పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7
సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు
వ్యాట్ రాసిన ‘’టాట్లేర్స్ సాంగ్స్’’ప్రచురణ తో లాభాలు బాగా సంపాదించిన ప్రచురణకర్తలు, కవులుకొత్త ఉత్సాహం తో ఊగిపోయారు .ప్రతిభ ఉన్న ఎమేచ్యూర్ కవులు ప్రొఫెషనల్ కవులై పోయారు . 1525—1577కాలం వాడైన జార్జి గాస్కోన్ తన కవితలు ముద్రణ లాభాలతో పొందటం తో తృప్తి పడక నీతి పద్యాలు రాసి అచ్చేశాడు .నికొలాస్ బ్రీతాన్ అనే అతని మారుటి కొడుకు గ్రామీణ శృంగార కవితలు రాశాడు .జార్జి వెట్స్ స్టోన్ కూడా ఈ బృందం లో చేరాడు .
అది జాగృతమైన యుగం .అనేక విరుద్ధ భావాల మయం .దెశాలఆ సరిహద్దుల్ని పెంచుకోవటం సాంస్కృతిక వైభవాన్ని స్తుతించటం సర్వ సాదారణమైంది .ఇంగ్లాండ్ అన్నిరకాలుగా’’ దివాలా ‘’తీసి పోయింది .ధనాగారం నిండుకొంది ..దాన్ని నింపటానికి కొత్త ప్రదేశాలను కనుక్కోవటానికి సముద్రయానాలను ప్రోత్సహించింది .సముద్రాంతర భాగాల ఆక్రామణ ధ్యేయం గా ఇది సాగింది .ఇందులో రహస్యం గా యుద్ధం ,పైరసీ అంటే సముద్ర దొంగతనం ఇమిడి ఉన్నాయి .ఎలిజబెత్ రాణి ఆ కాలపు అన్ని విపరీత భావాలు ,అంటే మతం ,క్రూరత్వం ,పరిశోధనాత్మక కళ,నిరాశాపూరిత శ్రమ ,బేఫర్వాతనం మేధావిత్వము పై అసంతృప్తి అన్నీ సంక్రమింప జేసుకోంది .ఇవన్నీ ఆమె వ్యక్తిత్వం లో చోటు సేసుకోన్నాయని సర్ వాల్టర్ రాలీ విశ్లేషించాడు .
ఎలిజ బెత్ రాణి శృంగార పతనం రాలీ మీద మిష తో పడటం వాల్టర్ చారిత్రిక పురుషుడయ్యాడు .ఆతను అలాంటి వాడో కాదో తెలీదు కాని అతని చుట్టూ అనేక కధలూ గాధలూ అల్లారు . మేధావి దైవ భక్తీ ఉన్నవాడు ,అన్నిట్లోనూ ముందుండే ఇంగ్లీష్ రినైసంస్ మనిషి, యోధుడు ,నావికుడు ,రాజకీయ వేత్త ,సాహసి ,పరిశోధకుడు అన్నిటికంటే గొప్ప కవి .1552 లో దేవెంషైర్ లో హెలీ బార్టన్ దగ్గర పుట్టాడు .ఆక్స్ ఫర్డ్ ఓరియల్ కాలేజిలో చదివాడు .డిగ్రీ పొందలేదు స్పెయిన్ ,ఐర్లాండ్ లలో యుద్ధం చేసినా సరైన హోదా (రాంక్) పొందలేక పోయాడు .కెప్టెన్ పదవి కంటే పెద్ద పదవి రాలేదు .పదేళ్ళలో బాగా పెరిగి తరిగి పోయాడు .రాణి అతన్ని దయగా చూసేది .సర్ హంఫ్రీ గిల్బ్బర్ట్ రాలీకి సోదరుని వరుస .1578లో అతని మొదటి అమెరికా కు నౌకా యానానికి వెడుతూ తన నౌకలపై అధికారాన్ని రాలీ కి అప్పగించాడు . గిల్బర్ట్ అమెరికా బయల్దేరగానే రాలీ కొత్త ప్రదేశాలు కనీ పెట్టి జయించటానికి పూనుకొని బయల్దేరాడు .అప్పుడే తను కను గొన్న’’ కాలని ‘’కి కన్య (వర్జిన్ )గా ఉన్నరాణి పేర ‘’వర్జీనియా ‘’అని పేరు పెట్ట్టాడు .
కాని అకస్మాత్తుగా అతనిపై రాణి కి దయ తప్పింది .దీనికి కారణం రాణి పనికత్తె ఎలిజ బెత్ త్రాక్ మారటాన్ పై రాలీ కన్ను పడిందని అనుమా నిమ్చటమే .ఇది రాజ ద్రోహం గా రాణి భావించింది .వెంటనే ఆమెను పెళ్లి చేసుకోమని హుకుం జారీ చేసి అమలు అయ్యేట్లు చూసింది .రాలీ ఎలిజబెత్ లు హాయిగా సంసారం సాగించారు .కాని రాణి కోపం ఆగిపోలేదు .అతన్ని క్షమించ లేక పోయింది .అతని ప్రాముఖ్యాన్ని తగ్గించే అన్ని ప్రయత్నాలూ చేసింది .పనామా లో పరిశోధన చేస్తున్న రాలీ ని వెంటనే వెనక్కి పిలిపించి ,చౌక బారు ఆరోపణల మీద టవర్ జైల్లో పెట్టించింది .’’ఆమ్యామ్యా’’సమర్పించి రాలీ విడుదలైనాడు .మళ్ళీ రాణీ గారి కృపా వీక్షణాలను పొందాడు .కాని సమస్యలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి .తనపై మోప బడ్డ మచ్చలను మాపుకోవటానికి అనేక నౌకా యానాలు చేశాడు .రాణి దయ కోసం వెంప ర్లాడాడు .రాణి రాలీ రాతిభ గుర్తించి జెర్సీ కి గవర్నర్ ను చేసింది .రెండేళ్లకే రాణి చనిపోయింది .విధి వక్రించి రాలీ మళ్ళీ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయాడు .
మొదటి జేమ్స్ రాజైన తర్వాత కొత్త రాజును కూల దోసె కుట్రలో రాలీ కూడా ఉన్నాడని తప్పుడు అభియోగం మోపాడు .జడ్జి ఎటూ తేల్చ లేక చివరికి మళ్ళీ టవర్ లో ఉరిశిక్ష అమలు చేయమని ఆజ్ఞాపించాడు .కాని అమలుకు ముందు పద్నాలుగేళ్ళు జైల్లో ఉంచారు .అరవై ఏళ్ళు వచ్చాక విడుదలైనాడు .ధైర్య సాహసాలతో ఒరినాకో లో బంగారం కోసం మళ్ళీ సముద్రపరిశోధనకు బయల్దేరాడు .ప్రయోగం విఫలమైంది .తిరిగి రాగానే అరెస్ట్ చేశారు .ఒక స్పానిష్ సెటిల్ మెంట్ ను రాలీ కావాలనే తగల బెట్టాడని స్పానిష్ రాయబారి నేరం మోపాడు .రాలీ మీద .పాత రాజద్రోహం మళ్ళీ వెలుగు లోకి తెచ్చి మళ్ళీ జైలు పాలు చేశారు .విచారణలో రాలీ తప్పు చేసినట్లు రుజువైంది .29-10-1618న ఆ సాహస యాత్రికుని తల నరికారు .
ఆ రోజుల్లో రాలీ ని గురించిన సాహస గాధలు పాటలుగా కధలుగా జనం పాడుకొన్నారు చెప్పుకొన్నారు .అతని నౌకా యానం చరిత్రలో నిలిచి పోయింది .రాలీ యువ రాజు ‘’ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘జ్ఞానాభి వృద్ధి ’కోసం ‘’ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ‘’ను జైల్లో ఉండగా పదమూడేళ్ళు కష్ట పడి రాశాడు .రాలీ లోని కవితాత్మను అతని రాజోద్యోగం ,నౌకాయానం మరుగు పరచాయి .త్రుణీకారాన్ని సామాన్య విషయం గా ‘’ది నిమ్ఫ్స్ రిప్లై టు ది షెపర్డ్ ‘’,లో చూపాడు .’’డి వుడ్ ,ది వీద్,ది వాగ్’’కవిత నిరాశా నిస్పృహ లతో చావుకు దగ్గరౌతున్న వాడి మాటల్లా రాశాడు .అది రాలీ తనను గురించి రాసుకొన్న ‘’స్మ్రుతి గీతం ‘’.అతని టెక్నిక్ గొప్పదే కాని అతని కాలనైజేషన్ లాగా అదీ ఫలించక పోవటం దురదృష్టం .
![]()
![]()
రాలీ ఆఫీసు సీలు
![]()
కవులకు కవి – ఎడ్మండ్ స్పెన్సర్
స్పెన్సర్ తన సమకాలీన కవుల, తన వంశం వాళ్ళ తో విభేదించాడు .ప్రత్యేకత సాధించాడు .తన కవిత్వం తో ఇంగ్లీష్ కవిత్వాన్ని సు సంపన్నం చేశాడు .లాటిన్ భాషా సొగసుల్ని అద్దాడు. అంతప్రాచుర్యమూ తెచ్చాడు ..మహా కావ్యాలు రాయాలని తపించాడు .అవి ఓడిస్స్సీ ,ఎనీద్ ల స్థాయి లో ఉండాలని ఆశించాడు .’’దిఫైరీ క్వీన్ ‘’’’షెపార్డ్స్ కాలెండర్ ‘’లు వీటికి ఉదాహరణలు.తియోక్రితాస్ ,వర్జిల్ లను ప్రేరణ గా గ్రహించాడు .ఆంగ్ల గ్రామీణ కవిత్వానికి సొగసులు చేకూర్చాడు .
1552లో వస్త్ర తయారీ దారుని కొడుకుగా పుట్టి టేయిలర్స్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జి లోఇరవై అయిదేళ్ళకే ఏం ఏ సాధించాడు .అతని ముచ్చటైన రూపం తెలివి తేటలతో లీసేస్టర్ బంధువు ఎలిజ బెత్ రాణి కి బాగా ఇష్టుడైన ‘’ఎరల్ ఆఫ్ లీ చెస్టర్ ‘’కు సెక్రటరి అయ్యాడు .లీచేస్టార్ బంధువు సర్ ఫిలిప్ సిడ్నీతో సాహిత్య పరిచయమేర్పడింది ఇంకో ఇద్దరు ఈ బృందం లో చేరారు .ఛందస్సుపై అనేక చర్చలు జరిపారు .రాజాస్థానం లో ఉద్యోగం పొందాలనుకొన్నా రాలేదు .ఇరవై అయిదేళ్లకు ఐర్లాండ్ కు క్రూరుడైన లార్డ్ గ్రే డీ విల్టన్ కు సెక్రెటరి గా .వెళ్ళాడు.రెండేళ్లలో గ్రే ను వెనక్కి పంపించేశారు . డబ్లిన్ లో గుమాస్తాగా చేరి స్పెన్సర్ ఉండిపోయాడు .తర్వాత మంచి జీతం తో షరీఫ్ అయ్యాడు .ఐర్లాండ్ ను ‘’ప్రావస దేశం ‘’గా ఎప్పుడూ భావించేవాడు .ఐరిష్ ప్రజలంటే ద్వేషం .’’లార్డ్ డిప్యూటీ’’భావాలు మాత్రం నచ్చాయి స్పెన్సర్ ‘’నైట్ ఎర్రంట్ ఆఫ్ జస్టిస్ ‘’గా ఫైరీ క్వీన్ లో అతన్ని చిత్రించాడు .లార్డ్ గ్రే దయ వలన మూడు వేల ఎకరాల ఎస్టేట్ ను కౌంట్ కార్క్ లో పొందాడు .అందులో నిర్మించిన ‘’కిల్కొల్మాన్ సౌధం ‘’లో ప్రవేశించాడు .ఫైరీ క్వీన్ లో మర్మం గా గ్లోరియానా ‘’ పాత్ర గా సృష్టించిన ఎలిజ బెత్ రాణికి అంటే వర్జిన్ క్వీన్ వర్జిన్ మేరీ కి అంకితమిచ్చాడు .నలభయ్యవ పడిలో ‘’ఎలిజ బెత్ బాయిల్ ‘’ను పెళ్ళాడాడు .ఆమె వలననే అందరూ పాడుకొనే పెళ్లి పాట‘’ఎపితాల్మియాన్ ‘’ను మహాద్భుతం గా రాశాడు .’’to which the woods did answer and your echo ring ‘’.అంటూ సాగే పాటఅది .
పెళ్లి అయిన నాలుగేళ్ళకు ఐరిష్ అంతర్యుద్ధం 1598లో మొదలైంది .స్పెన్సర్ సౌధాన్ని ముట్టడించి అగ్నికి ఆహుతి చేశారు .భార్యా నలుగురు పిల్లలతో తప్పించు కొని పారిపోయి ఒక చౌక ఇంట్లో అద్దేకుండి తల దాచుకొన్నాడు .ఒక నెల లోపే స్పెన్సర్ 16-1-1599నమరణించాడు .ఎరల్ ఆఫ్ ఎస్సెక్స్ స్పెన్సర్ అంత్య క్రియల ఖర్చు పెట్ట్టాడు .తర్వాత స్పెన్సర్ భౌతిక దేహాన్ని లండన్ లోని పోఎట్స్ కార్నర్ అయిన వెస్ట్ మినిస్టర్ అబ్బే లో భద్రాపరచారు .స్పెన్సర్ ను చదవటం కంటే ఎక్కువగా గౌరవించారు .భాష పై అనితర సాధ్యమైన పట్టు ,పద ప్రయోగం ప్రవాహ వేగం తో జాలువారే పదాల వరుస స్పెన్సర్ ప్రత్యేకత .విమర్శకులు సాహిత్య నిపుణులు స్పెన్సర్ కవిత్వాన్ని ఎంతగానో మెచ్చుకొన్నారు .స్పెన్సర్ ను’’ కవులకు కవి ‘’అన్నారు .
స్పెన్సర్ కవి తొమ్మిది లైన్ ల సుందర కవితను సృష్టించి వందలాది తరువాతి కవులకు మార్గ దర్శి అయ్యాడు .అదే ‘’a-b-a-b-b-c-b-c-c’’.దీనినే ‘’స్పెన్సర్ స్టాంజా ‘’అన్నారు .మొదటి ఎనిమిది లైన్లు పది అక్షరాల సముదాయం తో దీర్ఘముగా పొందికగా ఉండి చివరి లైను పన్నెండు అక్షరాలసముదాయం తో ‘’ అలేక్సాండ్రిన్ ‘’అనే పేరుతొ ఉండటం స్పెన్సర్ చేసిన ప్రయోగం ,సాఫల్యం . అతని ఫైరీ క్వీన్ నుంచి దీనికి ఒక ఉదాహరణ .
‘’it was an hill placed in an an open plain –that round about was bordered by a wood –of matchless height that seemed the earth to disdain –in which all trees of honor stately stood –and did all winter as in summer bud-spreading pavilions for the birds to bower –which in their lower branches sung aloud –and in their tops the soaring hawk did tower –sitting like kings of fowls in majesty and power ‘’
ఇదీ స్పెన్సర్ స్టాంజా అంటే .ఎనభై ఎనిమిది సానేట్స్ రాశాడు .స్పెన్సర్ ఆరాధ కవులు అతన్ని అనేక రకాల కవితలతో కీర్తించారు .అందుకే ఏదైనా ప్రత్యేకత ఉంటె దాన్ని ‘’స్పెన్సర్ రేట్ ‘’అనీ ‘’స్పెన్సర్ క్వాలిటీ’’ అని అనటం అలవాటయ్యింది .

![]()
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-14-ఉయ్యూరు

