భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ హాద్’’పిలుపు నివ్వగా ,ఉలేమాలు మొదలైన వారంతా దేశ వ్యాప్తం గా బ్రిటిష్ వారి దాస్టేకానికి నిరసన తెలియ జేశారు .అప్పటిదాకా పరదాల చాటునే ఉంటున్న ముస్లిం మహిళలు బహిరంగం గా నినాదాలు చేసి తీవ్ర నిరసన తెలిపారు .ఈ జీహాద్ ఉద్యమం1857లో బలపడి1947 స్వాతంత్ర్య సాధన వరకు కోన సాగింది .ముస్లిం మహిళలు భర్తలు ఉద్యమం లో ఇంటికి దూరం గా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలన్నిటినీ తామే స్వీకరించి తండ్రులకు కొడుకులకు బంధువులకు ప్రేరణ కల్గించి ముందుకు నడిపించారు .బాహాటం గా స్వాతంత్ర్య దీప్తిని రగిలించారు .అహింసా ,హింసా విదానాలలోను భాగ స్వామినులయ్యారు .ఈ మహిళలు ఉన్నత కుటుంబాలకు ఉన్నత విద్య నేర్చిన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే కాదు ,సాధారణ కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యా గంధం లేని ముస్లిం మహిళలు కూడా ఎందరో ఉన్నారని గ్రహించాలి .ఇప్పుడు కొందరు ముస్లిం మహిళా దేశ భక్తుల పోరాట పటిమల గురించి తెలుసు కొందాం .
బీగం హజ్రత్ మహల్
నవాబ్ వాజిద్ ఆలి షా భార్య అయిన బీగం హజ్రత్ మహల్ తన భర్త కలకత్తాకు ప్రవాసానికి వెడితే బాధ్యతలను చే బట్టింది .భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం లోని నాయకులతో కలిసి పని చేసింది .సర్ హెన్రి లారెన్స్ మొదలైన ఆఫీసర్లను వెల్ల గొట్టి లక్నో రెసిడెన్సి ని ముట్టడించి వశ పరచు కొన్నది .జెనరల్ హేవ్ లాక్ ఆఫీసర్లకు సైన్యానికి రక్షణ గా వచ్చినా విఫలమైనాడు .తర్వాత వచ్చిన కాంప్ బెల్ లక్నో ను తిరిగి స్వాధీనం చేసుకోవటం లో విజయం పొందాడు .బీగం ను బలవంతం గా వెనక్కి మరలేటట్లు చేయ గలిగాడు .బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాలు తనకక్కర లేదని క్షమా భిక్ష వేడనని ఖచ్చితం గా చెప్పింది .బ్రిటిష్ వారికి దొరక కుండా తప్పించుకుంటానని ధైర్యం గా ప్రకటించింది .తనకొడుకు యువరాజు బిర్జీస్ ఖాదిర్ ను అవద్ కు రాజును చేసింది .కొద్ది కాలమే అతను పరిపాలించాడు .బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పదవి నుండి తప్పించింది .తల్లి బీగం హజ్రత్ మహల్ నేపాల్ దేశానికి చేరి ప్రవాస జీవితం గడిపింది .1820లో జన్మించిన బీగం నేపాల్ లోనే 7-4-1879లో యాభై తొమ్మిదో ఏట మరణించింది .ఆమె జీవిత విశేషాలు మరిన్ని తెలుసు కొందాం .
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ హాద్’’పిలుపు నివ్వగా ,ఉలేమాలు మొదలైన వారంతా దేశ వ్యాప్తం గా బ్రిటిష్ వారి దాస్టేకానికి నిరసన తెలియ జేశారు .అప్పటిదాకా పరదాల చాటునే ఉంటున్న ముస్లిం మహిళలు బహిరంగం గా నినాదాలు చేసి తీవ్ర నిరసన తెలిపారు .ఈ జీహాద్ ఉద్యమం1857లో బలపడి1947 స్వాతంత్ర్య సాధన వరకు కోన సాగింది .ముస్లిం మహిళలు భర్తలు ఉద్యమం లో ఇంటికి దూరం గా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలన్నిటినీ తామే స్వీకరించి తండ్రులకు కొడుకులకు బంధువులకు ప్రేరణ కల్గించి ముందుకు నడిపించారు .బాహాటం గా స్వాతంత్ర్య దీప్తిని రగిలించారు .అహింసా ,హింసా విదానాలలోను భాగ స్వామినులయ్యారు .ఈ మహిళలు ఉన్నత కుటుంబాలకు ఉన్నత విద్య నేర్చిన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే కాదు ,సాధారణ కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యా గంధం లేని ముస్లిం మహిళలు కూడా ఎందరో ఉన్నారని గ్రహించాలి .ఇప్పుడు కొందరు ముస్లిం మహిళా దేశ భక్తుల పోరాట పటిమల గురించి తెలుసు కొందాం .
బీగం హజ్రత్ మహల్
నవాబ్ వాజిద్ ఆలి షా భార్య అయిన బీగం హజ్రత్ మహల్ తన భర్త కలకత్తాకు ప్రవాసానికి వెడితే బాధ్యతలను చే బట్టింది .భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం లోని నాయకులతో కలిసి పని చేసింది .సర్ హెన్రి లారెన్స్ మొదలైన ఆఫీసర్లను వెల్ల గొట్టి లక్నో రెసిడెన్సి ని ముట్టడించి వశ పరచు కొన్నది .జెనరల్ హేవ్ లాక్ ఆఫీసర్లకు సైన్యానికి రక్షణ గా వచ్చినా విఫలమైనాడు .తర్వాత వచ్చిన కాంప్ బెల్ లక్నో ను తిరిగి స్వాధీనం చేసుకోవటం లో విజయం పొందాడు .బీగం ను బలవంతం గా వెనక్కి మరలేటట్లు చేయ గలిగాడు .బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాలు తనకక్కర లేదని క్షమా భిక్ష వేడనని ఖచ్చితం గా చెప్పింది .బ్రిటిష్ వారికి దొరక కుండా తప్పించుకుంటానని ధైర్యం గా ప్రకటించింది .తనకొడుకు యువరాజు బిర్జీస్ ఖాదిర్ ను అవద్ కు రాజును చేసింది .కొద్ది కాలమే అతను పరిపాలించాడు .బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పదవి నుండి తప్పించింది .తల్లి బీగం హజ్రత్ మహల్ నేపాల్ దేశానికి చేరి ప్రవాస జీవితం గడిపింది .1820లో జన్మించిన బీగం నేపాల్ లోనే 7-4-1879లో యాభై తొమ్మిదో ఏట మరణించింది .ఆమె జీవిత విశేషాలు మరిన్ని తెలుసు కొందాం .
బీగం అసలు పేరు మొహమ్మది ఖానుం .అవద్ లోని ఫైజా బాద్ లో జన్మించింది .ఆమె రాజు గారి ఆస్థానం లో పని చేసింది .తలిదండ్రులు ఈమెను అమ్మేశారు .ఖవాసిన్ అయింది .తరువాత రాజ ప్రతినిధులకు అమ్ముడు పోయింది .అక్కడ ‘’పారి ‘’అయి అవద్ రాజు లలో చివరి వాడైన వజీర్ అలీ షాకు కు చిన్న భార్య అయి బీగం హజ్రత్ మహల్ పేరు తో స్తిర పడింది .బ్రిటిష్ ప్రభుత్వం అవ ద్రాజ్యాన్ని లోబరచుకోవటం తో షా కలకత్తాకు పారిపోయి ప్రవాస జీవి అయ్యాడు .భర్త తో విడాకులు పొందినా రాజ్య వ్యవహారాలను బీగం చే బట్టింది .అవద్ –ఇప్పుడున్న ఉత్తర ప్రదేశ్ లో చాలా పెద్ద ప్రాంతం గా ఉండేది .రాజా జైలాల్ సింగ్ వంటి దేశ భక్తుల తో కలిసి బ్రిటిష్ వారిపై ప్రధమ స్వాతంత్ర్య సమరం చేసింది .నానా సాహెబ్ తో కూడా కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించింది .శహజన్ పూర్ పై గైజాబాద్ మౌలవి తో తో కలిసి దాడి చేసింది .
ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం లోని ప్రార్ధనా మందిరాలను రోడ్ల నిర్మాణం పేరు తో కూల గొట్టి చర్చిలను నిర్మిస్తూ ఉంటె వ్యతిరేకించింది .దైవారాధనకు స్వేచ్చ ఉండాలి అని ఎదురు తిరిగింది .ఈ విషయం లో ఆమె ‘’పందులను తింటూ మద్యం సేవిస్తూ ,తుపాకీ కాట్రిడ్జ్ లకు పంది కొవ్వు కలిపినతీపి పదార్ధాలను పూసి ,రోడ్ల విస్తరణ పేరు తో హిందూ ముస్లిం దేవాలయాలను కూల్చి వేస్తూ చర్చిలు నిర్మిస్తూ ,మత ప్రచారకులను వీధుల్లో తిప్పి క్రిస్టియన్ మత ప్రచారం చేయిస్తూ,ఇంగ్లీష్ స్కూళ్ళు ఏర్పరచి ,ఇంగ్లీషు ,సైన్సు నేర్వటానికి స్టైఫెండ్ ఇస్తూ ,ఇప్పటిదాకా హిందూ ముస్లిం ల దేవాలయాల విషయమే పట్టించు కోకుండా అశ్రద్ధ చేసి,మీరు చేస్తున్న మీ నిర్వాకాన్ని చూస్తె మత విశ్వాసాలలో మీరు తలదూర్చరని నమ్మకం ఎక్కడ కనీ పిస్తోంది ‘?’అని సూటిగానిప్పులు కక్కుతూ ప్రశ్నించిన ధీర వనిత బీగం .
చివరికి నేపాల్ కు శరణార్ధిగా వెళ్ళాల్సి వచ్చింది .మొదట అక్కడి ప్రధాని జంగ్ బహదూర్ ఆమె ప్రవేశాన్ని అడ్దగించినా తర్వాత అంగీకరించి ఆశ్రయ మిచ్చాడు .ఆమె నేపాల్ లోనే చనిపోయింది .ఆమె దేహాన్ని ఖాట్మండు లోని జామా మసీద్ లో ‘’ఒక అనాధ ‘’గా ఖననం చేశారు .అంతటి మహారాణికి స్వాతంత్ర్య సమర మహిళకు ఎంతటి దుర్గతి?. బీగం 135 వ వర్ధంతి నాడు జామా మసీద్ లోని ఆమె సమాధిపై భారత ,నేపాల్ రాయ బారులు పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళు లర్పించారు .ఇండియాలో లక్నో లో పురాతన పార్కుకు 15-8-1962 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆమె పేరు పెట్టి గౌరవించారు .ఒక పాల రాతి స్మ్రుతి చిహ్నాన్ని అక్కడ నెల కోల్పారు .1984 మే పది న భారత ప్రభుత్వం బీగం పేరిట 15,00,000లపోస్టల్ స్టాంప్ ల ను విడుదల చేసి ఆమె స్వాతంత్ర్య దీక్షను శ్లాఘించింది .
![]()
మరో ముస్లిం మహిళా యోధురాలి గురించి మరో సారి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-14-ఉయ్యూరు

