పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5
సృజన సూర్యోదయం
చాసర్ తో బలపడిన కవిత్వం ఆయన ప్రభావం తో ఇబ్బంది పడింది .కాంటర్ బరీ కదల తర్వాత ఒక శతాబ్దం కాలం కవులలో కొత్త విషయాలపై ఆలోచన చేయ లేదు .అనుకరణ ,ప్రతిధ్వని ,అన్వయం లో కూరుకు పోయారు .కొత్త గొంతుక అవసరమైంది కొత్త ఆలోచనలు కావాల్సి వచ్చింది .సృజన కోసం ఆరాటం పెరిగింది .ఈ నేపధ్యం లో అలాంటి గొంతు విని పించింది .సృజనాత్మక ఆలోచన రచన తో దూసుకు పోయిన కవి వచ్చాడు .కాని అతన్నికావాలనే దూరం చేశారు అతడే ‘’జాన్ స్కెలిటన్’’ స్కేలిటన్ తో’’ సృజన భానూదయం ‘’అయింది ఆంగ్ల సాహిత్యం లో .
జాన్ స్కెల్ టన్
జాన్ స్కెల్టన్ 1460లో పుట్టాడని భావిస్తారు 1529జూన్ లో మరణించాడు పూర్వీకుల గురించి తెలియదు .కంబర్లాండ్ జానపదుడు .నారక్ ఫోక్ లో ఉండేవాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ యూని వర్సిటీలు అతని అసామాన్య ప్రతిభను గుర్తించాయి .ఆస్థాన కిరీటం లాంటిది ఇచ్చి ‘’ప్రజాస్తాన కవి ‘’గా గుర్తించి గౌరవించాయి .అప్పటికి రాజాస్థానాలలో ‘’ఆస్థాన కవి ‘’అనే గౌరవ పదవి ఏర్పడలేదు .ఈ గౌరవం పది హేడవ శతాబ్ది నుండే ప్రారంభమై ‘’బెన్ జాన్సన్ ‘’మొదటి రాజాస్థాన కవి అయ్యాడు .ఈ పదవి వలన ఏడాదికి రెండు వందల పౌండ్ల పారితోషికం ఒక ‘’టన్ను వైను ‘’జాన్సన్ కు లభించాయి .
స్కేల్టన్ హెన్రి యువరాజుకు ట్యూటర్ అయ్యాడు .ఏడవ కింగ్ హెన్రి గా ఆయన పట్టాభి షిక్తుడు అయిన తర్వాత గురువు గారిని ‘’ఆస్థాన కవి ‘’ని చేశాడు .కొద్దికాలం లోతన స్వంత ప్రదేశం నార్త్ ఫోక్ కు ‘’రెక్టార్ ‘’అయ్యాడు .ఆ కాలం లో చర్చి బోధకులు పెళ్లాడ రాదనే నియమం ఉంది .మనకవికి పెళ్లి అయిందో లేదో తెలీదు .అతని పై పెద్ద అభాండం వేశారు .దీన్ని తిప్పి కొట్టాటానికి అందర్నీ సమావేశ పరచి తన ఇంట్లో ఉన్న ఆమె పై అభూత కల్పనలు చేసినందుకు పరిష్కారం గా ఆమెయే తన భార్య అని ప్రకటించాడు .ఆమెకు ఉన్న కొడుకు తన కొడుకే అనితెలియ జేశాడు .తనపై బిషప్ కు’’ మూటలు ‘’మోసిన వారిపై తీవ్రం గా విరుచుకు పడి ‘’to complain without a cause ,I say you be and have been and will and shall be knaves ‘’అని వాళ్ళంతా పచ్చి ‘’మోసగాళ్ళ’’ని కడిగి పారేశాడు .
స్కే ల్టన్ నిజాయితీ ,నిర్భీకత వలన చర్చి లో అత్యున్నత పదవి పొందాడు .ఇది అంత ప్రాదాన్యపదవేమీ కాదు .గ్రామం లోని ప్రీచర్ తో సమానమే .కాని కార్డినల్ ‘’ఒల్సీ ‘’మీద పదే పదే ఆరోపణలు చేసే వాడు .తర్వాతరాజ దర్బారు లో ‘’రాయల్ ఆరేటర్ ‘’అయ్యాడు .కార్డినల్ పై మాటల దాడి ఆపలేదు .విజ్రుమ్భిస్తూనే ఉన్నాడు .దీన్ని తిప్పి కొట్టటానికి ఒల్సీ విశ్వ ప్రయత్నం చేస్తూ ఆత్మ రక్షణ లో పడి పోయాడు .ఈ బాధ భరించలేక స్కెల్ టన్ మినిస్టర్ ఆశ్రమానికి వెళ్లి పోయాడు .అక్కడే 70ఏట స్కెల్ టన్ పోయి, నిజం గానే’’ స్కేలిటన్ ‘’(ఆస్థి పంజరం )అయ్యాడు .
రాజు విపరీత ధోరణులకు స్కేల్ టన్ యే కారణం .ఇద్దరూ విశ్రుం ఖలం గా వ్యవహరించారు ఫుడ్డూ, బెద్డూ కలిసి పంచుకొన్నారు .కలిసి స్త్రీ సంభోగాలను అనుభవించారు .కుళ్ళు జోకులు మురికి హాస్యం తో కాలం గడిపారు .అదే స్కేల్ టన్ కవిత్వం లో చోటు చేసుకోంది .విలువల పతనం జరిగింది విలువలకు ప్రాదాన్యతనివ్వలేదు .చిన్న ఛందస్సు ను ఎన్నుకొన్నాడు .వేగ వంతం గా కవిత నడిపాడు .భా అనేక కొత్త పోకడలు పోయింది. విపరీత ఆచారాలకు ప్రాధాన్యత నిచ్చాడు .అందుకే అతని సృజనను గురించి ‘’crude and classic creation ‘’అంటారు .’’హోలీ బాత్ ‘’,మోళీ బ్ల్లూం ‘’కవితలలో కవిత్వం ప్రవహించింది .పాత్రల చిత్రణ ఆయన పేరుకు తగ్గట్లే రక్త మాంసాలు లేకుండా ‘’ఆస్థి పంజరాలు (స్కేలిటన్స్ )గా, నిర్జీవం గా ఉన్నాయి .కవి మేధస్సు లోని లోని ఒక పార్శ్వమే ప్రదదర్శించాడు అని ‘’ విమర్శకాభిప్రాయం .
And prettily he would pant –when he saw an aunt –lord !how he wilde pry after the butterfly –lord!how he wolde hop –after the grass shop ‘’ఇలా నడుస్తుంది .విషయం లోఉన్న గాఢతను బట్టి కవిత్వం రాశాడు . ఎన్నుకొన్న ఛందస్సు నాలుగు దీర్ఘాక్షర సముదాయం గా ఉంటుంది .ఇలా ఇంతకూ ముందు ఏ కవీ కవిత్వం రాయలేదు .అందుకే దీనికి ‘’స్కేల్టానిక్ మీటర్ ‘’ అని అతని పేరు మీద పిలుస్తున్నారు .తనకు ముందు ఉన్న కవుల శైలిని ,సరళతను ఇతను ఇష్టపడలేదు . మర్యాద కు భిన్నమైనవి, నీచమైనవి కావాలనేకవిత్వం లో చొప్పించాడు .సద్యో గర్బ్భిత భావాలు అలవోకగా వచ్చి దూకే పదజాలంతో స్కెల్ ట న్ తన తరాన్నే కాక ముందు తరాలనూ ప్రభావితం చేశాడు .కాని మూడు కారణాల వలన అతన్ని దూరం చేశారని రాబర్ట్ గ్రీవ్స్ 1920లో రాశాడు అవే ‘’his wide though un deserved reputation as a specialist in obscenity ,a misreading of his verse structure due to the dropping of the final ‘’e’’ and other changes in pronunciation which occurring shortly after his death made Skelton ‘s rhythms seemed wild and crudy contrived and the fact that the few available editions of his work were a hodge podge of faulty guesses and flagrant errors ‘’
ఏమైనా స్కెల్ టన్ అతని ‘’cut and thrust manner was against him ‘’అని తేల్చారు పందొమ్మిదో శతాబ్దపు మధ్యకాలం వరకు ఆటను ప్రజల ,ప్రైవేట్ వ్యక్తుల కు దూరం అయ్యాడు .అలేక్సాండర్ డైస్స్ అనేమేధావి, విద్యా వేత్త స్కెల్ టన్ రచనలను తప్పులు లేకుండా మొట్టమొదటి సారి ప్రచురించాడు .అది కూడా కొంతకాలం అందరి దృష్టిలోకి రాలేదు .కొందరు ఆధునిక కవులు ‘’enthusiastically discovered the range of Skelton ‘s variety ,the virtuosity of his technique and the brusque power of his personality ,four hundred years after he was buried ‘’.ఇలా చరిత్ర గర్భం లో కలిసి పోయి ఆ ప్రతిభను గుర్తించిన ఆధునిక కవుల హృదయాలలోకి చేరి మళ్ళీ బతికి ప్రజా హృదయాలలో నిలిచి పోయాడు సృజన సూర్యుడైనకవి ‘’స్కెల్ టన్ ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-14-ఉయ్యూరు

