తిక్కన భారతం –19
యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7
ఆశ్వత్థామ నారాయనా స్త్రాన్ని ప్రయోగించాడు .అర్జునుడు మొదలైన వారంతా రధాలు దిగి విల్లు బాణాలు మొదలైన ఆయుదా లన్ని వది లేసి దానికి నమస్కరించారు .కానీ భీముడు మాత్రం సైనికులతో –”దిగకుడు వాహనంబులు ,గడింది మగంటిమి గోలు పోవ ,మీ –రు గడక దక్కవేట్టకుడు,రూపర నాయుధముల్ ,మహాస్త్ర –శక్తి గెలుతు ,గోత్ర భిత్కులి శ,థీ వర శరంబుల వైభవంబు ,భూ –రి గదా విహార భంగియు ,నరి ప్రకరంబులు పిచ్చ లింప గన్ ” ఎవరు భయ పడద్దని రధాలు వగైరా లు దిగాక్కర లేదని ఆయుధాలు విసర్జిన్చాక్కర లేదని తాను దాన్ని ఎదుర్కొని అందర్ని రక్షించ గలనని ఉత్సాహ పరిచాడు .శంఖ నాదం తో ,తొడలు కొట్టు కొంటూ సింహ నాదం తో ఆశ్వతామ ను ఎదుర్కో బోతున్నాడు భీముడు .నారాయణాస్త్రం కార్చిచ్చు లాగా భీమ సేనున్ని చుట్టు ముట్టేసింది కృష్ణార్జునులు ఉత్త చేతుల తో భీమున్ని నిరాయుదుడిని చేసి ,రధం నుంచి కిందికి తోసేసి కాపాడారు .ఈ విధం గా భీముని సహజ మైన ఔద్ధత్యం ,సాహసాలను తిక్కన ఇక్కడ ప్రదర్శింప జేశాడు ..
సాత్యకి పరాక్ర మానికి దుర్యోధనాదులు పారి పోయారు .ఈ విషయాన్ని సంజయుది ద్వారా విన్న ద్రుత రాష్ట్రుడు –”పులికి బసులు వారిన క్రియ ,–సల్పు జలము సిగ్గు విడిచి ,యట్లొక్కని కో –ల్తల కోర్వకవిరిగిన –పుత్రుల నేమని విందు, నేను రోయక ఇంకన్ ” అని సంజయుని తో తన బాధ వెల్ల గక్కు కున్నాడు .కౌరవుల అశక్తత ను గుర్తించాడు .సాత్యకి చేతి లోనే చావు దెబ్బ తింటే ,ఇంకా ముందు జరిగే యుద్ధం లో తన కొడుకు గతేమిటో అని విచారించాడు .మనసు స్వాధీనం తప్పింది .ద్రోణా చార్యుడు మొదలైన వారిని తప్పించుకొని ,భీముడు వ్యూహం లోకి ప్రవేశించాడని విన గానే ”ఇట్లు సింహ నాదమిచ్చిన భీముని –మార్కొనంగ ,మగడు ,మన బలమున –గలిగినే ,మదాత్మ జుల గాల్ప బుట్టిన –చిచ్చు వాడు ,వాని జనయుం టరిది”భీముడు సింహనాదం చేస్తూ వ్యూహం లో ప్రవేశిస్తే ,తమ బలం లో అతడిని ఎదిరించే మాగాడే లేకుండా పోవటం ముసలి రాజు కు తీవ్ర నిరాశ కల్గించింది .తట్టు కో లేక పోయాడు .ఘటోత్కచుని పై కర్ణుడు శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించి ,చంపాడు అన్న మాట విన్న పెద్ద రాజు ఎంత ఉక్రోషం తో ,తన మనస్సు లోని మాటను బయట పేడు తున్నాడు చూడండి — ”ఒకనిని జంపి ,ఇట్లు సమ నుజ్వల ,శక్తి నెరింగి ,కర్ణుడే — టికి ,నరు మీద దాని నిగిడింపక ఇన్ని దినంబు లప్రయో –జకము జేసే ,గయ్యము భుజా బాల శాలి ,నరుండు ,వద్ద బో–రికి ,మరి యుత్స హింప గలరే ,పేర వారలు సూత నందనా ” -కర్ణుడు ఎవరు యుద్ధానికి రమ్మన్నా ,వ్రతమని ,నియమమని ,అంటూ ఎందుకు ఇప్పటి దాకా కాల క్షేపం చేశాడు ?అని బాధ పడ్డాడు .అంటే అంతకు ముందే ఈ పని చేసి ఉంటె తన కొడుక్కి ధైర్యం వచ్చేది కదా .అని లోపలి భావం .ఇక్కడ అతని పుత్రా మొహం తీవ్రత స్పష్టం .దేవుని పై విశ్వాసం ,విధి విలాసం అనుల్లంఘ నీయం అనే జ్ఞానం కూడా లేని వాడు అని మనకు స్పష్టం గా తెలుస్తోంది .అందుకే గతం అను కూలించ లేదే అని విచారిస్తున్నాడు .దీన్నినే ద్రుత రాష్ట్రుని ”ఆశక్త దుర్జ నత్వం ”అన్నారు పెద్దలు .–
రెండో రోజు యుద్ధం లో పాండవుల్లో ఒక్కడు కూడా చావా లేదని తన సేన ఆడ వాళ్ళ మధ్య లో ఉన్న మగ వాళ్ళ లాగా ప్రవర్తిస్తోందని ఆవేదన చెందాడు .శల్యుడు ,దుర్యోధనాదుల చావు విన్న తర్వాతమనసు లోని దుఖాన్ని బాధను ,ఆవేదన ను బయటికి వదులుతూ –”చావరు ,నొవ్వరు ,పాండవు –లేవురు నని ,నీవు చప్ప ,,నిప్పలుకులు ,దుహ్–ఖా వేష కరములై ,చే–తో వ్రుత్తి దహింప జొచ్చె ,దుర్భర భంగిన్ ”అని వాపోయాడు .ఆయన మనసు ఎంత విష పూరితమో ,దుష్టుల స్వభావం ఎలా ఉంటుందో ,స్పష్ట పరిచాడు తిక్కన .బహుశా వేద వ్యాసుడు కూడా ఇలా ముసలాయన అంతర్యాన్ని బహిర్గతం చేసి ఉండదు .తన కొడుకుల తో పాటు ,పాండవుల్లో ఒక్కడు చచ్చినా ముసలి రాజు ఆనందించే వాడు .కాని ఎవ్వరూ చావా లేదు .తన వాళ్ళంతా అగ్ని లో పడ్డ మిడుతల్లాగా భస్మ మై పోయారు .మరి మండదా?ఇదే దుస్శహవ్యధ అంటే .ఈర్ష్య గాంధారీ వల్లభుడిని పూర్తీ గా ఆక్ర మిన్చేసింది .దుర్జన స్వభావం తేట తెల్ల మయింది .పుత్రా శోకం ముంచి వేయగా ,విధి అప్పుడు జ్ఞాపకం వచ్చి ఎంతో ఏడుస్తాడు .”కొడుక! తమ్ములు తోడ్పడ గడగి శత్రు –వరుల గెలిచెద నంటి ,ఒక్కరుడుండక ,–కుండా నీ తమ్ము గుర్రల ,నూచ ముట్టు–గొనియెనె ,విధి ,యే గతి జనుదు జెపుమ ”తమ్ముల్లున్నారనే నమ్మకం తో కయ్యానికి కాలు దువ్వావు .నీ తమ్ముల నందర్నీ ఊచ కొత్త కేసేశారు పాండవులు .విధి బలీయం నాకిన్కేమిటి గతి అని ఆక్రోశం వేలిగక్కాడు .–”గదిసిన పవనుజుడుబెట్టుగ- గదవ్రేసి , -తొడలు విరిగి ,కయ్యపు నేలన్ –మద మరి పడి నప్పుడు నీ –మది నేమని తలచితో ,కుమార ఎరుంగన్ ”భీముడు గద తో ప్రతిజ్ఞా పాలనం చేస్తూ తొడలు విరగ్గొట్టి నప్పుడు నేలకు ఒరిగి యేమని విలపించాడో పెద్ద కొడుకు అని ఆవేదన ఈయనకు .మంచి వాడైనా ,చెడ్డ వాడైనా మానవుడికి రాగ మొహాదులు ,వాత్సల్యాదులు ,సమానం గా నే ఉంటాయి .ఇది ప్రకృతి సహజం .వీటిని ఇంత గొప్ప గా బహిర్గతం చేయటమే తిక్కన చేసిన గొప్ప పని .
కర్ణ వధ విన్నాడు ముసలి రాజు .అతనికి ఉదాత్త గౌరవాలనిచ్చి మాట్లాడాడు .మంచి విశేషణాలతో అతన్ని స్తుతించాడు .అతను తన కుటుంబానికి చేసిన సేవ మరచి పోలేనిది .కర్ణుని పై తన కొడుకులు ఎంతో ఆధార పడ్డారు .ఆతని వధ తో కౌరవ సేన నిస్తేజం నిర్వీర్యం అయిందని చెప్పుకున్నాడు సంజయుడికి .–”ఆలా లోని ఆబోతు ను బోలె నొప్పు –గురు బలంబులలో ,నున్మద ద్విరద మూర్తి -సింహ సంహనుండు ,నిస్సీమ విక్ర –మాభి రాముండు,వోయెనే ?యక్క టక్కట”ఇలా ద్రుత రాష్ట్రుని చిత్త వృత్తులను ఆయా సందర్భాలలో జరిగిన సంఘటన ల ను ఆధారం గ ఆకర్ష ణీయం గా వెలి బుచ్చాడు తిక్కన .
దుర్యోధనుడు మడుగు లో దాక్కున్నాడు .అతని అనుజులు అందరు అప్పటికే హతమై పోయారు .ఆ ఆనందం లో ధర్మ రాజు కర్ణుని తన సోదరు లతో ఎవరి తో నైనా గదా యుద్ధం చేయటానికి ఎన్ను కో మంటాడుఇందులో ఆతని తొందర పాటు ఉంది .అతని హృదయ వైశాల్యమూ కన్పిస్తుంది .దాక్షిణ్యం ,ధర్మ బుద్ధీ కనీ పిస్తాయి .శ్రీ కృష్ణుడు ధర్మ రాజు ను విమర్శిస్తాడు .”జూదం లో చేసి నట్లే మళ్ళీ చేస్తావా ?”అని ప్రశ్నించాడు .అమితోత్సాహం తో ,ముందు వెనుకలు చూడ కుండా పందాలు కాయటం ,శపధాలు చెయ్యటం ఎంత చేటు తెచ్చిందో తెలియ జెప్పాడు .ధర్మ రాజుకున్న ద్యూతాసక్తి యే మహా భారత యుద్ధానికి కారణం అయింది .అందుకే ఉపాయం గా ”ఈ రాజు కు భీముని తో పోరితేనే సమంగా ఉంటుంది ”అని సన్నాయి నొక్కులు నొక్కాడు .వెంటనే భీమ ప రాక్రమాన్ని ,,దుశ్శాసన వదను చెప్పి ,ఉత్సాహాన్ని ప్రశంశించాడు .దుర్యోధనుని పగ ను ఎగ దోస్తాడు .చివరికి రోగీ పధ్యమే కోరాడు, వైద్యుడూ అదే చెప్పాడు అన్న సామెత లాగా దుర్యోధనుడు భీముడి తోనే యుద్ధం చేస్తానన్నాడు .ఏమైనా సరి జోదుతో చేస్తేనే మజా కదా .ధర్మ రాజు సంస్కృతి కల మాన వ శ్రేష్టుడు .కాని ,మానవ స్వభావాతీత దివ్య పురుషుడు కాదు అంటారు విశ్లేషకులు .అందుకే మనకు దగ్గరవుతాడు .వ్యాస మహర్షి ఈ విధం గా ధర్మ రాజాదులను ఇంద్రియ వ్యాపారాలతో కూడిన మానవులు గా చిత్రించి భారత పాత్ర లను లోక జీవితం లో అను సందించాడని మనం గ్రహించాలి .దానికి తెనుగు దనం తో మూర్తి కట్టించాడు తిక్క యజ్వ .
సశేషం –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-7-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,120,113 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,721)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
