రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4
1— ఆం ఆద్మీ చీపురు పట్టి రాచకీయ చెత్తను ఊడ్చి పారేశాడు
ఆ చేత్తనే నాయకుడు మళ్ళీ నెత్తి నెట్టుకొని సింహాసనం ఎక్కుతున్నాడు
2-.చేతిని ,కాషాయాన్ని పక్కకు ఊడ్చి పైకొచ్చాడు కేస్రీవాల్
మంచిపనే జరిగిందను కొంటె భస్మాసుర హస్తం నెత్తి నేంటి ప్యారేలాల్ ?
3-ఏ అనుభవం లేని ఆద్మీలు గద్దె నెక్కుతారట
దిల్లీని యేలి ఆం ఆద్మీలకు స్వర్గం చూపిస్తారట .
4-మాలే గాం మహర్షి కి ఎందుకీ ఆద్మీ పైన కోపం ?
అడుగడుగునా అవరోధం కల్పిస్తూ పెడుతున్నాడు శాపం ?
5-లోకం కోసం లోక్ పాల్ అని తెచ్చారు
లొసుగులున్నా బాగుందనే అందరూ మెచ్చారు .
6-జే సి పై ఫైర్ అవుతున్న బొత్స
సంజాయిషీ అంటూ చేస్తున్నాడు రచ్చ .
7-బోలారం లో తిష్టవేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పతి
మోరలెత్తుకొని దర్శించి మరీ మొత్తుకుంటున్నాడు ప్రతి పార్టీ పతి
8-బెంగుళూరు వోల్వా లో మూకుమ్మడి సజీవ దహనం
బాధ్యత మరచిన నాయక అధికారగణ మానవత్వ హననం
9- సన్యాసం స్వీకరించిన సినీ నటి రంజిత
నిత్యానందం లో మునుగు తూచేస్తుంది మనసు రంజిత
10-అనాలోచిత అహంకార స్వార్ధ పూరిత బిల్లు తెలంగాణా
అని ఇప్పుడు రోదిస్తూ మోగిస్తున్నాడు జే.పి.జాగృతి గంటలు గణా గణా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-13-ఉయ్యూరు

