శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం – ఫలాల తో పూజ మరియు గీతా జయంతి
గీతా జయంతి
శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా త్రయాహ్నికం గా జరిగే కార్య క్రమాలలో రెండవ రోజు’’వివిధ ఫలాల తో’’ శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి విశేష పూజ నిర్వహించాము .ఈ రోజు శ్రీ గీతా జయంతి కూడా .గీతా జయంతి ని పురస్కరించుకొని సరసభారతి 54వ సమా వేశాన్ని కూడా దేవాలయం లో నిర్వహించాం ..
ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు సడెన్ గ గీతా జయంతిని నిర్వహిస్తే బాగుంటుంది అని పించి ఎవర్ని పిలవాలో ఒక్క క్షణం ఆలోచించి మన కాలేజి దగ్గరున్న శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ‘’శ్రీ మధుసూదనం పిళ్లే’’గారికి ఫోన్ చేశాను .ఆయన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తూ వాళ్ళ స్కూల్ విద్యార్ధుల చేత రెండు అధ్యాయాలు గీత పఠనం చేస్తే బాగుంటుందని అన్నాను వెంటనే ఒప్పుకొన్నారు .ఏంతో ఆనందం వేసింది .అవ్యవధానం గా కార్యక్రమం ఖరారైంది .ఇలా చేసినందుకు ఆయనను ఏమీ అనుకోవద్దని చెప్పాను.అలాంటిదేమీ లేదని’’ మీరు నిర్వహిస్తున్నందున సంతోషం గా ఉందని మీరు చెప్పిన టైం కే అంటే ఉదయం పదిన్నరకే విద్యార్ధులతో వస్తానని’’ చెప్పారు పిళ్లే.
నేను నా కార్య క్రమాలు పూర్తీ చేసుకొని ఉదయం తొమ్మిదిన్నర కు దేవాలయానికి చేరాను .అరటి పండ్లు కమలాలు యాపిల్ ,దానిమ్మ ద్రాక్ష ,ఉసిరి గుమ్మడి పళ్ళతోస్వామి వారలకు సహస్రనామ పూజ చేశాం .
పదిన్నరకు పిళ్లే గారు భార్య శ్రీమతి శాంతకుమారి తోనూ ఏడుగురు విద్యార్ధినుల తోనూ వచ్చారు .అక్కడ ఉన్న గీతా బోధన చిత్ర పటానికి అందరి చేత పుష్పాలు వేయించి మొదలు పెట్టాము .పిళ్లే గారిని ముఖ్య అతిధిగా ను,భార్య ను ‘’ గీతోపదేశం స్తుతి ‘’చేయమని ఆహ్వానించాను .పిళ్లే గారిని గురించి నేను మాట్లాడుతూ ‘’పిళ్లే గారితో ముప్ఫై ఏళ్ళుగా పరిచయం ఉందని ,విశ్వ హిందూ పరిషద్ ,ఆర్ ఎస్ ఎస్ చేబట్టే ప్రతికార్యక్రమాన్ని ఆయన ఏంతో చిత్త శుద్ధిగా నిర్వహిస్తారని, గీతా పోటీలకు విద్యార్ధులను తయారు చేసి పంపి బహుమతులు సాధిస్తారని,నిరాడంబర జీవి అని ఎన్నో స్కూళ్ళు కొత్తగా వచ్చినా ఆ పోటీ లో నిలబడి శాంతి నికేతన్ ను కాపాడుకొంటూ,హాస్టల్ ను కూడా నడుపుతూ కనీసం నాలుగు వందల మంది విద్యార్ధులతో నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని పొందారని .మలయాళీ అయినా మన తెలుగు పైణా సంస్కృతీ పైనా విశేష మైన విశ్వాసం ఉన్నవారని ,అడగం గానే ఇవాళ కార్య క్రమానికి రావటంసంతోషం గా ఉందని క్రుతజ్ఞాతలని ‘’చెప్పాను
పిళ్లే ‘’మేస్తారితో నాకు ఏంతో కాలం గా పరిచయం ఉంది వారు పిలిచినప్పుల్లా వెళ్లి పాలు పంచుకొంటాను .అలాగే ఇవాళ వచ్చాను .అన్నారు .నేను భగవద్ గీత లో ఉన్న కర్తవ్యమ్ గురించి ,ఫలా పేక్ష రహిత పనుల గురించి గీత బోధనకు నేపధ్యాన్ని గురించి చెప్పాను .శ్రీ మతి శాంతకుమారి గీతా స్తుతి శ్రావ్యం గా చేశారు .ఆ తర్వాత విద్యార్ధినులు భక్తీ యోగం ,పురుషోత్తమ ప్రాప్తి యోగాలను పఠనం చేశారు .ఇందులో మా మనవరాలు రమ్య కూడా పాల్గొంది .నేను ‘’మేము హిందూ పురం లో ఉన్నప్పుడు అంటే 1947-48.లో సుమారు ఎనిమిదేళ్ళ వయసులో అక్కడ జరిగిన భగవద్ గీత పోటీలలో భక్తీ యోగం లో నేను ,పురుషోత్తమ
ప్రాప్తి యోగం లో మా అక్కయ్య దుర్గా మొదటి బహుమతులు సాధించిన విషయం ఇప్పుడు మా మనవరాలు రమ్య పాల్గొంటున్న సందర్భం గా గుర్తుకు వచ్చింది. అప్పుడు శ్లోకాలు వెనక నుంచి ముందుకు కూడా చదివితేనే బహుమతి ఉండేది .ఆప్పుడు బహుమతిగా ఇచ్చిన భగవద్గీత పుస్తకాన్ని ఇప్పటికీ నేను రోజూ చదువుకొంటూ భద్రం గా ఉంచుకోన్నాను ‘’అని చెప్పాను . పిళ్లే దంపతులకు ఆలయ మర్యాదలతో సత్కారం చేసి ,సరసభారతి పుస్తకాలు ‘’సిద్ధ యోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ‘’రెండూ ఇచ్చి సత్కరించాను .పాల్గొన్న విద్యార్ధినులకు కూడా ఈ రెండు పుస్తకాలను గీతా జయంతి శుభా కాంక్షలతో అంద జేశాను .అనుకోకుండా మొదలు పెట్టిన ఈ కార్య క్రమంస్వామి కృప చేత ఇలా విజయ వంతమైంది ..
మార్గ శిర శుద్ధ ఏకాదశి –శ్రీ గీతా జయంతి శుభా కాంక్షలతో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-13-ఉయ్యూరు
