49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే
హెన్రి ఎమిలి బెనాట్ మాటిస్సే జీవిత చరిత్ర అంటే అతని పెయింటింగుల కేటలాగ్ అవుతుంది .కళ నే జీవితంగా జీవి౦చినవాడు ,నిజంగా చెప్పాలంటే ‘’కాన్వాస్ పైనే జీవించాడు ‘’.31-12-1869 న ఫ్రాన్స్ లో ని పెకార్డీ లో ఉన్న ఫ్రాన్స్ –ఫ్లాన్దర్స్ తో కలిసే చోట లీ కాత్యూ అనే చిన్న పట్టణం లో జన్మించాడు .తండ్రి ధాన్య వ్యాపారి .పెద్దకొడుకైన హెన్రీ లాయర్ కావాలని తండ్రి కోరాడు .దీనికి అనుగుణంగానే కొడుకు చదువు ప్రారంభించాడుకాని అనారోగ్యం వలన కోన సాగించ లేక పోయాడు .కోలుకొంటున్న స్థితిలో తన చుట్టూ ఉన్న వస్తువుల స్కెచ్ లు గీశాడు .అప్పుడే అతని దృష్టిలో ‘’హౌ టు పెయింట్ ‘’అనే పుస్తకం పడింది .తలిదండ్రులకు ఇష్టం లేకపోయినా లా కు నీళ్ళోదిలి ఆర్టే హార్ట్ గా భావించి ముందడుగే వేశాడు .కమ్మర్షియల్ డిజైన్ లో పాఠాలు నేర్చాడు .దీన్ని ఎంబ్రాయిడరీ కోసం వాడుతారు .కాని 23 ఏళ్ళు వచ్చేసరికి ఆర్ట్ ను క్రమ పద్ధతిలో నేర్వటం ప్రారంభించాడు 29వ ఏట టౌలస్ కు చెందిన ఎమిలీ పెయేరే ను పెళ్ళాడాడు .ఇద్దరుకొడుకులు జీన్ ,పియరే లు పుట్టారు .
సాంప్రదాయ విద్యా విధానాన్ని తిరస్క రించే రాడికల్ గా పెయింటింగ్ జీవితం ప్రారంభించ లేదు హెన్రి .అతని మొదటి గురువు స్పాంజి కేక్ పింక్ ,షుగర్ లతో వనదేవతలను చేయటం లో ప్రసిద్ధుడైన బోగురే .ఇది మూడో తరగతి ఆర్ట్ గా భావించి ,గుస్టీవ్ మొరువా స్టూడియో లో చేరాడు . . గుస్టేవ్ గొప్ప ఆర్టిస్ట్ కాకపోయినా హేన్రిపై ప్రభావం చూపించాడు .ఈయనే రౌవాల్ట్ ,డూఫీ ,మాటిస్సే లను అరువు తెచ్చుకొన్న శైలిని వదిలేసి ,స్వంత స్టైల్ ను జాతీయతను ఏర్పాటు చేసుకోమని సూచించాడు .మాటిస్సే స్వతంత్ర విధానం లోకి మారటానికి ఎక్కువ కాలం పట్టింది .పూర్వపు ప్రసిద్ధ ఆర్టిస్ట్ ల చేతలను కాపీ చేయటం మొదలు పెట్టి మ్యూజియం లలో ఉంచటానికి అమ్ముకొంటూ డబ్బు సంపాదించేవాడు .తర్వాతకాలం లో అరాచక వాది అని పించుకొన్నా ,ఎన్నడూ సంప్రదాయాన్ని నిరాకరించలేదు .తన పూర్వ ఆర్టిస్ట్ ల నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ,,తన భావ దోరణి ని వాటిలో ప్రవేశ పెడుతూ ,అకాడెమీలో నేర్చిన విషయాలను చొప్పిస్తూ ఎదిగాడు .అందుకే ఆతను ‘’నేనెప్పుడూ ఒక పాదం లావ్రే లోను,భవిష్యత్తులో సాహసాలు చేయాల్సి వస్తే ,నా’’ లంగరు ‘’ నా స్వంత ఊరులోను ఉంచుతాను ‘’అన్నాడు హెన్రి .
ఈ యాంకర్ అంటే లంగరు తాత్కాలికంగా వదిలేసి ,అనుభూతి వాదులతో (ఇంప్రెష నిస్టులు ),తర్వాత వారినీ అధిగమించి ముందుకే మున్ముందుకే దూసుకు పోయాడు .1897లో ముప్ఫై ఏళ్ళకు పెయింటర్ మొరువా ఊహించి ‘’మాటిస్సే ఏదో ఒక రోజు పెయింటింగ్ ను సరళీకృతం చేస్తాడు ‘’అని ముందే చెప్పిన మాట కొంతవరకు యదార్ద్ధమయింది . వివరంగా చెప్పాలంటే అతని లాడేసేర్టే పూర్తిగా సృజనాత్మకమైనదే .ఇది సెలూన్ డీ లా సొసైటీ నేషనేల్ వారికి కారం రాసినట్లని పించింది .ఈ మరపు రాని విషయాన్నే జెట్రూడ్ స్టెయిన్ ‘’మాటిస్సే శీతాకాలం అంతా ఒక స్త్రీ ఒక టేబుల్ ను సర్దుతూ ,దానిపై అద్భుతమైన డిష్ లో పండ్లు ‘’ఉన్న ఒక పెద్ద చిత్రాన్ని గీస్తూగడిపాడు .ఈ పళ్ళను ఎలాగైనా కొనమని తన కుటుంబం వారిని కోరాడు ఆ రోజుల్లో పారిస్ లో పళ్ళు అంటే విపరీతమైన అభి రుచి ఉండేది .మామూలు పళ్ళు అంటేనే మహా ఇష్టంగా ఉండేవారు జనం. అలాంటిది ఇంతటి అపూర్వ సృష్టి అయిన మాటిస్సే పళ్ళు అంటే మహా ముచ్చట పడ్డారు కళా ప్రియులు సామాన్యులు కూడా .ఆ ఫలాల తాజాదనాన్ని అలాగే కాపాడటానికి పెయింటింగ్ స్టూడియో లో చల్లదనం కలిపించారు ,పారిస్ వింటర్ లో అది పెద్ద అసాధ్యమైన విషయం కాదు .ఈ చిత్రాన్ని మాటిస్సే ఓవర్ కోట్ వేసుకొని ,చేతులకు గ్లోవ్స్ తో చలికాలమంతా శ్రమించి చిత్రించాడు .ఇంత కష్టమూ పడి గీసి సెలూన్ కు పంపితే తిరస్కారానికి గురైంది .అవి చాలా చీకటి రోజులు ,ఆతని ఉత్సాహం నీరుకారింది ‘’అని రాశాడు .కొత్త చిత్రాలను అమ్మి పొట్ట గడుపుకో లేక పోయాడు .శిల్పిగా జీవితం ప్రారంభించాలను కొన్నాడు .భార్య టోపీలు తయారు చేసి అమ్మి కొంత డబ్బు సంపాదించేది .
1904లో అద్భుతమైన వ్యాపార ద్రుష్టి ఉన్న సేజాన్నే లోని కళను గుర్తించి లోకానికి పరిచయం చేసిన ఆంబ్రోస్ వోలార్డ్ మాటిస్సే చిత్ర ప్రదర్హన ఏర్పాటు చేశాడు .ఆర్ధికం గా అది విజయం సాధించలేదు వోల్లర్డ్ ఒకే ఒక కాన్వాస్ ను అమ్మగాలిగాడు .దానివలన మాటిస్సే కి దక్కింది కేవలం వంద ఫ్రాంకులు మాత్రమే .కాని కొత్త తరహా ఆలోచన ,భావ వ్యక్తీకరణ,తెలివి తేటలు ఉన్న నూతన ఆర్టిస్ట్ లభించాడని అందరూ సంతోషించారు .పారిస్ లో దర్శనమిచ్చిన అనేక జపనీస్ ప్రింట్ లకు ఆకర్షితుడై వాటిని వాటి ప్రభావం నీడ లను పడనీయ కుండా తమాషాగా అనుకరించాడు .36 వ ఏట 1905లో ఇంకొక అడుగు ముందుకేసి ,కొత్త ప్రదేశం లో కాలుపెట్టాడు .యువ రాడికల్స్అనబడే వైల్డ్ బీస్ట్’’ల తో కలిసిసగం గర్వం సగం ఎదిరించే ‘’ఫావిజం ‘’పాత్ర చిత్రీకరణ ను అంగీకరించి నడిచాడు .అదంతా ఇజాల కాలం .ఫావిజం నుంచి ఇంప్రెష నిజం వచ్చింది తర్వాత పోస్ట్ ఇంప్రెషనిజం ,డివినిజం ,పాయింటి లిజం లు వచ్చి చేరాయి .దీనితర్వాత జర్మనీలో ముఖ్యంగా ఎక్స్ప్రెష నిజం వచ్చింది .ఫాచురిజం ఇటలీని ఊపేసింది .ఇంగ్లాండ్ ను వోర్టి సిజం ,ఇంగ్లాండ్ ను కట్టి పడేసింది .సర్రియలిజం అబ్ స్ట్రాక్షనిజం ప్రపంచమంతా రాజ్యమేలాయి .
ఫ్రాన్స్ లో వైల్డ్ బీస్ట్ లు వస్తు విషయం లో స్వేచ్చ తీసుకొన్నారు .వాళ్ళు వస్తువులనుకాకుండా ఆలోచనలనే (ఐడియాస్ )పెయింట్ చేశారు .మానసిక స్థితి (మూడ్ )ను వ్యక్తీకరించటానికి ఆకారాలను ఏకపక్షంగా మార్చేశారు .భావ వ్యక్తీకరణకు దట్టమైన హింసాత్మక (వయోలేంట్ )రంగుల్ని,అంతకు పూర్వం ఎవరూ కూడా వాడని వాటిని వాడారు .వీళ్ళని ప్రక్రుతిఅంటే ఏమిటో తెలియని ‘’పిచ్చోళ్ళు ‘’ దిగజారినజనం ,నేరగాళ్ళు బుద్ధిలేని నమ్మక ద్రోహులు అని గేలి చేశారు . పబ్లిక్ నుఅవమానిస్తూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ,మాన మర్యాదలు మంట గలుపుతూదేశ ద్రోహం చేస్తున్నారని వీరిపై అభియోగం మోపారు .
మాటిస్సేచేస్తున్న సరళీకరణ, రంగుల విధానం విమర్శకులకు విపరీతమైన కోపం తెప్పించింది అతన్ని అరాచకునిగా అన్ని సంప్రదాయాలను విధ్వంసం చేసేవాడిగా, దోషిగా ప్రకటించారు .’’మాటిస్సే ఒక విషం .అతడు ఆల్కహాల్ కంటే ఎక్కువ హాని చేస్తాడు .,పిచ్చితనానికి అతడు పరాకాష్ట ‘’అన్నారు .క్రమంగా అతని కీర్తి వ్యాపించాక హెన్రి మెక్ బ్రైడ్ అనేఅమెరికన్ విమర్శకుడు ‘’ఆర్టిస్ట్ గా జీవితం ప్రారంభిన సమయం లో మాటేస్సే ఉత్సాహం కోసం తననే చూసుకొని స్వేచ్చ,వ్యక్తీకరణ లకు కోసం చిన్నపిల్లల బొమ్మలేశాడు .తాను పిల్లాడు కాకపోయినా అది అవసరమనిపించి స్కూలులో బోధించే అనేక రకాల మేనరిజం ల సృజనకు తోడ్పడింది .తరువాత బేఫర్వాగా పెయింటింగ్ చేయటం నేర్చాడు .మాటిస్సేగొప్ప చిత్రాలన్నీ సంసిద్ధతను దాచి ,అభి వృద్ధి చెందే దిశలో ఉన్నట్లు అనిపిస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-19-3-16-ఉయ్యూరు
,

