తిక్కన భారతం –20 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8

  తిక్కన భారతం –20
 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8
భీష్ముడు తనను అర్ధ రధుని కింద జమ కట్టి నందుకు కోపించిన కర్ణుడు అస్త్ర సన్యాసం చేశాడు .కాని పిఠా  మహుడు శర తల్పం మీద పడి పోగానే ,సందర్శించి భక్తీ వినయాలతో ,పాదాలకు ప్రణామం చేశాడు . వినమ్రం గా విన్న వించు కొంటున్నాడు చూడండి –”అలుక దక్కి ,నన్ను ,అధిక వాత్సల్య శీలము గాగ జూచి ,తగిన మాట లాడవే మహాత్మా !”అంటూ రుద్ధ కంఠం  తో ప్రార్ధిస్తాడు .పశ్చాత్తాపం  తో కర్ణుడు తడిసి ముద్ద అయ్యాడు .దారి మారిన కొడుకు పుత్రవాత్సల్యంకోసం తండ్రి ని చేరి ,పరి తపించి నట్లుంది అతని పరిస్తితి . ”ప్రాడిగల్ సన్ ”అయి పోయాడు .పితా మహుడు కూడా ”–నీ  దెస గోపిన్తూనే  ,అది శిక్ష కాని ,రోషంబు గాదు ,కాని ,నీవు ,పాండు తనయుండ వగుటం ,నీయెడ వాత్సల్యంబ,కాని ,మాత్సర్యంబు  లేదు ”అని అనునయించాడు భీష్ముడు కురు పితా మహుని హోదాలో .ఆమాటలు కర్ణుని కర్నాలకు అమృతపు పలుకు లైనాయి . కౌరవులకు జయం లభించ దని ,కుంతీ పుత్రుడు కనుక ,పాండవులను చేరటం శ్రేయస్కరం అనీఉపదేశించి  చెప్పాడు .కానీ కర్ణుడు నిశ్చయ బుద్ధి తో –”దైవ ధీనము సర్వమున్ ,మన మతిం దప్పింప గా వచ్చునే ”అని విధి విలాసానికి తలోగ్గు తాడు .”నీ వింకన్ నను నొండు వల్కక ,పరానీకంబు పై బంపు ,మత్సేవా ధర్మము  నిర్వ హించెద ”అని సర్వ సైన్యాధి పత్య  స్వీకరణకు అనుమతి కోరాడు .మర్నాడు మళ్ళీ యుద్ధ సన్నద్ధు దై వచ్చి ,వీర శయన మహా నీయుడైన మహాను భావున్ని  భీష్ముణ్ణిదర్శించి ,ఆయన పాదాల పై పడి ,కన్నీరు కారుస్తూ ,చేయెత్తి ,వినయం తో ,ఒంగి నమస్కరిస్తూ –”వచ్చితి రాధేయుడ గను — విచ్చి ,ననుం జూడు భరత వీరాగ్రణీ నీ–సచ్చరితము ఫలమే,యి –ట్లిచ్చట ,నీ యునికి ,దాత నేమన నేర్తు న్ –పావనంబైన పలుకులు నా చెవు –లార నెమ్మి నన్ను నాదరింపు –మయ్య ,ధర్మ నిత్య యంచిత సత్య శం –తన కుమార గాఢ ధైర్య సార ”అని ,నిస్సహాయుడైన చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు కర్ణుడు .ఇలాంటి మాటలు ఆతని నోటి లోనుంచి రావటం మనకు ఆశ్చర్యమేస్తుంది .తన బాహు బలాన్ని నమ్ము కున్న వాడు దుర్యోధనునికి అమ్ము కొన్న వాడూ ఈ కర్ణుడే నా అని పిస్తాడు తిక్కన .విధి నిఎవరు ఏది  రించ లేరనే సత్యాన్ని గ్రహించే వివేకం అతనికి కలిగింది .ఇదొక గొప్ప మార్పు .భీష్ముడి పై పూజ్య భావం ,విధి చేతిలో అలాంటి అసహాయ శూ రుడూ  ఒక బొమ్మ అయాడని అభి ప్రాయం .అతని లోను పితామహుడి లోను ఉన్న పవిత్రత ,హృదయ మార్దవము వ్యక్తమయాయి . అతని లో సద్వంశం లో జన్మించిన వాడికి ఉండే భక్తీ ,ప్రేమ ,ఔదార్యం మూర్తీభ వించి నట్లు గోచరిస్తాయి .అర్ధ రధుడు అని కౌరవ సభలో కర్ణుడిని భీష్ముడు అనగానే ”నువ్వే అర్ధ రదుడివి ” అని నిండు సభలో బీరం గా పల్కిన కర్ణుని లో ఎంతటి  పరి వర్తన వచ్చిందో గమనించండి .
భీష్మ పితా మహుని శౌర్య పరాక్రమాలను వర్ణిస్తూ కర్ణుడు కన్నీరు కారుస్తుంటే ,కర్ణుడిని చూసి రాజులు అందరు ఆర్త రవాలు చేసి ,కన్నీరు మున్నీరు గా విల పించారు .రాదేయుడు భీష్ముని –”దమమును ,సత్యముం దపము ,దానము ,శీలము ,నస్త్ర వీర్య శౌ –ర్యములును ,భీష్ము నంద కలవట్టి మహాత్ముడు పోర నీల్గె ,నిం –క ,మనకు నేటి బాహు బల గర్వము లెక్కడి సేన లక్కటా –సమసేనే ,కౌర వేశ్వరుని ,సంపద యంచు విషన్న మూర్తి యై ”.అంతే కాదు చాలా సహజ సౌజన్యం తో భీష్ముడి పట్ల తన కున్న ,గౌరవ భావాన్ని ఆవిష్కరించాడు .అది మనసు లో ఉంది .ఇప్పుడు బయట పడింది .తన ప్రత్యర్ధి అయిన అర్జునుని పరాక్రమ విక్రమాన్ని కూడా జంకు లేకుండా ప్రశంసించాడు కుంతీ పుత్రుడు .వివిధ సంఘటన లలో మానవ హృదయం లో కలిగే పరి వర్తనం ,దానికి కారణం అయిన ప్రవర్తన ,స్వభావ సిద్ధ మైన శీలాదులు తిక్కన చిక్కగా చక్కగా ,పోషించాడు .కర్ణుని మాటలు వినండి –”భరితాశాన్తర ,పాం– చ జన్య రవ దృప్యద్దేవదత్తధ్వని ,–స్ఫురణన్ ,వీనులు వ్రయ్య ,గేతన కపి స్ఫూర్జత్ప్రభన్ ,జూడ్కులా –తురతంబొందంగ , చండ గాండీవ సముద్భూతాస్త్ర జాలంబు ,లె –వ్వరు సైరింతురు నీవు దక్క ,భుజ గర్వ స్ఫూర్తి ,నిర్వాహకా !”అని అర్జునుని గాన్దీవాన్ని ఎదుర్కోవా లన్నా ,పాన్చానన్య ధ్వని విని తట్టు కోవాలన్నా ,భీష్ముడు తప్ప వేరేవారు లేరని నిస్సందేహం గా తెలియ జేశాడు .తన వల్ల కాదు కిరీటి ని తట్టు కోవటం అని నర్మ గర్భం గా తె లియ జేసి నట్లే .
ఈ రకం గా ,మహా కవి తిక్కన భీషణ యుద్ధ సమయం లోను ,మానసిక స్వభావాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ,యుద్ధాన్ని కూడా మానవ జీవితానికి అతి సన్నిహితం చేస్తాడు .పౌరుష శౌర్య ధైర్య సాహస విజ్జ్రుమ్భణే కాదు మానవ ప్రకృతుల ఆవిష్కరణ ను కూడా అంతే ఉదాత్తం గా వెలువరింప జేస్తాడు తిక్కన .పౌరాణిక మార్గం లో కాక ,ఒక రూప కర్త లాగా ,తాను పాత్రల వెనుక ఒదిగిఉండి ,నాటక రంగం లా యుద్ధ రంగాన్ని నిర్మించాడు .అవసరాన్ని బట్టి మనోహర ప్రకృతి సౌందర్యాలను ,మరో చోట విశిష్ట శబ్ద ప్రయోగ చాతుర్యాన్ని చూపిస్తాడు .అర్ధ గౌరవం ,రసధ్వనుల స్ఫూర్తి ,సందర్భోచిత మైన సంభాషణా ,రసవత్తర నాటకీయ సంవాదం ,సన్నీ వేశాన్ని బట్టి ,మానవ స్వభావ వ్యక్తీకరణం ,పరిస్తితిని బట్టి మారే ,మానసిక ప్రవృత్తీ ,మనో రంజకం గా వ చిత్రించే మహా కవి తిక్కన సోమయాజి .ఉభయ కవి మిత్రుడి ఉదాత్త ప్రౌఢ కవితా రచన కు ఆదర్శం ,మానవ ప్రకృతికి అద్దం (ఆదర్శం -అంటే -అద్దంఅనే అర్ధం ఉంది )ఈ యుద్ధ పంచకం .
దీని తరు వాత ”స్త్రీ పర్వం ”లోని విశేషాలు తెలుసు కొందాం
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్.–29-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.