శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3

శక్తి స్వరూపిణి అయిన శ్రీ దేవి భండాసుర వదకోసమే జన్మించింది .భండాసురుడు మహా శక్తి సంపన్నుడు మన్మధుని కుమారుడు బల గర్వాలతో మదించి ఉన్నాడు ఎవరిని లెక్క చేసే వాడు కాదు అక్షౌహిణుల దానవ సైన్యం అతని అధీనం లో ఉంది తమ్ముళ్ళు మహా  బల పరాక్రమాలు కలవారు కొడుకులు వీరికంటే శక్తి ఉన్న వారు .వాడి ఆజ్ఞా కు అందరూ దాసోహం అనాల్సిందే .ఎదిరించే ద్జైర్యం ఎవరికి లేదు దేవతలను మునులను రుషి పత్నులను బాధిస్తూ వారి యజ్న యాగాదు లకు భంగం కలిగిస్తున్నాడు .అలాంటి వాడిని వదించాలంటే శక్తి మాత్రమె చాలదు యుక్తి ఉండాలి .దానికి మించి శస్త్రాస్త్ర సంపన్నత ఉండాలి వాడి బలాన్ని నిర్వీర్యం చేసే ఆయుదాలుఉంటేనే  వాడిని నిర్జిన్చటం తేలిక లేక పోతే శ్రమ అంతా వృధా .ఇవన్నీ దేవతలు గ్రహించారు అమ్మకు బాసట గా నిలిచారు తమ శక్తులన్నిటి ని ఆమె పరం చేశారు తాము నిమిత్త మాత్రులుగా ఉండిపోయారు .సర్వ వస్తు సామగ్రి సమకూర్చారు .ఇక శ్రీ దేవి ఆజ్ఞ ఇస్తే చాలు రణం మొదలెట్టటమే అన్నట్లు గా యుద్ధ రంగం సర్వ సంసిద్ధం గా ఉంది

ముందే చెప్పినట్లు భండాసురుడు రాయి లాంటి వాడు .నిష్క్రియా పరుడు ,నిస్చేస్టూడు ,నిస్చేతనుడు .ఎక్కడ పడి  ఉంటె అక్కడే ఉండే తత్త్వం వాడిది .ఒక వేళ  ఏదైనా మార్గం లో నడిస్తే అది తప్పుడు త్రోవే అవుతుంది .తప్పు పనులే చేస్తాడు విచక్షణా జ్ఞాన శూన్యుడు వాడి జీవిత పరమావధి తినటం సౌఖ్యాలనుభావించటం .మనస్సు ,ప్రాణం విజ్ఞానం అనేవి ఏమిటో వాడికి తెలీనే తెలియవు .భౌతిక సుఖాలలో పశువు లాగా ప్రవర్తిస్తాడు .బ్రాహ్మాన్దాన్ని కేవల పిందాండం గా భావించి దేవి ఆగ్రహ  జ్వాలకు మాడి  మసి అయ్యాడు .అమ్మ ఆత్మ వైభవమే వాడిని లోబరు చుకుంది .ఈ విజయాన్నే అమ్మ వారి నామం ‘’భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్వితా ‘’అనే నామం లో ఆవిష్కార మైంది ఇక ఆమె సైన్య సమున్నతిని గూర్చి తెలుసు కొందాం .

‘’సంపత్కరీ సమారాధ్యా ,సింధూర వ్రజ సేవితా –అశ్వా రూఢాదిష్టి తాశ్వ కోటి కోటి భిరావ్రుతా ‘’

‘’ సంపత్కరి’’ అనే శక్తి శ్రీ దేవికి ఈ యుద్ధం లో సహాయ పడింది .ఈ శక్తి ఏనుగు మీద స్వారీ  చేస్తుంది .ఇదీ దేవి గజ సైన్యం .సంపద నిచ్చే ఈ శక్తి ఏనుగు లాగా ఘీన్కరిస్తుంది .ఘోర నిద్రలో ఉన్న జీవులకు మేల్కొల్పు పలుకుతుందన్న మాట .కనుక జనాలను జాగృతం చేసే ఈ నినాదాన్ని ‘’హస్తి నాద ప్రాబోదినీ ‘’అని శ్రీ సూక్తం లో చెప్పారు .గజ గర్జనలో గంభీరత ,పరి పూర్ణత జాగృతి మూడు కలిసి సమ్మేళిత మవుతాయి .ఈ అద్భుత సమ్మేళనమే సంపత్కరీ శక్తి  అయిన శ్రీ దేవి గజ సేన లో కనీ పిస్తుంది .సంపత్ అనే శబ్దానికి సమ్యక్ రూపం లో పొందటం అనే అర్ధం ఉంది .ఏ వస్తువు సమ్యక్ అంటే సరైన రూపం లో లభిస్తుందో అదే సంపత్తు అని భావార్ధం .సంపత్తు రూపం లో లభించనిదే విపత్తు .ఏ వస్తువూ సంపత్తు ,కాని విపత్తు కాని కాదు మనం చూసే దృష్టిలో భేదమే ఏ దృష్టిలో చూస్తె ,ఎలా సంపాదిస్తే అది సంపత్త్తా లేక విపత్తా అన్నది ఆధార పడి ఉంటుందని అంతరార్ధం .సంపత్కరీ శక్తి దైవిక మైనది .అదే ప్రపంచం లోని ప్రతి వస్తువును సరైన దృష్టిలో చూపిస్తుంది.జీవితాన్ని ఏనుగు నడకలా గాంభీర్యం గా దర్జాగా గతి శీలం గా సుందరం గా చేస్తుంది శ్రీ దేవి గజ సేన ఇలా యుద్ధ రంగం లో సాగుతుంటే భండాసురిడికి, వాడి సేనకు వణుకు పుట్టిందన్న మాట .

రెండో పాదం లో అశ్వ సేన వర్ణిత మైంది .అశ్వా రూఢఅన్న దైవీ శక్తి కోట్లాది గుర్రాలతో కదులు తోంది.సంపత్కరి గజ గమనం లో గాంభీర్యం సౌందర్యం ఉంటె ఆశ్వారూ కోటి కోటి అశ్వాల పరుగులో గతి శీలతా ,వేగం దమ్యత లేని స్వభావం జ్యోతక మవుతాయి .వేదాలలో ‘’అశ్వ పూర్వా ,రధమద్యా ‘’’’అనే శ్రీదేవి వర్ణన ఉంది ఇప్పుడీ నామం దాన్ని సార్ధకత చేస్తోంది గజ సేనలో దేవి సంపన్నత ఉంటె అశ్వ సేన లో సశ్రీకత కూడా మర్మ గర్భం గా ఉంది .గజ సేనలో జ్ఞానం ,అశ్వ సేన లో కర్మ భావం వ్యక్త మవుతాయి ముందు జ్ఞానం కలగాలి తర్వాత జ్ఞానాన్ని అనుసరించి కర్మా చరణ చేయాలి .అప్పుడే అభీష్ట లక్ష్యం నేర వేరుతుంది అని అంత రార్దము

శ్రీ దేవి ఆమె అనుచర గణం తమ తేజస్సు ,ఓజస్సు లకు అనుగుణమైన వేర్వేరు రధాల పై ముందుకు నడుస్తున్నారు .శ్రీ దేవి కూర్చున్న రధం ‘’శ్రీ చక్ర   రాజం ‘’అంటే శ్రీ చక్రం తో అలంకరింప బడింది ఈ రధం లో విజయం సాధించి పెట్టె సకల శ స్త్రాస్ట్రాలు ఉన్నాయి .ఆమె అనుచర మంత్రులు ‘’గేయ చక్ర’’అనే పేరున్న చక్రాలతో తాయారు చేయ బడిన రధాల మీద అనుసరిస్తున్నారు ఈ  వర్ణన అంతా తరువాతి శ్లోకం లో దర్శన మిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3

  1. abhi901abhi's avatar abhi901abhi says:

    Guruvugariki Namaskaramulu,

    Sir,

    I have a doubt since long time. We know that Tirupati, Chardham , Amarnath,
    Shabarimalai etc all are very powerful and we believe that God will be
    there only.

    So lots of people used to go there by taking so much risk and pain. Then
    why lots of people are dying in front of the God, God should give him
    normal death right? why that much painful death. We are not going anywhere,
    still we are living happily why? . Among the died people if you take the
    probability definitely some people might have good attitude and social
    responsibility than the living people. Then why God killing those?.

    Please explain me if possible.

    Once again thank you for your work.

    Namaste,
    Abhi

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.