పెరల్ ఎస్ బక్ -2
పెరల్స్ బక్’’ ‘గ్లోబల్ ’ విద్య ‘’కు నాంది పలికిన మహిళా తేజం .స్టాలిన్ దుశ్చర్యలను ఖండించి ముందు నిలిచింది .ఆమె రాసిన రెండు పుస్తకాలు ‘’దియాంగ్రీ వైఫ్ ‘’,’’హౌ ఇట్ హాపెన్స్ ‘’లు బాగా గుర్తింపు పొందాయి న్యూ యార్క్ నగరం లో 1960లో ‘’గాంధి మెమోరియల్ లెక్చర్ ‘’ఇచ్చింది .కేన్నేడి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఈమెను సాదరం గా డిన్నర్ కు ఆహ్వానించి రచయితలకు అగ్రస్తానాన్ని కల్పించాడు .1963లో ‘’దిలివింగ్ రీడ్ ‘’రాసింది .తన పై పెట్టిన కేసులు ,ఎఫ్ బి.ఐ.ఎంక్వైరీ మొదలైన వాటిని చూసి 77వ పుట్టిన రోజు నాడు ‘’మానవత్వం కోసం చేసిన సేవకు అవమానం ఫలితమా ?’’(for life time humanitarian service – humiliation is the reward?””అని వ్యధ చెందింది
![]()
నోబుల్ బహుమతి స్వీకరిస్తున్న బక్
పెరల్స్ బక్ తన జీవిత చరిత్రను రెండు భాగాలుగా రాసుకొన్నది .6-3-1973.ణ మానవ సేవలో సాహితీ సేవలో సార్ధక జీవితాన్ని గడిపిన పెరల్స్ బక్ మరణించింది .ఆమెకు చార్లెస్ డికెన్స్ అన్నా ఆయన రచనాలన్నా మహా ఇష్టం పదే పదే వాటిని చదువుకొనేది తన దగ్గర ఎప్పుడూ ఆయన పుస్తకాలను ఉంచుకొని స్పూర్తి పొందేది .చని పోయే రోజున చివరి సారిగా డికెన్స్ ను స్మరిస్తూ తన చుట్టూ డికెన్స్ రచనలన్నిటినీ పెర్పించుకోంది బహుశా సాహిత్య చరిత్రలో ఇలా చేసిన వారెవరూ లేరేమో ?
ఆ నాటి అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఆమె ‘కు ’లిటరరీ మెంటార్ ‘’నిక్సన్ బక్ సేవలను ప్రశంసిస్తూ ‘’pearl S. Buck is a bridge between the civilizations of East and West ‘’అని కీర్తిం చాడు .ఆమె తన సమాధి పై తన పేరు ను ఇంగ్లీష్ లో రాయించలేదు .సమాధి లోపల’’ Chine characters representing the name Pearl Syndensticker ‘’.ను చిత్రింప జేసి తనకు ఉన్న చైనా అభిమానాన్ని నిరూపించుకొంది .ఈ విధం గా ఆసియా అమెరికా సాహిత్య వారధి నిత్య జ్వలన జ్యోతి ఆరి పోయింది .
పెరల్స్ బక్ అమెరికా లోని వెస్ట్ వర్జీనియా లో ని హిల్స్ బోరో లో ‘’కెరొలిన స్తంట్లింగ్ ,ఆబ్సలాంసిన్దేన్స్టికర్ దంపతులకు1892 జూన్ 26న జన్మించింది .ప్రెస్బిటేరియన్ చర్చ్ తో కుటుంబానికి సంబంధం ఉంది ఈమే పుట్టాక ముందే తలిదండ్రుల వివాహం తర్వాత చైనా వెళ్లి బక్ పుట్టుక కోసం అమెరికా వచ్చారు మళ్ళీ బక్ మూడో నెల పిల్లగా ఉండగా చైనా వెళ్లి పోయారు తాను రెండు ప్రపంచాలలో జీవిన్చానని ఆమె చెప్పేది ఒకటి ప్రెస్బిటేరియన్ ప్రపంచమైతే రెండోది చైనా జీవిత ప్రపంచం .పందొమ్మిదవ ఏట చైనా వదిలి అమెరికా లో వర్జీనియా లో ఉన్న రాండాల్ఫ్ మెకన్ వుమెన్ కాలేజి లో చేరింది . గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి మళ్ళీ చైనా చేరింది .జాన్ లసింగ్ బక్ అనే వ్యవసాయ ఆర్ధిక వేత్తను పెళ్ళాడింది .దంపతులు యూని వర్సిటి ఆఫ్ నాంకింగ్ లో గడిపారు .కరోల్ అనే కూతురు పుట్టింది .అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీ ని కార్నెల్ వర్సిటి నుండి పొందింది భార్యా భర్తలు తిరిగి చైనా వచ్చారు
.1927లో చైనా ఒడిదుడుకులలో ఉంది చాంగ్ కై షేక్ ప్రభుత్వానికి కమ్మ్యూనిస్ట్ లకు తీవ్ర పోరాటాలు జరిగాయి నాన్జింగ్ లో ఉన్న వీరికి రక్షణ కరువైంది .జాలి తో ఒక చైనా కుటుంబం వీరిని ఆదరించి ఇంట్లో ఉంచుకోండి .రచనలు చేయటం మొదలెట్టి ఆకర్షించింది ఆమె నవల ‘’ఈస్ట్ విండ్ వెస్ట్ విండ్ ‘’కు న్యూయార్క్ పబ్లిషర్లు ప్రోత్సహించారు .వదల కుండా రచయిత్రి గా ఉండమని సలహా ఇచ్చారు .నాన్జింగ్ ఇల్లు తగలెట్టారు జపాన్ చేరారు ఏడాది తారవాత మళ్ళీ చైనా వచ్చారు ఇతాకా కు మారారు .బక్ నుప్రెస్బిటేరియన్ స్త్రీల సంఘం లో మాట్లాడ మని ఆహ్వానిస్తే మాట్లాడి స్పూర్తి నిచ్చింది . ఇది హార్పర్స్ మేగజైన్ లో పబ్లిష్ అయింది .జాన్ డే పబ్లిషర్ అయిన రిచార్డ్ వాల్ష్ తో పరిచయం అయి పెళ్లిదాకా వెళ్ళింది .అప్పుడే గుడ్ ఎర్త్ నవల రాసింది భర్తకు విడాకు లిచ్చి వాల్ష్ ను పెళ్లి చేసుకోంది .1960లో వాల్ష్ మరణం దాకా పెన్సిల్వేనియా లో ఉన్నారు కల్చరల్ రివల్యూషన్ కాలం లో చైనా పల్లె జీవితం పై రచనలు చేసింది 1972 నిక్సన్ తో చైనా వెళ్ళటానికి అనుమతి రాలేదు బాధ పడింది .లంగ్గ్ కేన్సర్ కు గురై పెరల్స్ బక్ 1973మార్చ్ ఆరున 81 ఏళ్ళ వయసులో వెర్మాంట్ లోని డాన్ బి లో చని పోయింది తన సమాధి నిర్మాణాన్ని తానె డిజైన్ చేసుకోంది .
3-10-2002 నాటి నా అమెరికా డైరీ నుండి
క్రిస్మస్ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-13-ఉయ్యూరు
.
