వింత ఆలయాలు –వి చిత్ర విశేషాలు –13 రంగ రంగ వైభవం –శ్రీ రంగం

 వింత ఆలయాలు –వి చిత్ర విశేషాలు –13

                                                             రంగ రంగ వైభవం –శ్రీ రంగం

            మహా రాష్ట్రులకు పాండురంగడు అంటే ఎంత భక్తీ యో ,తమిళ నాడు లో శ్రీ రంగ నాధుడు అంటే అంత ఆరాధన .’’విప్రనారాయణ ‘’కధ కు కేంద్రం కూడా .తిరుచినా పల్లికి దగ్గర లో ఉన్న శ్రీ వైష్ణవ క్షేత్రం .కావేరి ,కోలనూర్నదుల మద్య ఉన్న ద్వీపం .రాన్గానాదాలయం కావేరి నది మద్య లో ఉంటుంది .చాలా ఎత్తైన ప్రాకారాలతో ,పెద్ద ఊరంతా ఆలయం ఇది .శిల్ప సక్మ్పడకు ఆయువు పట్టు .శ్రీ మహా విష్ణువు శేష తల్పం పై శయనించి ఉన్న విగ్రహం శ్రీ రంగ నాదునిది ..ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరదు .శ్రీ వైకుంఠం ఇక్కడే ఉందా అని పిస్తుంది కనుకనే అపర వైకుంఠం గా ప్రశిద్ధి .

                               స్థల పురాణం

     బ్రహ్మ లోకం లో బ్రహ్మ దేవుడు రంగానాదుడిని నిత్యం పూజించే వాడు ..తరువాత ఈ విగ్రహాన్ని ఇక్ష్వాకు రాజులకు ఇచ్చేశాడు ..అందుకే ఇక్ష్వాకులైన రఘు వంశ రాజులు తమ ఇలా వేల్పుగా శ్రీ రంగానాదుడిని పూజించే వారు ..రామాయణ కల్ప వృక్షం లో ఈ విషయాన్ని శ్రీ విశ్వనాధ తెలియ జేశారు ..శ్రీ రామునికీ శ్రీ రంగనాధుడు ఆరాధ్య దైవమె ..రావణ వధ తర్వాతా ,పట్టాభిషేకానికి శ్రీ రాముడు సీతా సమేతం గా అయోధ్యకు వస్తుంటే ,విభీశానాదులు వెంట వచ్చారు ..శ్రీ రాముడు అనుగ్రహం తో విభీషణుడికి శ్రీ రంగ నాద విగ్రహాన్ని కానుక గా ఇచ్చాడు ..నేల మీద తగిలించ కుండా లంకకు చేరి అక్కడ ప్రతిష్టించమని హెచ్చరించాడు రాముడు .విధి బలీయం .శ్రీ రంగం దగ్గరకు వచ్చే సరికి ,ఆ విగ్రహం మోయ లేనంత భారమైంది .చేసేది లేక నెలకు దిన్చేశాడు విగ్రహాన్ని .ఇక స్వామి కొలువు శ్రీ రంగమే అయింది .శ్రీ లంకకు దక్కాల్సిన అదృష్టం శ్రీ రంగానికి దక్కింది ,మనకందరికీ దక్కింది .వైష్ణవ ధర్మ ప్రచారకులైన ఆళ్వారులు అందరు శ్రీ రంగ వాసులే ..శ్రీ మద్రామానుజుల వారు తమ విశిష్టాద్వైత మతాన్ని లోకానికి ఇక్కడి నుంచే చాటారు ..కనుక వైష్ణవానికిది రాజ దాని అయింది .తిరుపతి తర్వాతా అంత సంపన్నమైన ఆలయం శ్రీ రంగం .ఆలయ శిఖరం ‘’ఓంకార రూపం ‘’గా ఉండటం ఇక్కడి విశేషం .అయితే ఎంత దూరం నుంచి చూసినా ,ఆలయ శిఖరం కణి పించదు .ఇది . మరో విచిత్రం ..గర్భ గుడి కి ఎదురు వైపున ఉన్న ఒక మండపం లో ఒక ప్రత్యెక స్థలం దగ్గర నుంచొని చూస్తె నే ఓంకార శిఖరం కన్పించి ,తన్మయులను చేస్తుంది .

                                      జమ్బుకేశ్వరాలయం

    రంగం లో నే ‘’జంబుకేశ్వరం ‘’ఉంది .పంచ భూతాత్మక మైన ‘’జల లింగం ‘’జమ్బుకేహ్వార లింగం .లింగం కింద పాను వత్తం లో నుంచి ఎప్పుడు నీరు బోట్లు బోట్లు గా ఊరతం ఇక్కడి చిత్రాలలో విచిత్రం ..పాను వత్తం చుట్టూ బట్ట చుట్టి ఉంచుతారు ..అది తడిసి పోగానే తీసి ,పిండి  ,మళ్ళీ పరవటం ఆనవాయితీ .ఈ ఆలయం రంగానాదాలయం కంటే ప్రాచీన మైనది గా భావిస్తారు .చాలా విశాల మైంది కూడా .జంబు వ్రుక్షాలేక్కువ కనుక ఆ పేరు వచ్చింది .ఆడి శంకరులు దర్శించిన దివ్య ధామం ఇది .అమ్మవారు ‘’అఖిలాండేశ్వరి ‘’.ఉగ్రమూర్తి గా అమ్మ వారు కన్పించటం ఇంకో వింత ..ఆ భయంకర మూర్తి ణి చూడ టానికి భక్తులు భయపడుతుంటే శంకరాచార్యుల వారు ఇక్కడ ఉంది తపస్సు చేసి ,అమ్మను ప్రసన్నం చేసుకొని ,ఉగ్ర రూపాన్ని ఉపసంహరింప జేషి శాంత మూర్తి గా మార్చారట .అదో విశేషం ..విలువైన నవ రత్న నిర్మిత శ్రీ చక్రాన్ని ఆడి శంకరులు ఇక్కడ ప్రతిష్టించారు .

                           రాక్ టెంపుల్

                   శ్రీ రంగం నిజం గా ఒక దీవి ..కొబ్బరి తోటలతో ,కన్నుల పండువ గా కన్పిస్తుంది ,ఒక చిన్న కొండ మీద వినాయకుని ఆలయం ఉంది .చాలా పెద్ద వినాయక విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంది ..తీరని కోర్కెలను తీరుస్తాడని నమ్మకం .కొండ మీద ఉంది కనుక రాక్ టెంపుల్ అన్టారు .

 శ్రీ రంగ నాధ సేవలో యామునా చార్యులు ,పెర్యాల్వార్ అనబడే విష్ణు చిట్టులవారు అంటే గోదా దేవి పెంపుడు తండ్రి ,స్శ్రీ పాదాన్ఘ్రి రేణువు అని పిలి పించు కొనే విప్రనారాయణ స్వామి ,’’చూడి కొడుట్ట నాచియార్ ‘’అంటే ఆముక్త మాల్యద అయిన తిరుప్పావై రచించి సాక్షాత్తు శ్రీ రంగ నాదుదినే భర్త గా పొందిన న  గోదా దేవి  తరించి భక్తీ మార్గానికి దర్శకు లైనారు .శ్రీ రంగ నాధుని దర్శనం సర్వ పాప వినాశనం ,ముక్తి దాయకం .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.