సాహితీ బంధువులకు శుభ కామనలు -గత అయిదు వారాలుగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రతి శని వారం ఉదయం 7-15 కు తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కవి సామ్రాట్ విశ్వ నాద సత్య నారాయణ గారి ”వేయి పడగలు ”నవలను నాటకం గా ధారా వాహికం గా ప్రసారం చేస్తున్నారు అద్భుతమైన కదా కధనం తో సన్నీ వశాలతో సంభాషణ లతో విశ్వ నాద అంతరంగాన్ని మహా గొప్పగా ఆవిష్కరిస్తున్నారు దీనికి శ్ర్రీమతి డాక్టర్ దిట్టకవి శ్యామలా దేవి గారు ప్రతిభావంతం గా నాటకీ కరణ చేసి అందరి ప్రశంసలను అందుకొంటున్నారు ఇలాంటి ఆలోచన ఆంధ్రుల ఆధునిక తోలి ఇతిహాసాన్ని నాటకం గా మలిచి ప్రసారం చేసే ఆలోచన రావటం దాన్ని సమర్ధ వంతం గా తయారు చేయించి ప్రసారం చేయించటం స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి విశేష కృషియే కారణం ,అందరి కంటే భిన్నం గా ఆలోచించే వారు వేయి పడగలను చిరస్మరణీయం చేస్తున్నారు . సాహితీ బంధువు లారా ! మీ రందరూ కూడా వింటున్నారని భావిస్తున్నాను వినక పొతే ఇప్పటి నుండైనా విని ఆనందం పొందండి ఆ కృషికి జేజేలు పలకండి రేడియోలు లేవు అనే దిగులు అక్కర్లేదు మీ టి.వి ల కోసం ఏర్పాటు చేసుకొన్నా ”సెట్ ఆఫ్ బాక్సేస్ ”తో మీ కేబుల్ ఆపరేటర్ తో ఆ సౌకర్యాన్ని పొందచ్చు వెంటనే ఈ పని చేయ వలసిందిగా కోరుతున్నాను మొన్న శని వారం ప్రసారం అయిన అయిదవ భాగం లో ఒక ప్రముఖ సాహితీ వేత్త ద్వారా వేయి పడగలు నవలలోని పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరింప జేసి విధం ప్రశస్తం గా ఉంది ఇది వినే వారికి ఎంతో అవగాహన కల్పిస్తుంది ఒక రకం గా ఈ నవలను నాటకం గా మార్చి ”శ్రవ్య కావ్యం ”గా చేసిన హైదరాబాద్ ఆకాశ వాణి వారికి ,పాత్ర గాత్ర దారులకు ముఖ్యం గా సారధి ఆదిత్య ప్రసాద్ గారికి ధన్య వాదాలు . మీరూ వినండి మీరూ స్పందించండి .
— చదివించి మొదటి భాగం విని పించారు అనుకోకుండా. విన్న నేను నిజం గానే .”అవాక్కు ”అయ్యాను . ఇది సాయి గారు చదివిన తీరు మహా సొగసుగా ఉంది. వారి చేత చది వించటం ఒక ముందడుగే దీనిని ధారా వాహికం గా ప్రతి సోమ వారం ఇదే సమయానికి ప్రసారం చేస్తామని చివరలో చెప్పగా విన్నాను సాయి గారి ఫోన్ నంబర్ నా దగ్గర ఉన్నది లోగడ రెండు మూడు సార్లు వారితో మాట్లాడాను కూడా మొదటి భాగం పూర్తీ అవగానే సాయి వారికి ఫోన్ చేశాను ఆయన ఆశ్చర్య పోయారు ఈ ప్రసారం సంగతి తనకు తెలియదనీ రేడియో వారు కనీసం ఫోన్ చేసి చెప్ప లేదని అన్నారు నేను చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పారు ఇదీ తీరు .
