మనకు తెలీని భ.కారా మేస్టారు

శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ”భమిడి పాటి కామేశ్వర రావు ‘పుస్తకం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని మీకు తెలియ జేస్తున్నాను . download
  కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు గారు పుట్టారు . జన్మ తేది 30-4-1897.నర్సా పురం టేలర్ స్కూల్ లో కొంతకాలం చదివి ,కాకినాడ పిఠాపురం కాలేజి లో ఇంటర్ పూర్తీ చేసి ,రాజ మండ్రి  ఆర్ట్స్ కాలేజి లో గణితం లో డిగ్రీ పొందారు .. అక్కడే టీచర్స్ ట్రయినింగ్ పాసై వీరేశలింగం స్కూల్ లో లెక్కల మేష్టారు గా 31ఏళ్ళు పని చేసి 1953లో పదవీ విరమణ చేశారు . అయిదేళ్ళ తర్వాత కేన్సర్ వ్యాధి తో 25-8-1958న మరణించారు . ఆయనకు ”కారా కిళ్ళీ ”వేసుకొనే అలవాటు బాగా ఉండేది అదే  ఆయన గొంతు కేన్సర్ కు కారణమై చని పోవటం బాధా కరం .
  తండ్రి నరసావధన్లు పరమ నైష్టి కుడు ,మహా పట్టుదల మనిషి ఆ  పట్టుదలే  రావు గారికి వచ్చింది అదే అండగా నిలబడింది జీవితాంతం ..మేస్తారికి మంచి లెక్కల మేష్టారు గా పేరుంది ..యెవరి తోనూ సన్నిహిత సంబంధాలు లేవు ఆ యనకు ”’బాగు -బాగు ;-మేష్టారు ”అనే నిక్ నెమ్ పిల్లలు తగిలించారు . ఆ  పేరు తో చిన్న నాటిక కూడా ఆయన రాశారు .
 మేస్టారి తాత గారు నడవ లేని వాడు అందు  తండ్రి నరసావధనులు గారు తానూ బయటికి వెళ్ళేటప్పుడు తండ్రిని కావడి లో పెట్టుకొని తనతో ఆ నాటి” శ్రావణ కుమారుడు” లాగా తీసుకొని వెళ్ళేవారు అంతటి పితృభక్తి పరాయణులు మేస్టారి  తండ్రి గారు . తల్లి, తండ్రీ మరణించే దాకా ఆయన వివాహం చేసుకో లేదు నలభయ్యవ ఏట వారిద్దరి మరణం తర్వాతే పెళ్లి చేసుకొన్నారు . తన కొడుకు కామేశం తన లాగే వేద విద్య నేర్వాలని తండ్రి ఆరాట పడ్డారు .కాని మేస్తారికి డిగ్రీ చదవాలని కోరిక .దబ్బు లేదు ఒక ఇరవై  వెండి  నాణాలు కొడుకు మొహాన కొట్టి డిగ్రీ సాధించామని పంపారు  . కాకినాడలో ఇంటర్ లో కృష్ణ శాస్త్రి గారు సహాధ్యాయి మేస్తారికి . అప్పటి దాకా సాహిత్యం అంటే తెలీని మేస్తారికి శాస్త్రి గారి వల్ల అ గంధం అబ్బింది .. పేద విద్యార్ధికి ఇచ్చే ఉపకార వేతనం అందుకోగాలిగారు .దానితొదిగ్రీ చేశారు .. అవసరమైతే తండ్రిగారికి చెప్పి బంధువు దగ్గర అప్పు చేసి చదివి ట్రే  యింగ్ పూర్తీ చేశారు . ఎల్ టి కాగానే వీరేశ లింగం స్కూల్ లో లెక్కల మేస్తారుగా చేరారు .
      బెత్తం ఉపయోగించే వారు కాదు చలోక్తులతో బోధనా రక్తి కట్టించే వారు ఇంటర్ వాళ్లకు కూడా విద్య చెప్పే పాండిత్యం ఉండేది ..యెదుటి  వారిని ఛలోక్తి తో నవ్విన్చట మే కాని తానూ నవ్వటం ఎప్పుడూ ఉండేది కాదు అదీ మేస్టారి ప్రత్యేకత ..ఇంగ్లేష్  రచయితలు రాసిన ఆల్జీబ్రా పుస్తకాలు కొని వాటిని విద్యా బొధనలొఉపయొగింటమేస్టారి స్పెషాలిటి . పరీక్షల ముందు విద్యార్దులన్దర్నిజాంటి గంగన్న పంతులు గారి మెడ మీదకు పిలిపించి సబ్జెక్ట్ అంటా రివైజ్ చేసి అందరికీ టీ  పార్టీ ఇచ్చే వారు ఽఅఫ్శనల్ లెక్కల వరికిఈ గౌరవం ప్రత్యేకం గా ఉండేది .
  శుభ్రమైన అంచు ఉన్న తెల్లటి ధోవతీ ,తెల్ల చొక్కా ,దాని పై గోధుమ రంగు కోటు  బూట్లు నెత్తిన టోపీ ఇదీ ఆ రోజుల్లో భ కా. రా మేస్టారి వేషం . తెల్ల వారు ఝామున నాలుగింటికి లేచి గోదావరి లోస్నానం చేసి ,వరవర రావు హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగి ,”కారా కిళ్ళీ ”బుగ్గన బిగించి ”ఇంటికెళ్ళే వారు తొమ్మిదింటికి భోజనం చేసి పదింటికి స్కూల్ కు చేరే వారు .కపి లేశ్వరాపురం జమీందారు గారి పెద్దబ్బాయి యెస్.పి.బి.పత్తభి రామా రావు కు లెక్కలు సరిగ్గా అర్ధం కావటం లేదని ఇంటికిట్యూషన్ కోసం పమ్పిస్తాననిఆయన తండ్రి కబురు చేశారు దానికి మన మేస్టారి సమాధానం ”మీ వాడు లెక్కలు సరిగ్గా చెయ్యటం లేదంటున్నారు అంటే అతనికి అర్ధం అయ్యేటట్లు నేను లెక్కలు చెప్పటం లేదని నాకు అర్ధమయ్యింది. అర్ధం  అ యెట్లు చెప్పటం నా బాధ్యత ధర్మం .దీనికి నాకు డబ్బేమీ ఇవ్వక్కర్లేదు ”అని చెప్పి అతని పై ప్రత్యెక శ్రద్ధతో లెక్కలు బోధించి తీర్చి దిద్దారుఆఅయనె ఆ తర్వాతవిద్యా మంత్రి అయ్యాడని మనకు తెలుసు
   ఒక సారి స్కూల్ లో మేస్టారి అబ్బాయి రాధా కృష్ణ కూడా చదివె రోజుల్లో పరీక్ష పేపరును ఆత ను  పధకం ప్రకారం దోగిలించి మిగిలిన స్నేహితులకిచ్చాడు ఇది చాల రహస్యం గా చేశాడు పండితపుత్రుడు ంఅమ ర్నాదు పరీక్షలో బ్రహ్మాండం గా లెక్కలు చేయచ్చని  చంకలు గు లుద్దు కొన్నారు మిత్ర బృందం కాని క్వేస్చిన్ పేపర్ చూసి నీళ్ళు కారి పోయారు తము తస్కరించిన పేపర్ బదులు కొత్త పేపర్ ఇచ్చారు . మేస్తారిద్రుస్తి అంత నిశితం గా ఉండేది దీని పై కొడుకు రాధా కృష్ణ ”నాలుగు తిట్టి ,రెండు తగిలించినా బావుండేది .ఒక్క మాట అనకుండా శిక్ష మాలు చేశారు నాన్న ”అని బావురు మన్నాడు ఱాధా కృష్ణ గొప్ప హాస్య రచయితా .యెన్నొ సినిమాలకు మాటలు రాసి మెప్పించిచి హాస్య రచయిత
  రాధా కృష్ణ కు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం సరదా తండ్రి నడిగి డబ్బులు తీసుకొని వెళ్లి చూసోచే వాడు మేష్టారు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారు వారానికి ఒకటైనా చూసేవారు తనతో కొడుకునీ తీసుకొని వెళ్ళే ఒక రోజు కొడుకు సినిమాకు డబ్బు లడి గాడు .వద్దని చెప్పకుండా మేస్టారు”సినీ గీతోపదేశం” చేశారు ఇలా ”పరీక్షలైనాసరే ,పరీక్ష తప్పినా సరే ఏది ఏమైనా సినిమాలుటం మానకు .  . పరీక్ష ఎలాగూ పోతుంది ఉద్యోగం రాదన్న బెంగ లెదు.నిన్ను రోజూ హాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కనుక పిలిచి టికెట్లు గేటుద గ్గర చించే ఉద్యోగం ఇస్తారు.పెల్లి కాదనే చింతా అక్కర్లేదు ఆడ వాళ్ళ గేటు దగ్గర టికెట్లు చించే వాడి  కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు .వీలయితె ముగ్గురు కలిసి టికెట్లు చిమ్పుకొంటు బతికేయ్యచ్చు .తప్పకున్దా సినిమాకి వెళ్లి రా నాన్నా “‘అన్నారు బుర్ర వాచీ పోయింది రాధాకృష్ణ ‘మళ్ళీ    సినిమా మాటెత్తితే ఒట్టు  . అదీ మేస్టారి మార్కు ట్రీట్ మెంటు .
  మేస్తారి ఖగోలపాన్దిత్యం బాగా ఉండేది ఱాధా కృష్ణ కు ఇంజీ నీరింగ్ చదవాలని ఉండేది తండ్రి రావు గారికి అంత స్తోమత లేదు కాని మినిస్టర్  పట్టాభి రామా రావురికమెండేషన్ తో సీట్ సంపాదించే ప్రయత్నం చేశాడు రాధాకృష్ణ .తన్ద్రికి తెలిసిపట్టాభి రామా రావు దగ్గరకు వెళ్లి  ”మా వాడికి ఇంజిరీనిగ్ చైవే అర్హతలేదు .టు తు తు ఇప్పించి పొరబాటు చేయద్దు ”అని చెప్పి వచ్చారు . కుర్రాడికి మతి తప్పి సి.యె.చెసి సినీ రచయితా గా స్తిర పడ్డాడు
  శ్రీ సుబ్రహ్మణ్య షష్టి  శుభా కాంక్షలతో
 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-13- కాంప్ –మద్రాస్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.