చరిత్ర-సాహిత్యం –2
ప్రకృతి మన ముందున్న సజీవ చరిత్ర .’’కళలన్ని ప్రక్రుతి కి అనుకరణలే ‘’అన్నాడు అరిస్టాటిల్ (art imitates nature ).ఏది చేస్తుందో అదే ప్రక్రుతి అన్నారు ..ఈ ప్రపంచం యేర్పడ టానికి మూల కారణం ప్రక్రుతి .అంటే నదులు ,పర్వతాలు ,సూర్యుడు సముద్రాలు ,చెట్లు ,అరణ్యాలు ,చంద్రుడు ,ఆకాశం ,పశువులు ,పక్షులు అనీ .ఇవన్నీ మనకు ఏదో ఒక ఆదర్శాన్ని అందించేవే ..లాభా పెక్షా ,ప్రతిఫలా పెక్షా లేకుండా నే మేలు చేస్తాయి .మానసిక వికాసం కల్గిస్తాయి .అందుకే మన మొట్ట మొదటి సాహిత్యం అయిన వేదాలలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ..నదీ సూక్తం ,పర్జన్య సూక్తం ,పృధ్వీ సూక్తం అన్నీ వీటికి సంబంధించి నవే . .ఇదంతా ప్రకృతి ఆరాధనా విధానమే .మనం పొందే ప్రేరణ కూడా ఉంటుంది .మనకు అపాయం కల్గించే వాటి నుండి రక్షించ మని దేవత లను వేడు కోవటమే .మన కుటుంబం ,సమాజం ,దేశం అభి వృద్ధి కి దోహదం చేయమని ,ప్రక్రుతి శక్తుల్ని ప్రార్ధించటం ఉంది ..అన్నిటినీ దేవతలు గా భావించే మనస్తత్వం మనది ..ఇదంతా పైకి కన్పించేది .మరి మనకు మనసు ఉంటుంది కదా .ఇది లోపలి భావాలను గురించి ఆలోచించేది .దీన్నే అంతఃకరణ అంటారు .ఇది కూడా సాహిత్యం లో ప్రతి ఫలించింది .దీని వల్లనే కాళిదాసాది కవులు ,మిల్టన్ షేక్స్ పియర్ ,షెల్లీ కవిత్రయం మొదలైన వారంతా కావ్యాలు రాశారు .మానవ మనో ప్రవ్రుత్తి ని తమ రచన ల లో అద్భుతం గా ఆవిష్కరించారు ..ఇక్కడ కల్పనా ,చమత్కారం ,సౌందర్య దృష్టి ,మానసిక ఆనందం అన్నీ లభిస్తాయి ..ప్రక్రుతి శక్తులను వశం చేసు కోవా టానికి ,మానవ శ్రేయస్సు కు యజ్ఞాలు ,యాగాలు చేయాల్సి వచ్చింది .వాటి కోసమే మంత్రాలు అవే రుక్కులు ..మానవుడికి ,పశు పక్షాడులకు శారీరక ,మానసిక వ్యాధులు వస్తే నివారించాలి .దీని కోసం మంత్ర తంత్రాలు .
మానసిక ఆనందం రావటానికి రాగ సంగీతం అవసరం ..పాట లో వశీకరణ శక్తి ఉంది .ఇలా అనతం గా వేదాలు పెరిగి పోయాయి వేదాలు .అందుకే వేద విభజన చేయ వలసి వచ్చింది .వేద వ్యాసుడు ఈ పని చేసి నాలుగు వెదాలుగక విభజించాడు .దేవతా స్తుతి అంతా ఋగ్వేదం ,యజ్న యాగాలకు యజుర్వేదం ,ఆరోగ్యానికి అధర్వ వేదం ,సంగీతానికి సామ వేదం ..వేదాలను ఎవరు రాయ లేదనే మన నమ్మకం .మనసు ను జయించిన ఋషుల మనో నేత్రాలతో చూసి వాటిని దర్శించారు .కనుక వారు ద్రష్టలైనారు .వారు స్రష్టలు కారు .ఇలా వేద విజ్ఞానం అంతా వచ్చింది .యజ్న యాగాదులతో కాల క్షేపం జరిగి పోతోంది .అదే చివరికి రొటీన్ అయి పోయింది .సంతృప్తి తగ్గింది .కనుక ప్రశాంతం గా జీవించాలి అనే భావం వచ్చి అరణ్యాలకు వెళ్లారు .తపస్సు చేశారు .నిశ్చల మైన మనస్సు ఉంటె అంతా మనస్సు అనే స్క్రీన్ మీద భూత భవిష్యత్ వార్త మానాలు తెలుస్తాయి అనే భావం పొందారు .దాని వల్ల ఉపనిషత్తులు వచ్చాయి .అవి వందకు పైనే ఉన్నాయి .అందులో పది మాత్రమే ప్రాముఖ్యత చెందాయి .వేదాలలో ఏమున్నదో అందరు చదివి తెలుసు కొ లేరు .కనుక వాటి సారాన్ని ఉపనిషత్ ల లో నిక్షిప్తం చేశారు .వీటిని వేదాంత సాహిత్యం అన్నారు .వీటి వల్ల భగవంతుని సమీపం చేరే మార్గం సులభ మైంది .అయితే ఇవన్నీ వ్యక్తీ గతాలు .ఎవరి దారి వారిదే అయింది .,అంటే ఇప్పుడు సమాజం లో రెండు మార్గాలు ఏర్పడ్డాయి .ఒకటి –వేదాలలో చెప్పినట్లు యజ్న యాగాదులు చేయటం ,,లేదా రెండో మార్గ మైన వ్యక్తీ గత పధ్ధతి లో మోక్షాన్ని పొందటంఅందుకోసం వంటరి తనం గా అరణ్యాలలో జీవించటం .ఈ రెండు మార్గాలు కూడా ఎవరో కొద్ది మందికి మాత్రమే సాధ్య మైనవి ..మరి సామాన్య జనం సంగతేమిటి ? అందరు యజ్న యాగాల్లో నో ముక్కు మూసుకొని అరణ్యాల్లో నో ఉంటె ప్రజా జీవితం ఎలా /రాజ్యం ఎవరు నడ పాళీ ? రక్షణ ఎవరు చేయాలి ? న్యాయం ఎవరు చెప్పాలి ?.చదువు సంస్కారం లేని వారికి ముక్తి రాదా ?వాళ్ళను తరింప జేసే మార్గం లేదా ?.అప్పుడే వారి కోసం భగవద్గీత ఆవిర్భ వించింది
తన్ను నమ్ముకొన్న సామాన్య జనుల కోసం ముఖ్యం గా గోపికలు గోపాలురు అయిన చదువు రాని వారి కోసం శ్రీ కృష్ణుడు మహా భారత యుద్ధం లో ‘’గీత ‘’ ను ఉపదేశించాడు .’’అనన్యాస్చింత యంతోమాన్ ,మామేకం ,శరణం వ్రజ ‘’అన్నాడు .అంటే నన్ను నమ్మండి .నేనే మీకు శరణు అన్నాడు .మీ సంసార జీవనం మీర్రు చేసు కొంది .యే పని లో ఉన్నా ,ఆ పని లో శ్రద్ధ చూపండి .’’కార్యం కర్మ సు కౌశలం ‘’నైపుణ్యం తో చేసే ప్రతి పని ,భగవంతున్ని మెప్పిస్తుంది .duty is god ‘’పనికి గౌరవం ఇవ్వండి .అన్ని పనులు దైవ సమానమే .యే దేవుణ్ణి అయినా కొలవండి .కాని నిశ్చల భక్తీ అవసరం .అని చెప్పాల్సిన ఆవ సరం ఆ నాడు కృష్ణుడికి కల్గింది .ఇదంతా ఆనాటి కాల ప్రభావమే .అందుకే ప్రపంచం లో భగవద్గీత కున్న విలువ యే గ్రంధానికి లేదు .బైబిల్ తర్వాతా ప్రపంచం లో అందరు చదివే పుస్తకం గీత .వేద ,ఉపనిషత్ ,వేద శాస్త్ర విషయాలన్నీ అందులో ఉన్నాయి .
ఆదర్శ మానవున్ని ఆవిష్కరించాల్సిన అవసరం ,తన కాళ్ళ టో తాను ఆ ధర్మాలు ,లక్షణాలు ఉన్న శ్రీ రాముడిని దర్శించటం వాల్మీకి మహర్షి చేసుకొన్నా పుణ్యం .జంట పక్షుల విరహాన్ని చూసి ,శోకం లో అనుకో కుండా అనుష్టుప్ ఛందస్సు లో శ్లోకం నోటి వెంట వచ్చింది .శ్రీ మద్రామాయణం రాసి ఆది కవి అని పించు కొన్నాడు .అది ఆదికావ్యం అయింది ..అందులో అన్ని రకాల వ్యక్తుల మనో భావాలు ప్రతి ఫలించాయి .రాజనీతి ,యుద్ధ నీతి కర్తవ్య పాలన ,స్నేహ ధర్మం ,ఆశ్రిత రక్షణ ,పితృవాక్య పాలన ,భ్రాత్రు ధర్మం ,మాత్రుధర్మం శత్రువు లోని మంచిని గుర్తించటం ,పశు పక్షాదుల పై స్నేహ భావం ,ధర్మ రక్షణ మొదలైన వన్నీ రామాయణం లో రాముని నడక ,నడత వల్లమార్గ దర్శకం గా చూపించాడు కవి వాల్మీకి .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-5-12.—