్న సూర్యుడి నిశ్చలమైన బింబం కదిలే అలల్లో ప్రతి బిమ్బిమ్చి రత్నాల మెట్లు లాగా ఉంది ‘’.క్లిష్టం అనేది లేని కవిత్వం రాసింది .

కంపరాయలు ఉదయగిరికి రాజుగా ఉండేవాడు .తండ్రి బుక్క రాయల కంటే ముందే కంపరాయలు చని పోవటం తో విజయ నగర ప్రభువు కాలేక  పోయాడు  బుక్క కు చాలా మంది రాణులుఉన్నా గంగా దేవి  కంపరాయల తల్లిని మాత్రమె పేర్కొంది .కంపరాయలు రెండవ కంపరాయలుగా పేరొందాడు .మహా మండలేశ్వరుడు అనే బిరుదు ఉంది యుద్ధ కళల లోనే కాదు లలిత కళల్లోనూ మంచి ప్రవేశం ఉన్న వాడు .తండ్రి బుక్క రాయల అనుమతితో మధుర , తుండీర రాజ్యాలను జయించి వాటిని తురుష్కులఅధీనం నుండి విముక్తి చేసిన శౌర్య శాలి .ఇక్కడే కొంతకాలం ‘’మరకత నగరం ‘’రాజ దానిగా చేసుకుని మూడేళ్ళు పరిపాలన చేస్తూ పరిస్తితుల్ని చక్క బరచాడు .1374లో అతడొక్కడే పాలన చేసి నట్లు శాసన  ఆధారాలాలున్నాయి .హిందూమత పునద్ధరణకు కంప రాయలు చేసిన సేవలు చరిత్ర ప్రసిద్ధాలు 1371లో కంపరాయలు మధుర ,శ్రీరంగా పట్నాలను లొబరచుకుని తురుష్కులను పార ద్రోలాడు .ఈ చారిత్రక సంఘటనలను గంగా దేవి తన మధురా విజయం కావ్యం లో కమనీయం గా ఆవిష్కరిం చింది .కనుక ఈ  కావ్య కాలం 1371-1374అని భావింప వచ్చు .

78-కంచు ఢక్కల-గౌడ డిండిమ భట్ట కవి సార్వ భౌముడు

విజయ నగర రాజు రెండవ ప్రౌఢ దేవా రాయల ఆస్థానం లో డిండిమ భట్టు ఆస్థానకవి .అరుణ గిరి కుమారుడు .ఈ డిండిమపండితుడినే శ్రీనాధుడు వాదం లో ఓడించి అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు .దీనితో కవి సార్వ భౌముడు అనే తనకున్న బిరుదాన్నికోల్పోయి శ్రీనాధుడికి అప్పగించాడు .డిండిమ వంశం లో వారందరికీ కవి సార్వ భౌమ,డిండిమ  బిరుదు ఉండేది .సాల్వ నరసింహ రాయలు చరిత్రను రాజనాధుడు అనేకవి ‘’సాళువాభ్యుదయం ‘’అనే కావ్యం గా రాశాడు .సాల్వ నరసింహ రాయలు 1486లో విజయనగర రాజు కాని సాల్వాభ్యుదయం లో ఎక్కడా ఈమాట చెప్పబడలేదు. చంద్రగిరి రాజు అనే  ఉంది .కనుక ఈ కావ్యం అతడు మహా మండలేశ్వరుడుగా ఉన్నప్పుడే 1486లో రాయబడింది. ఈ కావ్యం ప్రచురితం కాలేదు .ఇందులో పదమూడు సర్గ లున్నాయి .

ఈ కావ్యం లో నరసింహ దేవరాయల యుద్ధాలు ధర్మ కార్యాలూ ఉదాత్తం గా వర్ణించ బడ్డాయి .సుందర కావ్య శైలి ఉంది .నరసింహ రాయలు సంస్కృతాంధ్రాల ను పోషించాడు .మూడు నుంచి ఏడు సర్గల దాకా అతని విజయాలు ,ఎనిమిదిలో వేట ,పదిలో ఋతు వర్ణనలు ,పదకొండులో  శివరాత్రి ఉత్సవాలు పన్నెండులో రాజ దానికి రావటం ,పదమూడవ సర్గలో దాన ధర్మాలు ,సాహిత్య పోషణ ఉన్నాయి .

మరోకవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-14-g

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేవతి రాసిన ”ఒక హిజ్రా ఆత్మకథ” పుస్తకంపై చర్చ-హైదరాబాద్ బుక్ ట్రస్ట్

http://hyderabadbooktrust.blogspot.in/Pamphlet

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నంపెట్టే చేతులు..

అన్నంపెట్టే చేతులు..

రోజూ బడికి వెళ్లే పిల్లలకు ఒక పూట వండి పెట్టడానికే ఎన్నో అవస్థలు పడతాం. అదే ప్రతి రోజు మధ్యాహ్నం బడి గంట కొట్టగానే – ప్రతి పిల్లాడి ముందు వేడి వేడి భోజనం సిద్ధం చేయడమంటే మాటలు కాదు. ఒక రోజు వండిన వంటను మరుసటి రోజు వండకుండా పద్దెనిమిది రకాల మెనూలతో పన్నెండువేల మందికి తిండి పెడుతోంది బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్ట్‌.. 
తలు గ్రామానికో, మండలానికో మహా అయితే జిల్లా వ్యాప్తంగానో సేవలందించడం మనం చూస్తూ ఉంటాం. కాని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులోని శ్రీ బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ తమ సేవలకు ఎల్లలు హద్దుకావని నిరూపించింది. పశ్చిమ ఆఫ్రికాలో సేవలను విస్తృతం చేసింది. ఈ స్థాయికి ఎదిగిన ట్రస్టుకు ప్రాణం పోసిన వ్యక్తి బుధ్ధవరపు వెంకట్రావు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు శ్రీనివాస నాగేశ్వర కుమార్‌ ట్రస్ట్‌ సేవలను ముమ్మరం చేశారు. మొదట్లో వైద్యశిబిరాలు పెట్టేదీ ట్రస్టు. ఆ తర్వాత – ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి సారించింది. పాఠశాల ఆవరణలోనే వండి వడ్డించే క్రమంలో కట్టెల పొయ్యలతో విద్యార్థులు పడుతున్న అవస్ధలను గుర్తించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని ఇచ్చేందుకు సంకల్పించింది. దీనితో పొలమూరులోనే అత్యాధునిక పరికరాలతో ఒక వంటశాలను నిర్మించారు. దీంతో పరిశుభ్రమైన వాతావరణంలో తిండిని వండేందుకు వీలవుతోంది. ప్రస్తుతం అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాలలోని 145 పాఠశాలల్లో సుమారు 12,500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. మండలాన్ని మూడు గ్రూపులుగా విభజించి పది ఆటోల ద్వారా సమయానికి ఆహారం సరఫరా చేయడం ట్రస్ట్‌ ప్రత్యేకత. ’’ ప్రభుత్వం ఒకో విద్యార్థికి సగటున ఐదు రూపాయల దాకా ఇస్తుంది. ఐదు రూపాయలతో భోజనం పెట్టడం దాదాపు అసాధ్యం. మిగిలిన వ్యయాన్ని మేమే భరిస్తున్నాం. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే ఇంకా ఎక్కువ మందికి ఆహారం అందించవచ్చు.’’ అని ట్రస్ట్‌ ఛైర్మన్‌ బుద్ధవరపు వెంకట్రావు వెల్లడించారు. అయితే మధ్యాహ్న భోజన సరఫరాకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటికీ ట్రస్టుకు ఇవ్వడం లేదు. అయినా సరే విద్యార్థుల కడుపులు మాడకూడదన్న ఉద్దేశ్యంతో పొయ్యి వెలిగిస్తూనే ఉన్నారు ట్రస్టు నిర్వాహకులు. మధ్యాహ్న భోజనానికి తమిళనాడులో అయితే మన దగ్గర కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. వంటగది, పాత్రలను సైతం ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది. కేంద్రప్రభుత్వం కూడా పిల్లల భోజనాలకు నిధులు చెల్లిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అంత చొరవ చూపకపోవటం వల్ల చాలా ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలుకావటం లేదు.
పర్యావరణ పరిరక్షణకు..
ప్రతి నెల పౌర్ణమి రోజున రాజమండ్రిలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ట్రస్ట్‌ నిర్వహిస్తుంది. హారతికి మన సంప్రదాయంలో ఒక విశిష్టత ఉంది. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. ఒక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కూడా. ఇప్పటి దాకా నాలుగేళ్లుగా ఈ హారతిని నిర్వహిస్తున్నాం. రెండు అధికమాసాలతో కలిపి వచ్చే నెల ఆరవ తేదీ వచ్చే కార్తిక పౌర్ణమికి 50 హారతులు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం..’’ అని ట్రస్టీ కుమార్‌ వెల్లడించారు. స్వచ్ఛ గోదావరి అనే నినాదంతో గోదావరి ప్రక్షాళన తమ ప్రధానోద్దేశమని వివరించారు. ’’ఒకప్పుడు గోదావరికి ఏడు పాయలు ఉండేవని చెబుతారు. వాటిలో ఇప్పటికే రెండు కనుమరుగైపోయాయి. మిగిలిన వాటిలో కొన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకొని మురుగు కాలవలుగా మారిపోయాయి. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్‌ తరాల వారికి ఇవి కూడా మిగలవు..’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫ్రికాలోను సేవలు..
దేశంలోనే కాకుండా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కూడా బుద్దవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలను విస్తరించింది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ట్రస్ట్‌ ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం అక్కడ పేదలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తుంది. గినియాలో వాటర్‌ ప్లాంట్‌ నిర్మించి అక్కడి ప్రజలకు స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తున్నారు. మన దేశం మాదిరిగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం ఏర్పాటు చేసి చిన్నారుల ఆకలి తీరుస్తోంది సంస్థ. అక్కడి ప్రజలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణనిస్తూ వారి జీవనోపాధికి బంగారు బాటలు వేస్తోంది.
(ట్రస్ట్‌ ఫోన్‌ నెంబర్‌- 9391984999) కర్రి శ్రీనివాసరెడ్డి, అనపర్తి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

kareem nagar gandhi -vishva bandhu -boyinapalli ramrao

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -57 63- స్వభావోక్తికవయిత్రి మురళ

గీర్వాణ కవితా గీర్వాణం -57

63-  స్వభావోక్తికవయిత్రి మురళ

మురళ అనే కవయిత్రిపేరు బిల్హనుడి సూక్తి ముక్తావళి లో ,శార్జ్న రాసిన పద్ధతిలో చోటు చేసు కొన్నది .ఒక శ్లోకం లో విరహం ,మరోశ్లోకం లో కలయిక వర్ణించింది సుందర సరళ సులభ శైలి లో కవిత్వం రాసింది .స్వభావోక్తికి పట్టం కట్టింది .ఈ శ్లోకాలను బట్టి ఆమె ప్రసిద్ధ కవయిత్రి అనే అభిప్రాయం కలుగుతుంది .ప్రసిద్ధ కవయిత్రుల పేర్లలో మురళ పేరును ధనాద దేవుడు పేర్కొనటం గమనార్ధం .కాలం సుమారు పదిహేను వందలు .

‘’శీలా విజ్ఞామారుళా మొరికాద్యాః –కావ్యం కర్తుం శాంతి విజ్ఞాః ప్రియ్యోసి

విడ్యాం వేట్టుం వాదినో నిర్వి జేతుం –దాతుం వక్తుం యః ప్రవీణః నవంద్య’’

64-ప్రణయ కవయిత్రి -మోరిక

ధన దేవుడు మెచ్చిన మరోకవయిత్రి మోరిక . ఈమె శ్లోకాలలో ప్రణయం ముఖ్య ఇతి వృత్తం .పైన తెలుసుకొన్న కవయిత్రి మురళ తో సమానమైన పాండిత్యం కవిత్వం ఉన్న మహిళ. పదిహేను వందలు కాలానికే చెందింది .

65-  లీలాశుకుడనే -బిల్వ మంగళుడు

పదకొండవ శతాబ్దానికి చెందినా బిల్వ మంగళుడు శ్రీ కృష్ణ కర్ణామృతం రాశాడు .శ్రీకృష్ణ గానం చేసిన చిలుక కనుక లీలా శుకుడు అయ్యాడు .ఇందులో మూడు వందల పది శ్లోకాలున్నాయి .భక్తీ రసం పొంగిపోరలేట్లు రాసినకవ్యం ఇది శ్రీకృష్ణ భక్తీ పరాకాష్టగా చెప్పాడు లీలాశుకుడు .మూడు ఆశ్వాసాలున్నాయి .ఒక్కోదానిలో నూటపది శ్లోకాలున్నాయి .మొదటిదానిలో శ్రీ కృష్ణ  సాక్షాత్కారం ,రెండవ దానిలో కృష్ణ లీలలు ,మూడు కృష్ణుని జీవితం లో అనేక మధుర ఘట్టాలున్నాయి .నిత్య పారాయణ గ్రంధం గా గొప్ప వ్యాప్తి ఉన్నది .భక్తీ తప్ప శృంగారానికి చోటు కల్పించలేదు .జయదేవుడే లీలాశుకుడు అయ్యాడనే ప్రచారం ఉంది .చింతామణి అనే వేశ్య తో బిల్వమంగళుడు ఉండేవాడు .ఒకసారి పెద్ద గాలి వానలో ఆమెను కలుసుకోవటానికి పెరటి గోడ ఎక్కుతూ తాడు అనుకోని పామును పట్టుకొన్నాడు .జ్ఞానోదయమై లీలాశుకుడుగా మారాడు .’’కస్తూరీ తిలకం లలాట ఫాలకే ‘’శ్లోకం రాణి వారుండరు .అది లీలాశుకుని శ్లోకమే .కర్నామ్రుతాన్ని రాగామాలికలలో సభల్లో గానం చేస్తారు .ఈయన కృష్ణా జిల్లాకు చెందినవాడే అంటారు .శ్లోకాలన్నీ ముక్తక రూపం లో ఉండటం ప్రత్యేకత దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది .కృష్ణుడు గోప బాలకుడుగా ,గోపా బాలకుల స్నేహితుడుగా ,లోకోత్తరశృంగార పురుశోత్తముడుగా ఇందులో దర్శన మిస్తాడు .

‘’చింతా మణిర్జయతి సోమ గురుర్మే-శిక్షా గురుశ్చభగవాన్ శిఖి  పించమౌళిః

యత్పాదకల్ప తరు పల్లవ శేఖ రేషు –లీలాస్వయం వర రసం లభతే జయశ్రీ ‘’

అనంత పద్మనాభ స్వామి ని మొదట దర్శించిన వాడు బిల్వ మంగళ రుషియే.కర్ణామృతం కాక శ్రీ చిహ్నం ,పురుష కారం ,అభినవ కౌస్తుభ మాల ,దక్షిణా మూర్తి స్తవం ,కాలవధ కావ్యం ,దుర్గా స్తుతి , బాల కృష్ణ స్తోత్రం ,బాల గోపాల స్తుతి ,శ్రీకృష్ణ వరదాస్టకం ,బృందావన స్తోత్రం ,భావన్నాముకురం ,రామ చంద్రాస్టకం ,గణపతి స్తోత్రం అనుభావాస్స్టకం ,మహా కాలాస్టకం,మహా లక్ష్మి సోత్రం ,కర్కోటక స్తోత్రం ,కృష్ణ లీలా వినోదం ,సాకార హృదయంగమంసుబంధ సామ్రాజ్యం ,తిన్ గంధ సామ్రాజ్యం ,క్రమ దీపిక మొదలైన ఇరవై రెండు గ్రంధాలు రచించాడు .కర్ణామృతం వింటూ శ్రీకృష్ణుడు టా ఊపే వాడని అంటారు .

66-  ఆర్యా సప్త శతి కర్త -గోవర్ధనా చార్యుడు

క్రీ శ.1116వాడిన గోవర్ధనా చార్యుడు లక్ష్మణ సేన మహా రాజు ఆస్థాన కవి .ప్రాకృత గాదా సప్త శాతిని అనుకరిస్తూ ‘’ఆర్యా సప్త శతి ‘’ని సంస్కృతం లో రాశాడు .ఇందులోనూ ఏడు వందల శ్లోకాలున్నాయి .ఇదికూడా ముక్తక కావ్యం .ప్రతి శ్లోకానికి ఒక కదా ఉంటుంది .ముక్తకాలలో గొప్ప పెరుపొందినడిది .జయదేవుడి ప్రస్తుతి పొందిన కవి గోవర్ధనుడు –‘’శృంగారోత్తర సత్ప్రమేయ రచనానైరాచార్య గోవర్ధన –స్పర్దీకో పి న విశ్రుతః శృతి దారో ధోయీ కవిక్ష్మా పతిః’’అంటూ జయదేవుడు ధోయీ ని గోవర్ధనుడిని పొగిడాడు .దోయి ఏక సంతాగ్రాహి గోవర్ధన్ శృంగారస పట్లు తెలిసిన వాడు ఇద్దరూ లక్ష్మణ సేనుని ఆస్థాన కవులే .

కవితా గోవర్ధనం

అప్పటిదాకా ప్రాకృతం లోనే ఉన్న ముక్తక సాహిత్యాన్ని సంస్కృతం లోకి ప్రవేశ పెట్టిన మొదటి వాడను తానె నని గోవర్ధనుడు చెప్పుకొన్నాడు –‘’వాణీ ప్రాకృత సముచిత రాసా బలేనైవ సంస్కృతం నీతా-నిమ్నాను రూప నీరా కాళింద కన్యేవ గగన తలం ‘’.దీని భావం –లోతులో ప్రవహిస్తున్న యమునా నదిని బలరాముడు గగన తలానికి చేర్చి నట్లు ప్రారుత పాతాళం లో ఉన్న రసమయ వానిని సంస్కృతం లో ప్రవేశ పెట్టాను అని కావ్యం మొదట్లో చెప్పాడు ..ఈ కావ్యం రాసి తాన సోదరు లిద్దరికీ నేర్పాడు వారు దీన్ని గొప్పగా ప్రచారం చేశారు ఆమాల పద విన్యాసం తో ఈ ముక్తకాలు ముత్యాల సొగసును వెదజల్లుతాయి .మనసుకు బాగా పట్టుకొనే సులభ సుందర ఆర్యా వృత్తాలలో వీటిని రాసి విపరీతమైన క్రేజ్ తెచ్చాడు .సజ్జన హృదయాలను అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి .మదన రూప బ్రహ్మ జ్ఞానానికి ఉపనిష్టుల లాంటివి అన్నారు వీటిని .

ఇందులో వివిధ రకాల నాయికల వర్ణన ఉంది ప్రేమ సంయోగం వియోగం ,ఈర్ష్య అసూయ ,శృంగారం అనునయం యదా ప్రకారం ఉన్నాయి రసవాది అనిపిస్తాడు –‘’రాతిరేవ వీత వాసనా ప్రిఎవ శుద్ధాపి వాజ్ముదే సరసా –అరసా సాలంక్రుతి రాపి ణ రోచతే శాల భంజీవ ‘’భావం రాతిలో వస్రాలను వదిలేసిననాయిక , ,నాయకుని అనన్య రతి భావం కల ప్రియురాలు లాగా అలంకారం లేని సరస వాని ఆనంద ప్రదం గా ఉంటుంది అలంకారాలతో ఉన్నా రస శూన్యం గా ఉన్న వాని అలంకారాలతో నిండిన సాల భంజిక లాగా రుచికరం గా ఉండదు ‘’.అనుప్రాసద్యలంకారం అంటే గోవార్ధనుడికి మహా ఇష్టం .దీనితో కావ్యాన్ని రస మాగ్నం చేసి మానసికానందాన్ని కల్గిస్తాడు .అలంకారం అంటే చాలు పులకిమ్చిపోతాడు .అన్యోక్తి అలమ్కారమూ చాలా   ఇస్టమైనదే .వ్యంగ్యార్ధం తోకావ్యాన్ని రస శోభా భరితం చేశాడు .

గోవర్ధనుడి లోక పరిశీలనాశక్తి గొప్పది మంచి లోక జ్ఞానం ఉన్నవాడు అతని శాస్త్ర పరిచయ జ్ఞానం దొడ్డది .రెండే పాదాలు ఉండే ఆర్యా ఛందస్సులో ఒక్కొక్కటి ఒక్కో కావ్య ఖండం గా తీర్చి దిద్దిన గొప్ప కవితా ప్రతిభ గోవర్ధనుడిది .రామనీయమియా వ్యంగ్యార్ధాలతో ప్రతి ముక్తకాన్ని ఒక మహా ముత్యం ళా మెరుగులు దిద్ది ప్రకాశమానం చేశాడు .ప్రాకృతం మీద మంచి గౌరవం కలిగిన వాడు .అందుకే గునాధ్యుడిని వ్యాస వాల్మీకి  అంతటి వాడు అని కీర్తించాడు .

ఒక సఖి ని చెలులు యెంత నచ్చ చెప్పినా ప్రియుడిని చేరలేదు విసుగెత్తి వాళ్ళు వెళ్ళిపోగా ప్రియుడు ఆమె చెంత చేరగా ఆమె అతనితో ‘’నా సఖులు  ‘చెప్పింది నేను వినలేదు .వాళ్ళు నన్నోడలి వెళ్ళిపోయారు .ఇప్పుడు నేను ఒంటరిని .నువ్వు నన్ను బలాత్కారించాలి అనుకొంటే ణా సర్వస్వం సమర్పించటానికి సిద్ధం గా ఉన్నాను ‘’అంటుంది =ఇడదేశ్లోకం లో ‘’అగ్రుహీతానునయాం మా ముపేక్ష్య సఖ్యోగతా బతైకాహం  -ప్రసభం కరోపిమఇ చేత్వదుపరి వపురద్య మొక్షామి ‘’ఇదొక సాంపిల్ మాత్రమె .కావ్యం లో అడుగడుగునా ఇలాంటివి కోకొల్లలు .జుర్రుకొనే ఓపిక ఉండాలికాని కావ్యం ఆపాతమధురమే .

67- భక్తికి శాస్త్రీయత కల్పించిన -మధు సూదన సరస్వతి

క్రీ శ పదహారవ శతాబ్దం వాడిన మధు సూడన సరస్వతి శ్రీ మహా విష్ణువు కు మహా భక్తుడు .విష్ణు మూర్తిని కేశాల దగ్గరనుండి పాదాల వరకు వర్ణిస్తూ ‘’ఆనంద మందాకినీ ‘’అనే కావ్యం రాశాడు దీన్ని స్తుతికావ్యం అంటారు .కోమలమైన భక్తీ  గొప్ప హ్రుదయాను భూతి ఇందులో ప్రత్రి శ్లోకం లో దర్శనం ఇస్తుంది మధుసూదనుడు’’ భక్తీ రసాయనం’’ అనే గ్రంధాన్ని రాశాడు .ఇందులో శాస్త్రీయ పద్ధతిలో భక్తిని అన్నికోనాలలోను చర్చించాడు .రూప గోస్వామి భక్తిని రసం గా చెప్పినా ,దానికి శాస్త్రీయతను కల్పించిన వాడు మధు సూడాన సరస్వతి మాత్రమె .ద్వైతం నుండి అద్వైతానికి ప్రయాణం చేశాడు .బెంగాలుకు చెందినా మధు సూదనుడి అసలు పేరు కమల నయనుడు .నవ్య న్యాయ సిద్ధాంతాన్ని చదివి ప్రచారం చేశాడు .వారణాసి చేరి సన్యాసిగా మారి అద్వైతాన్ని జేఎవితాన్తమ్ ప్రచారం చేశాడు .ఇరవైకి పైగా రచనలు చేశాడు అందులో కృష్ణ –కుతూహలం అనే నాటకం కూడా ఉంది .ఈశ్వర ప్రతిపత్తి ప్రకాశం ,భాగవత రసాయనం బాగా ప్రసిద్ధి చెందాయి .అక్బర్ చక్ర వర్తితో గొప్ప దోస్తీ ఉండేది .తులసీదాసు కు మంచి మిత్రుడు .

68- మౌలికత ఉన్న కవయిత్రి -గౌరీ

పది హేడవ శతాబ్దికి చెందినా గౌరీ రాసిన ఇరవై ఎనిమిది శ్లోకాలే దొరికాయి ఇందులో రాజనీతి ,యుద్ధం ,శత్రురాజుఅల్ విషయాలు దొర్లాయి .మౌలికత ఉన్న రచయిత్రి అనిపిస్తుంది .సహజ ధోరణిలో లలితమదురకవిత్వం రాసింది .

69- ప్రకృతి కవయిత్రి -పద్మావతి

పద్మావతి కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినకవయిత్రి .దొరికినవి పందొమ్మిది శ్లోకాలు మాత్రమె .ఘూర్జర స్త్రీలతో సహా అనేక విషయాలపై రాసింది గుజరాత్ వాసి అవచ్చు సుందరమైన ప్రక్రుతి వర్ణాలు చేసింది కవిత్వం సహజ సుందరం

70- సంస్కృత ద్వ్యర్ధి కావ్య కవి-వేంకటాధ్వరి

క్రీ శ .1650కాలం వాడిన వేంకటాధ్వరి ‘’విశ్వ గుణాదర్శం’’అనే చంపూ కావ్యం రాశాడు ‘’లక్ష్మీ సహస్రం ‘’అనే వెయ్యి శ్లోకాల స్తుతి కావ్యం రాశాడు ,దీనిలో లక్ష్మీ దేవి విష్ణు స్తుతి ఉంది .రసవత్తరమైన స్తోత్ర కావ్యం గా గుర్తింపు పొందింది .’’సుభాషిత కౌస్తుభం ‘’అనే కృతికూడా చేశాడు .రాఘవ యదవీయం అనే ద్వార్దికావ్యం సంస్కృతం లో రాశాడు ,మొదటినుంచి చదివితే రామాయణ కదా కుడివైపు నుంచి చదివితే భాగవత కదా వస్తుంది ,అంటే ఒక రకం గా ద్వార్దికావ్యం అన్నమాట .ఇది ముప్ఫై శ్లోకాల కావ్యం మాత్రమె .

మరోకవిని కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూర్యకాంతం – దత్తపుత్రుడు దిట్టకవి అనంత పద్మనాభ మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ బి యెన్ పై ఎందుకు నిషేధం ?రాజీవ్ నాగ్ కమిటి -కె సిఆర్ కు ఛివాట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56

61- ప్రతాప రుద్ర రాజ కవి

ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతి రాజులో గణపతి దేవుడు ,ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి తర్వాత ప్రముఖ రాజు రెండవ ప్రతాప రుద్రమహా రాజు .రుద్రమదేవి మనుమడు .కూతురు ముంముడాంబ కొడుకు. రుద్రమ దత్తత తీసుకొన్నది .1296-1323కాలం వాడు .రుద్రమ దేవి తర్వాత రాజైన వాడు .గొప్ప సాహిత్య ప్రియుడు .స్వయానా రచయితా .సాహిత్య పోషకుడు .విద్యానాధుడు ఈయన ఆస్థాన కవి .ప్రతాప రుద్రా యశో భూషణం లేక ప్రతాప రుద్రీయం అనే అలంకార శాస్త్రం రాసి రాజుకు అంకితమిచ్చాడు .

రుద్ర రాజ కవి ప్రతాపం

స్వయం గా కవి అయిన ప్రతాప రుద్రుడు ‘’యయాతి చరిత్ర’’అనే సంసృత నాటకం రాశాడు . రాజు  రాజు కావతానీ ముందే ‘’కుమారు రుద్రుడు ‘’అనే పేరుతొ ‘’అమరుక రాజు రాసిన ‘’శృంగార శతకానికి ‘’వ్యాఖ్యానం రాశాడు తెలుగులో భాస్కర రామాయణం కూడా కొంత భాగం రాశాడు అసలుకవి భాస్కరుడికి రుద్రా దేవుడు శిష్యుడు .దీన్ని బట్టి రెండవ ప్రతాప రుద్రా చక్ర వర్తి సంస్కృతం లోను తెలుగులోనూ కవిత్వం రాశాడని అర్ధమవుతోంది .

యయాతి చరిత్ర నాటకం లో ఏడు అమ్కాలున్నాయి .ఇది భారత కదా .యయాతి రాజు తన భార్య దేవా యాని దగ్గర దాసిగా ఉన్న వృష పర్వ రాజు కూతురైన శర్మిష్ట ను ప్రేమించి పెళ్లి చేసుకొనే కధ.ఏరకమైన మార్పులూ లేకుండా ప్రతాప రుద్రరాజు నాటకం రాశాడు .చకని సంవిధానం తో నాటకం రాశాడు నాటకం పై హర్ష దేవా ,కాళిదాసుల ప్రభావం ఉంది .సరళమైన కవిత్వం లో నాటకాన్ని తీర్చి దిద్దాడు .అప్పయ్య దీక్షితులు ఇందులోని శ్లోకాలను ఉదాహరించాడు .పొన్నగంటి తెలగానార్యుడు ఆంధ్రీకరించాడు .

62-సంగీత సాహిత్యాలలో కూడా రాజు –సింగ భూపాలుడు

సింగ భూపాలరాజు  రాచకొండ ప్రభువు అనపోతనాయకుని కుమారుడు .రెండవ సింగ భూపాలుడు అంటారు .1386-1412కాలం లో రాజ్య పాలన చేశాడు .’

సింగ రాజీయం

సింగ భూపాలుడు ‘’ రసార్నవ సుధాకరం ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధాన్ని రాశాడు .సంగీత రత్నాకరం అనే సంగీత శాస్త్ర గ్రంధానికి ‘’సుధాకరం ‘’అనే వ్యాఖ్యానాన్ని రాశాడు .రాజు గొప్ప సంగీత ,సాహిత్య ప్రియుడు .ఈయన ఆస్థానం లో చమత్కార చంద్రిక రాసిన విశ్వేశ్వర కవి ఉండేవాడు .కవి,పండిత పోశషకుడే కాక స్వయానా కవి సింగ భూపాలుడు .నాటక రచయితా కూడా .కువలయావలి  అనే నాలుగు అంకాల నాటకం రాశాడు దీనికే రత్న పాంచాలిక అనే పేరు కూడా ఉంది .శ్రీ కృష్ణుడు కువలయా వలి అనే లలనా మణిని వివాహమాడటం ఇతి వృత్తం .రాచకొండ ప్రసన్న గోపాల స్వామి ఆలయ వసంతోత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కాలం 1386-1412

 

బ్రహ్మ దేవుని ఆదేశానుసారం కువలయావాలి అనే అమ్మాయి భూమి మీద పుడుతుంది .ఆమె పెంపుడు తండ్రి నారదుడు .తగిన వరుడికోసం వెతుకుతూ ఉన్నట్లు నటిస్తూ ద్వారక లో రుక్మిణీ దేవి సంరక్షణ లో ఉంచుతాడు .ఆమెకు నారదుడు ఒక ఉంగరాన్నిస్తాడు .దాన్ని ధరిస్తే మగవారికి ‘’రత్న పాంచాలిక ‘’గా కనిపిస్తుంది .ఒక సారి ఆమె ఉద్యాన వనం లో క్రీదిస్తుంటే నారదుడు ఇచ్చిన ఉంగరం జారి ఎక్కడో పడిపోతుంది .శ్రీకృష్ణుడు ఆ సమయం లో వచ్చి ఆమెను చూసి ఉంగరం వెతికి అందజేస్తాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .విషయం సత్య భామకు తెలిసి పోతుంది .ఆమె రుక్మిణికి చెబితే కువలయావలిని రుక్మిణి దాచేస్తుంది .ఒక రాక్షసుడు ఆమెను ఎత్తుకు పోతాడు .ఆమెను రక్షించమని కృష్ణుని రుక్మిణి కోరుతుంది .ఇంతలో నారదుడు వచ్చి బ్రహం ఆదేశం తెలియ జేస్తాడు .కువలయావలిని శ్రీకృష్ణుడికి ఇచ్చి రుక్మిణి పెళ్లి చేస్తుంది .ఈ నాటకం పై స్వప్న వాసవ దత్త మాలవికాగ్ని మిత్ర నాటకాల  ప్రభావం కనిపిస్తుంది .

రసార్నవ సుధాకరం కు ఆంగ్లం లో అమెరికాలోని టొరంటో యూని వర్సిటి సంస్కృత పోఫేసర్ శ్రీ టి వేంకటాచార్య మంచి వ్యాఖ్యానం రాశారు .ఇది తిరువనతపురం సంస్కృత లైబ్రరీలో లభ్యం .

63-సాహితీ సమరాంగణ సార్వ భౌముడు –శ్రీ కృష్ణ దేవ రాయలు

విజయనగర రాజులలో ప్రసిద్ధుడు శ్రీకృష్ణ దేవరాయలు స్వయానకవి కాక కవిపోషకుడు .భువన విజయం లో కవి పండిత గోష్టి నిర్వహించేవాడు 1509-1529కాలం .విక్రమాదిత్య  హర్ష వర్ధన భోజ రాజులతో సమానుడై ఆంద్ర భోజ బిరుదు పొందాడు .ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని ఆంద్ర నాయకుడి దెవాలయమైన శ్రీకాకుళం లో శ్రీకారం చుట్టాడు .

ఆంద్ర భోజ రాజీయం

కృష్ణ దేవరాయలు సంస్కృతం లోను గొప్ప పండితుదేకాక మహా కవి అనిపించుకొన్నాడు .మదాలస చరిత్ర ,సత్య వధూ ప్రీణనం ,సకల కదా సార సంగ్రహం ,పురాణ కదా సంగ్రహం రాశాడు .జాంబవతీ కల్యాణం అనే సంస్కృత నాటకాన్ని రాయలు రాశాడు .దీనికి ప్రేరణ గురువైన వ్యాస తీర్ధుల వారు .ఇది అయిదు అంకాల నాటకం .ఇది శ్యమంతక మని కద.శ్రీ కృష్ణుడు జాంబవతి దగ్గరనుండి శ్యమంతక మణిని ఆమె తండ్రి జాంబవంతుని నుండి జాంబవతిని పొందటమే కద.శాకుంతల నాటక పోలికలు ఎక్కువ .హంపీ లోని విరూపాక్ష దేవాలయం లో వసంతోత్సవాలలో చాలా సార్లు ప్రదర్శింప బడిన నాటకం ఇది .

64-   అన్యాప దేశ కవితా  నిష్ణాతుడు – భల్లట కవి

కాశ్మీర దేశీయుడైన ఈ కవి  883-902కాలం లోరాజు శంకర వర్మ ఆస్థానం లో  ఉన్నాడు .’’భల్లట శతకం ‘’రాశాడు నీటి ధర్మ బోధనా ఇందులో ఉన్నాయి .అనేక వృత్తాలను ప్రయోగించాడు .భల్లాట శతకం బాగా ప్రాచుర్యం పొందింది .దీన్ని ముమ్మటుడు ఆనంద వర్ధనుడు ఉదాహరించారు .750ప్రాంతం వాడి ఉండాలి

.                                కవిత్వ భల్లటీయం

ధ్వని ప్రధాన కవిత్వం చెప్పాడు .ప్రసాద మాధుర్యం తో వైదర్భీ రీతిలో ఉంటుంది .కాలిదాస ,భారవి మాఘ చొర ,భావ భూతి మురారి మొదలైన గొప్ప కవుల స్థాయి కి చెందినవాడు భాల్లతుడు .

‘’శ్రీ దండీ దిమ్దిమాఖ్యః శృతి ముకుట గురుర్భాల్ల టో భట్ట బాణః-ఖ్యాతాశ్చాన్యే సుబంద్ధ్వాదయ ఇహ కృతి భిర్విశ్వ మాహ్లాదయంతి ‘’

ఏ విషయాన్నైనా సూటిగా మనొ హరం గా చెప్పాడు అందుకే లోక ప్రియ కావ్యం గా గుర్తింపు పొందింది .మచ్చుకి ఒకటి

‘’పరార్దేయః పీడామను భవతి  భంగే పి మధురో –యదీయో సర్వేషా మిహ ఖాలు వికారో ప్యాభిమతః

న సంప్రాప్తో వ్రుదిం యదిస భ్రుశమ క్షేత్ర పతితః –కిమిక్షోర్దోషో యం న పునర గుణాయామ మరు భువః ‘’ఇది అప్రస్తుత ప్రశంస .విరహం తో ఉన్న నాయిక బాధ –

‘’వాతా వాంతు కదంబ రేణు వాహలా నృత్యంతుసర్పద్విషః-సోత్సాహ నవ తోయ దాన గురవో ముంచంతు నాదం ఘనాః

మగ్నాం  కాంత వియోగ దుఃఖ దహనే మాం వీక్ష్య దీనానాం –విద్యుత్ భో స్పురపి త్వమస్య  కరుణే స్త్రీ త్ప్రేపి తుల్యే సతిః’’దీని భావం –వాయువు ,మయూరుడు మేఘాలు ,పుంలింగాలు కా బట్టి నిర్దయ తో నన్ను బాధ పెడుతున్నాయి .ఎంతయినా మగాళ్ళు మగాళ్ళే కదా .ఓ దామినీ నీవు స్త్రీ అయి ఉండికూడా ఎందుకు ఇంత నిర్దయ చూపిస్తున్నావో అర్ధం కావటం లేదు .

అన్యాపదేశ శైలిలో భాల్లటుడు శతకం  రాశాడు .ఇందులో నూట ఎనిమిది శ్లోకాలున్నాయి .వ్యంగ్యవైభవం ఇందులో పూర్తిగా ఉంటుంది .రాజు శంకర వర్మ క్రూరుడై నియంతగా మారుతాడు .అధిక పన్నులు వేసి ప్రజల్ని పీడిస్తాడు .దీన్ని చూడలేక బాధ పడుతాడు భల్లటుడు. అతని జీవనాదారమూ పోయింది .బీదరికం ఆవరించింది .లావట్టుడుఅనే కూలివాడి జీతం రెండు వందల దీనార్లు .తన దీన స్థితిని గురించి గాలిని అన్యాపదేశం గా నిందిస్తూ శ్లోకం చెప్పాడు .’’ఒ గాలీ !ఎందుకు ఈ రకమైన ప్రవర్తన ?కాలికింద ధూళిని ఎగరేసి ఆకాశానికి తీసుకొని వెడతావు .ఎన్ని అడ్డంకులున్నా అధిగమిస్తావు .కాని ఆ దుమ్ము తో నీఒళ్ళు దుమ్ముకొట్టుకు పోయిందని తెలుసుకోలేక పోతున్నావు ‘’అంటాడు .

రాజు క్రూరత్వాన్ని అడవి వేటకాడు లతో అన్యోక్తిగా పోల్చి చెప్పాడు ‘’ఈ ధనుస్సు చావు నోరు తెరచి నట్లు ఉంది .బాణాలు విషం తో ఉన్నాయి .అర్జున పరాక్రమం  కంటే ఎక్కువగా ఉంది .ఈ పువ్వు లోపల విషం చిమ్ముతూ బయటికి వెకిలి నవ్వు తూపాడుతోంది .అడవిజంతువులన్నీ పారిపోతాయేమో?’’.

మరోకవితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
వాక్యం సరిగా లేదు
‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
ఈ వాక్యమూ సరిగా లేదు
‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’
వాక్యమిపుడు సరిగ్గా వుంది
వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు
వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు
ఎవరి సందర్భాలు వారివి!
కానీ వాక్యం సరిగ్గానే వుంది
‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’
ట్రాన్స్‌ఫార్మర్‌ మీద ఆత్మహత్య చేసుకున్న
రైతు మట్టి దేహమ్మీది నుంచి నేల మీదికి
రాలిపడ్డ వాక్యమది! సరిగ్గానే వుంది!
——-
బతుకు పండగనాడు తీరుతీరు పూలను పేర్చి
తలకెత్తుకుంటున్నాం- ట్యాంక్‌బండ్‌ సాక్షిగా సంబరమే!
కానీ యుగాలుగా రైతు పొలాల్ని
తలకెత్తుకునే వున్నాడని మనకు తెలుసా
అతన్ని మనం తలకెత్తుకోవడం లేదు సరికదా
తన పొలమ్మీద తననే బతకనివ్వడం లేదు
మనం సంబరాల్లో మునిగిపోయి అతని సాగును
మరిచాం, ఉనికిని మరిచాం
నీరందివ్వక వెల్తురునివ్వక నేల బతుకు నుంచి
అతన్ని వెలేసాం – నేల మిగలక గాల్లోకి లేచి
అతను ట్రాన్స్‌ఫార్మర్‌ మీద ప్రాణం తీసుకున్నాడు
చావు నిరసనలోనూ అతను అన్వయాన్నే
పాటించాడని మన తలకెక్కుతున్నదా
సంతాపం ప్రకటిస్తున్న ఈ నేలమీద
వేలాడుతున్న మట్టిమనిషి శవం ముందు
ఇపుడు ఏ తలల్తో నిలబడతాం మనం?
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూనిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు. 
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి.

పెంటమ్మ గుడిసె బయట తూర్పుముఖంగా నిలుచుండి ఎర్రని రూపు దాలుస్తున్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తున్నది. దస్తగీర్‌ రెండు చేతుల్లో రెండు గ్లాసులు పట్టుకొని గుడిసె బయటకి వచ్చి, పెంటమ్మ వైపు మళ్లే వరకు సూర్యుని కాంతితో ఆమె ముఖం ఇంద్రధనుస్సు రంగులతో మిళితమైనట్టు కనిపించింది. ముగ్ధుడై చూస్తూ టీ గ్లాసును ‘‘ఇగో చాయ్‌, చాయ్‌’’ అని అందించాడు…

పెంటమ్మ తెప్పరిల్లినట్టు దస్తగీర్‌ వైపు మళ్లింది. బిడియంతో నేలకు వంగి గ్లాసును అందుకుంది. తలను వంచే టీ గుటక వేసింది. ఆమెను తీక్షణంగా చూస్తూ దస్తగీర్‌ కూడా ఆమె గుటకలకు తన గుటకలు మేళవించి టీ తాగాడు.
….

ఒక ప్రేమకథను మలుపుతిప్పిన సన్నివేశం అది.
యవ్వనం, భద్రజీవితం, కాల్పనిక ఆవేశం, మోహాతురత – వీటి నడుమ పుట్టిన నడిమితరగతి ప్రణయగాథ కాదది.
చరిత్ర ధ్వంసరచనలో ఆశోపహతులైన ఇద్దరు నిరుపేద నడివయస్కుల బతికిన క్షణాలు అవి.
ఆరుదశాబ్దాల కిందట ప్రచురితమైన ‘రాజకీయ బాధితులు’ కథలోని ఒక సందర్భం అది.
రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి.
తెలంగాణ సంక్షుభిత కాలాన్ని అక్షరాలలోకి అనువదించిన అసామాన్య కథానవలా రచయిత.
ప్రజల మనిషి.
నేటి తరం పాఠకులకు అందు బాటులో లేని ఈ రచన గురించి వ్యాఖ్యానించే ముందు ఇందులోని కథను రేఖామాత్రంగా అయినా పరిచయం చేయడం న్యాయం.
పెంటమ్మ, దస్తగీర్‌- ఈ ఇద్దరూ ఈ కథలో నాయికా నాయకులు.
ఇద్దరూ దళితులు. దస్తగీర్‌ దళిత ముస్లిమ్‌.
ఆమెకు ముప్పయ్యైదేళ్లు, అతనికి నలభై అయిదు.
పెంటమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు. దస్తగీర్‌ ఒక మోటారుషెడ్‌లో పనివాడు, కాపలాదారు.
వారిద్దరికి హైదరాబాదు వీధుల్లో తెల్లవారుజామున ముసి ముసి చీకట్లలో పరిచయం అయింది. ‘పొగమాదిరి కమ్మిన’ మంచులో వెచ్చదనం కోసం చుట్టవెలిగించుకోవాలనుకున్న పెంటమ్మకు దస్తగీర్‌ గుడిసె కంతలో దీపం వెలుతురు కనిపించింది.
నిప్పు కోసం వెడితె ఆమెకు దస్తగీర్‌ చాయ్‌ ఇచ్చాడు.
‘నీ పని అయిపోయినాక బువ్వకిక్కడికే రారాదు!..’ అని దస్త గీర్‌ ఆహ్వానించాడు. కుదరదని ఖండితంగా చెప్పింది పెంటమ్మ.
ఆ సాయంత్రం దస్తగీర్‌ కాపుకాసి ఆమెను మళ్లీ వీధిలో ఊడుస్తున్నప్పుడే కలిశాడు.
రెండు వేరుశెనగ పొట్లాలు కొని అతనికి ఒకటి ఇచ్చింది పెంటమ్మ.
రెండు పొట్లాలు కలిపేశాడు దస్తగీర్‌.
చాయ్‌వాడు వస్తే రెండు టీలు తీసుకున్నారు.
పైసలుపెంటమ్మే ఇచ్చింది.
వాళ్లిద్దరినీ చూస్తే టీ కుర్రాడికి ఏదో అర్థమయింది.
……..
ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయ త్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూ నిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు. భర్త సజీవుడో కాదో ఆమెకు తెలియదు. భార్యాపిల్లలను చంపేశారని అతనికి తెలుసు.
ఈ కథా కాలం 1955 ప్రాంతం. అప్పటికి హైదరాబాద్‌ పై సైనిక చర్య జరిగి ఏడేళ్లు. తెలంగాణ సాయుధ పోరాటం అధికారికంగా విరమించి నాలుగేళ్లు. రచయిత కథాకాలాన్ని, నేపథ్యకాలాల్ని ఎంతో ఖచ్చితంగా పాటించారు. పెంటమ్మ ఫ్లాష్‌ బ్యాక్‌ ప్రకారం ఆమె భర్త కోటయ్యరాఘవాపురంలో దొర తోట మాలిగా పనిచేసినవాడు. మాటకారీ, దళితవాడలో పెద్దమనిషీ కావడం వల్ల కమ్యూనిస్టుపార్టీ స్పర్శ ఆ ఊరికి సోకగానే ప్రథమ కార్యకర్తగా మారినవాడు. దొరదగ్గరి పనికిరాని తుపాకీని మర మ్మత్తు చేయించుకుని సాయుధుడయ్యాడు. దొరమీదకే దాన్ని గురిపెట్టాడు. కమ్యూనిస్టుగా మొదట రజాకార్లను, తరువాత కాంగ్రెస్‌ వాండ్లను, మిలటరీని, పోలీసులను కూడా వేటాడాడు. కమ్యూనిస్టు పార్టీ పోరాటం మానుకున్నా కోటయ్య మాత్రం మానుకోలేదట. అందుకని పార్టీ వాండ్లు అతన్ని వెలివేశారు. అప్పుడు పార్టీ వాండ్లపైనా అతను కన్నెర్ర చేశాడట. ఏకాకిగా ఎన్నో అవస్థలు పడ్డాడట. బహుకష్టంగా ప్రభుత్వానికి చిక్కాడు. ఆ తరువాత అతని ఆచూకీ లేదు. అతను బతికిందీ చచ్చిందీ గట్టిగా చెప్పగలవారెవరూ లేరు. పెంటమ్మ కోటయ్యకు అన్ని విధాల చేదోడు వాదోడుగా పనిచేసింది. కానీ, ఆమెకు కోటయ్య పార్టీని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోయింది. కోటయ్య పట్టుబడ్డాక ఎవరినుంచి సానుభూతీ సహకారం దొరకక, ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిలో కుది రింది. కానీ యూనియన్‌ వాండ్లకు కూడా తన వివరాలు చెప్ప లేదు. మహానగరంలో తనను తాను కాపాడుకుంటూ ఎట్లాగో నెట్టుకువస్తున్నది. ఇదంతా జరిగి మూడేండ్లపైన అయింది.
రామయ్య అనే దళితుడు పదిహేడేండ్ల కిందట మతం మారి దస్తగీర్‌ అయ్యాడు. దళితులను మతమార్పిడి చేసే కార్యక్రమం 1937-40 ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది. ‘ప్రజల మనిషి’ నవలలో దాని విశేషాలను గమనించవచ్చు. అట్లా మారినవారు, అనేకమంది తిరిగి ఆర్యసమాజం శుద్ధి స్వీకరించి వెనుకకు వచ్చారు కానీ, కొందరు కొనసాగారు కూడా. అట్లా కొనసాగిన వాడు దస్తగీర్‌. అంతే కాదు, రజాకార్‌గా మారి, వారి కార్యకలా పాల్లో పాలుపంచుకున్నాడు. పెంటమ్మతో పరిచయం అయిన రోజున అతనికి తనగతం గుర్తుకు వచ్చింది. పెంటమ్మ ముఖం కడుక్కుంటుంటే, రెండు మూడు సార్లు గుడిసెలోంచి తొంగి చూచి, తన్మయత్వంలో మునిగితేలాడు. ‘‘….ఒకసారి శిలాప్రతిమ వలె నిలుచుండి తన్ను తానే మరచి ఆలోచించసాగాడు. అకస్మా త్తుగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లలో పోలీసు ఏక్షన్‌ రోజుల్లో పల్లెటూరిలో అతని ఇంటిపై దాడి జరిగి తన భార్య, పిల్లలు హత్య చేయబడడం గురించి, విన్న వివరాల ప్రకారం దృశ్యాలు తాండవించాయి. ఆనాడే ఆ సంఘటన జరిగినంత తల్లడిల్లాడు. పచ్చిగాయం మీద బలమైన ఇంకొక గాయం తగిలినంత వణికి పోయాడు. తాను రజాకారుగా చేసిన హత్యలు, గృహదహనాలు, మానభంగాలు పాపాన్ని కన్నీటిబొట్లతో కడిగి వేస్తున్నాడు…’’

వీళ్లిద్దరిని కథకుడు హైదరాబాద్‌లో ఎందుకు కలిపాడు? ఇద్దరి మధ్య ఏ సారూప్యం ఉన్నది? ఇద్దరూ రాజకీయ బాధితులు కావడమే కారణమా? అసలు వీరిని రాజకీయ బాధి తులు అనడం సరిఅయినదేనా?- ఈ ప్రశ్నలకు పూర్తి సమా ధానాలు కథలో దొరకవు. రెండు దళిత పాత్రలనుంచే ఎందుకు తీసుకున్నాడు? – ముస్లిమును ముస్లిముగానే తీసుకుని ఉండ వచ్చును గదా? గోపీచంద్‌ ‘గతించని గతం’లో బతుకమ్మ ఆడుతున్న సీ్త్ర మీద అత్యాచారంచేసిన ముస్లిం, పోలీసు యాక్షన్‌ వేళ పాకిస్థాన్‌కు పారిపోయి, ఏడేళ్ల తరువాత తిరిగివచ్చి పశ్చాత్తాప పడడం కథ. అది కేవలం రజాకార్‌ అత్యాచారాన్ని, బాధితురాలు బేలగా తనమీద దాడిచేసినవాడి కోసం ఎదురు చూడడాన్ని, ఆమె దయనీయస్థితి చూసి దుండగుడే పశ్చాత్తాప పడడాన్ని కథకుడు మూసవిలువల నేపథ్యంలోనే చిత్రించాడు. ఇక్కడ ఆళ్వారుస్వామి, రజాకార్‌గా మారిన దళితుడిని పాత్రగా తీసుకున్నాడు. దస్తగీర్‌ అయినా, పెంటమ్మ భర్త కోటయ్య అయినా – భూస్వామ్యపీడన నుంచి విముక్తి కావడానికే ఆయా రాజకీయ పాత్రలను స్వీకరించారు. తెలంగాణ గ్రామాల్లో మత మార్పిడి కోసం ముస్లిమ్‌ మతతత్వ సంస్థ ఉద్యమం చేపట్టి నప్పుడు- వారు దళితులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూస్వా ముల నుంచి పడుతున్న కష్టాలను మతమార్పిడి తొలగి స్తుందన్న భ్రమ కల్పించారు. దస్తగీర్‌ ఏ మార్గాన్ని ఎంచు కున్నప్పటికీ, అతని ఉద్దేశ్యం మాత్రం దోపిడి నుంచి బయట పడడమే. మతమార్పిడి చెందిన దస్తగీర్‌ యథాలాపంగా ఉండి పోలేదు.
నిష్ఠ కలిగిన ముస్లిమ్‌గా మారాడు. ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ చేసిన రాజకీయ ప్రబోధాలను విశ్వసించి రజాకార్‌గా మారాడు. తెలంగాణలో రజాకార్లు చేసిన పనులన్నిటిలోను భాగస్వామి అయ్యాడు. ఫలితంగా, పోలీసుచర్య సందర్భంగా జరిగిన పౌరదాడుల్లో తన భార్యాపిల్లలను పోగొట్టుకున్నాడు. కమ్యూనిస్టుల ప్రాబల్యం కానీ, ఉదార లౌకికవాదులైన కాంగ్రెస్‌ ప్రాబల్యం కానీ ఉన్నచోట్ల ముస్లిములపై ప్రతీకార దాడులు జరగకుండా నిరోధించగలిగారు కానీ, ఇతర ప్రాంతాల్లో హింసా త్మకమైన చర్యలు జరిగాయి. అందుకు దస్తగీర్‌ కుటుంబంలోని అమాయకులైన సీ్త్రలు, పిల్లలు మరణించడమే రచయిత చూపిన నిదర్శనం. తనకు కలిగిన నష్టం నుంచి, తాను చేసిన పనులను దస్తగీర్‌ బేరీజువేసుకుని దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని కలగలిపి బాధపడ్డాడు. గ్రామంలో ఏమి జరిగిందో వినడమే తప్ప, అతను గ్రామానికి వెళ్లలేదని, హైదరాబాద్‌లో బతుకు ఈడుస్తున్నాడని కథాక్రమంలో మనకు అర్థమవుతుంది. ఈ ఏడేళ్ల కాలం అతను కష్టజీవిగానే గడిపాడు. పెంటమ్మతో అతను వ్యవహరించిన తీరులో ఎంతో సంస్కారం, పరిణతి కనిపిస్తాయి. అతనికి సంక్రమించిన జీవితం- అతన్ని ఒక మౌన పశ్చాత్తప్తునిగా మార్చివేశాయి. పెంటమ్మ కలిసిన రోజు శుక్రవారం. ఆరోజు అతను కొంత సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అట్లా అనుకోవడంలో ఒక వెలితి, దైన్యం కనిపిస్తాయి.

పెంటమ్మ కోటయ్య వంటి సాయుధయోధుడికి, ప్రజా నాయకుడి భార్యగా ఉండడంలోనే అనేక కొత్త సంస్కారాలు అలవరచుకుంటుంది. ఒకరికి తోడుగా ఉండగలిగిన గుణమూ, ఒంటరిగా నిభాయించుకోగలిగిన నిబ్బరమూ రెండూ ఆమెకు ఉంటాయి. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఒంటరి మహిళగా తనకు ఎదురైన అనుభవాలనన్నిటినీ ఒక విద్యార్థిగా ఆమె విశ్లేషించుకుంటుంది. తనకు దగ్గర కావడానికి ప్రయత్నించే పురుషులలోని స్వార్థాన్ని ఆమె గుర్తించగలదు. దస్తగీర్‌ విషయంలో కూడా ఆమె ఆ స్వార్థాన్ని పసిగట్టింది కానీ, అతని ప్రయత్నంలోని హుందాతనాన్ని గౌరవించింది. భర్త ఉన్నాడో లేదో తెలియనితనం నుంచి, పోయాడులే అని నిర్ధారణకు వస్తున్న క్రమంలో ఉన్నదామె. (జైలులో లేకుండా, బయట లేకుండా అదాలతులో మొఖద్దుమా లేక ఏమై ఉంటాడు? హృదయంలో ఒక ప్రశ్న బయలుదేరింది. ఆ విధంగా నామ రూపాలు లేకుండా మాయమైన వారు ఎందరు లేరు? వారిలో కోటయ్య కూడా ఎందుకు చేరగూడదు? ప్రజల బలం గాని, పార్టీ సానుభూతి గాని లేని కోటయ్యను ఎవరు ఏమి చేసినా అడిగేవారెవరు? ఎవరూ లేరు. కాబట్టి తప్పకుండా చచ్చి ఉండాలి..) అప్పుడు దస్తగీర్‌ పరిచయం ఆమెలో కదలిక కలిగించింది.. వాళ్లిద్దరూ ఒకరికొకరు తమ గత జీవితాలను చెప్పుకున్నారా? రచయిత అట్లా ఎక్కడా చెప్పలేదు. కానీ, దస్తగీర్‌ రూపురేఖలను తలచుకుంటూ పెంటమ్మ అనుకున్న మాటలు ఆమె గ్రహింపు శక్తిని సూచిస్తున్నాయి. ‘‘.. అతడు అందగానిలో లెక్క కాదు. పిల్లి గడ్డం, స్ఫోటకపు మచ్చలతో చెదలు పట్టినట్లున్న ముఖం, పట్టుదలతో నమాజు చేస్తున్నందుకు గుర్తుగా నుదుటి మీది రూపాయి కంటె పెద్ద నల్లని మచ్చా, పోలీస్‌యాక్షన్‌ రోజుల్లో మిలటరీ తుపాకీ దెబ్బకు ఎగిరిపోగా మిగిలిన చెవ్వు, మిలటరీ క్యాంపులో తిన్న దెబ్బలకు వంకరలు తిరిగిన వేళ్లు…’’ అదీ దస్తగీర్‌ రూపం. బహుశా, తెలంగాణలో అణగారిన ప్రజలు ప్రతి ఒక్కరి ఒంటి మీదా, జీవితం మీదా నాటి కాలం కొన్ని గుర్తులు వేసింది. బాధితుల మధ్య కలిగే సహజమైన మమత్వం ఏదోవారిద్దరినీ దగ్గర చేసి ఉండాలి. యుద్ధరంగం ఎన్ని మరణాలను వెదజల్లినా, ఎప్పుడో ఒకప్పుడు జీవితం తిరిగి మొలకెత్తవలసిందే.
తెలంగాణ సాయుధపోరాటం, పోలీసు యాక్షన్‌- భారతదేశ చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు. దేశవిభజన కాలం నాటి పరిణామాలతో పరోక్షంగా సంబంధం ఉన్న పరిణామాలు. అంతర్జాతీయంగా, రెండో ప్రపంచయుద్ధపు ముగింపు, చైనాలో విజయానికి చేరువగా ఉండిన విప్లవం, నూతన స్వతంత్ర భారత పాలకవర్గాల జాతీయోన్మాదం-అన్నీ కలిసి నాటి సంఘటనలను రచించాయి. తాము అడుగులో అడుగు వేసి నడిచిన విశ్వాసాలు తమను వెలిగా పెడితే, లేదా తాము ఎడం జరిగితే కలిగే ఏకాకితనం పెంటమ్మ, దస్తగీర్‌లకు అదనపు కష్టం. బహుశా, ఆళ్వారుస్వామి కూడా ఈ కథారచన కాలంలో అటువంటి మనస్థ్సితిలో ఉండి ఉంటారు. అందుకే ఆయన ఈ కథకు ‘రాజకీయ బాధితులు’ అని పేరుపెట్టారు. తరువాత కొద్దిరోజులకే తన ఒంటరి సంక్షోభానికి పరిష్కారంగా తిరిగి కమ్యూనిస్టుపార్టీలో ఆయన ప్రవేశించి ఉంటారు.
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, పాత్రల పట్ల ఆయన చూపించిన అపారమైన గౌరవం, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి. అలభ్యంగా ఉండిపోయిన ఆళ్వారు స్వామి కథల్లో ఇది ఒకానొకటి మాత్రమే. తక్కిన కథలన్నీ ఇంతటి విస్తృతినీ, ఇంతటి జీవితాన్నీ, చరిత్రనూ చిత్రించాయని కాదు కానీ, ప్రతి ఒక కథా ఒక ఆణిముత్యమే. లభ్యం కాని కథలే కాదు, దొరుకుతున్న కథలు కూడా తెలుగు పాఠకులకు తగినంతగా తెలియదు. కనీసం ఆళ్వారుస్వామి పేరైనా తరచు ప్రస్తావనకు వస్తున్న తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఆ ప్రయత్నం జరగకపోవడం ఆశ్చర్యకరం.
పుస్తకరూపం తీసుకోకుండా ‘స్రవంతి’ పత్రిక సంపుటాల్లోనే మిగిలిపోయిన ‘రాజకీయ బాధితులు’ కథతోపాటు సుమారు మరో ఇరవైకథలు ఇంకా తెలుగు పాఠకులకు కొత్తగా పరిచయం కావలసి ఉన్నాయి. ప్రగతిశీల ప్రచురణకర్తల దారుణమైన విస్మరణకు, వివక్షకు గురై ‘జైలు లోపల’కథలు కూడా ఇటీవలి దాకా పునర్ముద్రణే జరగలేదు. అముద్రిత కథలు పుస్తకరూపమే తీసుకోలేదు. కథారచయితగా ఆళ్వారుస్వామి అజ్ఞాతవాసానికి త్వరలో ముగింపు లభిస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి పరిశోధనల ద్వారా అసామాన్యమైన కృషి చేసిన సంగిశెట్టి శ్రీనివాస్‌ సేకరించిన అముద్రిత కథలతో పాటు, ఆళ్వారుస్వామి కథలన్నీ శతజయంతి సంవత్సరంలో 2015 ఫిబ్రవరి 5న ఆళ్వారుస్వామి వర్ధంతి రోజున ఆవిష్కృతం కానున్నాయి.
– కె. శ్రీనివాస్‌
(నవంబర్‌ 1న ఆళ్వారుస్వామి 99వ జయంతి, శతజయంతి ఉత్సవాల ప్రారంభం)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాగంటి -కార్తీక మాస విశేషాలు

26_10_2014_002_010

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య

  • -ముదిగొండ శివప్రసాద్

శ్రీ సీతారామాంజనేయ సంవాదము పద్యకృతి-
రచన: పరశురామ పంతుల లింగమూర్తి
వెల: 350/-
ప్రతులకు: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్
21-303 ఎస్-ఎఫ్-ఎస్ వీధి,
మురుగేశం కాంపౌండ్- కడప

నేటికి మూడువందల సంవత్సరాలకు పూర్వం ఓరుగల్లు వాస్తవ్యుడైన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తిగారు పద్యములలో సీతారామాంజనేయ సంవాదము అనే ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వీరివి దాదాపు పదకొండు ఇతర కృతులు లభ్యమవుతున్నా విషయ ప్రాధాన్యాన్నిబట్టి ఈ గ్రంథానికి విశేషప్రాచుర్యం లభించింది. దీనికి వెనె్నలకంటి సుందరరామశర్మగారు తాత్పర్యము వ్రాయగా వేదాం తం లక్ష్మయ్య సద్గురువులు విశేషార్థ వివరణ ఇచ్చారు. దీనిని ఇప్పుడు బ్రహ్మస్పర్శిని సంస్థ -(కడప)వారు ముముక్షువులకు అందించారు. ఈ కృతి సంకలనం చంద్రగిరి ఎస్.సుబ్రహ్మణ్యంగారు చేశారు. పరశురామ పంతులవారి పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఎప్పుడో వచ్చి ఓరుగల్లులో స్థిరపడ్డారు. శివుడు పార్వతికి శ్రీరామతత్వము బోధించినట్లు గ్రంథ ఉపక్రమణికలో ఉంది. సాంఖ్యము తారకము అమనస్కయోగము వేరువేరు కావని ఇందులో ప్రతిపాదించారు. నిజమునకు ఇదొక ఆధ్యాత్మిక సంగ్రహ విజ్ఞాన సర్వస్వమువలె కన్పడుతున్నది. రామపరబ్రహ్మ తత్వము అనే మిషతో అసంఖ్యాక విషయములు ఇందులో చెప్పబడ్డాయి. రాములవారు రచయితను స్వప్నసాక్షాత్కారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. శ్రీరామ పట్ట్భాషేకానంతరము ఈ సంవాదము జరిగినట్లు కవిగారు చిత్రీకరించారు. ఇందులో షట్‌చక్రములు- సత్వ అస్తేయశౌచములు స్వాధ్యాయము చతుర్విధ శుశ్రూషా వివరణమూ వంటివేగాక భిన్నభిన్న యోగాసనములు ప్రాణాయామ పద్ధతులు కూడా చేర్చబడ్డాయి. అంటే ఇందులో తత్వశాస్త్రంతోబాటు తదనుభవ సామాగ్రి ఉపాసనా విధానము అందించారని తెలుస్తున్నది.
‘‘ఘటముంవీక్షించు వాడే గతిని తాగాక వేఱైన భంగిన్
పటుదేహద్రష్టనై పరమ సుఖమయ బ్రహ్మమై నట్టినేనె
నన్నటికిన్ దృశ్యంబు మాయానగర సమమసన్నామ రూపాత్మకంబున్
కుటిలా విద్యాకృతంబాకుల దమగుతనూ కోశముంగానువయ్యా!’’
(74వ పద్యము మహాస్రగ్ధర- పుట 317.)
ఈ విధంగా రచనాశైలి సాగింది. అపరిగ్రహము అంటే అసలు తీసుకోకపోవటం అని అర్థం చెప్పుకోకూడదు. శిష్యులిస్తే తీసుకోవచ్చు. అలాగే శౌచము బ్రహ్మచర్యము వంటి పదాలకు ఇందులో కొత్త అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇదొక శాస్త్రగ్రంథము. పైగా పద్యములలో ఉంది. అందువలన కేవల మోక్ష పురుషార్థకామములకు నిర్దేశింపబడింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం

హాస్యానందాన్నిచ్చే కథలు

  • -కూర చిదంబరం

నాకొక శ్రీమతి కావాలి
హాస్య కథలు
రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు
పేజీలు: 135, వెల: రూ.120/-
కాపీలకు: రచయిత,
విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు నవోదయా బుక్‌హౌజ్‌లు

‘‘నవ్వు నాలుగిందాల చేటు’’ అన్నది పాత నానుడి. ‘నవ్వు నాలుగు విధాల బెస్ట్’’ అని ఇప్పుడు అనుకోవాలి. నవ్వువల్ల ఎంతో మంచి చేకూరుతుంది. బరువెక్కిన ‘‘మూడ్’’ తేలికవుతుంది. ‘ఈసురోమంటూ ఇరవయ్యేళ్ళకంటే, నవ్వుతూ నాలుగేళ్ళు బ్రతుకుతే చాలు’ అనుకునే రోజులివి. వైద్యరీత్యా కూడా, నవ్వు ఆరోగ్యాన్ని చేకూర్చి రోగాల్ని దూరంగా ఉంచుతుందట! అందుకే మనం ‘అంతర్జాతీయ నవ్వుల దినం’ అని లాఫింగ్ క్లబ్బులు అని పెట్టుకుని, నవ్వు కరువవుతున్న ఈ రోజుల్లో, పనిగట్టుకుని మరీ నవ్వుతున్నాము.
ఈ సంకలనంలో 24 హాస్య కథలున్నాయి. ఇవన్నీ లోగడ వేర్వేరు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఏకధాటిగా, మనం నవ్వుకునేందుకు ఇప్పుడు వీటినన్నింటినీ సంకలనంగా మన ముందుంచారు డా.రాజుగారు. బోధన వీరి వృత్తి. కనుక చెప్పదల్చుకున్న విషయాన్ని అందంగా, పఠనీయత పెంచి మన ముందుంచటం వీరికి వృత్తితో పెట్టిన విద్య.
ఆనాటి రోజుల్లో మాత్రమే కనబడే వారాలబ్బాయి గురించి (్భక్త కుంకలు) వ్రాసినా, ఈనాటి దాలిబాబు కార్ఖానాలో పనిచేస్తూ, ఆయన కూతుర్ని లేపుకువచ్చి రైలు ప్రయాణం చేస్తున్న నర్సింహులు (బంగాళాఖాతంలో వాయుగుండం) గురించి వ్రాసినా, రంభా ఊర్వశిల్లాంటి అందగత్తెలతో సరసాలు సాగిస్తున్నానని చెబుతూ జోళ్ళషాపులో ఊడ్చి కళ్ళాపి చల్లే అప్పలమ్మతో గ్రంథం నడిపించబోయే బుచ్చిబాబు (రంభతో రాం. రాం) గురించి వ్రాసినా, మనం నవ్వుకోవాల్సిందే!
ఇక చొక్కావేసుకోని, నక్కిన చొక్కారావు (శ్రీమతి వౌనవ్రతం) అడ్వకేటు, వౌనవ్రతం పట్టే ఆయన శ్రీమతి ప్రతిభాదేవి గురించి వ్రాసినా, సర్వమంగళ మెడలో తాళికట్టి ‘్భర్త వత్సలం’ అయిన భక్తవత్సలం గురించి వ్రాసినా, అద్దె భార్య ప్రమీలను కుదుర్చుకుని అవస్థలు పడే పెంటారావు అనబడే గంటారావు (అద్దె భార్య అలిగితే) గురించి వ్రాసినా మనం హాయిగా నవ్వుకోవలసిందే! ఇప్పుడు కనబడటం లేదు కాని ఆ రోజుల్లో ‘నశ్యం’ పీల్చటం ఉండేది. ముక్కుపొడుం (నశ్యం) పీల్చే లంబోదరం లాంటి వేలువిడిచిన బంధువులు, (బేలు బిడిచిన బందుబు) అధ్యాపక వృత్తిలో తరుచూ తారసపడేవారు, వీళ్ళంతా మన నిత్య జీవితంలోని పాత్రలే! వీరితో నవ్వులపువ్వులు పూయించారు రాజుగారు.
వీరి కథల్లో ‘‘పన్’’ (-ఖశ) ఉంది. ‘‘పంచ్’’ ఉంది. అయితే సంకలనంలోని అన్ని కథల్లోనూ ఇవి ‘యూనివర్సల్’గా కానరావు. ఒక్కో కథలో ‘స్మైల్ ప్లీజ్. నవ్వండి’అని అంటున్నట్లవుపిస్తుంది. ‘కంటిన్యుటీ’ కనిపించక, ఘఇఖఔఆ గా కథ ముగించినట్లనుపిస్తుంది.
‘బ్నిం’ (బి.నరసింహమూర్తి) గారి ముఖ చిత్రంలో మనం బోలెడంత మంది నిన్నా, నేటి సినిమా తారలను చూసుకోవచ్చు. గృహస్తు అవాలని, శ్రీమతి కావాలని కలలుగనే లంబోదరమూర్తికి శ్రీమతి దొరకటం ‘అందని ద్రాక్ష’ కాగూడదని, త్వరలోనే పెళ్ళవుతుందని ఆ పెళ్ళి విశేషాలు, ఆ తర్వాతి కబుర్లు, ముందుముందు డా.మంతెన సూర్యనారాయణరాజు మనకందిస్తారని ఆశిద్దాం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

ఖరీదైన సెల్‌ఫోన్లు.. కాంతులీనే టీవీలు.. బ్రాండెడ్ దుస్తులు.. ఠీవి పెంచే చెప్పులు.. కెమెరాలు.. ఒకటని కాదు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే మనసుకు నచ్చిన వస్తువులను క్షణంలో కొనుగోలు చేస్తున్న రోజులివి. దుకాణాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇపుడు ‘ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు’ అనుకూలంగా మారాయి. అరచేతిలో ఉండే మొబైల్‌లోనే అతిపెద్ద దుకాణ సముదాయాలను కలియజూసిన అనుభూతి పొందుతూ నేడు చాలామంది ‘ఆన్‌లైన్ షాపింగ్’ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. పలురకాల వస్తువులు విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉండడం, భారీ రాయితీలు, నగదు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, మనం కోరుకున్న వస్తువులు అదే రోజు ఇంటికి చేరడం.. ఇలా ఎనె్నన్నో అనుకూల అంశాలు వినియోగదారుల్లో ‘ఆన్‌లైన్ షాపింగ్’ పట్ల మక్కువను పెంచుతున్నాయి. ఇదో ప్రభంజనం… ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లు భారత ఆన్‌లైన్ రంగంలో తాజాగా సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. ఇంటర్నెట్‌తో ‘టచ్’ ఉన్నవారిలో అధిక సంఖ్యాకులు ఈ నెల 6న ‘్ఫ్లప్‌కార్ట్’ వెబ్‌సైట్‌ను ఏదో ఒక వస్తువు కోసం ‘క్లిక్’ చేశారంటే అందులో అతిశయోక్తి లేదు. ‘ఆన్‌లైన్ బూమ్’ను పండగల సీజన్‌లో క్యాష్ చేసుకునే పనిలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు నిమగ్నమై పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఊహించని డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, కచ్చిత బహుమతులు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు వెల్లువెత్తడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి మన దేశంలో ఈ ఏడాది దసరాకు ముందునుంచే ఇ-కామర్స్ సంస్థల జోరు మొదలైంది. ఇదే నెలలో దీపావళి తోడవడంతో ఆ సంస్థలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లకు యథాశక్తిన వల వేశాయి. పదునెక్కిన ప్రచార వ్యూహాలు, పోటాపోటీ ఆఫర్ల నేపథ్యంలో వినియోగదారులు ఈ వెబ్‌సైట్లను ‘క్లిక్’మనిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరికొత్త డిజైన్లు, విదేశీ ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెస్తూ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. పది గంటల్లో రూ. 610 కోట్ల విక్రయాలు..! ‘గతంలో ఎన్నడూ చూడని భారీ రాయితీలు.. ఇరవై నాలుగు గంటల పాటు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే అరుదైన అద్భుత అవకాశం..’- అంటూ భారీ ప్రచారంతో కస్టమర్లను తెగ ఊరించిన ‘్ఫ్లప్‌కార్ట్’ ఈ నెల 6న ‘ది బిగ్ బిలియన్ డే’ పేరిట ఆన్‌లైన్ వ్యాపారంలో పెను సంచలనం సృష్టించింది. అన్ని రకాల ఉత్పత్తులపై ఎనభై శాతం వరకూ తగ్గింపు ధరలంటూ రెండు వారాల ముందు నుంచీ వివిధ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా కస్టమర్ల నుంచి స్పందన వెల్లువెత్తింది. కొద్ది గంటల్లోనే తమ వెబ్‌సైట్‌కు వంద కోట్లకు పైగా ‘హిట్స్’ రావడంతో సగం వ్యవధిలోనే ‘్ఫ్లప్‌కార్ట్’ సంస్థ భారీ సేల్‌కు తెరదించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రత్యేక ఆఫర్లతో ఆర్డర్లు స్వీకరించగా కేవలం పది గంటల వ్యవధిలోనే వంద మిలియన్ డాలర్ల ( 610 కోట్ల రూపాయలు) మేరకు విక్రయాలను సాధించినట్లు ఆ సంస్థ గొప్పగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో నాణ్యమైన ఉత్పత్తులను భారీ రాయితీలపై విక్రయించడంతో స్పందన అనూహ్యంగా ఉందని స్పష్టమైనట్లు ‘్ఫ్లప్‌కార్ట్’ ప్రతినిధులు చెప్పుకున్నారు. ఇ-కామర్స్ చరిత్రలోనే ‘బిగ్ బిలియన్ డే’ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు అభివర్ణించారు. విమర్శలూ అధికమే… ‘బిగ్ బిలియన్ డే’ పేరిట ‘్ఫ్లప్‌కార్ట్’ నిర్వహించిన సేల్స్ స్కీమ్‌లో కొనుగోళ్లకు కస్టమర్లు ఎంత భారీగా స్పందించారో అదే స్థాయిలో విమర్శలూ చోటు చేసుకున్నాయి. మొబైల్ ఫోన్లు, పలురకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు నాణేలు, ఇతరత్రా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో కస్టమర్లు ఆర్డర్లు చేసేందుకు ఎగబడ్డారు. అసలు ధరలో పదోవంతుకే కొన్ని వస్తువులు ఇస్తామంటూ ఊదరగొట్టడంతో ఈ ఆన్‌లైన్ సైట్ ఎంతోమందికి లభించని పరిస్థితి ఏర్పడింది. తాము కోరుకున్న ఉత్పత్తులకు ఆర్డర్లు ఇస్తే తీసుకోలేదని, కొన్ని సందర్భాల్లో ‘క్లిక్’లు తప్పుడు పేజీలకు వెళ్లాయని సామాజిక మాధ్యమంలో కస్టమర్లు ఆరోపించారు. సర్వర్ ‘క్రాష్’ అయిందని చెప్పడమే గాక, తప్పుదోవ పట్టించే ధరలతో మోసగించారని కూడా విమర్శలు చెలరేగాయి. తమ వెబ్‌సైట్‌కు ‘ట్రాఫిక్’ అనూహ్యంగా ఉన్నా, సర్వర్ ‘క్రాష్’ కాలేదంటూ ‘్ఫ్లప్‌కార్ట్’ ఇచ్చిన వివరణ వినియోగదారులకు ఊరట కలిగించలేదు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో పలు రకాల ఉత్పత్తులను సాధారణ షాపింగ్ మాల్స్‌లో కంటే తక్కువ ధరలకు విక్రయిస్తారన్న నమ్మకం జనంలో ప్రగాఢంగా ఉంది. ఈ నమ్మకంతోనే ‘బిగ్ బిలియన్ డే’ పట్ల కస్టమర్లు వేలం వెర్రిగా మొగ్గు చూపారు. ‘్ఫ్లప్‌కార్ట్’లో ప్రదర్శించిన ఉత్పత్తుల ధరలు అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఇతర సంస్థల్లో కంటే అధికంగా ఉన్నాయని, అందువల్ల భారీ రాయితీలపై నిజమైన నమ్మకం కుదరలేదని కొందరు కస్టమర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ రాయితీలు చూపించేందుకు గతంలో విక్రయించిన ధర కంటే ఎక్కువగా చూపారన్న ఫిర్యాదులూ వచ్చాయి. ‘24 గంటల సేల్’ అంటూ ఘనంగా ప్రచారం చేసినా కొద్ది గంటల వ్యవధిలోనే ‘నో స్టాక్’ అని ప్రకటించడం ‘మరో దగా’ అన్నవారు కూడా లేకపోలేదు. కొన్ని రకాల ఉత్పత్తులను ‘్ఫ్లప్‌కార్ట్’ ద్వారా విక్రయించే సరఫరాదార్లు ఆర్డర్లు నిలిపి వేయడమే ఇందుకు కారణమని కొందరు వ్యాఖ్యానించారు. అనూహ్యంగా ఆర్డర్లు రావడంతో సాధ్యమైనంత త్వరగా సరకులను డెలివరీ ఇచ్చేందుకే కొత్త ఆర్డర్లు నిలిపివేశారన్న ఫిర్యాదులూ వినిపించాయి. ‘్ఫ్లప్‌కార్ట్’ వెబ్‌సైట్ అందుబాటులో లేనందున కొందరు కస్టమర్లు ఇతర వెబ్‌సైట్లను ఆశ్రయించక తప్పలేదు. కొద్దిమందికి డిస్టౌంట్ ధరల్లో వస్తువులు దక్కినా చాలామందికి నిరాశే మిగిలింది. ఒకే ఉత్పత్తి వివిధ సమయాల్లో వివిధ రకాల రేట్లలో దర్శనమివ్వడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ‘సారీ’.. మరోసారి ఇలా జరగదు.. ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా వినియోగదారులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయామని, ఆశించిన స్థాయిలో పనితీరును కనబరచలేక పోయామని ఇ-కామర్స్‌లో దిగ్గజమైన ‘్ఫ్లప్‌కార్ట్’ కస్టమర్లకు క్షమాపణలు చెప్పుకుంది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినపుడు పూర్తి స్థాయి సన్నాహాలతో, సమర్ధతతో ముందుకు వస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ స్పష్టం చేశారు. వంద కోట్లకు పైగా ‘హిట్స్’ రావడంతో సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు సమర్ధించుకున్నారు. ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా 20 రెట్లు అధిక ట్రాఫిక్‌ను ముందుగానే తాము అంచనా వేసి 5 వేల సర్వర్లను ఉపయోగించామని, అయినప్పటికీ కస్టమర్ల నుంచి విమర్శలు వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది. ఇంతటి భారీ స్పందనను ఊహించనందునే కస్టమర్లందరినీ సంతృప్తి పరచలేక పోయామని, ఇకముందు ఇలాంటి ఈవెంట్‌ను మరింత మెరుగ్గా నిర్వహిస్తామని ‘్ఫ్లప్‌కార్ట్’ వ్యవస్థాపకులు భరోసా ఇచ్చారు. తాము సాధ్యమైనంత వరకూ పలు రకాల ఉత్పత్తులను వేలు, లక్షల సంఖ్యలో సిద్ధం చేసినప్పటికీ అవి ఏ మూలకూ సరిపోలేదన్నారు. సంప్రదాయ రిటైల్ వ్యాపారం వెలవెల.. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో అమ్మకాల జోరు పెరగడంతో మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం ఇప్పటికే పలు ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు తోడు స్నాప్‌డీల్, అమెజాన్.. ఇంకా అనేకానేక ఇ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా అమ్మకాలు జరపుతున్నందున దేశీయ సంప్రదాయ రిటైల్ వ్యాపారం మనుగడపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ సంస్థల అమ్మకాల దూకుడు ఇలాగే కొనసాగితే సాధారణ దుకాణాలు, షాపింగ్ మాల్స్ పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గత అయిదారేళ్లుగా ఇ-కామర్స్ కంపెనీలు దేశీయ మార్కెట్లో పాతుకుపోయేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయడంతో ఇటీవల పరిస్థితిలో అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ దేశీయ వ్యవస్థాగత రిటైల్ వ్యాపారంతో పోలిస్తే ఆన్‌లైన్ వ్యాపార పరిమాణం చాలా తక్కువే. సంప్రదాయ రిటైల్ వ్యాపారం పరిమాణం 50 వేల కోట్ల డాలర్లు ఉంటుందని ఓ అంచనా. 2013 నాటికి ఇ-కామర్స్ వ్యాపారం విలువ 1,300 కోట్ల డాలర్లు మాత్రమే. ఇటీవలి కాలంలో ఇ-కామర్స్ వ్యాపారం అనూహ్యంగా విస్తరించడంతో రిటైల్ సంస్థలు దిగాలు పడుతున్నాయి. విదేశీ పెట్టుబడులతో… దేశ, విదేశీ పెట్టుబడి సంస్థల నుంచి ఆన్‌లైన్ సంస్థలు భారీ ఎత్తున ప్రైవేటు ఈక్విటీని సమీకరిస్తున్నాయి. దేశీయ ఇ-కామర్స్ సంస్థల్లోకి గత ఆరేళ్లలో దాదాపు 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఆన్‌లైన్ సంస్థలు అంచనాలకు అందని రీతిలో ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఈక్విటీల పేరిట సమీకరించిన డబ్బునే ఇ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు, టర్నోవర్‌ను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. నిజానికి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నా కొన్ని ఆన్‌లైన్ సంస్థలు సైతం ఆఫర్ల మాయాజాలం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఇనె్వస్టర్లు సైతం ఈ సంస్థల్లోనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఆధిపత్య పోరాటం.. దాదాపు 25 కోట్లకు పైగా ఇంటర్నెట్ కస్టమర్లు ఉన్న మన దేశంలో ఆన్‌లైన్ వ్యాపారానికి పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి. అందుకే ఆఫర్లు, రాయితీల పేరుతో లక్షలాది ఉత్పత్తులను విక్రయించేందుకు ఇ-కామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కస్టమర్ల ఆసక్తే ఈ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరిగే రిటైల్ అమ్మకాల్లో దసరా, దీపావళి వాటా ఎంత కాదన్నా 40 శాతం దాకా ఉంటుంది. పండగల వేళ కొనుగోళ్లకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందునే ఆన్‌లైన్ సంస్థల మధ్య ఆధిపత్య పోరాటం ఆరంభమైంది. కొన్ని రకాల ఉత్పత్తులు తమ సైట్‌లకే పరిమితమయ్యేలా ఉత్పత్తిదారులతో ఇవి ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కేవలం ప్రచారానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే వాటి మధ్య ఎంతటి పోటీ ఉందో అవగతమవుతుంది. ప్రస్తుతం భారత రిటైల్ మార్కెట్ 31 లక్షల కోట్లని ఓ అంచనా. ఆన్‌లైన్ మార్కెట్ వ్యాపారం ప్రస్తుతం 24 వేల కోట్లకు మించిందని, ఇది అంతకంతకూ పెరిగి 2016 నాటికి 50 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ చెబుతోంది. ‘అమెజాన్’ చూపు భారత్ పైనే… ప్రపంచ ఈ-మార్కెట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ‘అమెజాన్’ కళ్లు ఇప్పుడు భారతీయ మార్కెట్‌పై పడ్డాయి. వేలాదికోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఇక్కడి మార్కెట్‌లో కుమ్మరిస్తోంది. దీనికి పోటీగా వచ్చిన దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈమధ్య ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో చేసిన తమాషా ‘ఔరా’ అన్పించింది. ఆ సంస్థ ప్రకటించిన తాయిలాలు చూస్తే నిజమేనా అన్పిస్తుంది. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? అమెజాన్ 1994లో పురుడు పోసుకుంటే- ఢిల్లీ ఐఐటీలో మార్కెట్ పాఠాలు నేర్చుకున్న సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ అందులో చేరారు. వారు అమెజాన్‌లో ఉద్యోగం చేసి వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు. తరువాత 2007లో సొంతంగా ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థను 2007లో ఏర్పాటు చేశారు. సింగపూర్‌లో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన వీరి వెబ్‌సైట్ భారత్‌లో అత్యధికులు సందర్శించే టాప్ టెన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఒకటి. 2008 వరకు పుస్తకాలు, చిన్నచిన్న ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవల తన ఆలోచనలను మార్చుకుంది. 125 కోట్ల భారతీయుల్లో 20శాతం మంది ఈ-కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారని అంచనావేసింది. ఈలోగా భారత్‌లో వేలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు అమెజాన్ ప్రకటించడంతో ఫ్లిప్‌కార్ట్ కూడా ‘సై’ అంది. ఇదిగో అప్పటి నుంచి మార్కెట్‌లో ఆయా సంస్థల ఆఫర్ల మాయాజాలం మొదలైంది. 1994లో ఈ-మార్కెట్‌లో అడుగులు వేసిన అమెజాన్ ఒక్కో దేశానికి ఒక్కో వైబ్‌సైట్ నడుపుతోంది. భవిష్యత్‌లో శ్రీలంక, దక్షిణాసియా దేశాల్లోనూ అడుగుపెట్టబోతోంది. భారత్‌లో మింత్ర డాట్ కామ్ వంటి సంస్థలతో చేతులు కలిపిన అమెజాన్ ధాటిని తట్టుకోవడం ఫ్లిప్‌కార్ట్‌కు అంత సులువేం కాదు. ఈకామర్స్ కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఈ-కామర్స్ రంగంలో 6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల అమ్ముడుపోతాయి. ఇప్పటి వ్యాపారం కన్నా అది 70 శాతం అధికమని చెబుతోంది. పైగా ఈ వ్యాపారం అంతా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మొబైల్ వినియోగదారులతో ఎక్కువగా నడుస్తోంది. టాబ్లెట్ల ద్వారా విజిట్ చేసే వినియోగదారులది రెండోస్థానం. భారత్‌లో భవిష్యత్‌లో ఈ సాంకేతిక విప్లవం వర్థిల్లే సూచనలు ఎక్కువగా ఉండటం వల్ల మునుముందు భారీస్థాయిలోనే విక్రయాలు సాగుతాయని అంచనా. అందుకే ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, మింత్ర, అలిబాబా వంటి సంస్థలు భారతీయ మార్కెట్‌లో కాసులు గుమ్మరిస్తున్నాయి. కొత్తకొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక ఈ-మార్కెట్‌లో గెలుపెవరిదో..? * ………………………………… నియంత్రణ ఉండాల్సిందే! ఆన్‌లైన్ రిటైల్ కంపెనీల దూకుడుకు పగ్గం వేయాలంటూ దేశీయ రిటైలర్లు గళమెత్తుతున్నారు. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ‘కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అసోసియేషన్’ (సిఎఐటి) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆన్‌లైన్ వ్యాపార సంస్థల ధోరణి సంప్రదాయ మార్కెట్‌ను దెబ్బ తీస్తోందని సిఎఐటి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీల అడ్డగోలు వ్యాపారాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇష్టారాజ్యంగా డిస్కౌంట్లను ఇస్తున్నాయని, అనుచిత వ్యాపార విధానాలతో సంప్రదాయ రిటైల్ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ సంస్థల దూకుడుతో భవిష్యత్తులో వ్యాపార రంగంలో గుత్త్ధాపత్యానికి దారి తీసే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల వ్యాపార విధానాలపై, వాటి పన్ను చెల్లింపులపైనా సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని రిటైల్ వ్యాపారుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తాజాగా నిర్వహించిన ‘బిగ్ బిలియన్ డే’పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన డిస్కౌంట్‌పై రిటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయడంతో అవసరమైతే కొత్త విధానాలను రూపొందిస్తామని, ఈ-కామర్స్ వ్యాపారంపై మరింత స్పష్టత తీసుకొస్తామని ఆమె చెబుతున్నారు. భారీ ఆఫర్ల కారణంగా సంప్రదాయ మార్కెట్లలోని వ్యాపారులు దెబ్బతింటారని ఆమె అంగీకరించారు. కాగా, ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈ-కామర్స్ బిజినెస్‌కు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనను ఉల్లంఘన జరిగిందా? అన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) అధికారులు కూడా ప్రకటించారు. ……………… ఈ-కామర్స్‌లోకి అగ్రశ్రేణి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తదితర సంస్థలు భారీగా లాభాలను ఆర్జిస్తుండడంతో ఈ-కామర్స్ వైపు నేడు పలు భారతీయ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. 2020 నాటికి ఈ-కామర్స్ వ్యాపారం మనదేశంలో 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉండడంతో రేమండ్స్, అరవింద్, టాటా గ్రూపు వంటి ప్రముఖ సంస్థలు ఆన్‌లైన్ వ్యాపారంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. సంప్రదాయ రిటైలింగ్, మార్కెటింగ్, పంపిణీ విధానాలకు పూర్తి భిన్నంగా ఈ-కామర్స్ విస్తరిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు భవిష్యత్తులో ఈ-కామర్స్ ప్రధాన మాధ్యమం అవుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తుండగా, మరి కొన్ని మాత్రం ప్రత్యేక విభాగాలకే పరిమితమవుతున్నాయి. ఫ్యాషన్ దుస్తులు, జ్యూయలరీ తదితర ఉత్పత్తుల్లో ప్రజాదరణ పొందిన సంస్థలు భారీగా లాభాలను చవి చూస్తున్నాయి. దీంతో కొన్ని అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు కూడా ఈ-కామర్స్‌వైపు దృష్టి సారిస్తున్నాయి. ఆన్‌లైన్ రిటైలింగ్‌లో ఆశాజనక పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ దేశీయ వ్యాపార సంస్థలు కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు సొంతంగా వెబ్‌సైట్‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తులను ఇతర ఆన్‌లైన్ సైట్ల ద్వారా విక్రయాలకు పెడుతున్నాయి. ఫ్ల్లిప్‌కార్ట్ వంటి సంస్థలపై ఆధారపడడం కన్నా సొంతంగా ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లను ప్రారంభించేందుకు వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దుస్తుల రంగంలో ప్రఖ్యాతి పొందిన రేమండ్స్ లిమిటెడ్ ఇప్పటికే సొంతంగా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇదే తీరులో ప్రముఖ దుస్తుల కంపెనీ అరవింద్ కూడా ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. టైటాన్ కంపెనీ కూడా తన సొంత పోర్టల్‌ను ప్రారంభించింది. చేతి గడియారాలు, ఆభరణాలు, కళ్లద్దాలు, బ్యాగులు వంటి పలు రకాల వస్తువులను విశ్వవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు టైటాన్ కో-ఇన్ అనే పోర్టల్‌కు రూపకల్పన జరిగింది. ఇతర కంపెనీలకు చెందిన వస్తువులను కూడా ఈ సైట్‌లో టైటాన్ విక్రయిస్తుంది. అలాగే, పారిశ్రామిక దిగ్గజం అయిన టాటా గ్రూపు కూడా తాము ఉత్పత్తి చేసే అన్నిరకాల వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించే పనిలో పడింది. ……………… ఉద్యోగాల వెల్లువ… రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలో ఈ-కామర్స్ రంగం 20 నుంచి 25 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఉద్యోగాలు వెల్లువెత్తుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయ. కనీసం లక్షన్నర మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంటున్నారు. 2016 నాటికి దేశంలో ఈ-కామర్స్ వ్యాపార పరిమాణం 50 వేల కోట్లరూపాయలకు చేరుకునే అవకాశం ఉన్నందున అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ-కామర్స్ రంగం ఆశాజనకంగా ఉన్నందున ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయని ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఇండియా సంస్థ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే, మింత్రా వంటి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నందున క్యాంపస్ నియామకాలు కూడా జోరుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ-కామర్స్ సంస్థలు భారీగా వేతనాలు ఇస్తున్నందున యువత కూడా వాటిపై మొగ్గుచూపుతోంది. ఈ సంస్థల్లో జూనియర్ స్థాయి సిబ్బందికి వార్షికంగా 1.45 నుంచి 2 లక్షలు, మధ్యస్థాయి ఉద్యోగులకు ఏటా 12నుంచి 30 లక్షల వరకు వేతన ప్యాకేజీ లభించే అవకాశం ఉన్నట్టు మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తికమాస వైశిష్ట్యం -పి.వి.సీతారామమూర్తి

ఆశ్వయుజ కార్తీకమాసాలు శరదృతువు శోభను, పర్వదిన ప్రాశస్త్యాలను – ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి. శరదృతువు ఈ విశ్వమంతటినీ గిలిగింతలు పెడుతూ వుంటుంది.
పతనాలనుంచి కాపాడే శశాంక శేఖరుడు పరమ శివుడు. పోషక శక్తి ప్రదాత- అధిష్ఠాత, సమస్త ప్రాణులను సంరక్షించి జీవికను యిచ్చే విష్ణుమూర్తికి అత్యత ప్రీతికర మాసము కార్తీకమాసం. ఈ పవిత్ర మాసం స్నానమునకు- దీపమునకు- దానాలకు ప్రసిద్ధియైనది. ఆహ్లాదకరమైన ఈ శరదృతువులో చంద్రుడు పుష్టి కలిగి తన చల్లని కిరణముల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని అందిస్తాడు. ఈ మాసంలో శివుని మారేడు దళాలతో- జిల్లేడు పూలతోనూ, శ్రీ మహావిష్ణువును తులసీ జాజి పూవులతోను పూజించాలని శాస్త్రం చెబుతున్నది.
పరమేశ్వరుడైన శివునికి సోమవారం చాలా యిష్టం గనుక ఆ రోజున ఉపవసించడం ఎంతో మేలు. కార్తికంలో వనభోజనాలకు ప్రశస్తం గావున పలు రకాల వృక్షములున్న ప్రాంతంలో ఉసిరికచెట్టును పూజించి దాని క్రింద కూర్చుని పనస ఆకుల విస్తర్లలో భోజనం చేయాలని పురాణాలు తెలిపాయి. కార్త్తిక శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలి. ఈ మాసంలో ఏ సత్కార్యం చేసినా ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అని ఆచరించాలి.
ఋతుప్రభావంవలన- పరివర్తనాల వలన వాతావరణంలోని మార్పులను దృష్టిలో వుంచుకొని శారీరక- మానసిక – ఆధ్యాత్మిక ఆరోగ్యాలకూ వాటికీ వున్న సంబంధమును వైజ్ఞానిక దృష్టితో అర్థం చేసుకోవాలి. ఈ నెలలో నదులూ చెరువులు- బావుల నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారంవలన తేజస్సునూ, బలాన్ని సంతరించుకొని వుంటుంది. కావున ఇండ్లలో స్నానాలు చేయవద్దన్నారు. దేవుని ఆరాధనకు కావలసిన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ మాసం సాధనకు అనుకూలమైనది.
శరదృతువులోని పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. ఈ జలస్నానం మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పైత్య ప్రకోపాలను తగ్గించే స్నానం యిది. అమృతతుల్యం. మానవాళికి ఉపయుక్తమైనది. నదీ ప్రవాహంలో ఓషధుల సారం ఉంటుందని కృష్ణయజుర్వేదంలో ఒక మంత్రం తెలుపుతుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడంవలన ఈ హంసోదకం స్నానపానాదులకు అమృత తుల్యమని మహర్షి చరకుడు తెలిపినాడు. నదులు ప్రవహించే వేళ ఆ నీటిలో తెలియకుండా విద్యుత్ శక్తి ఉంది. శరీరానికి శక్తినిస్తుంది. మూడు దోసిళ్ల నీరు తీసికొని తీరానికి చల్లి, తరవాత బట్టల పిండుకోవాలి. దీనినే ‘యక్షతర్పణం’ అంటారు. పొడి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేయాలి.
ఈ తులామాసంలో గోష్పాదమంత జల ప్రదేశంలో అనంత శయనుడైన విష్ణువు నివసించి ఉంటాడని ధర్మశాస్త్రాలు చెబుతుంది. కార్తీక శుద్ధ విదియను యమద్వీతీయ అంటారు. లేదా భగినీ హస్త భోజనం అనగా ఈ రోజున సోదరి చేతి వంట తినాలి. యముడు విదియనాడు తన సోదరి యమున ఇంటిలో ఆమె వండి వడ్డించగా భోజనం చేశాడుగాన దీనికి ‘యమ ద్వితీయ’ అని పేరు. భోజనం పిదప సోదరికి వస్త్రాలంకారాలు సమర్పించాలి. నాల్గవ రోజు శుద్ధ చవితి నాగుల చవితి పర్వదినం. ఈ రోజున స్ర్తిలు పుట్టలలో పాలు పోసి చలిమిడి- వడపప్పు- నువ్వులతో చేసిన తీపి వుండలు- నైవేద్యాలుగా సమర్పిస్తారు. శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కృతయుగంలో దేవదానవులు క్షీర సాగర మథనం చేసిన రోజు. మరొకటి కార్తీక పౌర్ణమి. ఈ వేళ ఉసిరికాయలమీద వత్తులుంచి దీపాలు పెడతారు. నదుల్లో వదులుతారు. పండితులకు దీపదానం చేస్తారు.
ఈ మాస నియమాలు:ఈ నెల రోజులు ఇంగువ-ఉల్లి-వెల్లుల్లి- ముల్లంగి- గుమ్మడి- శెనగ- పెసర- అల్చందలు- నువ్వులు నిషిద్ధం. మాంసాహారం నిషిద్ధం. కంచు పాత్రలో భోజనం చేయరాదు. ఆదివారం కొబ్బరికాయ, ఉసిరికాయ తినరాదు.

 

 

నాగుల చవితి

సుబ్రహ్మణ్య షష్ఠి, స్కందపంచమి, కుమారషష్ఠి లానే కార్తిక చతుర్ది కూడా నాగులకు విశేషమైందే. శ్రావణ పంచమి నాడు నాగుల పుట్టలో పాలు పోసి పూజించినట్లే కార్తిక చవితినాడు పుట్టలో పాలు పోయటం, నాగులను పూజించటం చేస్తారు. ఈ నాగుల చవితినాడు పొద్దునే్న చన్నీటిస్నానం ఆచరించి ఇంట్లో నాగపడిగకు కాని నాగ ప్రతిమకుకాని పూజ చేస్తారు. ఆ తరువాత చల్లని పానకాన్ని, వడపప్పు, చలిమిడి, పాలు, కొబ్బరికాయ లాంటి వాటిని తీసుకెళ్లి పుట్టకు సమర్పిస్తారు. పుట్టకు దారం చుట్టటం కూడా కొందరు చేస్తుంటారు. పుట్టకు కొంతమంది కోడిగుడ్లు కూడా సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంతానాభివృద్ధి జరుగుతుందని వారి నమ్మకం. నాగపుట్ట చుట్టూ నూకను చల్లుతూ ‘నాగరాజా నీవు నూక తీసుకొని మాకు మూకను ఇవ్వు’ అని ప్రార్థిస్తారు. మేము తెలియక చేసిన అపరాధాలను మన్నించమనీ ప్రార్థిస్తారు. ‘పడగ తొక్కతే పసివాడనుకో, నడుము తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలిగిపో’ అని నాగులకు వేడుకొంటారు. నాగపూజ వలన నేత్ర, ఉదర, కర్ణ సంబంధ వ్యాధులనుకూడా దూరం అవుతాయ.
నాగులను పూజించటం వల్ల వంశాభివృద్ధి, సౌభాగ్యసిద్ధి , సర్వాభీష్టాలు కలుగుతాయి. అసలు పిల్లలు పుట్టలేదని బాధడపడేవారు సైతం నాగ పూజ చేస్తేవారికి సంతానం కలుగుతుంది. శివపార్వతులు లోక కల్యాణంకోసం పుత్రార్థులై ఉన్నసమయంలో దేవతలు ఆటకం కలిగించినందుకు పార్వతి ఎంతో కోపగించుకొంది. ఆ సమయంలో బయల్వెడలిన శివతేజస్సును దేవతల కోరికపై అగ్ని ధరించాడు. అగ్ని వల్లకాక గంగకు శివరేతస్సును ఇవ్వగా గంగ కూడా భరించలేక రెల్లువనంలో శివరేతస్సును విడిచిపెట్టింది. అక్కడ శే్వతపర్వతం ఏర్పడింది. దాన్నుంచి శరవణం ప్రభవించింది. ఆ రెల్లు వనంలోని శివతేజస్సునుంచే బాలుడు ఉదయించాడు. ఆ బాలునికి కృత్తికలు పాలివ్వగా ఆరు ముఖాలనుంచి పాలు గ్రోలాడాబాలుడు. అందుకే కార్తికేయనామధారుడయ్యాడు. ఇతనికే సుబ్రహ్మణ్యుడన్న పేరు వచ్చింది. దేవమానవులను హింసించే రాక్షసాధముడైన తారకుణ్ణి సంహరించమని దేవతలు కోరగా దేవసైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్లి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. దేవతలు మెచ్చి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేశారు. ఈ సుబ్రహ్మణుడి ప్రీత యర్థమే నాగుల చవితి పూజలు చేస్తుంటారు.
మనకు కనిపించే నాగులు ద్విజ్విహులుకావడానికి ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కశ్యపప్రజాపతికి కద్రువ వినతలు భార్యలు. తన సవతి అయన వినతతో కద్రువ ఓ సారి తాను చూచిన గుర్రపు తోక నల్లగా ఉందని పందెం కాసింది. వీరిద్దరిలో ఎవరి మాట తప్పు అయతే వారురెండవ వారికి దాసిగా ఉండాలని పందెం వేసుకొన్నారు. తాను నెగ్గాలనుకొన్న కద్రువ తన సంతానాన్ని వెళ్లి ఆ గుర్రపు తోకకు చుట్టుకొని ఉండి తనను గెలిపించమని కోరింది. తన కొడుకు వలన గెలిచిన కద్రువకు వినత దాసి అయంది. ఆ దాస్యత్వం పోగొట్టడానికి ఏం చేయాలని వినత కుమారుడైన గరుత్మంతుడు నాగులను కోరగా వారు ఇంద్రుని దగ్గర ఉన్న అమృతభాండాన్ని తెచ్చి ఇవ్వమనికోరారు. వారు చెప్పిన విధంగా – దేవతలతో యుద్ధం చేసి గెలిచి అమృత భాండాన్ని తీసుకొని రాబోతుండగా ఇంద్రుడు గరుత్మంతుని పట్టుదలా, నిజాయతీల మెచ్చుకుని నీవు ఈ అమృతభాండాన్ని నాగులకిచ్చి స్నానం చేసి శుచులై వచ్చి తీసుకోమని చెప్పమని చెప్పాడు. ఇంద్రుడు చెప్పినట్లుగానే గరుత్మంతుడు నాగులకు చెప్పి దర్భపైన అమృతభాండాన్ని పెట్టాడు గరుత్మంతుడు. నాగులు శుచులై వచ్చేలోపు ఇంద్రుడు అమృతభాండాన్ని తీసుకొని వెళ్లగా ఆ దర్భలను నాగులను నాకారట. దానితో దర్భలవల్ల నాలుక రెండుగా చీలినా అమృతభాండస్పర్శఉన్న దర్భల వల్ల వారికి అమృతత్వం వచ్చిందంటారు.
అనార్యుల నుంచి ఈ నాగారాధన ఉన్నట్లు చారిత్రికంగా తెలుస్తోంది. నాగ పత్రిమలు మొహంజదారో తవ్వకాల్లో బయల్పడ్డాయ. బౌద్ధ, జైనులు కూడా నాగులను ఆరాధిస్తారు. ఈజిప్టు, గ్రీక్, పర్షియా లాంటి దేశాల్లో అయితే సర్పాలను సస్యదేవతగా పూజించటం కనబడుత

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు పి ్‌ఎచ్ .డి . పొందిన -శ్రీ చిలుకూరి నారాయణ రావు

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు

ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా అప్పుడే అక్కడ ఉన్నాడు .కనుక కాలం1294-1325గా భావిస్తారు .కాకతి రాజులకాలం లో నాటకాలు అలంకార శాస్త్రాలు నాట్య శాస్త్రాలు ,చారిత్రిక కావ్యాలు ఎన్నో సంస్కృతభాషలో వెలువడ్డాయి .అగస్త్యకవి ఒక వ్యక్తీ కాదు ఒక సాహిత్య సంస్థ అని పించాడు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసన పట్టినట్లు ఈ అగస్త్యకవి సాహిత్య సముద్రాన్ని ఆపోసన పట్టి అపర అగస్త్యుదనిపించుకొన్నాడు అతని సమర్ధతకు నిదర్షం గా ఆయన రాసిన 74గ్రంధాలే సాక్ష్యం .

సాహితీ అగస్త్యం

అగస్త్యుడు సంస్కృతం లో సంక్షిప్తం గా భారతం రాసి బాల భారతం అని పేరుపెట్టాడు .ఇరావై సర్గ లున్న ఈకావ్యం వైదర్భీ రీతిలో రాయ బడింది .చక్కని ఆవ్య వర్ణనలు చేశాడు ఋతు వర్ణన అమోఘం గా చేశాడు .వసంత ఋతు వర్ణనలో ‘’పుష్ప పరాగం వసంత లక్ష్మి చల్లిన రంగుల్లాగా ఉన్నదట .క్లిష్టత లేక స్పష్ట సుందరం గా చెప్పటం అతని ప్రత్యేకత .కాళిదాసు ను జ్ఞప్తికి తెస్తాడు .భారత యుధం లో చంద్రుడు తన వంశం అంతరించిపోతోందని తెలిసి చూడలేక త్వరగా అస్తమించాడని వర్ణించాడు .-

‘’శీతాంశుర్నిజ ఉల జన్మనాం నృపాణాం సంగ్రామే నిధాన మపెక్షితుం –శృంగాణి క్షణ మవలంబ్య రశ్మి హస్తై రస్తాద్రేఃపయసాంనిధిం ప్రపేదే ‘’.ఈ ఆవ్యానికి విజయ నగర సామ్రాజ్య చక్ర వర్తి శ్రీకృష్ణ దేవరాయల ముఖ్యమంత్రి అప్పాజీ అనే తిమ్మరుసు ‘’మనోహర ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .దీని ఆధారం గా తమిళం లో ‘’విల్లి భారతం ‘’రాయబడిందట .

నల ఈర్తి కౌముది అనే రెండవ కావ్యాన్ని అగస్త్యుడు రాశాడు .ఇందులో రెండు ,నాలుగు సర్గలు మాత్రమె దొరికాయి శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దీని లిఖితప్రతి ని సంపాదించి తలుగు అకాడెమి జర్నలో లో ప్రచురించారని తెలుస్తోంది .రెండు సర్గల సరళిని చూస్తె ఇది మహా కావ్యం అనిపిస్తుంది .రెండవ సర్గలో నలుడు విదర్భలో దేవతలా దూతగా ప్రవేశించటం ఉంది నాలుగవ సర్గ లో నల దమయంతుల వివాహం తర్వాత నలుడు మామ గారింట్లో ఒక నెల గడిపి తన నిషాద నగరానికి వచ్చినట్లుంది .నలుడు దామయన్తితో నిషాద నగరానికి వస్తూఉంటె పురజనులు వేడుక తో చూసే వర్ణన ను రఘువంశం లో కాళిదాసు వర్ణించిన తీరుగా ఉంటుంది .తెలుగుకవులుకూడా ఈ విషయాన్ని అందం గా తమకావ్యాలలో వర్ణించారు అంతటి ప్రేరణ కల్గించి అగస్త్యుని రచన .ఈ సర్గాలోనే వసంత ,వర్శర్టు వర్ణన ,జలక్రీడలు వర్ణింప బడ్డాయి .ప్రతి సర్గ చివర ‘’శ్రీ ‘’శబ్దాన్ని భారవిలాగా ప్రయోగించాడు రెండవ సర్గలో డెబ్భై నాలుగవ శ్లోకాన్ని వాసు చరిత్రకారుడు రామ రాజ భూషణుడు అనువాదం చేసి పొందుపరచాడు ఆ పద్యమే ‘’నానా సూన వితాన వాసనలు –‘’.పన్నెండవ శతాబ్దం తర్వాత వచ్చిన కవుల్లో అగస్త్యుడే ప్రతిభా శాలి అంటారు .

58-వేదాంత దేశికులు

1268-1369కాలానికి సస్మ్బంధించిన వేదాంత దేశికుల వారు అపర రామానుజవతారం అంటారు .నూటపాతిక దాకా సంస్కృతం లో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన అపర సరస్వతీ స్వరూపులు .వైష్ణవ మాట వ్యాప్తికి ఇతోధికం గా తోడ్పడ్డారు .అసలు పేరు వెంకట నాధుడు .తమిళం లోను గొప్ప పండితులు .గొప్ప దార్శనిక్లుగా సుప్రసిద్ధులు .వేదాన్తాచార్య ,కవితార్కిక సింహ ,సర్వ తంత్ర స్వతంత్ర బిరుదాంకితులు దేశికులు .ఇరవై ఏడేళ్ళ వయసులోనే దేశిక ,ఆచార్య సర్వ తంత్ర స్వతంత్ర బిరుడులన్డుకొన్నారు .శ్రీరంగ స్వామి రంగనాధుడు దేవి రంగనాయకి స్వయం గా దేశికుల భక్తికి కవితా శక్తికి ,పాండిత్యానికి మెచ్చి వేదాన్తాచార్య బిరుదు ప్రదానం చేశారని అంటారు .తమిళనాడు లోని తిరువహిందిపురం లో గురువు ఆజ్ఞతో గడిపి గరుడాళ్వార్ ను సేవించి అనుగ్రహం పొంది హయగ్రీవ మంత్రాన్ను ఉపాసించి అనుగ్రహానికి పాత్రుడైనారు .అప్పటి నుంచి లక్ష్మీహయగ్రీవ భక్తులై జీవితాన్ని చరితార్ధం చేసుకొన్నారు .ఆసేతు హిమాచల పర్యంతం తీర్ధ యాత్రలు చేసి విశిష్టాద్వైత మత ప్రచారం చేశారు .యెంత ఎదిగినా ఒదిగి ఉన్నారు దేశికులు .’’వేదాంత దేశిక పధేవిని వేశ్య బాలాం’’’ అని అతి వినయం గా చెప్పుకొన్నారు .’’భగవానుడు ఒక బాలకుడికి ఆచార్య స్థాయిని కల్పించాడు .యెంత దయామయుడో’’అన్నారు .శ్రీరంగాన్ని మదురై సుల్తాన్ ఆక్రమించగా విజయనగర రాజ్య స్థాపకులు  దేశికుల సహా విద్యార్ధి అయిన విద్యారణ్య స్వామి శ్రీరంగం వచ్చి ఇక్కడి పరిస్తితులను అధ్యయనం చేసి గోపనార్యుడు అనే బ్రాహ్మణ సైన్యాధ్యక్షునికి దక్షిణ భారత దేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తి కలిగించమని ఆదేశించారు .ముందుగా జెంజిని జయించి స్వాధీనపరచుకొని ,తిరుపతి లోఉన్న శ్రీరంగాని విగ్రహాన్ని అక్కడికి తాత్కాలికం గా తెప్పించాడు .వెంటనే శ్రీరంగం లోని సుల్తాన్ సైన్యం పై విజ్రుమ్భించి ఓడించి ,శ్రీరంగానాదుడిని మరల శ్రీరంగం లో ప్రతిస్టించాడు గోపనార్యుడిని సాక్షాత్తు విష్ణు అవతారం అని భావిస్తారు .

దేశికీయ కవిత్వం

వేదాంత దేశికులు సర్వార్ధ సిద్ధి ,న్యాయ పరిశుద్ధి ,న్యాయ సిదాన్జన,మీమాంసా పాదుక ,అధికరణ సారావళి ,శాత దూషిణి,సచ్చరిత్ర రక్ష ,నిషేపరాక్ష ,పంచ రాత్ర రక్ష మొదలైన సంస్కృత గ్రంధాలను దార్శనిక సంబంధమైనవిగా లెక్కిస్తారు .రామానుజుల ‘’శ్రీ భాష్యం ‘’కు తత్వ టీకను ,తాత్పర్య చంద్రికలను ,యామునా చార్యుల గీతార్సరధ సంగ్రహ రక్షను ,రామానుజుల గద్య త్రయానికి రహస్య రక్షను ,ఈశావాస్యోపనిషత్ భాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు .ద్రావిడ ప్రబంధ మైన  ‘’తిరువాయి మొలి’’ని  సంస్కృతీకరించారు .

యాదవాభ్యుదయం అనే మహా కావ్యాన్ని ,సంకల్ప సూర్యోదయం అనే నాటకాన్ని ,హంస సందేశం అనే లఘు కావ్యాన్ని ,పాదుకా సహస్రం ,వరద రాజ పంచాశతి ,గరుడ దండకం అనే ముక్తక కావ్యాలను రాశారు దేశికులు రామాయణ కదా సారాన్ని ‘’రఘువీర గద్య ‘’గా సంస్కృతం లో రాశారు అచ్యుత శతకాన్ని ప్రాకృతం లో రాశారు వేదాంత దేశికులు దార్శనికులుగానేకాక మహా పండిత ప్రకాన్డులుగా ,మహా వ్యాఖ్యాతగా ,మహోన్నత కవిగా రాణ కెక్కారు .

దేశికుల యాదవాభ్యుదయం లో ఇరవై నాలుగు సర్గాలున్నాయి .శ్రీకృష్ణ చరిత్రకావ్యం ఇది .కృష్ణుని జీవితం లోని ప్రతి సంఘటన వెనుక ఉన్న దార్శనికార్ధాన్ని కమ్మని శైలిలో వర్ణించారు .ఈ కావ్యానికి అప్పయ్య దీక్షితులు వ్యాఖ్యానం రాయటం మరో విశేషం వర్ణనలలో వేదాన్తపర మైన ఉపమానాలను వాడటం దేశికుల ప్రత్యేకత .-

‘’వివిధ ముని గణోప జీవయా తీరదా విగామిత సర్ప గణా పరేణ పుంసా –అభిజిత యమునా విశుద్ధ ముగ్ర్యాం శమిత మహిర్మాట సంప్లవా త్రయీవ ‘’-అర్ధం –మూడు వేదాలని చదువుకొన్న వాడి చేత ఇతర మతాలూ ఏ విధం గా శమింప చేయ బడతాయో అదే విధం గా యమునా నది సర్పాల నన్నిటిని పార ద్రోలిన తర్వాత పరి శుద్ధమై విశుద్ధం గా ప్రకాశిస్తోంది .

 

దేశికులు సంకల్ప సూర్యోదయం అనే నాటకం రాశారు ఇందులో మోహ పరాజయం ,వివేకోదయం లను చెప్పారు .శాంతరసం వలన మనో వికారాలు శమించి ఆనందానుభూతి కలిగిస్తుందని వివరించారు .ఇది దార్శనికతకు ప్రతీకాత్మక నాటకం .

దేశికులు రహస్య గ్రంధాలైన ‘’తత్వ పదవి ,రహస్య పదవి తత్వ నవనీతం ,రహస్య నవనీతం ,తత్వ మాతృక ,రహస్య మాతృక ,తత్వ సందేశం ,రహస్య సందేశవివరణం ,తత్వ రత్నావళి ,తత్వ రత్నావళి ప్రతిపాద్య సంగ్రహం ,రహస్య రత్నావళి,రహస్య రత్నావళి హృదయం ,తత్వ త్రయ చూలకం ,రహస్య త్రయ చూలకం ,అభయ ప్రదాన సారం ,రహస్య శిఖామణి ,అంజలి వైభవం ,ప్రదాన శతకం ,ఉపహార సంగ్రహం ,సార సంగ్రహం ,మునివాహన భోగం ,మధుర కవి హృదయం ,పరమ పద సోపానం ,పరమత భంగం ,హస్తిగిరి మహాత్మ్యం ,శ్రీమత్ రహస్య త్రయ సారం ,సారసారం ,పరిహారం . ,

దేశికులు హంస సందేశం అనే కావ్యం రాశారు .రాముడు హంస ద్వారా సీతా దేవికి సందేశం పంపటం ఇందులోని వృత్తాంతం .దక్షిణ దేశం గుండా హంస పర్యటించి ,సముద్రం మీద రామ బాణం లాగా దూసుకు వెళ్లి యెగిరి లంక చేరి రామ సందేశాన్ని సీత కు సందేశం అందజేస్తుంది .దేశికుల ‘’పాదుకా సహస్రం ‘’ను ‘’మాగ్నం ఓపస్’’ గా భావిస్తారు .ఇది1008 శ్లోకాల భక్తిమాల .ఇందులో ముప్ఫై రెండు పదాదిలు ఉన్నాయి .రోజుకు ఒకటి చొప్పున ముప్ఫై రెండు రోజులలో దీన్ని భక్తితో పఠిస్తే కోరికలు తీరి మోక్షం లభిస్తుంది అని నమ్మం .చిత్ర పదాలతో లలిత సుందరం గా రాసిన భక్తీ కుసుమమాల ఇది .ముఖ్యం గా శ్రీరామ శ్రీకృష్ణ ,శ్రీ రంగనాధ స్వామి పాదపద్మా లపై రాసిన శ్లోక సముదాయం .ఇది చదివితే ఆత్మ జ్ఞానం లభించటం ఖాయం .వేదాంత దేశికులు ఎక్కని సోపానాలు లేవు .అందని పురస్కారాలు లేవు .కదిలించని రచనలు లేవు .అన్నిటా దేశికులు మహా మార్గ దర్శులే .

మరోకవితో కలుద్దాం

Swamy Desikan.jpg

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు- నది పత్రికలో

10358125_463739887097237_933547058037116647_n 10688000_463740267097199_4785532005841422699_o 68961_463740390430520_3492032012266459891_n 10501888_463740477097178_6556041745055068840_n 10447538_463740557097170_958199359059903359_n 10402765_463740650430494_2261025788983526428_n 1554364_463740743763818_96905378363693578_n 10689599_463740867097139_6258573982857227235_n 10712861_463741010430458_8518551558265989551_n 10366046_463768143761078_5512087312742271172_n

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

56-సిద్ధ యోగి పుంగవుడు   –అప్పయ్య దీక్షితులు

పౌండరీక ,వాసుదేవాది యజ్ఞయాగాదులను నిరంతరం చేస్తూ వైదిక ధర్మాన్ని అద్వైతమత ప్రచార దీక్షగా జీవితాన్ని గడిపి మూడు అలంకార శాస్త్రాలను రాసి ,బహుముఖ ప్రజ్ఞాశీలి ,అపర శివావతారం అనిపించుకొన్న అప్పయ్య దీక్షితులు 1520-1593కాలం వాడు .తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా (ఉత్తర ఆర్కాడు )ఆరణి దగ్గర ఆడయ పాలెం లో గణపతి సుబ్రహ్మణ్యశర్మ  గా ప్రమాదీచ సంవత్సరం కన్యా మాసం కృష్ణపక్షం లో ఉత్తరా నక్షత్రం లో జన్మించాడు .తండ్రి రంగ రాజాధ్వరి .భరద్వాజ గోత్రీకుడు .గణపతికి అప్ప అనే పెరున్దికనుక నామకరణ మహోత్సవం లో అప్పయ్య దీక్షితులు అనిపేరు పెట్టారు .తమ్ముడు అచ్చన్ దీక్షితులు .రామకవి అనే గురువువద్ద అప్పయ్య వేదం వేదాంగాలు అభ్యసించాడు .చాలా చిన్నతనం లోనే పద్నాలుగు విద్యలలో అపార పాండిత్యాన్ని సంపాదించాడు .కృష్ణ దేవా రాయల గురువు తాతా చార్యులు వైష్ణవాన్ని బాగా ప్రచారం చేస్తున్న సమయం లో కాశీ లో ఉన్న అప్పయ్య దీక్షితులకు తెలిసి విజయ నగరం చేరి ఆచార్యులను తనతో వాదానికి రమ్మన్నాడు .అప్పయ్య ప్రతిభ తెలిసిన రాయలు ఆచార్యులను వాదానికి దిగవద్దన్నాడు.కానీ రెచ్చిపోయిన తాతాచార్యులు వాదానికి దిగి ఓడిపోయి చేసుకొన్నా ఒప్పందం  ప్రకారం శైవాన్ని స్వీకరించేందుకు సిద్ధపడ్డాడట .అప్పయ్య లేక పొతే అందరూ నిలువు బొట్టు వాళ్ళే అయ్యేవారన్నమాట .ఆ ప్రమాదాన్ని తప్పించిన వాడు అప్పయ్య దీక్షితులు .

దేశాటన చేస్తూ వేద విరోధులను వాదం లో ఓడిస్తూ వైదిక మత ప్రచారం చేశాడు .వెల్లూరు ,తంజావూరు ,విజయ నగర ,వెంకట గిరి రాజుల ఆస్థానాలలో పండిత స్థానాన్ని అలంకా రించి  గౌరవ సన్మానాలు అందుకొన్న విదుషి అప్పయ్య దీక్షితులు .వాదనలో అపర రుద్రుడిలా విజ్రుమ్భించి ప్రతిపక్షులను గడగడ  లాడించే వాడు .దీనితో అతనిని ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్రలు కూడా తెర వెనుక జరిగినా మొక్క వోని ఆత్మా విశ్వాసం తో అప్రతిహతం గా ముందుకు సాగాడు దీక్షితార్ .రాజులు మహారాజులు ఎందరో అప్పయ్య అప్రతిహత విద్యా నైపుణ్యానికి దాసోహం అన్నారు .వారికి ధర్మ ప్రబోధం చేసి ఆత్మ మార్గాన్ని తెలియ జేశాడు .ఆశువుగా శ్లోకాలు గంగా ప్రవాహం గా చెప్పి అప్రతిభులను చేసే నేర్పు అప్పయ్యా దీక్షితుల సొమ్ము .తన వాక్ చాతుర్యం తో యుక్తితో ,సంయమనం తో ,విశాల హృదయం తో ,అల్ప మనస్కుల ను ఎదిరించి పరివర్తన తెచ్చిన ఘనత అప్పయ్య దీక్షితులది .

అప్పయ్య కవితా దీ(ద)క్షితీయం

కవిత్వం ,శైవాద్వైత ప్రచారం ,యజ్న యాగాదులతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతూ ఒక ‘సిద్ధ యోగి పుంగవుడు ‘’గా గడిపాడు .సాధించిన ఎన్నో మంత్ర విద్యలను ప్రదర్శించాడు .చివరికి వాటివల్ల ఆరోగ్యానికి భంగం కూడా కలిగింది .కొందరు ఆయనపై ప్రయోగాలు చేసి దుస్టశక్తులను ఆయనపైకి పంపేవారు ..ధ్యానం లో మునిగి ఉన్నప్పుడు సమాధి స్తితిలోకి చేరేటప్పుడు తనముందు కొన్ని తువ్వాళ్ళను ఉంచేవాడు .ఆ యోగ శక్తితో ఆయన లోని దుస్టశక్తులు ,వ్యాధులు  ,తువ్వాలళ్ళలో చేరేవి .అప్పుడు అవి పిచ్చెక్కి నట్లు నాట్యం చేయటం  శిష్యులు గమినించే వారు .సమాధినుండి బయటికి రాగానే ఆ తువ్వాళ్ళను మళ్ళీ మీద వేసుకొనేవాడు .

‘ఆత్మార్పణ స్తుతి ‘’కావ్యం రాశాడు . దీనికి ఒక  కధ ప్రచారం లో ఉంది .ఇది యాభై శ్లోకాల కావ్యం .ఒక్కొక్క శ్లోకం తో లోపలి ఆత్మను కర గించి వేశాడు .మరి ఈకావ్యం ఎలా రాశాడు ?తన ఆత్మ శక్తిని భగవంతునిపై తనకున్న వీర భక్తిని  పరీక్షించుకోవాలనే కోరిక కలిగిందట .అందుకని ‘’దాతుర ఫల రసం ‘’(ఉమ్మెత్త కాయల రసం )తాగాడు .అది తీవ్రమైన మత్తు పిచ్చి ఎక్కిస్తుంది  .పిచ్చి ఎక్కి మత్తులో తన నోట వచ్చిన ప్రతి వాక్యమూ రాయమని శిష్యులకు ముందే చెప్పాడు .ఇలాంటి స్తితిలో లోపల అణచ బడిన భావాలన్నీ ఒక్క ఉదుటున దూసుకు బయటికి వస్తాయి .ఈ స్తితిలో అప్పయ్య దీక్షితుల నోటి నుండి ఆశువుగా వెడలిన కావ్యమే ‘’ఆత్మార్పణ స్తుతి ‘’.దీనికి అప్పటి నుంచి ‘’ఉన్మత్త పంచ దశి ‘’అనే పేరొచ్చింది .అదీ ఆ మహా సిద్ధుని ప్రతిభ .

అప్పయ్య దీక్షితులు సంసృతం లో చిన్నా పెద్దా  నూట నాలుగు రచనలు చేసినా అందులో ముఖ్యమైనవి 60 రచనలు . .ఇందులో వేదాంత ,శివాద్వైత ,వ్యాకరణ ,మీమాంస  కావ్య వ్యాఖ్యాన , అలంకార ,భక్తీ స్తోత్రాలున్నాయి .శివాద్వైతులు అప్పయ్యను తమ వారిగా భావిస్తారు .యెంత శివ భక్తుడో అంతటి వైష్ణవ  పారమ్యం ఎరిగిన వాడు .బ్రహ్మ సూత్రాలలో చెప్పబడిన విషయాలను ‘’చతుర్మత సారం ‘’గా రాశాడు .నయ మంజరి లో అద్వైతాన్ని ,నయ మణిమాల లో శ్రీకాంత మతం గురించి చెప్పాడు .నయ మయూఖ మాలిక లో రామానుజుని విశిష్టాద్వైతం గురించి ,నయ ముక్తావళి లో మధ్వాచార్యుల వైష్ణవ మతాన్ని గూర్చి చెప్పాడు .ఇలా బ్రహ్మ సూత్ర రహస్యాలను అన్ని మతాలకు అన్వయిన్చేట్లు చెప్పిన మహా విద్వాంసుడు అప్పయ్య దీక్షితులు .ఇవన్నీ ఆయ మతాలకూ ఆధార గ్రంధాలుగా రిఫరెన్స్ పుస్తకాలుగా పూజనీయ స్థానం లో ఉన్నాయి .

దీక్షితులు రాసిన వేదాంత గ్రంధాలలో ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’ప్రముఖ స్థానాన్ని పొందింది .వివిధ ఆలోచనా ధోరణులను ఏకం చేసి అద్వైత ముఖ్య ప్రవాహం లో కలిపిన అతని వైదుష్యం హర్షణీయం .ఏక జీవ వాదం నానా జీవ వాదం ,బింబ ప్రతి బింబ వాదం ,సాక్షిత్వ వాదం మొదలైన వాటిని ప్రశ్నించి ఉన్నది. ఒకటే బ్రహ్మం అయితే ఇన్ని వాదాలేమిటన్నాడు .అందరూ మూల సూత్రాన్ని ఒప్పుకుంటూ భిన్న మార్గాలలో నడిచి దూరమైపోయారన్నాడు .అమలానంద రాసిన ‘’కల్ప తరు వు ‘’కు ‘’పరిమళ ‘’అనే అద్భుత వ్యాఖ్యానాన్ని రచించాడు .వాచస్పతి మిశ్ర రాసిన ‘’భామతి ‘’కి కల్పతరువు ఒక వ్యాఖ్యానమే .ఇది ఆది శంకరాచార్యుల సూత్ర భాష్యానికి వివరణం .

బ్రహ్మ సూత్రాలకు ‘’శివార్క మణి దీపిక ‘’అనే అమోఘమైన భాష్యాన్ని అప్పయ్య దీక్షితులు రాయటం మన అదృష్టం .ఇందులో శివ వైష్ణవాద్వైతాన్ని స్తాపించాడు .ఈ గ్రంధమూ ,పరిమళ గ్రంధము అప్పయ్య దీక్షితుల మేధో సర్వస్వం గా (మేగ్నం ఓపస్ )గా భావిస్తారు .ఇవి విషయం లో, గ్రంధ రూపం లో అతి విశిష్టమైన  ఉద్గ్రంధాలు .వెల్లూరు రాజు చిన్న బొమ్మ దేవర అప్పయ్య దీక్షితులతో శివార్క దీపిక ను  బోధింప జేయటానికి   500మంది విద్యార్ధులతో ఒక కళాశాల  నెలకొల్పాడు .వీరందరికీ నేర్పి అద్వైత భావాలలో నిష్ణాతులను చేసి భావ వ్యాప్తి చేయించాడు .

దీక్షితుల దృష్టిలో ద్వైతం కింది మెట్టు .విశిష్టాద్వైతం మధ్య మెట్టు ,శివాద్వైతం అద్వైతం ఒకటే అయిన ఆఖరి మెట్టు .శ్రీ కాంత శివాచార్యుని శివాద్వైతాన్ని అప్పయ్య అనుసరించి బ్రహ్మ సూత్రాలకు ఈ ధోరణిలో వ్యాఖ్యానం రాశాడు .దీక్షితులు వేదాంత దేశికుల మెప్పు పొందాడు .కువలయానందం లో ముకుందుని కీర్తించాడు .హరిహర అభేదాన్ని అప్పయ్యదీక్షితులు చెప్పినంత గాఢం గా అంతకు ముందెవరూ చెప్పలేదు .మీమాంస శాస్త్ర వ్యాప్తికి అప్పయ్య చేసిన కృషి అద్వితీయం .కౌస్తుభం అనే వ్యాఖ్య రాశాడు .విది రసాయనం  ,కువలయానందం లను విజయ నగర ప్రభువు పెనుగొండ రాజు వెంకట పతి రాయలు గుర్తించి ఆస్తానాన్నికి సగౌరవగా ఆహ్వానించి సన్మానించాడుఅంకితం పొందాడు  .సిద్ధాంత కౌముది రాసిన భట్టోజి దీక్షితులు అప్పయ్యను రాజుకు పరిచయం చేశాడు .అప్పయ్య రాసిన కువలయానందం చిత్ర మీమాంస ఎందరో విద్యార్ధులకు పఠనీయ గ్రందాలయ్యాయి .ఆయన రాసిన దుర్గా స్తుతి ,ఆదిత్య స్తవ రత్నం భక్తికి పరాకాష్టగా నిలిచాయి .వరద రాజ స్తవం లో అలంకారాలన్నీ వాడి శోభకల్పించాడు .

అరుణాచలం లోని అమ్మవారు ‘’ఆపీత కుచాంబ’’ పై చెప్పిన ‘’ఆపీత కుచాంబ స్తవం ‘’రచించాగానే అప్పయ్య కున్న జ్వరం తగ్గిపోయిందట .దానికి అంత ప్రభావం ఉంది .మానసోల్లాసం మానసిక ఆందోళన ఉన్న వారికి వర ప్రసాదమే .సౌభాగ్య క్షేమాలకు ,ప్రయాణం లో మంచి జరగటానికి ‘’మార్గ బంధు సూత్రం , ఆరోగ్యం కోసం ‘’ఆదిత్య స్తవ రత్నం రాశాడు .

చిదంబరం లో ఉండి నిత్యం నటరాజ స్వామి దర్శనం తో పులకిన్చేవాడు .అక్కడేఅప్పయ్య జీవిత పరిసమాప్తి డెబ్భై మూడవ ఏట  ‘జరిగింది ’.చనిపోయే రోజున రోజూ వెళ్ళే మార్గం గుండాకాక ‘’పంచాక్షర మెట్లు ‘’మీదుగా నటరాజ స్వామిని దర్శించడం అందరూ చూసి ఆశ్చర్య పోయారట .దర్శనం పూర్తీ చేసుకొని ఇంటికి వెళ్ళగానే అప్పయ్య దీక్షితులు తుది శ్వాస వదిలాడు .నటరాజ స్వామి అనుగ్రహం తో జన్మించిన అప్పయ్య ఆయన చెంతనే మరణించటం విశేషం .అప్పయ్య ఒక శ్లోకం లో ‘’నేనుపవిత్రమైన  చిదంబరం లో చనిపోవటానికి సంతోషిస్తున్నాను. నా కుమారులు బాగా చదువుకొని  గ్రంధ రచన చేసిన సంస్కారులు .నాకోరికలు  ఏవీలేవు .ఒక్కటే కోరిక .చిదంబరం లో నటరాజ సన్నిధిలో  మరణించ టమే నా కోరిక ‘’అన్నాడు .అలా కోరికను తీర్చుకొన్న ధన్య జీవి అప్పయ్య దీక్షితులు .

బహుముఖ ప్రజ్ఞా శాలి దార్శనికుడు అప్పయ్య దీక్షితులు రాసిన మూడు అలంకార గ్రంధాలు –వ్రుత్తి వార్తిక ,చిత్ర మీమాంస ,కువలయానందం .మొదటి దానిలో రెండు పరిచ్చేదాలున్నాయి అభిదా ,లక్షణా వృత్తుల భేదాలగురించి చెప్పాడు .వ్యంజనా వృత్తిని ఖండించాడు. ఇది అసంపూర్ణ గ్రంధం .చిత్ర మీమాంస అపూర్వ గ్రంధం అర్ధ చిత్ర కావ్యాలను గురించి చర్చించాడు ఇదీ  అసంపూర్ణమే .కువలయానందం లో అలంకారాలను గురించి వివరణ చేశాడు  అలంకారాలమీద వచ్చిన చివరిగ్రంధం గా దీన్ని భావిస్తారు .ఇతని సిద్ధాంతాలను జగన్నాధ పండితరాయలు ఖండించాడు .కువాలయనందానికి పది టీకలున్నాయి .ఇన్ని టీకా లుండటం దీని ప్రసిద్ధికి నిదర్శనం .పెనుగొండ రాజు వెంకట రాయలకు  అంకితమిచ్చాడు .విదేశీ  భాషల్లోకీ అనువాదం పొందిన గ్రంధం ఇది .అలంకార వివరణ తర్క బద్ధం గా శాస్త్రీయం గా చేశాడు .అలంకారాలు  విశ్వనాధుడి వరకు  ఎనభై తొమ్మిదికి పెరిగాయి .అప్పయ్య వీటి సంఖ్యను నూట పద్దెనిమిది పెంచాడు . అలంకారాల  గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జయదేవుడు రాసిన చంద్రాలోకం అప్పయ్య రాసిన కువలయానందం చదవాల్సిందే .ఇవే గతి .ధ్వనిలేక పోయినా అలంకా రాలతో ఉన్న కావ్యాలు సుందరం గా ఉంటాయన్నాడు .ధ్వనిలేకపోయినా కావ్యాన్ని ఆదరించాలన్నాడు .చిత్ర మీమాంసలో చిత్రకావ్యాల భేదాలను వివరించాడు .చిత్రకావ్యం కూడా ధ్వనికావ్యం లాగే మహత్వం ఉన్నదన్నాడు .కొద్దిగా కూడా ధ్వని లేని చిత్రకావ్యాల కొమ్ముకాసి ఉత్తమ స్తాయి కల్పించాడు ..దీన్ని ఖండించాడు పండిత రాయలు .అప్పయ్య దీక్షితుల సోదరుడి పౌత్రుడు నీల కంఠ దీక్షితుల సోదరుడైన మూడవ అప్పయ్య దీక్షితులు ‘’చిత్రమీమాంస దోష ధిక్కారం’’అనే గ్రంధం లో జగన్నాద పండిత రాయల అభ్యంతరాలన్నిటికి దీటైన సమాధానాలిచ్చి రాశాడు .

‘’ఆంధ్రత్వం ఆంధ్రభాష ,మధు మధురమైనవి .ఆంద్ర దేశం లో జన్మించటం పూర్వజన్మ  సుకృతం ‘’అని తెలుగును తెలుగు దేశాన్ని మనసారా మెచ్చుకొన్న అప్పయ్య దీక్షితుడు మనవాడే .మందరి వాడే .

మరోకవితో కలుద్దాం

Inline image 1  Inline image 2

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52

52-తంజావూర్ కృష్ణ రాయలు -రఘునాధ రాయలు

తంజావూరు పాలకుడు రఘునాధ రాయలు 1663-1673 కాలం రాజు .సంస్కృతం లోను తెలుగులోనూ రచనలు చేశాడు .సంగీతం లో కూడా అసామాన్యుడనిపించాడు .కొడుకు విజయ రాఘవ నాయకుడూ గొప్ప సాహిత్య పోషకుడు కవి ,పండితుడు .తెలుగులోనే రచన చేశాడు .ఈ కాలాన్ని దక్షిణాంధ్ర యుగం అంటారు .రఘునాధుడు తండ్రి అచ్యుత రాయలపై సంస్కృతం లో ‘’అచ్యుతేయాన్ద్రాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .యక్షగానాలు రాశాడు .వీణా వాదనలో మహా విద్వాంసుడు .క్షేత్రయ్య తంజావూర్ వచ్చి ఈ రాజును దర్శించి తన మువ్వ గోపాల పదాలతో మెప్పించాడు .తంజావూర్ సరస్వతిమహల్  గ్రంధాలయాన్ని, కుంభకోణం లో రామస్వామి దేవాలయాన్ని ,ఆది కుమ్భేశ్వరాలయానికి గోపురం నిర్మించాడు .తంజావూరు లోను పశుపతి దేవాలయం లోను స్వామి వారల రదోత్సవాలను మహా వైభవం గా నిర్వహింప జేసేవాడు .వీణ విధానం లో గణనీయమైన మార్పులు తెచ్చాడు రఘునాధుడు .జయంత సేన రాగాన్ని సృష్టించాడు .రామానంద తాళం కనిపెట్టాడు .చేమకూర వేంకటకవి ,కృష్ణాధ్వరి మధురవాణి, రామ భద్రాంబ ఈ ఆస్థాన కవులు .అనేక కావ్య రచన ఇక్కడ జరిగింది .శృంగారం వరదగా రఘునాదుడికాలం లో పారింది .అందుకని క్షీణ యుగం అన్నారుకూడా .బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు దానం చేశాడు .బీద బ్రాహ్మణులకు ఖరీదైన బహుమతు లంద జేశాడు .గుర్రపు సవారిలో ,ఖడ్గ యుద్ధం లో సాటిలేని వాడు .కవి ,పండిత సంగీతజ్ఞుల పోషణ చేశాడు .ఇంగ్లాండ్ డెన్ పోర్చుగీసు దేశాలతో మంచిమైత్రి నెలకోల్పాడు .

గోవింద ,యజ్న నారాయణ దీక్షితుల ప్రాభవం

ఈయన మంత్రి గోవింద దీక్షితులు ‘’సంగీత సుధ’’అనే కృతి చేశాడు .దీక్షితులకుమారుడు యజ్న నారాయణ దీక్షితులు రఘునాధుని విద్యా గురువేకాక ‘’రఘునాదాభ్యుదయం ‘’అనే సంస్కృత కావ్యం ను రాజు జీవిత చరిత్రగా రాశాడు .’’రఘునాధ విలాసం ‘’అనే సంస్కృత నాటకం రాసి రాజు ధర్మకార్య విశేషాలను తెలియ జేశాడు .’’అలంకార రత్నాకరం ‘’అనే అలంకార శాస్త్రాన్ని ప్రతాప రుద్రీయం నమూనాలో రఘునాధ రాయలను వర్ణిస్తూ లక్ష శ్లోకాలలో రాశాడు ‘.

53-ఆస్థానకవయిత్రి –రామ భద్రాంబ

తంజావూరు రాజు రఘునాధ రాయల ఆస్థాన నకవయిత్రి,ప్రియురాలురామ భద్రాంబ .రాజు జీవిత చరిత్రను ‘’రఘునాదాభ్యుదయం ‘’సంస్క్రుతకావ్యం రాసింది. శ్రీరామావతారం గా రఘునాధుని భావించి వర్ణించిన కావ్యం ఇది .పన్నెండు సర్గల మనోహర కావ్యం .ఇందులో రఘునాధుని దిగ్విజయాలు ,సుపరిపాలన వర్ణించింది .రామ భద్రాంబ తెలుగు కవిత్వం లోనూ ఆరి తేరింది .తెలుగు పద్యాలకు ప్రత్యెక మైన యతి ప్రాసలను సంస్కృత శ్లోకాలో ప్రయోగించటం ఒక గొప్ప ప్రయోగం .సంస్కృత ,ప్రాకృత భాషల్లో అనేక సమస్యలను పూరించిందని తెలుస్తోంది .ఈమె చెంగల్వ రాయకవి శిష్యురాలు .త్రిభాషా కవయిత్రిగా ప్రసిద్ధి చెందింది .అస్టావదానాలలో నిష్ణాతురాలు .

రఘునాదాభ్యుదయం లో రామ భద్రాంబ మొదటి సర్గలో చోళ రాజ్య వైభవాన్ని వర్ణించింది .తామ్రపర్ణి, కావేరి నదుల సోయగాలను వర్ణించింది .తరులు ,,లతలు ,పక్షులు, జంతువులూ అన్నీ ఆమె రచనలో చోటు చేసుకొన్నాయి .బ్రాహ్మణులు వేదం వేదాంగాలలో నిష్ణాతులుగా ,వారు నిర్వహించే యజ్న యాగాదులను తనివి తీరా వర్ణించింది .రెండవ అధ్యాయం లో చోళ రాజధాని తంజావూర్ పురాన్ని విశేషం గా వర్ణన చేసింది .అందులోని వీధులను ,దగ్గరున్న సముద్రాన్ని నాట్యకత్తెలను ,ఎత్తైన భవనాలను ,ఏనుగులు గుర్రాలను వర్ణించి రాజు ధార్మిక పరిపాలనను వివరించింది ..మూడవ అధ్యాయం లో రాజు శౌర్య ప్రతాప వితరణలను చెప్పింది .స్త్రీవిద్యకు రఘునాధుడు చేసిన కృషిని తెల్పింది .నాలుగవ సర్గలో రాజు దిన కృత్యాలను పూస గుచ్చినట్లు వర్ణించింది .అయిదులో కూడా రాజు గురించే రాసినా రాజాస్స్థానాన్ని సందర్శించిన కేరళ ,అంగ మగధ ,కలింగ గౌడ ,ఆరాట్ట దేశాలనుండి విచ్చేసిన సందర్శ్శకులను ముఖ్యంగా వేదాంతులను ,వ్యాకరణ పారీణులను ,కవులను ,కళాకారులను విపులంగా వివరించింది .రాజు విద్వాంసులను ఆదరించిన తీరు ,కళాకారులను ప్రోత్సహించి ,వారికి శిక్షణ నిచ్చిన విధానాలనూ తెలియ జేసింది రామ భద్రాంబ .

54-చోళ రాజ్య చరిత్ర రాసిన –విరూపాక్షకవి

చోళ రాజుల చరిత్రను విరూపాక్షకవి ‘’చోళ చంపువు ‘’గా సంస్కృతం లో రాశాడు .కావేరి పట్టణాన్ని రాజ దానిగా చేసుకొని తమిళ దేశాన్ని పాలించిన చోళ రాజుల చరిత్ర అంతా ఇందులో చూపాడు. ఈ రాజ్యం క్రీ శ మూడు నాలుగు శతాబ్దాలలో పల్లవ రాజుల చేత అంతమైంది .మళ్ళీ తొమ్మిదవ శతాబ్దం లో చోళ వంశం పునరుద్దరింప బడింది .అప్పుడు వీరు తంజావూర్ ను రాజ దానిగా చేసుకొని పరిపాలన సాగించారు .ఇదిమాత్త్రమే లభ్యం అవుతోంది. పూర్వ చోళ చరిత్ర దొరకలేదు కాని తమిళ సంగమ సాహిత్యం లో లభిస్తోంది .చోళ చంపువు ను మొదట కనుగొన్న వాడు ‘’హల్చ్ ‘’ఇది పౌరాణిక కల్పన ఆన్నాడు .స్థల పురాణం అయిన ‘’బృహదీశ్వరమాహత్మ్యం ‘’ఆధారంగా విరూపాక్షుడు ఈ చంపువు రాశాడు .చోళ చంపువు పదిహేడవ శతాబ్దపు రచన .భట్ట బాణుడి శైలిలో విరూపాక్షుడి శైలి ఉంటుంది .సరళ సుందర కవిత్వం తో ఈ చంపువు చంపక పరిమళాన్ని వెదజల్లింది .

55- పట్టపు  రాణి కవయిత్రి- నంజన గూడు తిరుమలాంబ

 

 

విజయ నగర రాజు అచ్యుత రాయల భార్య తిరుమలాంబ .కాలం 1529-1542 .’’వరదాంబికా పరిణయం ‘’అనే చంపూ కావ్యాన్ని సంస్కృతం లో రాసిన కవయిత్రి తిరుమలాంబ .ఆమె ప్రతిభకు ఇది నిదర్శనం .తాను  ఏక సంతాగ్రాహిని అని చెప్పుకొన్న విదుషీమణి .మనుష్య రూపం లో ఉన్న సరస్వతీ దేవి అని పేరుపొందింది .కవయిత్రిమాత్రమేకాదు కవులను పోషించిన ఔదార్యం అమెది .శకలం వారి ఆడపడుచు అయిన వరదాంబిక ,అచ్యుత దేవరాయల వివాహ వర్ణనయే ఈకావ్య ఇతివృత్తం ..మొదటగా అచ్యుత రాయల వంశాన్ని వర్ణించింది .అతని తండ్రి విజయ యాత్రలు ఓబలాంబ తో అతడి వివాహం అచ్యుతుని జననం ,రాజ్యాభిషేకం వివరం గా చెప్పింది ఒక రోజు రాయలు కాత్యాయని ఆలయం లో పూజ చేస్తున్న వరదాంబికను చూసి ప్రేమిస్తాడు .ఇద్దరి మధ్యా ప్రేమ  అంకురించటం ,ఇంతలో విదూషకుడు వచ్చి రాచకార్యం పై తీసుకొని వెళ్ళటం ,అయిష్టంగా అతను కదిలి వెళ్ళటం వరదాంబిక విరహ వేదన ఉంటుంది చెలికత్తెలు వచ్చి ఆమెను అచ్యుత రాయలకిచ్చ్చి ఆమె వివాహం జరిపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పటం ,ఇద్దరి పరిణయం .శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తో దంపతులకు వెంకటాద్రి జన్మించటం పట్టాభి షేకం జరగటం తో సమాప్తం .

తిరుమలాంబ కద కన్నా వర్ణాలకే ప్రాధాన్య మిచ్చి కావ్యం రాసింది .అచ్యుతరాయల కంటే తండ్రినే అధికం గా వర్ణించింది .సంస్కృతం పై చక్కని అధికారం తో కావ్యం రాసింది సందర్భాను సారం గా అన్ని రసాలను వర్ణించి కావ్య గౌరవం పెంచింది .శృంగారాన్ని  అంగి రసం గా చేసుకొన్నది .శ్లేష ,యమకాలనూ సమయాన్ని బట్టి వాడింది సైన్యం , ,యుద్ధాలను ,నదులను ,ఋతు  జలక్రీడ వర్ణనలను అద్భుతం గా చేసింది .అచ్యుత రాయలను నఖ శిఖ పర్యంతం శోభాయమానం గా వర్ణించింది .స్త్రీ ఇలా పురుష వర్ణన చేయటం అప్పటికి కొత్తా,  వింత కూడా . ఈమె గద్యం బాణుని బాటలో సమర్ధం గా నడిచింది .పరి సంఖ్యాలంకారాన్ని చమత్కారం తో ప్రయోగించింది .గద్యం ఓజో గుణ భరితం .అనుప్రాసలతో దీర్ఘ సమాస బంధురం గా రాసింది .ఉదాహరణకు –

‘’నిరంతరాంద కారిత దిగంతర కందళ మంద సుధారస బంధు సాన్ద్రతర ఘనాఘన వృందా సందేహ కరస్యన్దమాన మకరంద బిందు బంధుర మాకంద తరుకుల తల్ప కల్ప మృదల సికతాజాల జాతిల మూలతల మరువక మిలిద లఘు లయ కలిత రమణీయ పానీయ శాలికా బాలికా కరార వింద గలంతికా గల దేల లవంగ పాటల ఘన సార కస్తూరి కాతి సౌరభ మేదుర లఘుతర మధుర శీతలతర సలిల ధారా నిరాకరిష్ణు తదీయ విమల విలోచన మయూఖ రేఖా పసారిత పిపాసా యాస పాదిక లోకాన్ –‘’అని రస రమ్యం గా సాగుతుంది .ఆమె గద్యం కన్నా పద్యం హృద్యం.

‘’సరసి విరహసి త్వం శాత్రవా వారధి మధ్యే –త్యము పవన సరన్యాం తేలి ఘోరే వానంతే

కృతక గిరి తటే త్వం కిన్చాటే వింధ్య శైలే –కదా మరిషు విగానం కధ్యతా మచ్యుతేంద్ర ‘’

తిరుమలాంబ ‘’ఆర్య మహిళే’’ అని రాసిన దానిలో మహిళలే ఆర్య ధర్మాన్ని నిలబెట్టాలని సూచించింది .కన్నడ దేశాన్ని గురించి ,కన్నడ భాషను గురించి తిరుమలాంబ  చెప్పిన విషయాలు .ఆమె కన్నడ అభిమానానికి కన్నడ దేశ భక్తికి నిదర్శనాలని కన్నడ భాషా విమర్శకుడు సి యెన్ మంగళ చెప్పారు .ఇలా కన్నడం గురించి దేశాన్ని గురించి ప్రస్తుతించిన మొదటి కవి తిరుమలాంబ యేననీ ఆయన చెప్పటం తిరుమలాంబ వ్యక్తిత్వానికి మరింత శోభ కూర్చింది .

నంజన గూడు తిరుమలాంబ పేరిట ఒక సాహిత్య పురస్కారాన్ని ఏర్పరచి ప్రముఖులకు అందిస్తున్నారు .ఆ పురస్కారాన్నిపొండిన వారిలో విజయ లక్ష్మి పండిట్ కుమార్తె నాయన తారా సెహగల్ ఉన్నారు .ఏఎ అవార్డ్ గ్రహిస్తూ నాయన తార ఆనాడే పురుషుల తో బాటు స్త్రీకూడా అన్ని రంగాలలోనూ ముందు ఉండాలని ప్రబోధించి ఆచరించి చూపింది తిరుమలాంబ అని కొనియాడింది .

మరో కవితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి ,దీపావళి పండుగ

This gallery contains 29 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

51- భక్తిరస స్థాపకుడు – రూప గోస్వామి

గౌడీయ వైష్ణవ మతానికి చెందిన రూప గోస్వామి 1489-1564కాలానికి చెందిన వాడు .ఆరుగురు గోస్వాములలో పెద్దవాడు .సోదరుడు సనాతన గోస్వామి .వీరందరూ బృందావనం కేంద్రం గా ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ప్రభువు శిష్యులు .కలియుగం లో శ్రీకృష్ణుని అవతారమే చైతన్యప్రభువు అని వీరందరి నమ్మకం .రూపగోస్వామి పూర్వీకులు కన్నడ దేశానికి చెందినసారస్వత బ్రాహ్మణులు . లఘు తొషిని రాసిన జీవ గోస్వామి మాటలను బట్టి రూప గోస్వామి యజుర్వేద శాఖకు చెందినవారు .భారద్వాజ గోత్రీకులు .ఈ  వంశం లోని పూర్వీకుడే సర్వజ్ఞ రాజు విద్యా వేత్త .జగద్గురు బిరుతాంకితుడు .  ఈయన కుమారుడు అనిరుద్ధుడు .ఈయనకు హరిహార ,రూపేశ్వరులు కుమారులు .రూపేశ్వరుడు వేదం వేదాంగాలలో నిష్ణాతుడు .హరి హరుడు ధనుర్విద్యలో ,రాజకీయాలలో ఆరి తేరిన వాడు .తండ్రిమరణం తర్వాత రాజ్యం వీరిద్దరికీ విభజింప బడింది .కాని దుర్మార్గుడైన హరిహరుడు రూపేశ్వరుడు రాజ్యాన్ని లాక్కొని అతన్ని దేశ బహిష్కారం చేస్తే దేశాటనం చేస్తూ గంగా తీరం చేరాడు .పద్మనాభుడు ఈయనను ఆదరించాడు .పద్మనాభుడికి పద్దేనిమిదిమంది కుమార్తెలు ,అయిడుగురు  కుమారులు చివరికొడుకు ముకుందుడు .

ఆ ప్రాంతం లో మత సంఘర్షణలు చోటు చేసుకొంటే ముకుందుని కుమారుడు కుమార దేవుడు జేస్సూర్ చేరాడు .కుమార దేవుని కుమారులే రూప ,అమర,(సనాతన ) శ్రీవల్లభ ,(అనుపమ).కుమార దేవుని మరణం తర్వాత అన్నదమ్ములు ముగ్గురు గౌడ దేశం అని పిలువ బడే బెంగాల్ చేరి విద్యాభ్యాసం చేశారు .న్యాయ శాస్త్రాన్ని సార్వ భౌమ భట్టా చార్య వద్ద నేర్చారు .సంస్కృతం తో బాటు ఆరేబిక్ పర్షియన్ భాషలనూ నేర్చుకొన్నారు .వీరి తెలివి తేటలకు ,విద్యా గరిమకు మెచ్చి అప్పటి బెంగాల్ పాలకుడు అల్ల్లాఉద్దీన్  హుసేన్ షా వీరిని బలవంతం గా ప్రభుత్వాధికారులను చేశాడు .రూపను ముఖ్య కార్య దర్శిగా ,సనాతనుడిని రెవిన్యు మంత్రిగా చేశాడు సుల్తాన్ .

సుల్తాన్ రాజ దాని రామ కేళి లో వీరు ఉన్నారు .అప్పుడు చైతన్య మహా ప్రభువు 1514లో అక్కడికి వచ్చినప్పుడు మొదటి సారిగా దర్శించారు .చైతన్య ప్రభావం తో సన్య సించి రాజీనామా చేసి స్వంత గ్రామం జేస్సూర్ లోని ఫతియా బాద్ చేరుకొన్నారు .రూప ,అనుపమ లు చైతన్యునికోసం పూరీ కి పంపగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసి బృందావనం చేరటానికి ప్రయత్నించి తమ వద్ద ఉన్న పదివేల బంగారు నాణాలు సనాతనునికోసం అక్కడ ఉంచామని తెలియ జేసి బృందావనం చేరుకొన్నారు .

సోదరులు బృందావనం లో చైతన్యుడు కనిపించకపోయేసరికి ప్రయాగలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లి దర్శించారు .చైతన్యుడు వీరిద్దరికీ గౌడీయ వైష్ణవ ధర్మాలన్నీ బోధించాడు .బృందావనం లోని సనాతన ప్రదేశాలను గుర్తించి ,వైష్ణవ మత వ్యాప్తి చేసే బాధ్యతను చైతన్యుడు రూప గోస్వామిపై పెట్టాడు .బృందావనం లోనే జీవితాలను గడిపారు సోదరులు .శ్రీ క్రిష్ణుని ముని మనవడు వజ్రనాభ మహారాజు స్తాపించి అర్చించిన భగవాన్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని శోధించి కనుగొని బృందావనం లో రూప గోస్వామి ప్రతిస్టించాడు .వీరికి శిష్య పరంపర పెరిగింది అందులో లోక నాద ,భూ గర్భ ,గోపాల భట్ట ,రఘునాధ భట్ట ,రఘునాధ దాస గోస్వాములు .రూప గోస్వామి కూడా ఇక్కడికి చేరి వైష్ణవాన్ని పొందాడు .లలితాదేవి ఆధ్వర్యం లో రాదా క్రిష్ణులను భక్తితో సేవించిన చిన్న గోపిక ‘’రూప మంజరి ‘’యేరూప గోస్వామిగా మరల అవతరించారని వారి నమ్మకం .నిత్యం శ్రీ కృష్ణ భజనలతో బృందావనం మారు మోగింది అప్పటినుండి .ఇప్పటికీ అలానే జరుగుతోంది ,

రూప గోస్వామీయం

రూప గోస్వామి   సంస్కృతం  లో అనేక గ్రంధాలు రచించాడు అందులో వేదాంతం అలంకార శాస్త్రం ,నాటక శాస్త్రాలున్నాయి .రూప గోస్వామి రాసిన భక్తీ రసామృత సింధు గ్రంధం గౌడీయ వైష్ణవానికి ప్రామాణికం .ఉజ్వల నీలమణి అనేది మాధుర్య రసాన్ని గూర్చి తెలిపేది .లఘు భావామృత అనేది సనాతన గోస్వామి రాసిన బృహత్ భాగమృతం కు సంక్షిప్తం .విదగ్ధ మాధవ అనేది రెండు కృష్ణ నాటకాల సంపుటి .రెండు గా చేయమని సత్యభామ కలలో కన్పించి చెప్పిందట .ఇవే లలితా మాధవ ,విదగ్ధ మాధవ నాటకాలు .స్తవమాల లో అనేక స్తోత్రాలున్నాయి .దాన కేళి కౌముది లో  ఏకాంకిక ఉన్న భాణం .శ్రీ రాదా కృష్ణ గనోద్దీపిక  -లో రాధ కృష్ణుల పాత్ర స్వరూప స్వభావాలను వర్ణించాడు .మధుర మహాత్మ్యం లో మధురా నగర విశేషాలున్నాయి .ఉద్దవ సందేశం భాగవతం ఆధారం గా రాసింది ఇందులో కృష్ణుని ఆదేశం పై ఉద్ధవుడు బృందావనానికి రావటం తెలియ జేయ బడింది .హంస దూతం అనేది రాధ కృష్ణునికి హంస ద్వారా సందేశాన్ని పంపటం వృత్తాంతం .శ్రీ కృష్ణ జన్మ తిది విధి లో శ్రీకృష్ణ జన్మాష్టమి వివరణ చేయాల్సిన విధి విదానాలన్నీ వివరించాడు .నాటక చంద్రిక లో గౌడీయ వైష్ణవ నాటక విధానాలను వివరించాడు .ఉపదేశామృతం లో శ్రీకృష్ణుని చేరుకోవటానికి తేలికైన పదకొండు పద్ధతులను పదకొండు శ్లోకాలలో చెప్పాడు .

భక్తీ రస  స్థాపకుడుగా రూప గోస్వామి నిలిచాడు .ఉజ్వల నీల మణి, భక్తీ రసామృత సింధు అనే అలంకార శాస్త్రాలలో రస చర్చ చేశాడు .శృంగార రసాన్ని విపులంగా వివరించాడు .భక్తిలో ఉండే విభావ ,అనుభవాలను వివరిస్తూ వాటినీ రసం గానే చెప్పాడు .భగ వంతునిపై ప్రీతిని ప్రేయో రసంగా చెప్పాడు .దీన్ని మధుసూదన సరస్వతి సమర్ధించాడు .భక్తీ మధురం ఉజ్వలం అని రెండు రకాలన్నాడు .శ్రీ కృష్ణ గోపీకల మధ్య ఉన్నది శృంగార రసమన్నాడు .దీనికి చిత్త ద్రవం స్తాయీ భావంగా చెప్పాడు .కృష్ణ గోపీ విషయకమైన రతి ఉపాదేయం అని అదే భక్తీ రసమని వివరించాడు .శృంగారం మొదలైన రసాలు క్షుద్రమైనవని ,భక్తీ రసం ఒక్కటే సర్వ శ్రేష్టమైనదని స్తాపించాడు .భగవద్భక్తి రసాయనం అనే గ్రంధం లో భక్తీ కి సంపూర్ణం గా రసత్వాన్నిచ్చి ఉదాత్తత కల్పించాడు .భగ వంతుడు ఆలబన విధానం ,ఆయన చరిత్రలు విభావాలు ,భగవద్రతి స్తాయీ భావం ,నేత్ర వికారం మొదలైనవి అనుభవాలు ,నిర్వేదం ,శంక ,హర్షం మొదలైనవి వ్తభిచారీ భావాలు అని రూప గోస్వామి వివరించాడు .భక్తీ రసం అందరి ఆమోదాన్ని పొందింది .

నాటక చంద్రిక లో నాటక లక్షణాలు వివరణ లిచ్చాడు .

 

మరో కవితో కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తుస్సు టపాసులు

తుస్సు టపాసులు

వాలిపోయే అవ్వాయి చువ్వలాగా దూసుకొచ్చాడు మా బామ్మర్ది బ్రాహ్మి ‘’.బావా ఏటపాసులూ పేలటం లేదని అంటున్నారేమిటి  బావా’’అన్నాడు బోల్డు ఆశ్చర పోతూ .’’అదేంటిరా  .తుఫాను వచ్చింది విశాఖ ఇజీనగరం సికాకోలు జిల్లాలకేగా ?మనకేమీ వర్షం లేదు తడిసే పనీ లేదు ఎందుకు పేలవు ?’’అన్నా  అమాయకం గా .’’లేదు బా.ఎప్పుడూ కొనే వాడికోట్లోనే కొట్టుకొచ్చా .కాలిస్తే ఒక్కటీ కాలలేదు పేలలేదు ‘’అన్నాడు ఏడుపు మొహం తో .’’ఎందుకిలా?’’అని పోజు పెట్టా సుబ్బరాయ శర్మలాగా .’’నువ్వు బ్రాండ్ లేబిల్ చూశావా?’’అని అడిగా ..’’చూసిన గుర్తు లేదు బా .అయినా మీ చెల్లికి ఫోన్ చేసి తెలుసు కొంటానుండు ‘’అని ఫోన్ చేసి సమాధానం రాగానే తెల్ల మొహం వేశాడు .’’ఇంతకీ  ఏం చెప్పింది  మీ ఆవిడ?’’నా కుతూహలం ఆగక అడిగా .’’చిచ్చుబుడ్లు సోనియా బ్రాండ్ వి ,నేలటపకాయలు రాహుల్ బ్రాండ్ వి ట బా ‘’అన్నాడు బారుమంటూ .’’హర్యానా మహారాష్ట్ర లలో ఇద్దరి ఇజ్జత్తు తుస్సుమందిగా మొన్న ఎన్నికల్లో .అందుకే ఆబ్రాండ్ వి కూడా తుస్సుమని ఉంటాయి ‘’అన్నాను ఊరడిస్తూ .’’సరేకానీ బాంబులూ ఔట్లూ బాగా పేలాయా?’’మళ్ళీ  నాప్రశ్న.వాడు మళ్ళీ ఫోన్ లో ఎంక్వైరీ ,మరలా దిగాలు మొహమూ చూడలేక ‘’ఏమైందిరా?’’అన్నా ‘’మోసం బా .’’మళ్ళీ బావురు .’’పవార్ ఆటంబాంబులు ,చవాన్ ఔట్లూటబా ‘’అన్నాడు .నీళ్ళు రాకపోయినా అశ్రుపూర్ణు డనిపించినట్లున్నాడు.’’ఆహా !అదీ విషయం .ఇద్దరి  గాలి మహారాష్ట్రలో తుస్సుమంది రా. దానిప్రభావమే’’ అన్నా .సరే బావా నరకచాతుర్దసి ఎట్లాగో అయిన్దనిపించాం .దీపావళికి ఏమి కొనాలో ఎక్కడ ఏ బ్రాండ్ వికోనాలో తోచటం లేదు బా ‘’అన్నాడు .’’మతాబాలు ,సీమ టపాకాయల సంగతేమిటి ?’’మళ్ళీ ప్రశ్నించా .పాపం మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకొని మళ్ళీ బావురుమన్నాడు .’’ఏమిటి సంగతి ?’’అడిగా .’’అవీ మోసమే బా .హుడా ,చౌతాలా బ్రాండ్ లట .అవీ వెలగలేదు ,పువ్వులు రాలలేదు .టపటప మనాల్సిన సీమ టపాకాయలు నీళ్ళు కాచే పొయ్యిలో వేసినా ఉలకా  లేదు పగల లేదు శబ్దం ఒస్తే ఒట్టు ‘’అన్నాడు ఏడుపోక్కటే తక్కువ   .’’అలా చెప్పు .హర్యానాలో ఇద్దరూ మట్టికరిచారుకదా .ఇంకేం పేల్తాయిరా .పదవులలో ఉండగా దర్జాగా వాళ్ళు వెలిగారు .జనం గోడు పట్టించుకోలేదు .అవినీతి మురుగులో కూరుకు పోయిన ఫలితం .అల్లుడుగారి మేహర్బానీకోసం హర్యానాను తాకట్టు పెట్టిన ఫలితమే ఇది .ఇక  ఆబ్రాండ్ లకు కాలం చేల్లిపోయిన్దిరా .కొత్త  బ్రాండ్ లు వచ్చాయని అందరూ అంటున్నారు .అవి ట్రై చెయ్యి  ‘’అన్నా .

‘’బావా అందరూ మోడీ బ్రాండ్ వే కొంటున్నారట .నాబుద్ధి గడ్డి తిని నూరేళ్ళ పాత బ్రాండ్ కదా అని ఆశ పడి మోసపోయాను .అప్పటికీ మీ చెల్లెలు చెబుతూనే ఉంది ఈ బ్రాండ్ అంతా కల్తీ ,దగా మోసం అవినీతి తో కూరినవే .అందుకే తుస్సు బస్సు లే తప్ప ప్రతాపం చూపి పేలలేక పోయాయి ,కాల లేక పోయాయి వేలుగులివ్వలేక పోయాయి ,తిరగ లేక పోయాయి ఎగర లేక చతికిల పడ్డాయి .’’అన్నాడు జ్ఞాన నేత్రం తెరుచుకున్నఅజ్ఞాని లా .’’బావా !ఇక ఇప్పుడు చెలామణి లో ఉన్నది ఒకే  ఒక్క బ్రాండ్ మోడీ బ్రాండ్ .కావలసిన టపాకాయలన్నీ ఆ బ్రాండ్ వే కొంటా .మోతమోగిస్తా .వెలుగులు నింపేస్తా .దూసుకేల్తా ఇక తిరుగే లేదు .’’అంటూ ‘’మోడీ-అమిత్ షా  అవ్వయిచువ్వాయి’’లాగా రెట్టించిన వేగం తో, కాంతితో, మోతలతో, ఇంటికి దూసుకు వెళ్ళాడు బ్రహ్మి బామ్మర్ది,

Inline image 1  

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

50-  విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి  -వామన భట్ట బాణుడు

పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం లో విరూపాక్ష స్వామి వసంతోత్సవాలలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది .1380లో విజయ నగర రాజు మొదటి దేవరాయల శాసనాన్ని వామన భట్టు రచించాడు .అందులో తాను  కవీశ్వరుడనని వ్యాకరణ  మీమాంసా శాస్త్రాలలో  పండితుడనని చెప్పుకొన్నాడు .

భట్ట బాణ కవితా త్రివిక్రమం

వేమారెడ్డి ప్రభు జీవిత చరిత్రను ‘’వేమ భూపాల చరిత్ర ‘’గా వామన భట్టు రాశాడు .ఇదికాక ‘’హంస సందేశం ‘’అనే లఘుకావ్యం రాశాడు .ఇందులో రెండు భాగాలున్నాయి ,నూట ముప్ఫై ఒక్క శ్లోకాల గ్రంధం .కావ్యం అంతా మందా క్రాంత వృత్తం లోనే రాశాడు .కాళిదాసు మేఘ సందేశ చాయలు ఎక్కువగా ఇందులో గోచరిస్తాయి .ఇందులో వార్తాహరత్వం చేసింది హంస . –దక్షుడు అనే యక్షుడు ప్రియురాలిన కందర్ప లేఖ కు హంసద్వారా సందేశం పంపటమే కద.యక్షుడు నేరం చేయటం వలన కైలాసం నుండి పంపించి వేయ బడ్డాడు .మలయ పర్వతం మీద ఉంటున్నాడు .అతని ప్రవాస శిక్క్ష ఒక ఏడాదిమాత్రమే . అలకా నగరం లో ఉన్న తన ప్రియురాలికి ఇక్కడి నుండి సందేశం పంపుతాడు .యక్షుడు హంసకు అలకానగరం ఎలా వెళ్ళాలో రూట్ మాప్ తెలియ జేస్తాడు. తామ్రపర్ణి ,మధుర ,కావేరి ,శ్రీరంగం ,చిదంబరం ,కంచి ,కాళహస్తి కృష్ణా గోదావరి  తుంగభద్రానదులు దాటి  వింధ్య ను చుట్టి నర్మదా ,యమునా గంగా వారణాసి ,అయోధ్య ,సరయు గండకి నదులు చూసి కురుక్షేత్రం హిమాలయాలను క్రౌన్చాపర్వతాన్ని దర్శించి కైలాసం మీదుగా అలకా నగరం వెళ్ళమని చెబుతాడు .పర్వత నగర నదీ వర్ణనలను కాళిదాసు బాటలోనే చేశాడు .ఇదంతా మొదటి భాగం లో ఉన్నాయి రెండవ భాగం లో హంస అలకా నగరం చేరిన తర్వాత తన ఇంటి జాడలను గురించి చెబుతాడు .ప్రియురాలి వర్ణన, ఆమె విరహ వేదన, తర్వాత దక్ష యక్ష సందేశాన్ని హంస అతని ప్రియురాలు కందర్ప లేఖకు తెలియ జేయటం తో కావ్యం అయి పోతుంది .వర్ణనలు స్వారస్యం గా చేశాడు వామన భట్టు .భార్య విరహాన్ని వర్ణిస్తూ-

‘’చిత్రే కర్తుం వ్యవసితా మతిస్తూలికాయాం ద్రుతాయాం –భగ్నా రంభో .నాయన సలిలై స్చేతసి త్వాం లిఖామి

తత్రాపి ద్రాగరతి రదికోల్లాసినీ మే విహన్త్రీ –యత్ సత్యం నోవరతను విధిఃసంగామే సాభయ సూయః ‘’

వామనుడు ‘నలాభ్యుదయం ‘’,రఘు  వీర చరిత్ర ‘’అనే రెండు మహాకావ్యాలు రాశాడు .ఇవికాక పార్వతీ పరిణయం ,కనక లేఖా కల్యాణం ,బాణాసుర విజయం అనే నాటక రచనా చేశాడు .ఉషాపరిణయం అనే నాటకాన్ని వామనుడు రాశాడని మల్లంపల్లి వారు చెప్పారు .బహుశా బాణాసుర విజయం ఉషాపరిణయం ఒకటే కావచ్చు .

వామన భట్టు ముఖ్యం గా గద్య కవి .బాణుడులాగానే చక్కని గద్య రచనా చేశాడు .ఇతని శృంగార భూషణం అనే భాణం లో ఒకే ఒక్క అంకం ఉంటుంది .విలాస శేఖరుడు అనే విటుడు అనంగ మంజరి ఇంటికి వెడుతూ ఉంటె దారిలో అతడు చూసిన  వింతలు , విశేషాల వర్ణనే ఈ రూపకం .అందులో పేద ,ధనిక వర్గాల వారు ,విటులు వేశ్యలు  శ్రుంగార కార్యకలాపాలు ,గొర్రె పొట్టేళ్ల పోట్లాటలు ,కోడి పందాలు ,జూదం ,మల్లయుద్ధం ,ఖడ్గ యుద్ధం స్త్రీల బంతులాట ,ఉయ్యాల లూగటం మొదలైనవి అన్నిటిని వామన భట్ట బాణుడు వర్ణిస్తాడు .

పార్వతీ పరిణయము అయిదు అంకాల నాటకం .  .ఇందులో శివ పార్వతుల కల్యాణం వర్ణించాడు .కుమార సంభవ కధను చేర్చాడు .కవిత్వం గొప్పగామధురం గా సరసం గా  ఉంటుంది .కనక లేఖా పరిణయం  నాలుగు అంకాలున్న నాటకం .విజయ వర్మ అనే రాకుమారుడు వీరవర్మ కూతురు కనక లేఖను ప్ర్రేమించి పెళ్ళాడే కద.మధ్యలో అనేక చిక్కులు వాటిని అధిగమించటం చివరికి పెళ్ళితో తెర పడి సుఖాంతమవుతుంది .కొత్తదనం లేక పూర్వపు నాటకాల ధోరణిలోనే సాగింది .ఏనుగుల వేట ,ప్రియురాలి చిత్రపటం తో రాజు వినోదించటం నాయకురాలి ముగ్ధత్వం ఉంటాయి .శృంగారరస ప్రధాన నాటకం .హాస్యం అద్భుతరసాలు కూడా ఉండి కాలక్షేపానికి పని కొస్తాయి .

Inline image 1

మరో కవిని కలుద్దాం –

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధన్వంతరి -శివ భక్తీ -ధర్మం

ధన్వంతరి జయంతి

ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమ న్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు. ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు. ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవుశ్రేష్ఠుడిగా పిలువబడుతావు. అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని అనుగ్రహించాడు ఆ విష్ణుమూర్తి. ఈ అబ్జుడే – పుత్రార్థి అయ దీర్ఘతపుడు చేస్తున్న తపస్సుకు మెచ్చి కొడుకుగా జన్మనెత్తాడు. అతడే దివోదాసుగా కాశీరాజ్యానికి రాజు అయ్యాడు. ఈ దివోదాసు భరద్వాజునకు శిష్యునిగా ఆయుర్వేదాన్ని నేర్చుకొన్నాడని బ్రహ్మాండపురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ధన్వంతరి చేతినున్న అమృతకలశంలోని అమృతంతోనే దేవతలు మృత్యుం జయులు అయ్యారు. ఈ ధన్వంతరిని కొలిచిన వారికి సర్వరోగాలు దూరం అయ్య సంపూర్ణఆయురారోగ్యాలు లభిస్తాయ. ఆరోగ్యమే మహాభాగ్యము కనుక సర్వులూ ఈ ధన్వంతరి పూజచేయడం సనాతనంగా వస్తోంది. ఆయుర్వేదాన్ని వృత్తిగా గ్రహించిన వారు ధన్వంతరి జయంతిని వైభవంగా జరుపుతారు. ప్రపంచంలోని ప్రతి చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ధన్వంతరికి కేరళ రాష్ట్రంలో త్రిశూర్‌వద్ద ఓ ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.
ఈ ధన్వంతరినే ఒకచేత్తో అమృతకలశాన్ని, రెండవ చేతిలో జలగను పట్టుకొని ఉంటాడని ఓ కథనం ప్రచారంలో ఉంది.
ఆశ్వీయుజ బహుళ ద్వాదశిన ఆవిర్భవించిన ధన్వంతరిని స్మరిస్తూ ధన్వంతరి ప్రతిమనుగాని, లేకుంటే విష్ణుమూర్తి పటాన్ని లేక ప్రతిమను పువ్వులతో అలంకరించి తెల్లటి అక్షతలు, తెల్లని పూవులతో స్వామి సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో పూజచేస్తారు. ఈ ధన్వంతరికి పాల పాయసాన్ని నివేదన చేసి దాన్ని ముందుగా ఇంట్లో వారు స్వీకరించి తదుపరి తమ చుట్టు పక్కల ఉన్న వారిలో కనీసం ఐదుగురికి పంచుతారు. ఇలా చేయడం వల్ల ధన్వంతరి ప్రీతి చెందుతాడనే ఐతిహ్యం. ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేసినా సకల రోగాలు పటాపంచలవుతాయి. ఈ ధన్వంతరిని పూజిస్తే ఆయురారోగ్యాలే లభించడమే కాక భవరోగాలు దూరం అవుతాయ. కనుక ఈ ధన్వంతరిని
నమామి ధన్వంతరి మాదిదైవం సురాసురైర్వందితపాదపద్మం
లోకేజరారుగ్భయమృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానం
అని ప్రార్థించాలి. కలియుగంలోనూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, వాతావరణాన్ని కలుషితం చేసే పనులను దూరం చేసుకొంటూ – ఈ ధన్వంతరిని పూజిస్తే అందరికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
ద్వాదశి తరువాత వచ్చే త్రయోదశి కూడా దీపావళి పండుగలో భాగమే. ఇది గుజరాతీలకు సంవత్సరాది. దీనే్న ధనత్రయోదశి గాను ధన్ తేరాస్‌గాను అంటుంటారు. ఈరోజు కూడా దీపాలను వెలిగించి లక్ష్మీదేవి పూజను చేస్తారు. 13 సంఖ్య పాశ్చాత్యులకు మంచిది కాదనే అభిప్రాయం ఉన్నా మనం మాత్రం త్రయోదశి తిథి శుభదినంగానే భావిస్తాం. అన్ని పుణ్యకార్యాలను చేస్తుంటాం. అలాంటి ఈ రోజున చేసే లక్ష్మీదేవి పూజ సకల శుభాలను కలిగిస్తుంది. మహారాష్ట్రులు కూడా ఈ ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు. వర్తకులు ఈ త్రయోదశినాడు పద్దులు చూచుకొని కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఇల్లంతా దీపతోరణాలతో అలంకరిస్తారు.

శివతత్వం

  • – వేదగిరి రామకృష్ణ
  • 19/10/2014
TAGS:

శివ సాయుజ్యం పొందుట అనేది మన కర్మ ఆచరణలపై ఆధారపడి ఉంటుంది అనేది సత్యం. ఎవరైతే శివుని తత్వం గ్రహించి అనుసరించి ఆచరిస్తారో వారు శివ సన్నిధిని సులువుగా చేరగలుగుతారు.
పంచవిశంతి తత్వంతో సకల చరాచరములు సృష్టిస్తాను అని విష్ణురూపుడినై పోషించి కాల స్వరూపుడినై లయ చేస్తున్నాను అని శివుడు తన తత్వమును తానే తెలుపుకున్నాడు. సాక్షాత్ అన్నపూర్ణను సతిగా కలిగియున్నప్పటికి తన సహజ శైలిలో యావార వృత్తిలో భిక్ష పాత్ర నుంచుకుని కాలం గడుపుతున్నాడు. దీని ద్వారా జీవి తన స్వంత సంపాదన ద్వారా జీవితం గడపాలి అని తెలియచేయుచున్నాడు. శివుడు స్వయంగా నాట్యం చేస్తూ నటరాజుగా పేరు గాంచినాడు. ఈ జీవితం అనేది నాటకం లాంటిది. ఇందులో ఒక పాత్ర మనది. నిర్జీవమే నాట్య విరమణకు ఆఖరు దశ లాంటిది అని చెప్పినాడు.
మహాదేవుడు సాధారణమైన పూలతో చేసిన మాలలు ధరించడు. ఎందుకంటే అవి నశ్వరమైనవి. కపాల మాలలు, రుద్రాక్ష మాలలు ధరించుచున్నాడు. దీని ద్వారా మనకు బోధపడే తత్త్వము ఏమిటంటే లౌకిక వాసనలు పూలు వంటివి. అవి పునరావృతములు. వాటిని నివారింపచేసుకోవాలని తన తత్వం ద్వారా ముక్కంటి సూచించుచున్నాడు.
మహాదేవుడు తాను భస్మధారణ చేయుట ద్వారా ఏమి తత్వం బోధిస్తున్నాడు అంటే మానవుడు ఈ భూమి మీదకు వస్తూ తెచ్చినది ఏమీ లేదు. మరణానంతరం తీసుకొనిపోయేది ఏమీ లేదు. పుట్టుక మరణం మధ్య జీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది భస్మముగానే అనే తత్వం తెలుపుతున్నాడు. బతికినంతకాలం మంచిగా జీవిస్తూ అందరికి ఆదర్శప్రాయంగా యుండాలి.
శివుడు గరళం స్వీకరించుట ద్వారా మానవునికి ఏమి తత్వం ఉపదేశించినాడు అంటే జీవితం అంటే కష్టము నష్టముల భూయిష్టము. సుఖములను మాత్రమే ఆనందంగా అనుభవించుటగాదు. కష్టములు ఎదురైనప్పుడు తాను ఒక్కడే కష్టము ఎదుర్కొనుట ద్వారా పదిమందికి మేలు జరుగుతుంది అని భావిస్తే ఆ పనిని నిరాటంకంగా నిర్భయంగా ఆనందంగా చేయమనే తత్వమును బోధించుచున్నాడు.
శివుడిని శ్మశానవాసిగా చెప్పుకుంటాము. శివుడు శ్మశానవాసి ఎందుకైనాడో పరిశీలిద్దాం. శ్మశానమునకు రాజు-పేద అనే తరతమ భేదములేదు. ఎంతటివారు అయినా ఏదో ఒక రోజు అచటికి చేరవలసిదే. పార్థివ దేహంతో పాటు సూక్ష్మప్రాణి కూడా శ్మశానికి చేరుతుంది. తనతో వచ్చిన వారందరు వెళ్లగా బెరుగ్గాయుంటూ తన వారందరు వెనక్కి వెళ్లిపోయినారే అని దుఃఖిస్తూ యుంటుంది. అటువంటి సూక్ష్మప్రాణికి నీవారందరు వెనక్కి మరలినా ఒంటరి అయిన నీకు ఈ శ్మశానములో నేనున్నాను అని భరోసా ఇస్తాడు ఆ మహాదేవుడు. జీవన్మరణముల యందు తానే అయియున్నానని మనకు తన తత్వం తెలియచేయుచున్నాడు. అందుకే భూత గణములు ఆయన వెన్నంటే యుంటాయి. కామ, క్రోధ అరిషడ్వర్గాలు వాటి పరిధి దాటితే ఎలా యుంటుంది అనే అంశమును మన్మథుని భస్మీపటలం చేయుట ద్వారా మనకు తన తత్వమును తెలియజేసాడు. కామం, క్రోధం వంటివి అదుపు దాటితే మన్మథుని గతే ఎవరికైనా పడుతుంది అనే తత్వాన్ని మనం గ్రహించగలగాలి. శివుడు స్వయంగా ఢమరుకం మ్రోగిస్తున్నాడు అంటే మాయ అనబడే తిమిరం ఈ జగత్తు అంతా వ్యాపించి యుంది. దానిపట్ల నువ్వు అప్రమత్తంగా యుండు అని జీవిని హెచ్చరించుచున్నాడు.
వినాయకుడు- తండ్రీ ఈ జగమంతా నేను చుట్టిరాలేను అని విన్నవించుకుంటే ‘‘కుమారా తల్లి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఈ సమస్త జగత్తును చుట్టివచ్చినట్లేయని తెలుపుతాడు. దీని ద్వారా మానవుడికి తల్లిదండ్రిని తప్పక జీవితపర్యంతం ఆదరించాలి అనే తత్వం అంతర్నిగూఢంగా దాగియుంది. ఒక్కమాటలో మాతా పిత సేవలో తరించువాడు ముల్లోకముల యందు పూజనీయుడు అని అర్థం.

ధర్మము

  • -వంగూరి వెంకట్రామయ్య
  • 20/10/2014
TAGS:

ధర్మమనే పదమునకు అనేక అర్థములున్నవి. ఏ వస్తువుకు ఉన్న సహజ గుణములన ఆ వస్తువు ధర్మమంటారు. నీరు పల్లమునకు ప్రవహించును. ఇది దాని ధర్మము. నిప్పు పైకి ఎగిసిపడుట దాని ధర్మము. ఇదిగాకుండా మానవుల విషయములో మనిషి చేయవలసిన కర్తవ్యములను ధర్మమంటారు. వృత్తి ధర్మములు, ఆశ్రమ ధర్మములు వగైరా ప్రత్యేక ధర్మములుగాక, అందరి మానవులకు వర్తించే సామాన్య ధర్మములు కొన్ని ఉన్నాయి. ఇవి సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహణము, విచక్షణారహిత జీవితము, పరమత సహనం- ఈ ధర్మములను అన్ని మతాలు అంగీకరించినవి.
హిందూ మతములోని యోగ సిద్ధాంతము, బౌద్ధ జైన మతములు, వీటిలో ముందు ఐదింటిని యమ నియమములన్నారు. ఇది పాటించకపోయినా, ఏ సాధకుడు యోగ ధ్యానములో ముందుకు వెళ్లలేడు. పై ధర్మములకు ఆ పేరు దృతి అను శబ్దమునుంచి వచ్చినది. దృతి అనగా నిలబెట్టునది. అనగా సృష్టి, మానవ సమాజమును నిలబెట్టునవి. ఈ ధర్మములు మానవ సమాజం ఆచరింపకపోయినా కలహములు, కొట్లాటలు పెరుగును. సమాజం అల్లకల్లోలమవును. వీటిని ఆచరించునపుడు అనేక దుష్కార్యములు చేయుట మానవుడు మానుకోవలెను. తద్వారా కోర్కెలు నిగ్రహింపబడి మానవుడు దైవానే్వషణలో ముందుకు వెళ్ళుటకు సులువు ఏర్పడును. పై ధర్మములాచరించుట వలన ఇతరులకు, సమాజమునకు ఉపకారములు సుఖశాంతులు ఏర్పడును. అందుచే ఇవి నైతిక సూత్రములు, పుణ్యకార్యములు కూడా అయివున్నవి. ఇవి పుణ్యకార్యములగుటచే ఆచరించేవారికి పుణ్యము లభించి వారి సుఖ సౌఖ్యములు, సంపదలు అంతిమ విజయములు వచ్చును. భగవంతుడు ధర్మము నిలబెట్టుటకు కృషి చేయును. అవతారములెత్తును. ఆయన కర్మ సిద్ధాంతము ఏర్పాటుచేసి ధర్మములు పాటించువారికి కష్టములు తొలగించి, సుఖములిచ్చును.
సత్యము అంటే అబద్ధమాడకపోవుటేగాక ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చుటే. ఇది లేకపోయినా సమాజము విచ్ఛిన్నమగును. సత్యవాక్కును ఆచరించువాడు అవినీతి లంచగొండితనం, మోసము చేయలేడు. అప్పుడు సమాజము పవిత్రముగా ఉండి సుఖ శాంతులతో ఉండును. హరిశ్చంద్రుడు, ధర్మరాజు, శ్రీరాములవారు, సత్యవాక్కు పరిపాలకులు. శ్రీరాముడు తండ్రి యొక్క వాగ్దానములు నెరవేర్చుటకు చేతికి వచ్చిన రాజ్యము వదలి అడవికి వెళ్ళెను.
అహింసయంటే నాడీమండల వ్యవస్థ ఉన్న ఓ జీవిని అనగా మనుష్యులు, జంతువులను శారీరకంగాను, మానసికంగానూ హింసించకపోవుట. దీనిని ఆచరించే వారు శాఖాహారమునే తినవలెను. వృక్షములకు ప్రాణమయ కోశమే గాని మనోమయ కోశము అనగా నాడీ మండల వ్యవస్థ లేదు. అందుచే వాటికి బాధ సుఖము తెలియదు.
బ్రహ్మచర్యము అంటే వివాహము లేకుండా యుండుట అని అర్థమయినా, అందరూ బ్రహ్మచారులయితే సృష్టి ఆగిపోవును. పక్వము కానివాడు ఆచరించిన అది విఫలమగును. అందుచే వివాహేతర సంబంధములు పెట్టుకోకుండా ఏకపత్నీవ్రతము, పాతివ్రత్యము పాటించినా, వివాహము చేసుకొన్నా అది బ్రహ్మచర్యమునకు సమానమని ఋషులు చెప్పిరి. శ్రీరాముడు, సీతాదేవి ఈ విషయంలో ఆదర్శవంతులు. దీనివలన కుటుంబ వ్యవస్థ నిలబడును. ఆస్తేయమంటే ఇతరుల సొత్తును అపహరించకపోవుట. అది జరిగిన అవినీతి, దొంగతనము, దోపిడీ సమాజంలో యుండవు. అపరిగ్రహమంటే మన సొత్తును కూడా ఎదుటివారికి హాని లేకుండా మంచి కలిగించునట్లు వాడుకొనుట. అంటే మన సొత్తుకు మనము సమాజము తరఫున ధర్మకర్తలమన్నమాట.మనం ఆచరించే అనేక కర్తవ్యములు పై ధర్మములలో జేరిపోవును. ఏ పుణ్యకార్యమయినా ధర్మమే. అహింసతో కూడిన భగవతీ ఆరాధనలన్నీ ధర్మములే. అవి దైవచింతన పెంచునని, చిత్తశుద్ధిని కలిగించును. వాటిని ఎవ్వరూ మానకూడదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఇదియే ధర్మసూక్ష్మము.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నరకచతుర్దశి-చోడిశెట్టి శ్రీనివాసరావు

నరకచతుర్దశి

భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు ధరించడం,పిండి వంటలు భుజించడం ఇవన్నీ ఈ పండుగనాడు మనకు పైకి కనిపించే ఆర్భాటాలైనా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడం వెనుక అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే గొప్ప అంతరార్థం ఇమిడి ఉంది.
వెలుగులేక జగతి లేదు అన్నారు. అంటే వెలుగులేని ప్రపంచం ఊహించలేం. ఆ వెలుగును కలిగి ఉన్న భగవంతుడే పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అవిద్య, అజ్ఞానం, అవివేకం లాంటి అన్ని రకాల చీకట్లను పారద్రోలగల సమర్థుడు జ్ఞాన ప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలు సాధ్యమవుతాయి.
ఇక ఈ పండుగ జరుపుకోవడానికి కారకుడైన నరకాసురుడు భూదేవి కుమారుడు. నరకుడు అంటే హింసించేవాడని అర్థం. బ్రహ్మ వరప్రసాద గర్వితుడైన ఇతడు ప్రాగ్జ్యోతిష పురమనే రాజ్యాన్ని పాలించేవాడు. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. మణిపర్వతమనబడే మేరు పర్వతాన్ని వశపరచుకున్నాడు. సదా మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలమీదికి పదే పదే దండెత్తేవాడు.
నరకుడు పెట్టే హింసలు భరించలేక మునులు, దేవతలు అందరూ కలిసి శ్రీకృష్ణుని వద్దకొచ్చి మొరపెట్టుకున్నారు. నరకాసుర సంహారం లక్ష్యంగా శ్రీకృష్ణ భగవానుడు గరుడ వాహనారూఢుడయ్యాడు. సత్యభామ కూడా ఆయన వెంట బయలుదేరింది. నరకాసురుని ప్రాగ్జ్యోతిషపురం సమీపిస్తూ- మురాశురుని పాశాలచే చుట్టబడిన అయిదు దుర్గాలను చూసి ఆశ్చర్యచకితురాలైంది.
కృష్ణ్భగవానుడు మొదటి దుర్గాన్ని గదతో పగలగొట్టాడు. రెండవ దుర్గాన్ని బాణపరంపరలతో ఛేదించాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను సుదర్శన చక్రాలతో నిర్మూలించాడు. అటుపిమ్మట తనతో తలపడిన మురాసురుని, అతని కుమారులను కొంతమంది సైన్యాన్ని సంహరించాడు. అలసిన కృష్ణుడు అలసట తీర్చుకుంటుండగా, నరకాసురుడు యుద్ధ రంగంలోకొచ్చాడు. వస్తూనే ఆదమరుపుగా ఉన్న కృష్ణుడిని చంపబోయాడు. అది గమనించిన సత్యభామ చటుక్కున లేచి నిలబడి చీర చెంగుతో నడుం బిగించింది. వాల్జడ ముడివేసింది. తానే స్వయంగా విల్లందుకొంది. ఆమెలో వీరావేశం పరవళ్ళు తొక్కింది. అమ్ముల పొదినుంచి బాణాలు ఎప్పుడు తీస్తుందో, ఎప్పుడు సంధిస్తుందో ఎలా వేస్తుందో తెలియకుండా మెరుపు వేగంతో వాటిని వర్షింపసాగింది. ఆ ఎడతెగని బాణవర్షానికి, యుద్ధ విన్యాసాలకి తట్టుకోలేక శక్తి నశించిన రాక్షస సైన్యం నరకాసురుని వెనక దాగాయి. అంతకంతకూ ఆవేశపడిపోతున్న ఆమె చేతినుండి వింటిని గ్రహించి, నరకాసురునితో తను యుద్ధానికి తలపడ్డాడు. కొంతసేపటి తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుణ్ణి సంహరించాడు.
లోకకంటకుడైన నరకాసురుడు చనిపోయినది ఆశ్వయుజ బహుళ చతుర్దశి కాగా మరుసటి రోజు అన్ని లోకాలవారూ పండగ జరుపుకున్నారు. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళినాడు ఇంచుమించు అందరూ దీపాలను వెలిగిస్తారు. లోకంలోని కారు చీకట్లను పారద్రోలి కాంతిరేఖలతో నింపే పండుగ ఇది.
దీపాలను వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్ర్తిలదైతే, ఉన్నంతలో పేదసాదలకు దానధర్మాలు చేసి సాయపడే బాధ్యత స్ర్తిపురుషులిద్దరిది. బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం చిన్నపెద్దా తేడాలేకుండా అందరిది. అందుకే దీపావళి ఆనందోత్సాహాల పండుగగా ప్రసిద్ధి పొందింది. అంతేగాక ఈ పండుగ ఆరంభించిన తరువాత వచ్చే కార్తిక మార్గశిర మాసాలు రెండూ భగవత్ ప్రీతికరమైన మాసాలు. ఆధ్యాత్మిక సాధనకు అనువైన రోజులు కనుకనే దీపావళి పండుగకు ఎంతో వైశిష్ట్యం చేకూరింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపావళి కాంతులు.. ఇంటింటా సుఖశాంతులు .సి.శివశంకర శాస్ర్తీ

వేదభూమిగా వినుతికెక్కి ఎనె్నన్నో మతాలకు, పలు కులాలకు పుట్టినిల్లయిన మన భారతావనిలో ఏటా ఎనె్నన్నో పండుగలు వేడుకగా జరుపుకొంటున్నాం. ఇందులో కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైనవి కాగా, మరికొన్ని కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఆనందమయంగా జరుపుకునే పండుగలూ ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందినవారూ సంబరంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. భారతీయులంతా ఒకే కుటుంబ పరివారమనే విధంగా అందరి మనసుల్లో కొలువైనది- దివ్వెల పండగ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. చెడు నిర్మూలనం జరిగినపుడు జీవకోటికి కలిగే ఆనందానికి అవధులుండవన్న విషయం అందరికీ తెలిసిందే. పేరులోనే దీపాల వరుసను స్ఫురింపజేసే ఈ పండుగ మరే పండుగకూ లేని విశేషోత్సవాలు, సంబరాలను సొంతం చేసుకుంది. పురాణ కథనాల మేరకు దక్షిణ భారతీయులకిది మూడునాళ్ల ముచ్చటైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతర్దశిగాను, అమావాస్యను దీపావళి పండుగ గాను, కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది.
చీకటి విశ్వరూపాన్ని దర్శించిన మన జ్ఞానులు జ్యోతి స్వరూపాన్ని కూడా దర్శించి తద్వారా మనకు దిగ్దర్శనం గావించి ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ ప్రార్థన చేయించారు. నిజం చెప్పాలంటే ఏడాదికొకసారి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు అనగా- అమావాస్య నాడు మాత్రమే దీపం వెలిగించి నమస్కరించే మొక్కుబడి కాదు మనది. ప్రతి సాయంత్రం ఇల్లు తుడిచి ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని స్ర్తిలు దీపం వెలిగిస్తూ…
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే’’
– అంటూ శ్లోకం పఠించి, మెడలోని మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకొని ఆ వెంటనే దీప జ్యోతికి నమస్కరించుకొనే సత్ సాంప్రదాయం. ఇందుకు కారణం లేకపోలేదు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ జ్ఞాన సమారాధన, జ్ఞాన ఉపాసనే ‘దీపారాధన’ అని పలు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ప్రాచీన ఆర్ష వాక్యంలోని ఆత్మీయతతో పండుగలు గీటురాళ్ళని మన రుషులు నొక్కి పలికారు. దీపాన్ని మన జీవన గమనానికి పోల్చుకొంటే చీకటి వెలుగుల గురించి విశ్వమంత విషయంగా విపులంగా తెలుసుకునే వీలవుతుంది.
చెడు చీకటైతే, మంచి వెలుగై నిలుస్తుంది. అలాగే అజ్ఞానం చీకటి- జ్ఞానం వెలుగు. బతుకేమో వెలుగు- మృత్యువు చీకటి. అదేకోవలో బాధ-చీకటి, సంతోషం- వెలుగు. ఆకలి చీకటి- ఆహారం వెలుగు. స్వార్థం చీకటిగా ఉంటుంది, త్యాగం వెలుగవుతుంది. హింస చీకటి, అహింస వెలుగు. కామం చీకటి- ప్రేమ వెలుగు. ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస వంటి పరమయోగులు పలు సందర్భాల్లో ఉటంకించారు. అపకారం చీకటి, ఉపకారం వెలుగు. మోసం చీకటి, నిజాయితీ వెలుగు. ఇలా ఒకటొక్కటిగా పోల్చుకొంటూపోతే చీకటి, వెలుగుల విషయాలు ఎనె్నన్నో మనకు తెలుస్తాయి.
చీకటి విడిపోవాలంటే వెలుగు తప్పనిసరి. జగానికే జ్యోతి అయిన సూర్యభగవానుడు పగటి పూట తన వెలుగులతో జీవకోటిని ముందుకు నడిపిస్తూ ఆరోగ్య ప్రదాతగా ఉంటున్నాడు. సూర్యాస్తమయం కాగానే చీకటి కమ్ముకొస్తుంది. మన కార్యకలాపాలకు కొంతవరకు అవరోధం కలుగుతుంది. అలా కాకుండా ఉండేందుకై ఇంట దీపం వెలిగించుకొని పనులు చక్కబెట్టుకొంటున్నాము. చీకట్లోంచి వెలుగుబాటలో పయనించాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఇది సహజం. ధర్మసమ్మతం కూడా. మరింత లోతులకు వెళ్లి తరచి చూస్తే దీపం మానవాళికి ఐశ్వర్యం ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అని పలు పురాణాలు ప్రవచిస్తున్నాయి. నిలువెల్లా పవిత్రతను రంగరించుకున్న దీపాన్ని జ్ఞానచిహ్నంగా, ఐశ్వర్యమునకు సంకేతంగా, సంపద, ఆనందాలకు ప్రతీకగా భావించడంలో తప్పులేదంటూ జ్ఞానులు చెప్పిన మాటలతో మనం ఏకీభవించక తప్పదు.
నరక చతుర్దశి నాటి రాత్రి ఇంటిలో అష్టదిశలయందు అనగా నాల్గు దిక్కులు, నాల్గు మూలల్లో దీపాలను వెలిగించి చీకట్లను తరిమివేసే ఆచారం పలు ప్రాంతాల్లో ఉంది. దీపావళి నాటి ఉదయం తైలాభ్యంగనం చేసుకొని, తెల్లటి బట్టలు ధరించి లక్ష్మీదేవిని తెల్లటి పూవులతో పూజిస్తే ఆ తల్లి కృప మనపై తప్పక ప్రసరిస్తుందన్న జ్ఞాన జనవాక్యంలో నిజముందనక తప్పదు. క్షీర సముద్రరాజ తనయ అయిన లక్ష్మీదేవికి ఆ రోజున ధవళవర్ణం చాలా ఇష్టమని పురాణాల్లో అనేక ఆధారాలు న్నాయి.
దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని తెల్లటి పూలతోనే ఎందుకు పూజించాలి? అనే ప్రశ్నకు లభించిన సమాధానం ఇలా ఉంది. రాక్షస రాజైన బలి చక్రవర్తి సమస్త భూమండలాన్ని స్వాధీనం చేసుకోడమే కాక మహాలక్ష్మిని సైతం బంధించేశాడు. ఇలా చేయడంతో చరాచర విశ్వమంతా జ్యేష్టాదేవి వశమైపోయింది. ఫలితంగా యజ్ఞయాగాదులు నిలచిపోయాయి. ఎటుచూసినా చీకటి, అయోమయం. అప్పుడు దేవతా గణమంతా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపమని ప్రార్థించారు. కశ్యపుడు,అదితి దంపతులకు వామనమూర్తి అవతారంగా విష్ణుమూర్తి జన్మించాడు. బలి దురాగతాలను అణచివేసేందుకై అతని వద్దకు వెళ్లి తన నిత్యానుష్ఠాన కార్యకలాపాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొనేందుకు మూడడుగుల నేల దానమీయవలసిందిగా కోరాడు. అందుకు బలి అంగీకరించాడు. వామనమూర్తి త్రివిక్రమ రూపధారియై భూమ్యాకాశాలు రెండడుగుల్లో ఆక్రమించుకొని, బలి చెప్పిన మేరకు మూడవ అడుగు అతని నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కివేసి దేవతలతోపాటు తన దేవేరిని కూడా బంధ విముక్తను గావించాడు. దాంతో అసుర రాజ్యం అంతరించింది. చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరించింది. జనావళి ఆనందోత్సాహాలతో అమావాస్య నాడు పున్నమి వెనె్నలను చూశారు. అప్పటి నుండి పున్నమి వెనె్నలను పోలిన తెల్లటి పూవులతో శ్రీ మహాలక్ష్మిని దీపావళి నాడు పూజించడం ఆచారమైనట్లు పురాం కథనం.
మరో కథనం మేరకు పురాణాల్లో చెప్పిన వామనుని మూడడుగులే విష్ణువు త్రిపాదములని తెలుస్తోంది. విష్ణువు అంటే సూర్యభగవానుడే. అందుకే సూర్యుణ్ణి ‘సూర్యనారాయణ మూర్తి’ అని కీర్తిస్తారు. సూర్యుడి ఉదయం, మధ్యాహ్నం, అస్తమయాలే ఆయన మూడు పాదాలని పురాణాల ద్వారా తెలుస్తోంది. సూర్యాస్తమయం తర్వాత వచ్చేది చీకటి. ఉత్తర ధృవవాసులు తులా సంక్రమణంతో ఆరంభమైన ఆరు నెలలు దీర్ఘరాత్రిలో దీపోత్సవం చేసి, ‘నిశాచర రాజైన బలి చక్రవర్తి అనే శత్రువును పాతాళానికి అణగదొక్కి సూర్యుడు మాకు మళ్లీ కనబడుగాక’ అని ప్రార్థించడానికి ఏర్పాటుచేసిన వెలుగుల పండుగ దినమే దీపావళి అని కూడా బుధులు చెప్పినట్టు తెలుస్తోంది.
భారతీయులంతా ఆనందమయంగా జరుపుకునే ఈ పండుగ వేడుకలు, ఆచార వ్యవహారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కర్నాటకకు చెందిన కొన్ని పల్లె ప్రాంతాల్లో వివిధ పదార్థాలతో తయారు చేసిన ప్రమిదల్లో నువ్వుల నూనె నింపి దీపాలు వెలిగించి శ్రీమహాలక్ష్మికి హారతులిస్తూ పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం ముచ్చటగా మూడు రోజులపాటు ఉదయం, సాయంకాలం సాగుతుంది. దీనిని ‘ఆరతిబాన’ అంటారు. కర్నాటకలోని పలు పల్లెటూళ్లల్లో పాటు రాయలసీమ సరిహద్దుల్లోని పల్లెల్లో కనె్నపిల్లలు తేలికపాటి చిన్న చిన్న అట్టముక్కల్ని తీసుకొని వాటిని గుండ్రంగా కత్తిరించి ఆ బిళ్ళలపై రంగుల ముగ్గులు దిద్ది బియ్యపుపిండితో ప్రమిదల్ని తయారుచేసి, అందులో నేయి వేసి దీపాలు వెలిగించి అమావాస్య నాటి సాయంవేళ గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడుకొంటూ వాటిని నదుల్లోగానీ లేదా చెరువులు, కుంటల్లోగానీ వదలిపెట్టుతారు. ఇలా వేడుకగా పూజించే ఆ దీప దేవతను ‘సీగెమ్మ’ అని పిలుచుకొంటారు. సీగెమ్మ అమ్మవారి పూజల ద్వారా గౌరీదేవి ఆ కనె్నపిల్లలకు మంచి భర్తతోపాటు సుసంతానం, దీర్ఘసౌభాగ్యత్వం ప్రసాదిస్తుందని పండు ముత్తయిదువలు చెబుతారు.
మొత్తంమీద ఈ పండుగ ఆశాకిరణాల తోరణం. దుర్భరమైన దైనందిన జీవితాన్ని తలచుకొంటూ, పండుగలు దండుగ అనుకునేవారు కూడా నేటి ఆధునిక కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఎవరేమనుకున్నా, కనీసం పండుగ రోజైనా అన్నీ మరచిపోయి, భగవంతుడు మనకు ప్రసాదించినంతలో శుచిగా వండుకుని, తృప్తిగా తిని హాయిగా కాలక్షేపం చేయడం ఉత్తమం. అంధకార బంధురాన్ని పక్కకు తోసి, వెలుగు పుంజాలను చూపే దీపావళిని గూర్చి ‘జ్యోతిషాం జ్యోతి రుత్తమం’ అంటూ నిత్య సత్యమైన పలుకులు పలికిన మన జ్ఞాన యోగులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం మన కనీస కర్తవ్యం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాశ్చాత్యుల ప్రమేయం!

పాశ్చాత్యుల ప్రమేయం!

జమ్మూకాశ్మీర్‌ను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుండడం ఆశ్చర్యకరం కాదు. కాశ్మీర్‌లోని భారత వ్యతిరేక విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్‌తో కలిసికట్టుగా మనదేశంలోను, విదేశాలలోను విద్రోహకాండ కొనసాగిస్తుండడం కూడ దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ నెల 26న కాశ్మీర్ యాత్ర నిర్వహించాలని విద్రోహులు భావిస్తుండడం ఈ అంతర్జాతీరుూకరణలో భాగం. కానీ బ్రిటన్ ప్రభుత్వం ఈ యాత్రను నిషేధించకపోవడమే ఆశ్చర్యకరం. తమ దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విచ్ఛిన్న వాదులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్న ఐరోపాదేశాలు, అమెరికా, చైనా తదితరులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ దేశాలలో జరిగిపోతున్న ఉగ్రవాద చర్యలను పట్టించుకొనకపోవడం వైపరీత్యం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థను కాంక్షిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న అమెరికా, ఐరోపా దేశాల ప్రభుత్వాలు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా జిహాదీ ఉగ్రవాదులు తమ దేశాలలో ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతించడం ఈ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు చిహ్నం. చైనా ప్రభుత్వం తమ దేశంలో విచ్ఛిన్న కలాపాలను నిర్వర్తిస్తున్న జిహాదీ దుండగులను కఠినంగా అణచివేస్తుండడం నడుస్తున్న చరిత్ర. కానీ చైనా మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న బీభత్సకాండను మాత్రం నిరసించడంలేదు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. మనకు వ్యతిరేకంగా దురాక్రమణ సాగిస్తున్న నియంతృత్వ దేశం. పాకిస్తాన్‌కు మిత్ర దేశం. అందువల్ల చైనా ప్రభుత్వంవారు భారత వ్యతిరేక బీభత్స చర్యలకు ఇంటా బయటా ప్రత్యక్ష, ప్రచ్ఛన్న సమర్ధన కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు. కానీ బ్రిటన్ అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు కాశ్మీర్‌ను అంతర్జాతీయం చేస్తున్న పాకిస్తాన్‌ను నిరసించడం లేదు. తాము స్వయంగా అంతర్జాతీయం చేస్తున్నాయి. బ్రిటన్ నుండి స్కాట్‌లాండ్‌ను విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతుండిన సమయంలోనే మనదేశం నుండి జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టడానికి జరిగిన యత్నాలకు బ్రిటన్ పార్లమెంట్ పరోక్షంగా మద్దతు తెలిపింది. స్కాట్‌లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగా ప్రచారం జరుగుతుండిన సమయంలో బ్రిటన్ పార్లమెంటు గత సెప్టెంబర్‌లో కాశ్మీర్ గురించి చర్చించడం ఇందుకు నిదర్శనం. స్కాట్‌లాండ్ వ్యవహారాన్ని భారత పార్లమెంట్‌లో చర్చించినట్టయితే బ్రిటన్ ఏమంటుంది?
జమ్మూ కాశ్మీర్ భారత దేశపు అవిభాద్య అంతర్భాగం. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించని పాకిస్తాన్ కాశ్మీర్ వివాదాన్ని సృష్టించింది. ఇలా సృష్టించడం భారత వ్యతిరేక మతోన్మాద బీభత్సకాండలో భాగం. ఈ బీభత్సకాండ కాశ్మీర్‌తో మొదలు కాదు. పాకిస్తాన్ ఏర్పాటుతో మొదలు కాలేదు…క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ మన దేశంలోకి చొరబడినప్పటినుంచీ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జైష్ ఏ మహమ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు జిహాదీ ఉగ్రవాదులు కాశ్మీర్‌లో భద్రతా దళాలతో తలపడి హతులు కావడం ఈ కొనసాగింపులో భాగం. బెంగాల్‌లో ఇటీవల బంగ్లాదేశీయ మతోన్మాదులు జరిపిన పేలుళ్లు ఈ కొనసాగింపులో భాగం. ఇలా కొనసాగడం వల్లనే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత హంతకులు కాశ్మీర్‌లోకి చొరబడడం ఈ జిహాదీ ఉగ్రవాదంలో భాగం. అందువల్ల కథాకథిత జమ్మూ కాశ్మీర్ సమస్య నిజానికి జిహాదీ మతోన్మాదంలో భాగం మాత్రమే. జిహాదీ టెర్రరిజాన్ని నిర్మూలించినట్టయితే కాశ్మీర్‌లో ఎలాంటి సమస్య ఉండబోదు. ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ ఒప్పుకోదు. కానీ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు కూడ గుర్తించనట్టు నటిస్తున్నాయి. అందువల్ల జమ్మూకాశ్మీర్ వివాదం పరిష్కారం కాకపోవడం హింసాకాండ కొనసాగించడానికి కారణమన్న పాకిస్తాన్ వాదాన్ని ఐరోపా దేశాలు కూడ అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ ఏర్పడడానికి పూర్వం ‘పాకిస్తాన్ ఏర్పడినట్టయితే, ఖండిత భారత్‌లోను పాకిస్తాన్‌లోను కూడ మతోన్మాద జిహాదీ హింసాకాండ అంతరించి పోయి ప్రశాంత పరిస్థితులు ఏర్పడి పోతాయన్న ప్రచారం జరగడం చరిత్ర. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తరువాత జిహాదీ హింసాకాండ మరింత పెరిగింది. పాకిస్తాన్‌లో అన్యమత విధ్వంసకమైన ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. పాకిస్తాన్ ఏర్పడక పూర్వం అదే భూభాగంలో అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ నెలకొడం చరిత్ర. పాకిస్తాన్ ఏర్పాటుతో మతోన్మాద ఉగ్రవాదం అణగిపోలేదు. కాశ్మీర్‌లోకి చొరబడింది. ఇదే కాశ్మీర్ సమస్య. ఈ మతోన్మాదం కారణంగానే 83వేల చదరపు కిలోమీటర్ల జమ్మూ కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతోంది. ఈ దురాక్రమణ వివాదం బ్రిటిష్ వారు నిర్దేశించిన నియమావళి ప్రకారం జమ్మూ కాశ్మీర్ సంస్థానం 1947 అక్టోబర్ 26న భారత్‌లోవిలీనమైంది. బ్రిటిష్ రాణి నియమించిన బ్రిటిష్ పౌరుడైన గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ ఇందుకు ప్రత్యక్ష సాక్షి. అందువల్ల జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనం కావ డం వాస్తవమని బ్రిటన్ అప్పుడే ధ్రువీకరించి ఉండాలి. అలా ధ్రువీకరించకపోవడం ఐక్యరాజ్య సమితిలో వాస్తవాన్ని వివరించకపోవడం బ్రిటన్ ద్వంద్వ ప్రమాణాలకు, చారిత్రక నిదర్శనం. 1972 నాటి సిమ్లా ఒప్పందం తరువాత కాశ్మీర్ వివాదం ఐక్యరాజ్య సమితి పరిధి నుండి విముక్తమైంది. భారత పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక వ్యవహారంగా మారింది. ఈ సంగతి తెలిసినప్పటికీ కాశ్మీర్‌ను మళ్లీ మళ్లీ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐరోపా దేశాలుకాని, అమెరికా కాని నిరసించడం లేదు. మానవ అధికారాలను పరిరక్షించే నెపంతో ఐరోపా పార్లమెంటు వారు గత పదేళ్లలో రెండు సార్లు కాశ్మీర్ గురించి చర్చించారు. భారత దేశపు ఆంతరంగిక వ్యవహారమైన జమ్మూ కాశ్మీర్‌లో అలా అక్రమంగా జోక్యం చేసుకున్నారు. 1993-2003 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడుగా ఉండిన బిల్ క్లింటన్ కాశ్మీర్ భారత్‌లో విలీనం కావ డం నిర్ధారిత వాస్తవం కాదని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత అమెరికా ప్రభుత్వం మాటమార్చినప్పటికీ ‘పాశ్చాత్య అంతరంగ ఆకాంక్షలు’ మాత్రం అలా ఆవిష్కృతమయ్యాయి. ఇస్లాం మత దేశాల సమా ఖ్య-ఓఐసీ-దాదాపు ప్రతి సమావేశంలోను కాశ్మీర్‌ను ప్రస్తావించి భారత్‌ను నిరసిస్తూనే ఉంటారు.
ఇలాంటి అంతర్జాతీరుూకరణ పట్ల మన ప్రభుత్వం నిరసనలు తెలుపుతూనే ఉంది. లండన్‌లో కాశ్మీర్ యాత్రకు అనుమతి ఇవ్వడం పట్ల బ్రిటన్‌కు సైతం ఇప్పుడు నిరసన తెలిపింది. కానీ ఈ నిరసనలను పాశ్చాత్య దేశాలు ఖాతరు చేయకపోవడం వాస్తవం. టిబెట్‌ను దురాక్రమించిన చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను ఐరోపా దేశాలవారు అడ్డుకుంటూనే ఉన్నారు. కానీ మనదైన కాశ్మీర్ విషయంలో మన దేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలకు ఆ దేశాల వారు అనుమతి ఇస్తున్నారు. ద్వంద్వ ప్రమాణాలు ఇవీ…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు

జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి అద్వైతాన్ని జ్ఞానేంద్ర భిక్షువు వద్ద ,న్యాయ వైశేషికాలను మహేన్ద్రుని దగ్గర ,వ్యాకరణ శాస్త్రాన్ని వీరేశ్వరుని  వద్దా అభ్యసించి మహా పండితుడని పించుకొన్నాడు అలాంటి సర్వ సమర్ధుడైన తండ్రి వద్ద విద్య నేర్వటం జగన్నాధుని అదృష్టం అందుకే తండ్రిని కీర్తిస్తూ ‘’మహా గురుం ‘’అన్నాడు .పండితుడు రాసిన ‘’మనోరమా కుచమర్దనం లో తన గురువు శేష వీరేశ్వరుడనీ చెప్పుకొన్నాడు .అంటే తండ్రికి కుమారుడికి వీరేశ్వరుడు గురువు అన్నమాట .ఇతనికాలం1590-1667గా లెక్కిస్తున్నారు .రస గంగాధరం అనే ముఖ్య మైన అలంకార గ్రంధం రాశాడు .అందులో అతడు కావ్యానికి చెప్పిన ‘’ రామణీయార్ధ ప్రతిపాదక  శబ్దః  కావ్యం’’ అన్న నిర్వచనం ప్రతివారి నాలుకలపైనా నర్తించిన వాక్యం .

ఏదోకారణం వల్లకాని లేక అక్కడ తనను సమర్ధుడుగా సాటి వారు గుర్తించ నందు వల్లకాని జగన్నాధుడు స్వగ్రామం వదిలి యవ్వనం లో ఢిల్లీ  చేరాడు ..అక్కడ ఒక రోజున ఇద్దరి మధ్య తగాదా జరుగుతుంటే చూశాడు వారు రాజుగారి కొలువులో ఫిర్యాదు చేసుకొంటే సాక్షిగా వెళ్ళిన జగన్నాధుడుతనకు వారి భాష రాక పోయినా  తూ చా తప్పకుండా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను చెప్పాడు .అంతటి ఏక సంతాగ్రాహి .చక్రవర్తి ఆశ్చర్య పడి  నిజానిజాలు నిర్ణయించి జగన్నాదునిని ప్రతిభకు మెచ్చి ఆస్థాన పండితుని చేశాడట .ఆయనే షాజహాన్ చక్రవర్తి .షాజహాన్ పాదుషా పండితుని సమాదరించాడు  .షాజహాన్ తండ్రి జహంగీర్ కొలువులోను జగన్నాధుడు పండితుడుగా చలామణి అవటం విశేషం .జహంగీర్ చనిపోయిన తర్వాత ఉదయపూర్ రాజు జగత్ సింగు ఆశ్రయం పొంది ఆయనపై ‘’జగదాభరణ ‘’కావ్యం చెప్పాడు .1628లో దిల్లీ సింహాసనాన్ని  షాజహాన్ అధిస్టించగానే జగన్నాధుడు వచ్చి చేరాడు అని ఆరవిందశర్మ రాసిన ‘’పండిత రాజ కావ్య సంగ్రహ పీఠిక ‘’లో ఉంది .జగన్నాధుడు ఇక్కడి కొలువులో చేరటానికి ప్రోత్సహించింది షాజహాన్ మామ ,ముంతాజమహల్ తండ్రి అయిన ఆసిఫ్ ఖాన్ .దానికి కృతజ్ఞతగా పండితుడు ఆయనపై ‘’ఆసిఫా విలాసం ‘’కావ్యం రాసి అంకితమిచ్చాడు .జగన్నాధుని పాండిత్యాన్ని కవిత్వ ప్రాభవాన్ని గుర్తించిన షాజహాన్ జగన్నాదుడిని గొప్పగా సన్మానించి ‘’పండిత రాజు ‘’బిరుద ప్రదానం చేశాడు .సువర్ణాభిషేకమూ చేశాడు .

షాజహాన్ కొడుకు  దారా కు బాల్య గురువు జగన్నాదుడే .అందుకే దారా సంస్కృతం లో పేరుపొందిన కవి అయ్యాడు .ఔరంగ జేబు షాజహాన్ ను కారాగారం లో బంధించి , దారా మొదలైన అన్నదమ్ములని క్రూరంగా చంపించి పాదుషా అయ్యాడు 1666లో .ఈ రాజకీయ సంక్షోభానికి క్షోభ పడి జగన్నాధుడు అక్కడ ఉండలేక ఈ నాడు అస్సాం అని పిలువ బడే కామరూప దేశం చేరి రాజు ప్రాణ నాధుని  ఆస్థానం లో చేరి ,అతని పై ‘’ప్రాణాభారణ కావ్యం ‘’రాసి ఉంటాడని భావిస్తారు .ముసలితనం లో కాశీ చేరి ,తర్వాత మధుర వచ్చి యమునా నదీ  తీరం లో కాలం గడిపాడని అంటారు .

ఢిల్లీ లో ఉండగా జగన్నాధుడు ‘’లవంగి ‘’అనే ముస్లిం కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోన్నాడని ఆమె షాజహాన్ ఆస్థానం లో చెలికత్తె అని ,ఆమెను తనకు ఇవ్వమని పాదు షాను కోరాడని ఇస్లాం మతం తీసుకొంటే ఇస్తానని చెప్పి స్వీకారానంతరం లవంగిని కట్ట బెట్టాడని కద ప్రచారం లో ఉంది .కాని మతం మారాడని ఎవరూ నిర్ధారించలేదు .లవంగిపై’’ భామినీ విలాస ‘’కావ్యం రాశాడు .కాశీలో గంగా నది ఒడ్డున భార్య లవంగితో కూర్చుని ‘’గంగా లహరి ‘’రచించాడని యాభై రెండవ శ్లోకం పూర్తీ అయ్యేసరికి గంగ క్రమంగా పైకి వచ్చి వారిద్దరిని తనలో కలుపుకోందని అంటారు .వృద్ధాప్యం లో ఉండగా మధుర లోశ్రీ కృష్ణ సన్నిధి లో  జగన్నాధుడు జీవించాడని చెప్పటానికి అతడు రాసిన ఒక శ్లోకం ఆధారం గా కని  పిస్తోంది .

‘’శాస్త్రాణ్యా కలితాని నిత్య విధయః సర్వేపి సంభావితా –డిల్లీ వల్లభ పాణి పల్లవ తలే నీతనం నవీనం వయః

సంప్రత్యు జ్ఘిత వాసనమ్మదుపురీ మధ్యే హరిహ్ సేవ్యతే –సర్వం పండిత రాజ రాజి తలకే నాకారి లోకాధికం ‘’.

జగన్నాధ పాండి తీయం

జగన్నాధ పండిత రాయలు రస గంగాధరం అనే అలంకార శాస్త్రాన్ని రాశాడు .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశం తర్వాత దీనికే ప్రసిద్ధి ఎక్కువ ఇందు లోని విభాగాలను ‘’ఆననాలు ‘’అన్నాడు ..దీన్ని ఒక ఉద్గ్రంధం గా రాయాలని ప్రణాళిక తయారు చేసుకోన్నాడుకాని రాయలేక పోయాడని అంటారు .ఇప్పుడున్న రసగంగాధారం లో రెండే రెండు ఆననాలు ఉన్నాయి .జగన్నాధుడు చెప్పిన ‘’రమణీయార్ధ ప్రతి పాదకః శబ్దం కావ్యం ‘’అన్న రమణీయ మైన నూతన నిర్వచనం చెప్పాడు .దీనికి విపరీతమైన వ్యాప్తి కలిగింది .దీనికి మించిన నిర్వచనం లేదని విశ్లేషకుల భావన .ముందుగా కావ్య లక్షణాలు చెప్పి తర్వాతే కావ్య భేదాలను చెప్పాడు .కావ్యాలను ఉత్తమోత్తమ ,ఉత్తమ ,మధ్యమ ,అధమ అని నాలుగు రకాలు గా పేర్కొన్నాడు ధ్వని తోకూడింది ఉత్తమోత్తమ కావ్యమని ,వ్యంగ్య ప్రధానమైంది ఉత్తమ కావ్యమని ,గుణీ భూత వ్యంగ్యం ఉన్నది మధ్యమం అని, చిత్ర కావ్యం అధమ కావ్యమని విభజించాడు .మొదటిది జగన్నాధుడు స్వంతం గా చెప్పిన మాట .

జగన్నాధుడు రస గంగాధరం లో రసం గూర్చి విపులంగా చర్చించాడు .రస చర్చ ఉత్క్రుస్టం గా ఉంటుంది .ఆనంద వర్ధనుడి ధ్వని సిద్ధాంతానికి గొప్ప వత్తాసు పలికాడు .ధ్వని సిద్ధాంతాన్ని భరతుడి రస సిద్ధాంతం లోకి లాక్కొచ్చాడు .ధ్వనిని మెచ్చినా జగన్నాధుడు రస వాది అనే అనిపించుకొన్నాడు .రుయ్యకుడి మార్గాన్ని కొంత వరకు అనుసరించాడు .అలంకారాలలో ‘’తిరస్కారం ‘’అనే కొత్త అలంకారాన్ని వివరించాడు జగన్నాధుడు .సూత్రాలలోనే రసగంగాధారం రాశాడు తానె స్వయం గా విపులమైన వ్యాఖ్యనూ రాసుకొన్నాడు పండితుడు .మౌలికమైన తన భావనలు ప్రకటించాడు .అవసరమైన చోట్ల  ఆనంద  వర్ధన, ముమ్మటు లను విమర్శించ టానికి వెనుకాడ లేదు .జగన్నాధుని పాండితీ గరిమ ప్రతి దశలోనూ ప్రస్పుటం గా దర్శనమిస్తుంది .ప్రాచీన పండితులలో చివరివాడుగా జగన్నాధుడు పరిగణింప బడుతున్నాడు .అతనిది ప్రవాహ శైలి .తన కవిత్వం గురించి గర్వం గా –‘

‘’కవయతి పండిత రాజే కావ్యం త్వంఎపి విద్వాంసః –నృత్యతి పినాక పాణౌ నృత్యంత్యన్యే పి భూత భేతాళాః’’దీని భావం –పండిత రాజు కవిత్వం రాశాడు ఇతరకవులూ రాశారు .శివుడు నృత్యం చేస్తున్నాడు .భూత భేతాళాలూ నాట్యం చేస్తున్నాయి ‘’అని తక్కిన కవులను ఈసడించాడు .

జగన్నాధుడు అనేక చిన్న కృతులను రచించాడు .అందులో గంగాలహరి ఒకటి దీనికి పీయూష లహరి అనే పేరూ ఉంది. యాభై మూడు శిఖరిణీ వృత్తాల తో కమనీయ మనోహరం గా రాశాడు .రెండవది అమ్రుతలహరి .యమునా లహరీ అని కూడా పిలుస్తారు శార్దూల శ్లోకాలతో రాసిన యమునా నదీ స్తుతి .గంభీరం గా సరసం గా ఉంటుంది .మూడవది కరుణాలహరి .ఇందులో విష్ణు మూర్తి  ను వంశస్త ,సుందరీ మాల భారిణి వృత్తాలలో స్తుతించాడు .విష్ణు లహరి అంటారు .నాలుగవది లక్ష్మీ లహరి –నలభై ఒక్క శిఖరిణీ వృత్తాల తో లక్ష్మీ స్తుతి చేశాడు .అయిదవది సుధాలహరి ముప్ఫై స్రగ్ధరా వృత్తాలతో ఉన్న సూర్య స్తుతి ఇది .వీటిని ‘’పంచ లహరి ‘’అంటారు ఆరవది యమునా వర్ణన –తన రసగంగాధరం లో చెప్పిన మధ్యమ కావ్యానికి ఉదాహరణ గా దీన్ని రాశాడు .మిగిలినవి ఆసఫ్ విలాసం ,ప్రాణాభరణం ,జగాదాభరణం గురించి ముందే చెప్పుకొన్నాం .

జగన్నాధుని రసగంగాధరం తర్వాత ఎక్కువ ప్రాచుర్యమైనది భార్య లవంగిపై చెప్పిన ‘’భామినీ విలాస కావ్యం ‘’.ఇది ముక్తక కావ్య విభాగానికి చెందింది.ఇందులో నాలుగు విలాసాలున్నాయి ప్రాస్తావిక విలాసం ,శృంగార విలాసం ,కరుణ విలాసం ,శాంత విలాసం .మొదటి విలాసం లో నూట ఇరవై  తొమ్మిది, రెండులో నూట ఎనభై నాలుగు, మూడులో పందొమ్మిది ,నాల్గవ విలాసం లో నలభై ఆరు శ్లోకాలున్నాయి .వివిధ వృత్తాలలో దీన్ని రచించాడు. కోపించిన స్త్స్త్రీని భామిని అంటారు .అన్యోక్తులతో కూడి ఉన్న ముక్తకాలు మొదటి విలాసం లో ,స్త్రీ వర్ణన ,ప్రణయం రెండవ విలాసం లో మూడవ దానిలో వియోగ దుఖం ,నాల్గవ విలాసం లో వైరాగ్య, శాంత భావాలతో బాటు జగన్నాధుని శ్రీకృష్ణ భక్తికూడా ఉంటుంది .

పండిత జగన్నాధ రాయలు ఏదిరాసినా హృదయానికి తాకేట్లు రాసే నేర్పున్న మహా కవి .చదివి ప్రేరణ పొందుతాం తన ప్రియురాలి అమృత విలాసమే కవిత్వం గా పరిణమించిందని చెప్పుకొన్నాడు

‘’కావ్యాత్మనా మనసి పర్యమణన్ పురామే –పీయూష సార సద్రుశాస్తవ ఏ విలాసాః

తానంత రేణ రమణీ రమణీయ శీలా –చేతో హరా సుకవితా కవితా కధన్నః ‘’

శబ్దాలంకారాలు వాడినా రస సౌందర్యం దెబ్బ తిన కుండా ఔచిత్యం పాటించాడు ‘’మధువు ,ద్రాక్ష ,అమృతం ఆధర సుధా అందరికీ ఆనందాన్ని ఇవ్వక పోవచ్చు కాని తన కవిత్వం మాత్రం అందరికి ఆనందాన్నిస్తుందని జబ్బ చరఛి  చెప్పాడు .అలా ఆనందం పొందని వాడు జీవచ్చవం అని శాపనార్ధాలూ పెట్టాడు మహాను భావుడు .

‘’మధు ద్రాక్షా సాక్షా దమృత మధ వామాధరసుధా –కదాచిత్ కేషాం చిన్న ఖలు విదదీరన్నపి ముదం

ధృవం తే జీవంతో ప్యాహహ మ్రుతకా మంద మతయో –నఎశా మానందం జనయతి జగన్నాధ భణితిః’’’

ఈ దర్పం ,అహంకారం శాస్త్ర రచనలలోనే చూపించాడు పండితుడు .కావ్యాలలో చాలా సౌమ్యం గానే ఉన్నాడు. అతని శాస్త్ర పాండిత్యం అంత  ధిషణాహంకారం తో  ఉండేదన్న మాట .కవిత్వం పాండిత్యం మౌలికత త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన వాడు జగన్నాధ పండిత రాయలు .తెలుగు వారికి గర్వకారణమైన వాడు .మహోన్నత సంస్కృత సాహిత్యంయుగం జగన్నాధ పండితుని తో ముగిసింది .అలాంటి మౌలిక పాండిత్యం ఉన్న కవి శ్రేష్టుడు మళ్ళీ జన్మించనే లేదు .

Inline image 1  Inline image 2

మరో కవిని తర్వాత కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48

48-ప్రతాప రుద్ర యశోభూషణ కర్త –విద్యానాధుడు

విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు ”గా భావిస్తున్నారు .విద్యానాధుడు కాకతీయ చక్ర వర్తి ప్రతాప రుద్రుని ఆస్థాన కవి .జీవిత కాలము  క్రీ.శ.1292 నుంచి 1323 వరకు గా తెలుస్తోంది  .ప్రతాప రుద్రీయం లో ”ఔన్నత్యం యది వర్ణ్యతే ,తత్వం వర్ణ ఇతుం -బిభేమి యదివా ,జాహాస్త్మ్య గస్త్య స్తితిస్త్వత్సా ,ర్మ్యే-గుణ రత్న రోహిణి గిరే శ్రీ వీర భద్ర ప్రభో ”అని తాను అగస్త్యుడనే భావాన్ని తెలియ జేశాడు విద్యా నాధుడు .ఈ అలంకార గ్రంధాన్ని ప్రతాప రుద్ర మహా రాజుకు అంకితం ఇచ్చాడు .అద్భుతమైన ,పాండిత్యం వల్లనే అగస్త్యుడికి విద్యా నాధుడు అనే పేరు వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు .
అయితే ఆంద్ర దేశం లో విద్యా నాధుడు గానే చలా మణి అయాడు .”సౌగందికాపహరణం ”రాశాడు .ఇందులో అగస్త్యుడు తన మేన మామ అని చెప్పు కొన్నాడు .విద్యానాధుని శిష్యురాలు గంగా దేవి అనే కవయిత్రి .ఈమె ”మధురా విజయం ”అనే ”వీర కంప రాయల”చరిత్రను రాసింది .ఇందులో ఈమె ,అగస్త్యడు గొప్ప కవి అనీ ,74 గ్రంధాలు రాశాడని
తెలియ జేసింది .అందులో విద్యానాధుడు ”బాల భారతం ”అనే మహా కావ్యం రాశాడని చెప్పింది .దీన్ని ఆధారం గా చేసుకొని తమిళ కవి ”విల్లి పుత్తు రాన్ ”తమిళ భారతం రాశాడుతెలిపింది ..
విద్యా నాధుని రెండో రచన –”కృష్ణ చరిత్ర ”అనే గద్య కావ్యం .మూడవ రచన –”నల కీర్తి కౌముది ”అనే 24 సర్గల కావ్యం .ఇందులో రెండు సర్గలు మాత్రమే లభించటం దురదృష్టం .
విద్యా నాధుడు చాలా స్తోత్రాలు రాసి నట్లు తెలుస్తోంది .అందులో ముఖ్యమైనవి .దశావ తార స్తోత్రం ,లక్ష్మీ స్తోత్రం ,శివ స్తవం ,శివ సంహిత ,లలితా సహస్ర నామం ,మణి పరీక్ష.సకలాధి కారం విశ్వనాధ క్రుతులుగా ప్రచారం లో వుంది .ప్రతాప రుద్ర మహా రాజు మణి, మాణిక్య ,వజ్రాలను పరీక్షించటం లోగొప్ప  నేర్పున్న వాడు అని చరిత్ర చెబుతోంది.వేదం వెంకట రాయ శాస్త్రి గారు రాసిన ”ప్రతాప రుద్రీయ నాటకం ”లో ఈ విషయం వుంది .అంతే కాదు శాస్త్రి గారు ,ఆ నాటకం లో ”విద్యా నాదుడిని ”ఒక పాత్ర చేసి మంచి ప్రాముఖ్యాన్ని చ్చారు .రుద్రుడిని బందీ చేసి ధిల్లీ తీసుకొని పో తున్నప్పుడు ముందుగా బ్రాహ్మణ వేషం లో నది లో మునిగి పోతున్నట్లు నటించి ,ముస్లిం పాలకుల సాను భూతి చూర గొని ,వారి కోరిక మీద ప్రతాప రుద్రున్ని తీసుకు వెళ్తున్న ఓడ లో ఎక్కాడు .రాజు తో పరిచయం చేసు కొన్నాడు ..రాజు బందీ అయిన సమాచారాన్ని యుగంధర మంత్రికి,జనార్దన మంత్రికి తెలియ జేశాడు .చాకలి పేరి గాడికి సభా మర్యాద లను నేర్పి నట్లు వేదం వారు నాటకం లో చూపించారు .ఇతని పాత్రను చాలా ఉదాత్తం గా చూపించటమే కాదు ,అతనిలోని దేశ ,రాజ భక్తికి పట్టం కట్టారు వేదం వారు .
విద్యా నాధుడు ”అగస్త్య నిఘంటువు ”రాశాడని ”ఘనశ్యాముడు ”అనే కవి తన ”ఉత్తర రామ చరిత్ర వ్యాఖ్యానం ”లో చాలా సార్లు ఈ నిఘంటువు గురించిన ప్రస్తావన చేశాడు . .చాలా శబ్దాలను ఘన శ్యామ కవి ఇందులోనుంచి  ఉదహరించినట్లు తెలుస్తోంది .అయితే ఇది అలభ్యం అవటం ఆంద్ర సరస్వతి చేసు కొన్న దురదృష్టం .
అగస్త్యుడయితేనేమి ,విద్యా నాదుడయితే నేమి మహా ఆలన్కారికుడు ,ప్రతాప రుద్ర యశోభూషణ కర్త విద్యానాధుడు .అతని పూర్తి చరిత్ర కూడా లభ్యం కాక పోవటమూ,బాధ గానే వుంది .

ప్రతాప రుద్రా యశో భూషణం లో తొమ్మిది ప్రకరణాలున్నాయి .వీటిలో దృశ్య కావ్యాల గురించి శ్రవ్య కావ్యాల గురించి వివరించాడు .విద్యనాధుని అలంకర వివరాలను మల్లినాద సూరి చాలా చోట్ల ఉదాహరించాడు ..అప్పయ్య దీక్షితులు విద్యా నాధుదు చెప్పిన ఉపమాలంకార లక్షణాలతో ఏకీభ వించలేదు .మల్లినాధుడు విద్యాధరుడు అనే అలంకార శత్ర వేత్త రాసిన’’ ఏకావళి’’ కి వ్యాఖ్య రాస్తే ,అతనికుమారుడు ‘’ప్రతాప రుద్రీయం ‘కు ’’రాత్నాపనం ‘’అనే విపుల వ్యాఖ్యానం రాశాడు .విద్యాధరుడు కాని  విద్యానాదుడుకాని కొత్త కావ్య సిద్ధాంతాలను వేటినీ ప్రతిపాదించలేదు .ఉన్నవాటినే సులభం గా అర్ధమయ్యే రీతిలో రాశారు అంతే.

గంగా దేవి అనే  కవయిత్రి విద్యానాదుడిని తన మధురా విజయం లో గురువుగా చెప్పుకొన్నది .విద్యానాధుడు ‘’సౌగందికాపహరణం ‘’అనే వ్యాయోగం ను రచించాడు .ఇది ఒకే అంకం కలిగి ఉన్నది .భీముడు ద్రౌపదికోరిక తీర్చటానికి సౌగంధిక పుష్పాన్నిఅపహరించి  తీసుకు వచ్చే కద ఇందులో ఉంటుంది ,మహాభారత కద ఇది .ఇందులో భీముడు హనుమంతుని ఎదిరించటం ఉంది .ఇద్దరి మధ్య రసవత్తర సంభాషణలు నడుస్తాయి .వీర శౌర్య ప్రధానం .ఈ వ్యాయోగాన్ని ‘’ప్రేక్షణకం ‘’అన్నాడు విద్యానాధుడు .క్షేమేంద్రుడు ప్రేక్షణకం ను ఉపరూపకం లో ఒక భేదం గా చెప్పాడు .సహజం గా ప్రేక్షణకం లో ప్రాకృత భాషల ప్రయోగం ఉంటుంది .అందులోనూ శౌరసేనికి అధిక ప్రాధాన్యం ఉంటుంది .ముఖ సంధి,నిర్వహణ సంధి  రెండే ఉంటాయి .సూత్రదారుడితో పని ఉండదు. ప్రవేశిక ,విష్కంభాలు కూడా ఉండవు .నాయకుడు ఉత్తమ వంశ సంజాతుడుగా ఉండాలనే నియమం లేదని సాహిత్య దర్పణం లో ఉంది .ఇవన్నీ పరిశీలిస్తే విద్యానాధుడు రాసిన దానిలో ఇవేవీ లేవు .అంటే ప్రేక్షణక ధర్మాలేవీ లేవు .కనుక  సౌగందికాపహరణం వ్యాయోగ లక్షణాలు సంపూర్ణం గా ఉన్న’’ వ్యాయోగమే’’ సందేహం లేదు .

విద్యానాదుడే మొట్టమొదటి సారిగా ‘’త్రిలింగ ‘’శబ్దాన్ని వాడాడు .’’త్రికళింగ ‘’ నుంచి తెలుగు శబ్దం ఏర్పడిందని చిలుకూరి నారాయణ రావు గారన్నారు .తేనె +అగు =తెనుగు అయిందని గ్రియర్సన్ చెప్పాడు విద్యానాధుని అలంకర శాస్త్రం అయిన ప్రతాప రుద్రా యశో భూషణం ను తెలుగులోకి మహా మహోపాధ్యాయ శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ గారు అనువదించారు ..

మరోకవితో కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భ.కారాయమ్ -కె బి లక్ష్మి తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్

దీపావళి పై ఆలూరి బైరాగి కవిత -తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్bairagi 0012bhakara 001 3bhakara 001 bhakara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ షీలా వీర్రాజు గారికి బాపు -రమణ ల స్మారక పురస్కారం -తెల్గుగు విద్యార్ధి -సెప్టెంబర్

silavi- 001 D25711232

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురాంతకం ”ఎదురు గాలి ”కధలో లేఖన పధ్ధతి ”-పి శిరీష కుమారి -మూసి -అక్టోబర్

bharatmata 001kolhapur 001madhurantakam 1 001 madhurantakam 2 001 madhurantakam 3 001 kolhapur 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఆత్మీయ మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు మా ఇంటికి రాక

మా ఆత్మీయ మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు మా ఇంటికి రాక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ

విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ

సరసభారతి 71వ సమావేశం గా కవిసామ్రాట్ ,తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత  ,కళాప్రపూర్ణ ,పద్మ భూషణ్ స్వర్గీయ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 38వ వర్ధంతిని విశ్వనాధ వారి స్వగ్రామం  ఉంగుటూరు మండలం లోని నందమూరులో ,వారి తండ్రిగారు శోభనాద్రి గారు  నిర్మించిన శ్రీ గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం లో 19-10-14ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించింది . అతిధులను వేదికపైకి సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ఆహ్వానించగా ఛి బిందు దత్తశ్రీ దైవ ప్రార్ధనతో సభ ప్రారంభ మైంది .విశ్వనాధ చిత్రపటానికి పూలమాల వేసి ,పుష్పాలను సమర్పింఛి ,ఇటీవల హుదు హుదూద్ తుఫాన్ లో అసువులు కోల్పోయిన వారికి ,ప్రఖ్యాత రచయిత్రి ,రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకీ రాణి గారి మరణానికి అందరు లేచి నిలబడి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాము .

సభాధ్యక్ష స్థానం లో ఉన్న నేను ముందుగా ఈ సమావేశానికి నరసరావు పేటనుండి రావలసిన అతిదులలో లెక్చరర్ శ్రీమతి యడవల్లి మనోరమ గారికి నిన్న సాయంత్రం కాలేజి నుండి ఇంటికి ఆటో లో వస్తూండగా యాక్సిడెంట్ జరిగి తీవ్రగాయాలైనాయని ,ఆమె కదిలే స్తితిలో లేదని రాత్రి ఫోన్ వచ్చిందని ,ఆమెను అలా వదిలి తాము రాలేక పోతున్నామని నరసరావు పేట నుండి రావలసిన మరోఅతిధి శ్రీ ప్రసాద్ తెలియ జేశారని చెప్పి  అనుకోకుండా జరిగిన ఈ అవాంతరానికి బాధ పడుతున్నానని సభకు వచ్చిన వారికి తీవ్ర నిరాశ కల్గిన్చినందుకు మన్నించమని తెలియ జేశాను .

తరువాత విశ్వనాధ స్వగ్రామం లో వారి వర్ధంతి సభను ,వారిదైన ఆలయం లో నిర్వహించటం చాలా  ఆనందం గా  ఉందని  గ్రామస్తులిచ్చిన సహాయ సహకారాలకు అభినందనలు తెలియ జేశాను .పింగళి లక్ష్మీకాంతం గారి  జయంతిసభను జనవరిలో వారి స్వగ్రామం చల్ల పల్లి దగ్గర చిట్టూర్పు లోను,ప్రముఖ సినీ సంగీత దర్శకులు  శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి వర్ధన్తిసభను స్వగ్రామం కాటూరులోను ఇప్పుడు ఈ సభను ఇక్కడ , సరసభారతి నిర్వహించటం సరసభారతి అదృష్టమని మూడు చోట్లా స్పందన బాగా వచ్చిందని దీన్ని నిలబెట్టుకోవాలసిన బాధ్యత గ్రామస్తులదేనని చెప్పాను .విశ్వనాధ నేను బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు తెలుగు బోధించారని ,ఆయన కాలం లో నా లాంటి వారు ఉండటం మా లాంటివారికి గొప్ప అదృష్టం అన్నాను .విశ్వనాధ గొప్ప మార్గ దర్శకులని వారి మార్గం వేదమార్గమని ,వారి రచనలు హితోపదేశాలని అన్నాను .రామాయణ కల్ప వృక్షం ,వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలని వాటికి విలువ పెరిగేదేఆని తరిగేది కాదని చెప్పాను .ఆయన ఊహలు వాటిని పోషించేతీరు అనన్య సదృశం అన్నాను . Sarasabharathi 71 141019_0001 Sarasabharathi 71 141019_0002

‘’ఆకృతి రామ చంద్రు విభవాకృతి –కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి –కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు రామ దేహాక్రుతి –సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి –కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై ‘’అన్న పద్యం లో రాముడికి సీతకు అభేదాన్ని గొప్పగా  సృస్టించారని అన్నాను .రాముడు దయామూర్తి .ఈ  విషయం  సీత కళ్ళు చెబుతున్నాయి. మించిపోతే ఏం జరుగుతుందో విల్లులాంటి కను బొమ్మలు చెబుతున్నాయి .రాముడు ధర్మ ప్రతిజ్ఞకలవాడు .ఆయన శృంగారం ధర్మ బద్ధం .ఇదంతా సీత కూర్చున్న తీరులో స్పష్టం చేశాడు విశ్వనాధ ..ఇంతటి గొప్ప భావం అద్ద్వైతభావం నిక్షిప్తం చేశాడు విశ్వనాధ .అందుకే ఈ భావనలను ఆపోసన పట్టిన శ్రీ కేతవరపు రామ కోటి శాస్త్రి అంటే కాకతీయ యూని వర్సిటి లో తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి కాత్యాయినీ విద్మహే తండ్రి గారు తనకు ముక్తికంటే విశ్వనాధ సాహిత్య స్నానమే ముక్తి అన్నారు .

‘’పోరాపాటై జని యించితిని ప్రభూ !సరే  పోనీ మరీ జన్మకున్ –పరమోపజ్ఞాన నిధాన ,దివ్య దిషణాభ్రాజిష్ణువౌ ,విశ్వనాధ రాసోదంచిత -సాహితీ విమల తీర్ధ స్నాన పూతాత్మగా  కరుణిం పం దగు  ముక్తి మాట అటుపై –కాశ్మీర నేత్రచ్చవీ ‘’ .విశ్వనాధకు కల్ప వృక్షం లో అంతా యజ్నమయం గా దర్శన మిస్తుంది అదీ అయన గొప్పదనం .

చిన్ననవలలో విశ్వనాధ‘’విశ్వ నాదం ‘’వినిపించాడు .వీరవల్లడు నవలలో వల్లడు హరిజనుడు వల్లప్పా అని అందరూ పిలుస్తుంటే తల్లిని తన పేరు మార్చమని అడుగుతాడు .ఇది తండ్రివిని ఒక కద చెబుతాడు అదే నవల .వల్లడు పాలేరు తాత తండ్రి తాన తరం దాక హరిజనుడు .దొర చనిపోతే కుటుంబాన్ని ఆడుకొంటాడు మళ్ళీ దొర ఇంట్లో దీపం పెట్టె దాక విశ్రమించను అని ప్రతిజ్ఞ చేస్తాడు .అలా చేసి చూపించి తన్ను ప్రేమించిన వారితో సహా సర్వం కోల్పోతాడు .కులం కంటే మానవత్వం గొప్పదన్న సంస్కారం ఉన్నవాడు వల్లడు .ఇందులో ధార్మిక ప్రవ్రుత్తి ఔదార్యం కనిపించి వాటికి వల్లడు ప్రతీకగా చూపాడు విశ్వనాధ .

మా బాబు నవల హింసకు ,పరిహాసానికి గురైన బాబు లో కారుణ్యం ,జీవిత పరిమళం వికసింప జేయటం ఉంది .తనను చంపాలనుకొన్న పాముల వాడికి ప్రాణ భిక్ష పెట్టటం  పరాకాష్ట.కుశాలమ్మ గొప్ప పాత్రకూడా .కుణాలుని శాపం నవలలో స్నేహ మాధుర్యం గొప్పతనం వివరణ ఉంది. అధికారదుర్వినియోగం ,పదవీకాంక్ష పనికి రాదనీ చెప్పాడు వీటన్నిటికంటే స్నేహం ,ధర్మ రక్షణ ,మానవత ,మంచితనం అవసరం అని చెప్పెనవల .

హాహా హూ హూ నవలలో మానవుని అల్పత్వాన్ని తెలియ జేశాడు విశ్వనాధ .-లండన్ ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద ఒక వింత జంతువు  పది ఉంటే చూడటానికి చాలా మందివస్తారు భాషా వేత్తలూ ,మతపెద్దలూ చేరతారు .ఆ జంతువూ మెడవరకు మనిషి. తల గుర్రం తల .జూలు ,నిక్కించిన చెవులు .చేతులకు కాళ్ళకు కడియాలు .ఒళ్ళంతా గాయాలు మూర్చలో ఉంటుంది .పది హీను రోజుల తర్వాత ‘’కిం గతోస్మి ‘’ అంటుంది  అంటే నాకు ఏమైంది ?అని .ఇదివిన్న భాషా పండితుడు  దానికి సంస్కృతం వచ్చు అని గంతులేస్తాడు .ఒక బిషప్ వచ్చి దాన్ని ఏ కులం అని అడిగితె ‘’ఆహా అల్పతామనుష్యాణాం’’అంటుంది అంటే యెంత అల్ప బుద్ధి మానవులది అని అర్ధం .భారతీయ సంస్కృతీ  భారతీయత ,భాష గోప్పతనాలను ఇందులో చెప్పాడు .

కడిమి చెట్టు చారిత్రాత్మక నవలలో కదంబం అనే వంశం కదా .ఆ చెట్టు తో బాటు శుక్ల పక్ష చంద్రుని గా పెరుగుతాడు మయూర శర్మ  అనే కుర్రాడు.శాత వాహన రాజ్యం లో స్తానా కోడూరు పల్లవుల వశమౌతుంది పల్లవులు పాశవికం గ మయూరుని తల్లి తండ్రి అక్క తాతలను చంపేస్తారు .వారిపై పగ తీర్చుకోవాలనుకొంటాడు శర్మ .అతన్ని రామ శర్మ పెంచుతాడు .నిద్రలో కూడా శత్రువును చంపుతున్నట్లే కలకనే వాడు.ఈ బాలుడిలో మహా పురుష లక్షణాలు గుండెలో శౌర్య రేఖ ఉన్నాయని వైద్యుడు గమనిస్తాడు .చివరికి పగ తీర్చుకొంటాడు మయూర శర్మ .ఇందులో జాతిని సంరక్షించుకోవటం ,తెగువ సాహసం సంస్కృతీ పరిరక్షణం ఉన్నాయి .

ఇప్పుడు మనం తెలుసుకొన్న నవలలో –వీరవల్లుడు లో మానవత్వం ,మా బాబులో కృతజ్ఞత ,కడిమి చెట్టులో పట్టుదల హాహా హూహూ లో భారతీయ సంసృతి విశిష్టత ప్రతిస్తితమైంది .ఇవే చిన్ననవలలో విశ్వనాధుని విశ్వ నాదం .ఏ యిజమూ గట్టేకించదు .వేదిజం ఒక్కటే శరణ్యం .భారతీయ మందిరానికి ఎన్నో దారులున్నాయి .అందులో తెలుగు దారిపేరు విశ్వనాధ ‘’అన్నారు ప్రముఖ  కధకులు శ్రీ వాకాటి పాండురంగా రావు .దేశ కాలాలకు అతీతం గా ఉన్న భారతీయ సంసృతి  క్షీణిస్తోందని ,తన రచన నిండా కన్నీరు కార్చిన మహానుభావుడు విశ్వనాధ –ఆ తపస్వి అన్నీటి ధారలోంచి ఘనీభవించిన మహోజ్వల రత్నమే రామాయణ  కల్ప వృక్షం  .కల్ప వృక్షం ,వేయి పడగలు రెండూ ఆధునిక ఇతిహాసాలే అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నా చార్య .వేయిపడగలలో విశ్వ లయఉంది  మూల చైతన్యం లో  అనంత చైతన్యాన్నిమానవీయ విలువలను నెలకొల్పాడని వాల్మీకి సుందర కాండలో సుందర హనుమంమంత్రం  నిక్షేపిస్తే  విశ్వనాధ కల్ప వృక్షం లో ‘’ఆపదుద్ధారక హనుమంమంత్రం ‘’ను నిక్షేపించాడని యుద్ధ కాండ  అంతా  రావణుడి ఈశ్వర అన్వేషణ మేనని  రాముడు నారాయణ స్వరూపం అని తెలిసుకోగానే రావణ వధ జరిగిందన్ దైత్య ప్రవ్రుత్తి  నశించి దివ్య ప్రక్రుతి అతనీలో విజ్రుమ్భించిందని ,భారతీయ సారస్వతం లో కైలాస శిఖరం కల్ప వృక్షమని మని ,వేయిపడగలులో కుండలినీ విద్య ఉందని ధర్మారావు మనీషి ,రామేశ్వర శాస్త్రి భూమిక  ,అరుంధతి ఆరోహణ చైతన్యం గిరిక  హృదయం అన్నారు సుప్రసన్న .విశ్వనాధ ది హరి హరాద్వైతం .ఆయనకు శివుడిలో విష్ణువు  విష్ణువు లో  శివుడు కనిపిస్తారు .తిరుమల శ్రీనివాసుడి  చేతిలో చక్రం  శివుడి చేతికి చుట్టుకొన్న చేతికి  వాసుకిగా ,శంఖం గజముఖు డైన వినాయకుడుగా ,నిలువు బొట్లు త్రిశూలం గా దర్శించాడు విశ్వనాధ .మున్నంగి వేణు గోపాల శతకం లో వేణుగోపాలుడి నెమలి పించం సురగంగ తరంగాలుగా ,పిల్లన గ్రోవి శివుడి ఆయుధం ఖట్వాంగం గా   ,రత్న హారాలు పాకే పాముల్లా కనిపించాయి విశ్వనాధకు  .వేయిపడగల పాము  సుబ్రహ్మన్యేశ్వరుడు  సృష్టికి మూల ద్రవ్యం కు ప్రతీక సకల ఊహల  సనాధుడు విశ్వనాధ .అయన కధల్లో మాక్లీ  దుర్గం లో కుక్క .ఏమి సంబంధం  రెండూ భారతీయ భాషల్లో మోగిన మాణిక్య వీణలు .

శ్రీ శ్రీ ,విశ్వనాధలవి భిన్నమార్గాలైనా ఒకరిపై  మరొకరికి గౌరవం ఉన్నవారు .ఒక సారి శ్రీ శ్రీ ‘’మదరాసు నగర వీధుల్లో ఆకలితో మాడుతూ తిరుగుతున్న రోజుల్లో నా ప్రాణాన్ని నిలబెట్టినవి రెండే –ఒకటి  కార్పోరేషన్ కుళాయి నీళ్ళు రెండవది ,విశ్వనాధ సత్యనారాయణ కవితా ‘’అని రాసుకు న్నాడు .అలాగే విశ్వనాధపై రాసిన ఒక గీతం సుప్రసిద్ధమైనది –

‘’మాటలాడే వెన్నెముక –పాట పాడే సుషుమ్న –నిన్నటి నన్నయ భట్టు –ఈ నాటి కవి సమ్రాట్టు –గోదావరి పలక రింత –కృష్ణా నది పులకరింత –కొండవీటి పొగమబ్బు –తెలుగు వాళ్ళ గోల్డు నిబ్బు –అకారాది క్షకారాంతం –ఆ సేతు మిహికావతంశం –అతగాడు తెలుగు వాడి ఆస్తి –అనవరత తెలుగునాటి ప్రకాస్తి –ఛందస్సులేని ఈ ద్విపద –సత్యానికి నా ఉపధ ‘’.

ఇంతటి విశిష్ట వ్యక్తిని ఇక్కడ వారి స్వగ్రామం లో స్మరించు కోవటం  మనందరి అదృష్టం .దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ‘’అని చెప్పాను

ఇక్కడ ఈ సభ జరుగుతుందని తెలిసి విని గన్నవరం శాసన సభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారి తండ్రి గారుశ్రీ రమేష్ చంద్ర  ఆత్మీయ అతిధులుగా విచ్చేసి తనకు విశ్వనాధపై ఉన్న ఆరాధనా భావాన్ని చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ చదివానని సంస్కారం మూర్తీభవించిన వ్యక్తీ విశ్వనాధ అని మంచి హాస్య ప్రియులని ,ఆయన రచనలో జీవం ఉంటుందని అదే అందరికి ఆకర్షణ అని ,ఇంత వివిధ్యం తో ఇన్ని ప్రక్రియలలో అసమాన పాండిత్యం తో రచనలు చేసిఉన వారు అరుదని, వారు నందమూరులో జన్మించటం మనందరి అదృష్టమని ప్రముఖ సినీ దర్శక నిర్మాత గూడవల్లి రామ బ్రహ్మం గారిది కూడా నందమూరు అని చెప్పారు .

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ మాటల్లో విశ్వనాధ మనుమలం అని చెప్పుకోవటం తమకు గర్వం గా ఉందని ,అయన పేరిట ట్రస్ట్ ఏర్పరచి ఆర్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్ని రచనలు రెడీగా ఉన్నాయని చెప్పారు వేయిపడగలలోని సుబ్బన్న పేట నందమూరు  అని గిరిక తిరగటం ,స్వామి ఉత్సవ వైభవాలు ,జమీందారు దేవిడీ ఈ గ్రామంలో ఉన్నట్లు  చదివితే గొప్ప అను భూతి కలుగుతుందని ,సరసభారతి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం  హర్షణీయమ న్నారు . సత్యనారాయణ తమ్ముడు కూడా తాతగారి పద్యాలుపాడి స్మరించాడు .విశ్వనాధ మునిమనవడు ,సత్యనారాయణ కుమారుడు చిరంజీవి  శ్రీ పావని చాలా బాగా  శ్రావ్యం గా విశ్వనాధ పద్యాలను గానం చేసి అందరిని అలరించి వారసత్వాన్ని నిలిపాడు .సరసభారతి ఈ చిన్నారికి అతని తండ్రిశ్రీ  సత్యనారాయణకు ,శ్రీ రమేష్ చంద్ర కు శాలువాలు కప్పి సత్కరించి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి జ్ఞాపికలను ప్రదానం చేసింది .మిత్రులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు నాకు పట్టు బట్టలు పెట్టి సత్కరించారు .

సభ ప్రారంభానికి ముందు శ్రీ గుడిసేవ భాస్కర దాసు గారు సుందరకాండ పారాయణ చేస్తే ,బిందు దత్తశ్రీ భగవద్ గీతా పారాయణ చేసింది .సుమారు యాభై మంది పాల్గొన్న ఈ సభ జయ ప్రదయమై అందరికి ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది .ఊహించని స్పందన ఇది .ఉయ్యూరు నుంచి మాతో పాటు కారులో ఇక్కడికి శ్రీ ఆంజనేయ శాస్త్రి ,శ్రీమతి మల్లికాంబ  ,శ్రీ వి బి జి రావు వచ్చారు. రావు గారు ఏంతో గొప్పగా సహకరించి ఫోటోలు ,వాయిస్ రికార్డ్  పనులను చూసి కార్యక్రమ నిర్వహణ కు  తోడ్పడ్డారు .శ్రీమతి శివలక్ష్మి వందన సమర్పణ ,జనగణ మణ  తో కార్యక్రమం సమాప్తమైంది .ఒక  గొప్ప అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చిన కార్యక్రమగా నిలిచిపోయింది ఇది .అప్పటిదాకా వాన భయ పెట్టినా ,దోబూచులాడినా కార్యక్రమం మొదలవగానే మంచి ఎండ వచ్చి వరుణుడూ దీవించి సహకరించాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-14-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’

ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’

……………..
ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ వచ్చే నెల
జ్ఞానపీఠ అవార్డు స్వీకరిస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేంద్రీయ
విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో
ఈ నెల 20,21 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా…
……………….
2013వ సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌ను జ్ఞానపీఠ అవార్డు కోసం ఎంపిక చేయడం దేశంలోని అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులను గౌరవించడంగా భావించాలి. కేదార్‌నాథ్ సింగ్ ప్రతి రచనలో ఒక ఆత్మీయ ఆర్ద్రత కనబడుతుంది. ఆ ఆర్ద్రత ఈ దేశంలోని కోట్లాది గొంతులకు ఒక వేదికగా మారుతూ స్వతంత్ర భారత వైరుధ్యాలను ముందుకు తెస్తుంది. 1934లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన కేదార్‌నాథ్ సింగ్ చుట్టూ ఉన్న ప్రపంచానే్న తన కవిత్వానికి వస్తువుగా మలచుకుని అనేక కావ్యఖండాలను చెక్కారు. తన చుట్టూ ఉన్న పదజాలానే్న కవితా భాషగా స్వీకరించి ప్రజల భాషను సజీవంగా నిలబెట్టారు. నిజానికి వారి కవితాయాత్ర 1950 నుంచే మొదలవుతుంది. సమకాలీన హిందీ కవిత చరిత్ర రచనా రీతుల మీద చర్చకు తెరలేపిన కవి ఆజ్ఞేయ్ సంపాదకత్వంలో 1950లో వెలువడిన ‘తార్ సప్తక్’ లో స్థానం పొంది అప్పట్లోనే శక్తివంతమైన యువకవిగా పేరొందారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను లోతుగా పరిశీలిస్తూ తమదైన శైలిలో గొంతు కలిపిన కవి కేదార్‌నాథ్ సింగ్. వారి కలం నుంచి వెలువడిన కవితా సంకలనాల శీర్షికలను చూడగానే కవి తృష్ణ అవగతమవుతుంది. ‘అభిబిల్కులే అభి’, ‘జమీన్ పక్ రహీ హౌ’, ‘అకల్ మే సారస్’ (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన) టాఘ్ (పులి) ల్లాంటి అత్యంత శక్తివంతమైన రచనలు ఈ రోజు జ్ఞానపీఠ అవార్డు రావడానికి పునాదులుగా పనిచేశాయి. మిగతా కవితా సంకలనాల కన్నా ‘పులి’ కవితా సంకలనం విశిష్ట రచనా ప్రక్రియను ప్రవేశపెడుతుంది. ‘పులి’ కవితా సంకలనం కొన్ని కావ్యఖండికల సమాహారం.
నిజానికి మానవ చరిత్రలో అత్యధిక ప్రయాణం చేసింది కవిత్వమొక్కటే. అత్యధిక విశ్వాసాన్ని ప్రకటించబడింది కూడా కవిత్వం పట్లనే. ‘నాగరికత దినదినాభివృద్ధితో పాటు కవిత్వం పతనమవుతుంది’ అని మిల్టన్ గురించి రాసిన ఒక వ్యాసంలో మెకాలే అన్నప్పటికీ కవిత్వ ప్రయాణం అజరామరంగా కొనసాగుతూనే ఉంది. దానిపట్ల విశ్వాసం సన్నగిల్లలేదు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో కవిత్వం అనేక మలుపులను, ఒడిదుడుకులను చూసింది. తన రూపాన్ని, వ్యాకరణాన్ని మార్చుకుంది. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అధమం వైపు మళ్లిన సంఘటనలూ ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలంటే కవిత్వం యొక్క ఈ సుదీర్ఘ చరిత్ర ఆత్మ సంఘర్షణల చరిత్రే. మానవ నాగరికత, సంస్కృతితో బాటు సమానాంతరంగా నడుస్తున్న చరిత్ర. అప్పుడప్పుడు ముందుగా నడుస్తూ మార్గాలను, మలుపులను అడ్డగిస్తున్న చరిత్ర కవిత్వానిది.
హిందీ కవిత్వం, ముఖ్యంగా నేటి హిందీ కవిత చరిత్ర ఆత్మ సంఘర్షణతో కూడుకున్నదని చెప్పక తప్పదు. ఈ ఆత్మ సంఘర్షణను గమనంలో ఉంచుకోకుండా ఇప్పుడు వస్తున్న కవిత్వాన్ని గాని, కవులను గాని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే కవిత్వంలో కనబడే ఆత్మసంఘర్షణ కవి యొక్క ఆత్మసంఘర్షణ కాబట్టి. ఈ సంఘర్షణని ప్రతిభావంతంగా, శక్తివంతంగా వ్యక్తం చేసిన కవులలో కేదార్‌నాథ్‌సింగ్ అగ్రగణ్యులు. సమకాలీన సంఘర్షణని, ఆత్మ ఘర్షణని అతని కవిత్వం ఆవిష్కరిస్తుంది.
‘నా వీపుమీద కాలపు పంజాల సంతకాలు ఎన్ని ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు’ అంటూ ‘పులి’ కవిత్వం ఆరంభంలోనే నేడు విస్తరిస్తున్న ఉద్యమ స్ఫూర్తిని, ఆర్తిని, సంఘర్షణ లోతులను కేదార్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. ‘పులి’ కవిత్వం ‘మనిషి’ని కుదిపివేసే కవిత్వం. చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనల నడుమ నిలబడి అస్తిత్వం, అభివృద్ధి కోసం పరితపించే ‘మాయావి సమయం’లో మనిషి అంతరంగంలో నుంచి పుట్టుకువచ్చే అనేక రూపాల ఆకారం – ‘పులి’. పులి కవిత్వం అనేక దృశ్యాలు, చిత్రాలు, రూపకాలుండే ప్రతీకా? లేక ప్రతిబింబమా? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ‘మనిషి’ అంతర్గత పరిస్థితిని సృజనాత్మక దృష్టితో పరిశీలించే గొప్ప కావ్యం ‘పులి’. కాల ప్రవాహంలో, చీకటి మలుపులతో కొనసాగుతున్న మానవ విధ్వంసానికి పోరాట జీవన గాథ ‘పులి’. మనలోని చైతన్యాన్ని, ప్రేమను, అమాయకత్వాన్ని, నిరాశను అర్థం చేసుకునే విశ్వాసాన్ని, అవకాశాన్ని ‘పులి’ కల్పిస్తుంది. ‘పులి’ నగరమంతటిని తిరస్కారంగాను, అసహ్యంగాను చూస్తుంది. అంటే మానవ నైజంలో చోటుచేసుకున్న వికృతాన్ని అసహ్యించుకుంటుందన్నమాట. మానవ జీవితంలోని వికృతాన్ని, విపరీత పోకడలను తిరస్కరించడమంటే మనిషిలోని ప్రేమను బ్రతికించడమే.
అనారోగ్యం, అంధవిశ్వాసాలు, నిరక్షరాస్యత, దారిద్య్రం మీద పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు భయంకరమైన వౌన సంస్కృతికి అలవాటుపడ్డారు. ప్రశ్నించే స్వభావాన్ని ఇంకా అలవరుచుకోలేదు. తమ గురించి ఆలోచించే వారున్నారని, వారే అన్నీ చేసి పెడతారని ఆలోచించే ‘మాట్లాడని సంస్కృతి’లోకి నెట్టివేయబడ్డారు. అందుకేనేమో ‘పులి’ ఓచోట ‘మనుషులు ఈమధ్య వౌనంగా ఎందుకుంటున్నారు’ అని ప్రశ్నిస్తుంది. కాని సంతృప్తికరమైన జవాబు దొరకదు. అయోమయంలో పడిపోతుంది. మన పల్లెసీమలు పట్నం వైపు కదులుతున్నాయి. ‘కోరికలతో నిండిన ఎద్దుల బండ్లు కదిలిపోతున్నాయి’ అంటాడు కవి. అయితే అవి ‘పల్లె నుంచి పట్నానికి ఏదో ఒకటి మోస్తూ తన వంతు భూమిని కోల్పోతూ సాగుతుంటాయి’ అంటాడు. ఎంత నిజం. ఇలాంటి అనేక వాస్తవాలతో సమకాలీన భౌతిక, భౌతికేతర పరిస్థితులను, సమస్యలను స్పర్శిస్తూ, సృజిస్తూ పాఠకుడిలో ఒక లోతైన ఆలోచనను నాటి అర్థవంతమైన ప్రయత్నం ‘పులి’.

హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ కవితలు రెండు

  • 20/10/2014
TAGS:

కవిత – 1

ఏదో
ఓ రోజుకి
ఈ నేల మీద
పులులు ఉండవని
అవి పిల్లల పుస్తకాల్లోకి
చేరిపోతాయని
పులి భయం

పులికన్నా ఎక్కువగా
నాకూ భయమే
అప్పుడు
చేతులు ఎక్కడ ఉంటాయి
పుస్తకాల్ని చదివేందుకు
కళ్ళెక్కడుంటాయి
ప్రెస్‌లు ఉండవు
పట్టణాలూ ఉండవు
‘‘క’’ తర్వాత
‘‘ల’’ లేక ‘‘శ’’
గెంతుతూవచ్చి
పడే పుట ఉండదు
దానిని గాలి
తన జ్ఞాపకాల్లో
పాతుకుంటుంది

పూర్తి పదాన్ని ఆకులు నెమరువేస్తాయి
నేలమీది
కనపడని తారల గుండా
ఆసుపత్రి కిటికీ క్రింద
చనిపోయే మనిషి
పెదవుల్లో
బ్రతికే గీతం అవుతుంది

నాకు భయం
మామూలు సీదా సాదా భయం
భయం ఎక్కడ ఉంటుంది!

కవిత – 2

గోధూళి వేళ
నగరం గోపురం నుండి
ఓ మనిషి
అరుస్తున్నాడు

గాలిమరల రెక్కలు
నేత చేతులు
నడిచే కాళ్ళు
అన్నీ గతించిపోతున్నాయి
కానీ
మనం బ్రతకాలి
పులితోబాటు బ్రతకాలి
పులి లేకుండా బ్రతకాలి

నీళ్ళలాగా
రాళ్ళలాగా
బ్రతక గలగాలి
ఉరి కంబమెక్కి
తిరిగి లేవగలగాలి
సమయం లేకున్నా
స్థలం లేకున్నా
సైకిల్ ట్యూబులో ఉండేంత
గాలి నగరంలో మిగిలినా
బ్రతకాలి

బ్రతకాలి
ఈ నేలపైన బ్రతకాలి
ప్రతి మనిషి బ్రతకాలి
అంగుళం అంగుళం బ్రతకాలి

నిజానికి
నగరంలో ఆ మనిషి లేడు
ఆ గోపురం లేనే లేదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన హీరోలు మారుతున్నారా?!

మన హీరోలు మారుతున్నారా?!

ఇప్పటికే విడుదలై మంచి టాక్‌నీ, కమర్షియల్ విజయాన్నీ సొంతం చేసుకున్న ‘మనం’, ‘దృశ్యం’, ‘లెజెండ్’ సినిమాలు ఒక రకంగా తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసాయని చెప్పాలి. ఇదిలా ఉండగానే ‘గోపాల..గోపాల’ సినిమా అరుదైన కాంబినేషన్‌తో అనౌన్స్ అవడం ఒక ధోరణికి అలవాటుపడ్డ సగటు ప్రేక్షకులనేకాక, సినీ ప్రేమికులను, మేధావులను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఈ పరిణామాలు ప్రామాణికం కాకపోయినా, మారిన, మారుతున్న మన హీరోల దృష్టికోణానికి అద్దంపడుతున్నాయా? ఇమేజ్ చట్రంలో బిగుసుకుపోయి, అదే ‘సింహాసనం’అనే భ్రమలో మునిగితేలుతున్న మన హీరోల వైఖరిలోని మార్పుకు ఇది ఏమైనా సంకేతాలుగా నిలుస్తున్నాయా? కొంపదీసి మన హీరోలు మారారా? అనే చర్చను లేవనెత్తుతున్నాయి. ======================== 1980 దశకం అనంతరం తెలుగు తెరపై దూసుకొచ్చిన హీరోల విషయంలో చాన్నాళ్ళుగా ఒక విమర్శ ఉంది. ‘ఈ హీరోలు బాలీవుడ్ హీరోలలా ఒకరితో ఒకరు కలవరు. ఎవరి ఈగో జోన్‌లలో వాళ్ళుంటారు. స్టార్‌డమ్ విషయంలోనూ, నెంబర్స్‌గేమ్ విషయంలోనూ ఒకరితో ఒకరికి సరిపడవు’అనేవే ఆ విమర్శలు. ఆ తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల విషయంలో గత కొంతకాలం వరకూ ఈ వ్యాఖ్యానాలు నిజం అని చెప్పడానికి తగిన ఉదాహరణలే ఉండేవి. కానీ ఇటీవలి కాలపు పరిణామాలను, సినిమాల పరంగా కాంబినేషన్‌ల పరంగా వస్తున్న మార్పులను గమనిస్తే, ఈ హీరోల వైఖరిలో మార్పు వచ్చిందేమో! అసలు ఈ హీరోలు మారారేమో! అనే ఆలోచనలు సాధారణ ప్రేక్షకుడి మనసులో చెలరేగుతున్నాయి. హీరోల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు, వైరుధ్యాలను ఆసరాగా చేసుకుని ఇంతకాలం తమలో తాము శత్రువులుగా భావించుకున్న ఫ్యాన్స్‌ల మనసులలో కూడా ఇప్పుడు ఈ రకపు ఆలోచనలే పొడసూపుతూ, అందరిమధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనే సానుకూల దృక్పథం రూపొందుతోంది. ఇది ఆహ్వానించదగిన అంశం అనడంలో సందేహం లేదు. ‘మనం-దృశ్యం-లెజెండ్’ త్రయం మన సీనియర్ తెలుగు హీరోల వైఖరి మారింది అనడానికి ఇటీవలి తాజా ఉదాహరణలుగా నిలుస్తున్న సినిమాలు- మనం, దృశ్యం, లెజెండ్ అని చెప్పాలి. ‘మనం’ సినిమాలో నాగార్జున చూపించిన చొరవ, చేసిన ప్రయోగం మూడుతరాల అక్కినేని నటులను ఒక్క కథలో ప్రత్యక్షమయ్యేలా చేసింది. కథ, కథనం, మానవ భావోద్వేగాలు, అనుబంధాల విషయంలో పరిణతిని ప్రదర్శించి నాగార్జునలోని నిజమైన నట నిర్మాతను వెలికి తీసింది. మరోవైపున ‘కేడి’, ‘రగడ’, ‘్భయ్’వంటి మాస్ ఇమేజ్ నుంచి రియలిస్టిక్ తరహాలో నాగార్జున సహజ నటనను ప్రదర్శించగలడని ప్రూవ్ చేసాయి. అలాగే ‘దృశ్యం’కూడా! మలయాళ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాని మహిళా దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ నటించడానికి అంగీకరించడం ఒకవైపు, ఈ సినిమాలోని పాత్రపరంగా ఆయన ఇద్దరు టీనేజ్ ఆడ పిల్లలకు మధ్యవయసు తండ్రిగా నటించడం వెంకటేష్ దృష్టికోణంలోని మార్పుకు సంకేతాలే అని భావించాలి. బాడీగార్డ్, షాడో, మసాలా వంటి సినిమాలలోని యాక్షన్ హీరో ఇమేజ్‌నుంచి దృష్టి మరల్చి ఫ్యామిలీ పర్సన్‌గా మధ్యతరగతి కుటుంబీకుడి పాత్రని పోషించడం తన వాస్తవిక వయోరీతికి దగ్గరగా తన పాత్ర ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. ఇక, ‘లెజెండ్’లో జగపతిబాబు మొదటిసారిగా విలన్‌గా నటించి, ఇంతకాలంగా తనకు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్‌నుంచి క్యారెక్టర్ పరంగా కొత్తగా ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఇదే ఊపులో వెంకటేష్- పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కలిసి ‘గోపాల… గోపాల’ సినిమాలో నటిస్తుండటం మరింత ముచ్చటగా భావించడంలో తప్పులేదు. మొన్నామధ్య వెంకటేష్- మహేష్‌బాబు ఇద్దరూ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో నటించి, ఆ సినిమాని ఏ రేంజ్‌లో హిట్ చేసిందీ చూసాం. ఇప్పుడు ఈ ‘గోపాల… గోపాల…’కూడా ఆ దారిలోనే వెళ్తుందనే ఊహలు నిజం అవుతాయనే చెప్పొచ్చు. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’ సినిమాకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా రానున్న కాలంలో మరిన్ని అరుదైన కాంబినేషన్ సినిమాలకి తెర తీసే అవకాశం ఉంది. సీనియర్ హీరోల దృష్టి మారిందా? ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరూ తమనితాము సరికొత్తగా తెరపై ఆవిష్కరించుకోవాలనే తాపత్రయంలో ఉన్నారనే విషయాన్ని, వారు ప్రస్తుతం నటించిన, నటిస్తున్న సినిమాలు తేటతెల్లం చేస్తున్నాయి. వీరు ఇప్పుడు చేస్తున్న సినిమాలు, ఎంపిక చేసుకుంటున్న కథలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ లెక్కన మన తెలుగు సీనియర్ హీరోలు మారారు అనడానికి ఈ సప్త సూత్రాలను కారణాలుగా చెప్పవచ్చు: 1.ఇదివరకటిలా కథను దాటేసి, కథాతీతంగా ప్రవర్తించే హీరోలా కాకుండా కథల్లో ఒదిగిపోయే కథానాయకుడిగా మారడం. 2. పాత్రోచితంగా, పాత్ర స్వభావం- పరిధుల మేరకు నటించడం, ఆ పాత్ర తరహాలోనే సహజంగా ప్రవర్తించే ప్రయత్నం చేయడం. 3. ఇమేజ్ పేరుతో కథని నేలమీద నడవకుండా చేసే ధోరణికి గుడ్‌బై చెప్పడం. 4. వయసుకు తగిన పాత్రలను, కథలను ఎంపిక చేస్కోవడం. 5. తమ శారీరక, వయోపరమైన పరిమితులను గమనించి, ఆ లోపాలను అధిగమించడానికి కంటెంట్‌ను ఆశ్రయించడం. 6. యంగ్ హీరోలతో పోటీపడటంకోసం కథలలో యంగ్ హీరోల కథలనే సెలెక్ట్‌చేసుకోవడానికి స్వస్తిపలకడం. 7. ఇప్పటి యంగ్ హీరోలతో రేస్‌లో పోటీపడటానికి పకడ్బందీ స్క్రిప్ట్‌లనే సాధనంగా గుర్తించడం. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలందరూ (ఒకరిద్దరు మినహా) ప్రస్తుతం ఈ ‘సప్తసూత్ర నియమాల’నే తమ ‘బాటమ్‌లైన్’గా మార్చుకున్నారని, ఇటీవలి వారి సినిమాలు- కథలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆలెక్కన చూస్తే మన హీరోలు మారారనే విషయం కూడా సులభంగానే వెల్లడవుతుంది. ‘సైకాలజీ’ ఏం చెబుతోంది? సీనియర్ హీరోలలో పొడసూపుతున్న ఈ మార్పు సగటు సినీ ప్రేమికునికి కొత్త తరహా వినోదాల విందును, కొత్తతరం సినిమాలను అందిస్తున్నది కనుక ఈ మార్పును అందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’ విషయంలో సైకాలజీ ఏం చెపుతుందో ఒకసారి గమనిద్దాం. సైకాలజీలో వ్యక్తుల ప్రజ్ఞ (ఇంటెలిజెన్స్)ను కొలవడానికి ఆల్‌ఫ్రెడ్ బీనె వంటి మనోవైజ్ఞానిక శాస్తవ్రేత్తలు ఒక కొలమానాన్ని తయారుచేసారు. అదే 1) శారీరక వయస్సు 2) మానసిక వయస్సు. అంటే, పుట్టినప్పటినుంచీ వయస్సుపరంగా భౌతికంగా మనిషిలో వచ్చే శారీరక, జైవిక, దైహిక మార్పులను ‘శారీరక వయస్సు’ అంటారు. అలాగే ఉద్వేగాలు, మేధాశక్తి, జ్ఞానం, స్మృతి, అవధానం వంటి అంశాలపరంగా వయసుతోపాటు వచ్చే పరిణామాలను ‘మానసిక వయస్సు’ అంటారు. ఈ శారీరక-మానసిక వయస్సుల మధ్య పెరుగుదల సమాన స్థాయిలో ఉన్నస్థితినిబట్టి వ్యక్తి మేధాశక్తిని, ప్రజ్ఞాపాటవాలను అంచనా వేస్తారు. అయితే, సినీ రంగంలో ఈ సూత్రంలో చిన్న మార్పుచేసి, ఈ అంశాన్ని విశే్లషణ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే, 1) శారీరక వయస్సు 2) తెరమీది పాత్ర వయస్సు (స్క్రీన్ ఏజ్). చాలా సందర్భాలలో తెలుగు సినిమా హీరో వాస్తవిక వయస్సుకు, తెరమీది వయస్సుకు మధ్య ఏమాత్రం పొంతన లేని వ్యవహారమే అనూచానంగా వస్తోంది. చిత్తూరు నాగయ్య కాలంనుండీ మొదలైన ఈ అపసవ్య ధోరణి, ఆ తర్వాత ఎన్టీఆర్-అక్కినేని-కృష్ణ- శోభన్‌బాబు- కృష్ణంరాజులతో పరాకాష్టను అందుకొంది. ఇదే తరహా వాస్తవిక స్థితిని అంగీకరించలేని స్థితి, ప్రస్తుత సీనియర్ హీరోలలో కూడా అంటువ్యాధిలా ఇంకా కొనసాగుతోంది. అందుకే ఐదు పదుల వయసున్న స్టార్ హీరో కూడా, తెరమీద కాలేజ్‌కెళ్ళే కుర్ర హీరో పాత్రలకే మొగ్గుచూపే స్థితి తెలుగు సినీ పరిశ్రమలో రాజ్యమేలుతోంది. హీరోలను ఆశ్రయించే, నడుస్తున్న పరిశ్రమ, అనివార్యంగా కథలని కూడా వారికి అనుగుణంగానే రూపొందించుకోవలసి వస్తోంది.. ఈ విధానాన్ని మనం, దృశ్యం సినిమాలు, రానున్న ‘గోపాల… గోపాల’ సినిమా ఒక రకంగా బ్రేక్ చేసాయ. దీనివల్ల హీరోల శారీరక వయస్సు, తెరమీద వారు పోషించే పాత్రల వయస్సు మధ్య సమన్వయం కుదిరి, వారి నటనలు, హావభావాలలో అసహజత స్థానంలో సహజత్వం, హీరో స్థానంలో వారి పాత్ర స్వభావం ప్రేక్షకులకు సాక్షాత్కారం అవుతుంది. సైకాలజీ సూత్రాలు చెప్పినట్లుగా సీనియర్ హీరోలు ఇలాగే తమ శారీరక- తెర వయసు పాత్రలను సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళడం హీరోల మారిన తీరుకు సూచికగా మారుతుంది. ఈ మార్పుకు కారణాలేంటి? తెలుగు సీనియర్ హీరోలలో ఇపుడు కనిపిస్తున్న ఈ ‘మార్పు’వెనుక అసలు కారణాలేంటి? హీరోలలో జ్ఞానోదయం కావడమా? తెలుగు సినిమాని ఉద్ధరించే లక్ష్యమా? అని ఆలోచిస్తే, ఇవేవీ కావు అని కొంచెం లోతుగా ఆలోచిస్తే అవగతమవుతుంది. సీనియర్ హీరోలకు ప్రస్తుతం క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గతంలో ఉన్నంతగా లేదు. కొత్త తరం హీరోల వైపే యువ ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఈ సీనియర్ హీరోల మార్కెట్ వాల్యూ, క్రేజ్ తగ్గిపోయాయి. ఈ వాస్తవాన్ని గమనించిన ఈ హీరోలు ఇంకా ‘కుప్పిగంతులు’ ఎందుకులే అని గుర్తించి, దానిని బాహాటంగా అంగీకరించడానికి మనసొప్పక, తమలోని మార్పుకు అందమైన కారణాలను చెపుతున్నారు. వారి మార్పుకు వారిలోని సంస్కరణవాదాన్ని, సంస్కారాన్ని కొత్తగా హైలైట్ చేసుకుంటున్నారు. అంతేతప్ప తెలుగు సినిమాని ఉద్ధరించాలని కాదు అనే విమర్శ వినిపిస్తోంది. ఒకవేళ, మన తెలుగు హీరోల ఆలోచనాధోరణి, వైఖరి మారింది నిజమే అయితే ‘దృశ్యం’లాంటి ప్రయోగాలు నవతరం హీరోలెవరైనా చేస్తే నమ్మొచ్చు. కానీ సీనియర్ హీరోలు చేస్తున్న ఈ సినిమాల ఆధారంగా మొత్తం తెలుగు హీరోల ఆలోచనలోనే మార్పు వచ్చిందనడం తప్పని, గత్యంతరం లేని స్థితిలోనే సీనియర్ హీరోలు ఈ ప్రయత్నాలను, ప్రయోగాల పేరుతో చేస్తున్నారని, ఇదంతా వారి అస్తిత్వం, ఉనికికోసం చేస్తున్నవే తప్ప, వాటికి ఎలాంటి లోక కళ్యాణపు ఆశయాలని అంటగట్టడం సరికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, సీనియర్ హీరోలు తమ ‘సీనియారిటీ’ని గుర్తించి, దానికి తగినట్లుగా తెరమీద కనిపించాలని కోరుకోవడం వల్ల ప్రేక్షకులకు ఎంత మంచి సినిమాలను వారు అందించారో ‘మనం’, ‘దృశ్యం’సినిమాలు నిరూపించాయి. ఈ మార్పునుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా సీనియర్ హీరోలు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటే అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు ఇద్దరూ ఆనందపడతారనడంలో సందేహం లేదు. నవతరం హీరోలు కూడా మళ్ళీ సీనియర్ హీరోలు అయ్యేంతవరకూ కాలం వెళ్ళబుచ్చకుండా ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన తరుణం కూడా ఇదే! *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

‘మీరు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు. మీరు చిన్నతనంలో బాలకార్మికుడిగా టీ అమ్మారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పనొకటుంది. బాల్యంలో చిన్నారులు పనిచేయాల్సిన దుస్థితిలో ఉండకూడదు. ఆ వయసులో వారికి చదువే ముఖ్యం. ఉచితంగా వారికి అది అందాలి.. మీరు ఈ విషయంపై దృష్టిపెట్టాలి.’ – పనె్నండేళ్ల వయసులో చిన్నారుల చదువు కోసం పరితపించి.. ఒక్కో అడుగేస్తూ వచ్చిన 60 ఏళ్ళ కైలాష్ సత్యార్థి నరేంద్రమోదీకి పంపిన ట్వీట్. ‘మా అమ్మ చేసిన టిఫిన్ పట్టుకుని స్కూలుకు బస్సులో బయలుదేరా.. దగ్గరగా వచ్చిన కొందరు నీ పేరేంటి? అని అడిగారు…మలాలా అన్నాను…అంతే బుల్లెట్లవర్షం కురిపించారు… రెండేళ్లుపట్టింది బతకిబయటపడటానికి…ఇప్పుడు తాలిబన్లు ఎదురై చంపేస్తామన్నా.. భయమేం లేదు. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో వారికి చెబుతా… వారు చేస్తున్న పని తప్పని చెబుతా, బాలలు తమ హక్కుల కోసం పోరాడాలని చెబుతా…’ -ఇది 17 ఏళ్ల మలాలా మాట. పనె్నండేళ్ల వయసులో పలకరించిన మృత్యువుతో పోరాడి గెలిచిన చిన్నారి మాట… * * * ఆడపిల్లలకు చదువెంత అవసరమో వివరిస్తూ ప్రచారం చేస్తోంది మలాలా. చిన్నారులంతా పనిలోకి కాదు.. బడిలోకి వెళ్ళాలంటారు కైలాష్.. ఈ ఇద్దరూ కేవలం అలా చెప్పి ఊరుకోలేదు. ప్రాణాలకు తెగించి పోరాడారు. అందుకే వారు పిల్లల దేవుళ్లయ్యారు. అవిరళ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది నోబెల్‌శాంతి బహుమతి వరించింది. ఎవరీ కైలాశ్ సత్యార్థి మధ్యప్రదేశ్‌లోని విదిషలో పుట్టిన కైలాస్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్ట్భద్రుడు. భోపాల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని, చిన్నారులకు చదువుకునే అవకాశాలు కల్పించాలని, అక్రమ రవాణా, వెట్టిచాకిరీ నుంచి పిల్లలను రక్షించాలని భావించారు. అందుకోసం ఒంటరిగా పోరాటం ప్రారంభించిన ఆయన ఇప్పిడు దాదాపు 140 దేశాల్లో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. న్యూఢిల్లీలో భార్య, ఇద్దరు పిల్లలు, తాను విముక్తి కల్పించిన పిల్లలతో కలిసి ఉంటున్న ఆయన ప్రస్థానం ఇది. బుక్‌బ్యాంక్‌తో మొదలు పాఠశాల విద్య చదివేటప్పుడు తనతోసహా చాలామంది పిల్లలకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడం పెద్దసమస్యగా మారింది. కొంతమంది స్నేహితులతో కలసి పుస్తకాల సేకరించాలనుకున్నారు. ఓ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన కైలాష్‌సత్యార్థి అందులో సభ్యత్వం కావాలంటే ఒక విద్యార్థికి కావలసిన పుస్తకాలు కొనివ్వాలని షరతు పెటారు. కేవలం ఒక్కరోజులో వారు 2వేల పుస్తకాలు సమకూర్చారు. దానిని బుక్‌బ్యాంక్‌గా మార్చి పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఇది అతడి చిన్ననాటి పని. ఉన్నత చదువు పూర్తయిన తరువాత 1980లో మరో అడుగువేశారు. బచ్‌పన్ బచావో ఆందోళన్ పిల్లలను చదివించాలని, పనిలోకి నిర్బంధంగా దించడం, బాండెడ్ లేబర్‌గా పనిచేయించడం తప్పని, దానిని అడ్డుకోవాలని భావించారు. దేశంలోని తివాచీలు, కంబళ్ల పరిశ్రమల్లో పిల్లలతో ఎక్కువగా పనిచేయిస్తున్నారని గమనించారు. దీనిని అడ్డుకునేందుకు కలసిరావాలంటూ పిలుపునిస్తూ బచపన్ బచావో ఆందోళన్ పేరిట ఓ సంస్థను 1980లో ప్రారంభించారు. స్నేహితులు, సంస్థ సభ్యులతో కలసి బాలలతో పనిచేయిస్తున్న పరిశ్రమలు, కార్యాలయాలపై దాడులు చేసి వారిని రక్షించేవారు. 2004లో ఓ సర్కస్ కంపెనీ, 2011లో ఓ బట్టల పరిశ్రమల్లో బాలకార్మికులను విడిపించినప్పుడు యాజమాన్యాలు దాడులు చేయించడంతో తీవ్రంగా గాయపడినా మొక్కవోని దీక్షతో అడుగుముందుకేశారు సత్యార్థి. తరువాత ఆయనతో పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. దక్షిణాసియాలో 750 ఎన్‌జీఓలు ఇప్పుడు చేదోడుగా ఉన్నాయి. గ్లోబల్‌మార్చ్‌తో విశ్వఖ్యాతి బాలబాలికల హక్కుల సంరక్షణ, ఉచితవిద్య కోసం ఉద్యమించిన ఆయనకు యునెస్కో బాసటగా నిలిచింది. అదే లక్ష్యంతో 1998లో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌మార్చ్ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. 103 దేశాలు, 20 వేల పౌరసంస్థలు, 72 లక్షల మంది పౌరులు ఆయనతో నడిచాయి. జెనీవాలో జరిగిన సదస్సులో చిన్నారుల హక్కుల రక్షణకోసం ఓ తీర్మానం చేస్తే 140 దేశాలు సంతకం చేశాయ. బాలమిత్ర గ్రామ్ పిల్లలకు చదువుతోపాటు వారి హక్కుల రక్షణ, వారికి నచ్చిన వాతావరణం సృష్టించడం, పాఠశాలల్లో బాలబాలికలకు వౌలిక వసతులు ఏర్పడేలా చూడటం కోసం బాలమిత్ర గ్రామ్ కార్యక్రమాన్ని 2001లో ప్రారంభించారు. చురుకైన విద్యార్థులతో బాలపంచాయతీ పేరుతో ఓ కమిటీని వేయడం, ఆ గ్రామంలో, పాఠశాలల్లో మార్పులపై చర్చించి, ఉద్యమించి, సాధించడం వారి పని. ప్రజలూ వారికి అండగా నిలిచారు. ఇప్పటికి ఇలా 11 రాష్ట్రాల్లో 317 గ్రామాల్లో బాల పంచాయతీలు పనిచేస్తున్నాయి. మరో 8 గ్రామాలను ఇప్పుడు దత్తత తీసుకున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకోవడమే తప్ప పనుల్లోకి వెళ్లరు. వెళ్లనివ్వరు. ఆ ఇద్దరు.. ఇలా బాలమిత్ర పంచాయతీ సభ్యులుగా ఉన్న ఇద్దరు చిన్నారులకు దక్కిన గౌరవమేమిటో తెలుసా… జైపూర్‌కు చెందిన 14 సంవత్సరాల ఓం ప్రకాష్‌కు ఇంటర్నేషనల్ చైల్డ్ పీస్ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసే న్యాయనిర్ణేతల బృందంలో సభ్యుడిగా (జ్యూరీ) బాలమిత్ర గ్రామ్ విద్యార్థి, పనె్నండేళ్ల రాకేశ్‌కుమార్‌కు అవకాశం దక్కింది. * రగ్‌మార్క్-గుడ్‌వీవ్ కైలాష్ సత్యార్థికి ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన ప్రయోగం ఇది. 1994లో ఇది ప్రారంభించారు. బాలకార్మికులతో పనిచేయించకుండా తయారు చేసిన కంబళ్లు, తివాచీలకు ఇచ్చే సర్ట్ఫికెట్ ఇది. ఆయా ఉత్పత్తులపై ఈ రగ్‌మార్క్ ఉంటే వాటికి విలువ ఎక్కువ. ఈ సర్ట్ఫికెట్ కోసం ఆయా సంస్థలు తగుమాత్రం ఫీజు చెల్లించాలి. ఎగుమతి చేసే రగ్గు లేదా కంబళి విలువలో 0.25 శాతం, దిగుమతి చేసుకున్నప్పుడు ఆయా వస్తువుల షిప్‌మెంట్ విలువలో 1.75 శాతం ఫీజు చెల్లించాలి. ఆ మొత్తాలను చిన్నారుల చదువు, శిక్షణ, సంస్థల నిర్వహణకు వెచ్చిస్తారు. మొదట ఆసియా దేశాలకే ఈ రగ్‌మార్క్ పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపు 115 దేశాలు కావాలనడంతో దానిని గుడ్‌వీవ్‌గా మార్చారు. కేవలం రగ్గులు, కంబళ్ల పరిశ్రమలకే గాక ఫుట్‌బాల్, కోకోకోలా, గార్మెంట్ పరిశ్రమల్లోనూ పధ్నాలుగేళ్లలోపు పిల్లలతో పనిచేయించకూడదని ఇప్పుడు పోరాడుతున్నారు. 83525 కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వ చ్చిందని తెలిసిన వెంటనే బచపన్ బచావో ఆందోళన్ కార్యాలయానికి మీడియా ప్రతినిధులు పోటెత్తారు. అభిమానులు పెద్దసంఖ్యలో చేరిపోయారు. హాస్పిటల్‌కు వెళుతూండగా సమాచారం అందుకున్న కైలాష్ సతీమణి సుమేధ శరవేగంగా భర్తకు అభినందనలు చెప్పేందుకు కార్యాలయానికి వచ్చారు. అయితే, లోపలికి వెళ్లేందుకు ఆమెకు గంటపైగానే పట్టింది. ఈలోగా నింపాదిగా బయటకు వచ్చిన కైలాష్ ప్రత్యర్థి, ఆయన సిబ్బంది ఓ కాగితం తీసుకొచ్చి నోటీస్ బోర్డుపై అతికించారు. ఆ కాగితంపై ఓ నెంబర్ రాసి ఉంది. అది 83525. ఆ క్షణం వరకు వెట్టిచాకిరీ, నిర్బంధం నుండి బిబిఎ రక్షించినవారి సంఖ్య అది. తొలిచూపులోనే…. కైలాష్ సత్యార్థి సుదీర్ఘపోరాటం వెనుక సతీమణి సుమేధ మద్దతు ఉంది. స్థానిక పత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమెను కైలాష్ చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ మేగజైన్‌కు తరచూ ఆర్టికల్స్ రాస్తూండే సత్యార్థి ఓరోజు సుమేధ తండ్రితో అసలు విషయం చెప్పారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. 36 ఏళ్లక్రితం అక్టోబర్ 8న వారికి వివాహం అయింది. ఆ తరువాత ఏడాదికి బచపన్ బచావో ఆందోళన్ సంస్థను ప్రారంభించారు. ఏడాది పిల్లాడికి పాలు కూడా కొనే పరిస్థితిలో లేం. అయినా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు అంటారు సుమేధ. మేం తొలిసారిగా కలుసుకున్నది ఆక్టోబర్‌లోనే. మా పెళ్లి అయింది కూడా అదే నెలలోనే. మావారికి నోబెల్ వచ్చింది కూడా ఈ నెలలోనే అంటూ ఆనందం వ్యక్తం చేసిన సుమేధ ఆనందానికి ఎంతో అర్థం ఉంది. ఆయన సుమేధను దేవీజీ అని ప్రేమగా పిలుస్తారు. కైలాష్‌ను ఆమె సాబ్‌జీ అని పిలుస్తారు. అది వారిమధ్య అనురాగబంధాన్ని బలోపేతం చేసే సంబోధన. వారి కుమారుడు భువన్‌రిభు లాయర్. బచపన్ బచావో ఆందోళన్ సంస్థలోనే పనిచేస్తున్నారు. కైలాస్ తనయ అస్మిత. ఆమె ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేట్. ఆమె కూడా చిన్నారుల కోసం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకుంటున్నారు. మా నాన్నకు నోబెల్ వస్తుందని ఐదేళ్లక్రితం అనుకున్నాం, అప్పుడు రాలేదు. ఇప్పుడు అనుకోకుండా వచ్చింది. ఇది పిల్లలకు దక్కిన గౌరవం అని అస్మిత అంటోంది. ఆర్యసమాజ్‌లో సభ్యుడైన తన మామగారి సూచనతో కైలాష్ పేరు మార్చుకున్నారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సత్యార్థి అసలు పేరు కైలాష్ శర్మ. అయితే కులమత బేధాలు ఉండకూడదన్న గాంధీజీ స్ఫూర్తితో ఆయన పేరును కైలాష్ సత్యార్థిగా మార్చుకున్నారు. ముక్తిఆశ్రమ్-బాల ఆశ్రమ్ బచ్‌పన్ బచావ్ ఆందోళన్ సభ్యులు, తాను, మీడియా ప్రతినిధులు, పోలీసులు కలసి బాలకార్మికులు ఉన్న వ్యవస్థలపై పక్కాప్లాన్‌తో దాడులు చేసి చిన్నారులను రక్షించేవారు. ఆ తరువాత వారిని ముక్తి ఆశ్రమ్‌కు చేర్చేవారు. ఇది ఢిల్లీలో ఉంది. బట్టలు, ఆహారం, మందులు అందించి వారికి ధైర్యం నూరిపోసేవారు. వారి బంధువుల ఆచూకీ తెలుసుకుని వారిదగ్గరకు చేర్చేవారు. అనాథ బాలకార్మికులుంటే వారిని రాజస్థాన్‌లోని విరాట్‌నగర్‌లో ఉన్న బాల ఆశ్రమ్‌కు తరలించేవారు. వారిని దీర్ఘకాలంగా అక్కడే ఉంచి చదువు చెబుతారు. వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో నిశ్శబ్ద విస్ఫోటనం

నిశ్శబ్ద విస్ఫోటనం..

ఇరాక్, సిరియాలలో రక్తపాతం సృష్టిస్తున్న ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీ ముఠావారి జెండాలు జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శ్రుకవారం మళ్లీ కనిపించాయట. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులు మన దేశంలో విశ్రమించలేదన్న వాస్తవానికి ఇటీవల జరిగిపోతున్న ఇలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. పెద్ద ఎత్తున బీభత్స ఘటనలు జరిపే దుస్సాహసానికి ఒడిగట్టకపోయినప్పటికీ చడీ చప్పుడూ లేకుండా జిహాదీ యంత్రాంగం కలాపాలు సాగిస్తూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పేలుళ్లు ఇప్పుడు బంగ్లాదేశీయ జిహాదీ హంతకుల డొంకను కదిలించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి చొరబడిన ముగ్గురు టెర్రరిస్టులను చొరబాటు వ్యతిరేక పోలీసు విభాగం వారు కాల్చివేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లోని వర్ధమాన్ జిల్లా ఖాగ్రాగఢ్‌లో జరిగిన బాంబు పేలుళ్లు జిహాదీల ఆక్రమ కార్యక్షేత్ర విస్తృతికి నిదర్శనం. వర్ధమాన్ జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రాజకీయ పక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ రాజకీయ ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ నుంచి చడీ చప్పుడు లేకుండా చొరబడుతున్న బీభత్సకారులు గొప్ప క్రియాశీలకంగా ఉన్నారన్నది బయటపడిన నిజం. ఈ పేలుడు ఫలితంగా హతులైన ఇద్దరూ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉత్ ముజాహిద్దీన్ బీభత్స సంస్థకు చెందిన వారని దర్యాప్తు చేస్తున్న భద్రతావిభాగాలవారు నిగ్గు తేల్చారు. అరెస్టయిన మరో నలుగురు అదే సంస్థకు చెందిన వారన్నది పోలీసుల నిర్ధారణ. వీరందరికీ బంగ్లాదేశ్‌కు చెందిన మరో జిహాదీ హంతక ముఠా హుజీతో కూడ చక్కటి సంబంధాలు ఉన్నట్టు భద్రతా దళాల వారు ధ్రువపరచారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగంగా చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ సంస్థవారి భారత వ్యతిరేక బీభత్స కాలాపాలలో ఈ పేలుళ్లు భాగం. పేలుళ్లు ప్రమాదవశాత్తు జరిగాయా లేక కావాలని ఈ జమాత్ ఉత్ ముజాహిద్దీన్ హంతకులు పేలుళ్లు జరిపారా అన్నది అప్రధానమైన అంశం. అంతమంది హంతకులు అంతపెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను నిలువ చేసి నిర్భయంగా నిర్వహిస్తుండడం ప్రధాన సమస్య. ఈ పేలుళ్లు జరిగిన తరువాత ఘటనా స్థలంలో సంచుల కొద్దీ పేలుడు పదార్ధాలు, సామగ్రి పట్టుబడ్డాయి. ఆ తరువాత బెంగాల్‌లోని పురూలియా జిల్లా రఘునాథ్‌పూర్ సమీపంలో 11 వేల చిన్న పెద్ద బాంబులు, 27వేల జిలిటెన్ విస్ఫోటక పదార్ధాల ముక్కలు పట్టుబడ్డాయట. పశ్చిమ బెంగాల్ అంతటా టన్నుల కొద్దీ పేలుడు పదార్ధాలు నిక్షిప్తమై ఉండడానికి ఇలా ఇదంతా నిదర్శనం.
జమ్మూ కాశ్మీర్‌లో ఐఎస్‌ఐఎస్ అన్న జిహాదీ బీభత్స సంస్థవారి, ఆనవాళ్లు లభించడం శుక్రవారం మొదటిసారి కాదు. గతంలో కూడ ఐఎస్‌ఐఎస్ కదలికలు శ్రీనగర్‌లోను కాశ్మీలోయ ప్రాంతంలోను ధ్రువపడినాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ హంతకులు లేరని ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అబద్ధాలు చెప్పడం బీభత్సకారులకు బలం కలిగిస్తున్న దశాబ్దుల వైపరీత్యం. 2001లో సిమి వంటి జిహాదీ ముఠాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తమ రాష్ట్రంలో సిమి ఉగ్రవాదులు ఎవరూ లేరని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ధ్రువపరచడం చరిత్ర. తమ రాష్ట్రంలో ఫలానా జిహాదీ ముఠాకు చెందిన టెర్రరిస్టులు పట్టుబడలేదని ముఖ్యమంత్రులు చెప్పవచ్చు. కానీ తమ రాష్ట్రంలో హంతక ముఠాలు లేనేలేవని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలడు? తెలియని విషయాన్ని తెలిసినట్టు అబద్ధాలు చెప్పడం ద్వారా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించడానికి కాక కప్పిపుచ్చడానకి యత్నించడం జాతీయ భద్రతా కుడ్యాన్ని ఛిద్రం చేయడానికి పదే పదే దోహదం చేసింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడదే పని చేస్తోంది. తమ రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ హంతకులెవ్వరూ లేరన్నది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా 14వ తేదీన చేసిన నిర్ధారణ. కొంతమంది దుండగులు ఐఎస్‌ఐఎస్ జెండాలను ఊపుతూ ఊరేగిన ఘటన గురించి ముఖ్యమంత్రి చేసిన స్పష్టీరణ ఇది. ఆ జెండాలను ఊపినవారు కేవలం మూర్ఖులని వారు ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లు కాదని ఉమర్ అబ్దుల్లా కనిపెట్టాడు. పైగా ఈ జెండాలు దురదృష్టవశాత్తు ప్రచార మాధ్యమాల వారి కళ్లలో పడ్డాయని కూడ అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. దురదృష్టం ఎవరిది? ఎవరిదైనప్పటికీ ఆయన ఇలా స్పష్టీకరణ ఇచ్చిన తరువాత మూడు రోజులు గడవకముందే 17వ తేదీన శ్రీనగర్‌లో మరోసారి ఐఎస్‌ఐఎస్ వారి జెండాలు, చిహ్నాలు దర్శనమిచ్చాయట.
ముఠాలు వివిధ పేర్లతో చెలామణి అవుతున్నప్పటికీ వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే. కార్యక్రమం ఒక్కటే, స్వభావం ఒక్కటే. బెంగాల్‌లో రెండవ తేదీన పేలుళ్లు జరిపిన జమాత్ ఉత్ ముజాహిద్దీన్ వారు హుజీతో అనుసంధానమై ఉన్నారు. ఈ హుజీ జమాత్ ముఠాలు కాశ్మీర్‌లోకి చొరబడిన జైష్ ఏ మహమ్మద్ ముఠాతోను, లష్కర్ ఏ తయ్యబాతోను, జమాత్ ఉద్ దావా తోను అనుసంధాన వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. వీటన్నింటికీ ఇండియన్ ముజాహిద్దీన్, సిమి వంటి ముఠాలతో చక్కటి సంబంధాలున్నాయి. ఇప్పు డు ఇరాక్‌లోని, సిరియాలోని ఐఎస్‌ఐఎస్ కూడ మనదేశంలోకి భారీగా చొరబడింది. ఈ ముఠా కూడ మిగిలిన జిహాదీ ముఠాల అనుసంధానంలో చేరిపోయింది. అనుసంధాన సమన్వయ వ్యవస్థను పాకిస్తానీ ఐఎస్‌ఐఎస్ ఏర్పాటు చేసిందన్నది జగమెరిగిన రహ స్యం. అందువల్ల హైదరాబాద్‌లో లష్కర్‌లు పట్టుబడినా, నేపాల్ సరిహద్దులలో జమాత్ ఉద్ దావా హంతకులు సంచరించినా, బెంగాల్‌లో హుజీ మద్దతుదార్లు పేలుళ్లు జరిపినా, కాశ్మీర్‌లోకి జైష్ ఏ మహమ్మదీలు చొరబడినా..ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌ఐఎస్ వారి విస్తృత పన్నాగంలో భాగం మాత్రమే. ముంబయికి చెందిన నలుగురు యువకులను ఐఎస్‌ఐఎస్ వారు ఇంటర్‌నెట్ వ్యవస్థ ద్వారా జిహాదీ హంతకులుగా తీర్చిదిద్దినట్టు గత జూలైలో బయటపడినప్పుడు మన నిఘా వ్యవస్థ ఉలిక్కిపడింది. ఈ నలుగురు హంతకులూ మనదేశం నుండి చల్లగా జారుకుని ఇరాక్‌లో తేలారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరారు. ఇలా చేరడం మళ్లీ మనదేశానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున బీభత్స చర్యలు జరపడానికై శిక్షణ పొందడంలో భాగం. వీరిలో ఒకడు ఇరాక్‌లో హతుడయ్యాడట. మిగిలిన ముగ్గురి జాడ లేదు. ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ అపహరించిన 39 మంది భారతీయ కార్మికుల జాడ ఇంతవరకు తెలియరాలేదు. భారత్‌ను బద్దలు కొట్టే తాలిబన్, అల్-ఖైదా, జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబాల బీభత్స వ్యూహంలో ఐఎస్‌ఐఎస్ ఇప్పుడు ప్రధాన పాత్రధారి…
హైదరాబాద్‌కు చెంది యువకులు కొందరు ఐఎస్‌ఐఎస్‌లో చేరి బెంగాల్‌లో కలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. మరో 15 మంది హైదరాబాదీలు కూడ ఐఎస్‌ఐఎస్‌లో చరిపోయినట్టు నిఘా అధికారులు అనుమానించినట్టు సెప్టెంబర్‌లో ప్రచారమైంది. వీళ్లంతా ఇప్పుడెక్కడ ఉన్నారు? బెంగాల్‌లో జరిగిన పేలుళ్ల నిర్వాహకులతో వీరికి సంబంధాలు ఏర్పడి ఉండినట్టయితే ఆశ్చర్య పోనక్కరలేదు. బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య కళ గా జ్ఞాపకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెలిగించిన విద్యుల్లత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితలు -పులి ,విశాఖ వెళ్లి రావాలి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శతక ధారణ లో ప్రపంచ రికార్డ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment