ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19573-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్–3(చివరి భాగం )
ఎడ్డింగ్ టన్ఉపన్యాసాలు ఇవ్వటానికీ సిద్ధమయ్యాడు .నెమ్మదిగా మొదలు పెట్టి గంభీరంగా మాట్లాడేవాడు .దృఢమైన నోరు ,లోతైన కళ్ళు ,వాటిని సగం మూసి ఉంచే కనురెప్ప వెంట్రుకలు చూస్తీ ఈ వ్యక్తీ ప్రపంచం అంతా, ఆలోచనలతో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది .వక్తగా చూస్తే దీనికి పారడాక్స్ గా ఉంటుంది .వ్యక్తీకరణ చాలా డల్ గా ఉన్నా విషయ వివరణం సూటిగా స్పష్టంగా ఉండేది .విని ప్రేరణకు లోనవ్వాల్సిందే .రాత ,కూత తర్వాత కాలాన్ని గోల్ఫ్ ,పజిల్స్ ,డిటెక్టివ్ కధలలో గడిపాడు .కనుక పెళ్లి ఆలోచనే లేదు .ఐన్ స్టీన్ వర్క్ లోని జామెట్రీకల్ రీజనింగ్ పై ఆలోచన పెట్టాడు .దీనిలో చాలాక్లిస్టమైన ‘’కాల్క్యులస్ ‘’గణితం ఉంది .’’రిలేటివిటి దీరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ‘’లో తన సూత్రాన్ని వివరించాడు .ఫిజిక్స్ లోని నంబర్లు ‘’కాన్ స్టంట్స్ఆఫ్ నేచర్ ‘’ను పూర్తిగా ప్రేరక తార్కికత(ఇండ్యూసివ్ లాజిక్ ) తో గుర్తించి పరిష్కరించ వచ్చుఅన్నాడు .విశ్వ సత్యాలను కాంతి వేగాన్ని కాని అణువు బరువు ను బట్టికాకుండా కూడా సాధించవచ్చు .మొదట్లో ఏదో ఒక దాన్నిఅతి సరళంగా మూలంగా ఉన్న దాన్ని ఊహించి తరువాత ముందుకు వెళ్ళవచ్చు .అని చెప్పాడు .
ఉదాహరణకు మనం మూడు పరిమాణాలప్రపంచం లో లో ఉన్నామని అనుకొంటే కాలం ఉందనిభావిస్తే,విద్యుత్ కు ధన రుణ తటస్థ స్వభావాలు ఉన్నాయనుకొంటే వీటి ఆధారం గా గణిత చట్రనిర్మాణాన్ని తయారు చేయవచ్చు .ఇది చాలా సంక్లిష్టమైనది కాని కొలువదగినంత ఫలితాలనిచ్చే దానిగా చేయచ్చు .ఎలక్ట్రాన్ కంటే ప్రోటాన్ 18 40 రెట్లు బరువైనదని ఈయన సిద్ధాంతం రుజువు చేసింది .అటామిక్ ఫిజిక్స్ లోఆయన ఊహా గణిత భావనలు ప్రయోగ ఫలితాకు అతి దగ్గరగా ఉండటం గొప్ప విశేషం .ప్రోటాన్ కు ఎలెక్ట్రాన్ కు మధ్య ఒక ఊహాత్మక అటామిక్ పార్టికల్ ఉంటుందని చెప్పాడు .తరువాత పరిశోధనలో అదే’’ మీసాన్ ‘’ అని కనిపెట్టారు .ఆయన ఊహించిన అన్ని లక్షణాలు బరువు చార్జి లతో సహా దానికి ఉన్నాయి .
విశ్వం లో 204 x2to the power of 256 కణాలు ఉంటాయని చెప్పాడు .ఈ సంఖ్య 16 తర్వాత 78సున్నాల సంఖ్య కు సమానం .కాని వ్యోమగాముల గణనాల ప్రకారం విశ్వం ద్రవ్యరాశి అన్ని కణాలు కలిగి ఉండే వీలు లేదు .లెక్కల్లో ఏదో కొద్ది తేడా తప్ప ఆయన ఊహ దాదాపు యదార్ధమే .సైంటిస్ట్ లు ఆయనను మేధావి అనాలో లేక సంఖ్యల మర్మజ్ఞుడనాలో అర్ధకాక జుట్టు పీక్కున్నారు .భౌతిక స్థిరత్వాల సంఖ్యా సంబంధ యాదృచ్చికాలు ఎడ్డింగ్ టన్ ఫలితాలతో సరిపోతున్నాయని విమర్శకులు తేల్చి చెప్పారు .1944లో కేన్సర్ సోకి రెండేళ్ళు బాగా పోరాడుతూ నూతన జామెట్రీకల్ సూత్రాలను వివరిస్తూ విశ్లేషిస్తూ గడిపాడు .22-12-19 44న 62ఏళ్ళ వయసులోకేంబ్రిడ్జ్ నర్సింగ్ హోం లో చనిపోయాడు .
ఇంకా శోదిన్చాల్సినవెన్నో మిగిలే పోయాయి .యువ శాస్స్త్ర, గణిత వేత్తలు వీటిని సాధించాలి .కాని ఎడ్డింగ్ టన్ కృషి చెల్లుబాటు అవుతుందో కాదో తేల్చాల్సిన పనేమీ లేదు .ఆయన విధానాలలోనిర్ణయాలలో తప్పులు ఉండవచ్చు కాని లాజిక్ నుండి ఫలితాలు సాధించవచ్చునని ఆయన రుజువు చేసింది పూర్తీ యదార్ధం .జామెట్రికల్ రీజనింగ్ పరిధి బాగా విస్తరించి,మిశ్రమ లోహాల ,నెబ్యులాలపై మరింత విజ్ఞానం లభించింది .ఆయన కృషి పరిధి పెరిగింది .సైన్స్ పరికరాల కంటే మనిషి తార్కిక శక్తి ఎక్కువ ఫలితాలనిస్తుందని ఎడ్డింగ్ టన్ నిరూపించాడు .కాస్మలాజికల్ కాన్ స్టంట్ విశ్వ ఆవిర్భావానికి ముఖ్య దోహదకారి అయి ఉండచ్చు అని నిర్ణయించి, కస్మలాజికల్ పరిశోధనలను ఆ కాన్ స్టంట్ పాత్ర ,దాని లక్షణాల పరిశీలనపై కేంద్రీకరించాడు .వీటిని ‘’మాదేమేటికల్ దీరీ ఆఫ్ రిలేటివిటి ‘’గ్రంధం లో పొందుపరచాడు .ఈ కాన్ స్టంట్ అంటే విశ్వ స్వీయ కొలమానం ..
ఫండమెంటల్ ఫిజిక్స్ కు E numbers అనే ఆల్జీబ్రా ఆధారితమైనది ఉందని తెలుసుకోన్నట్లు చెప్పాడు .దీనినే క్లిఫోర్డ్ ఆల్జీబ్రా అన్నారు .స్పేస్ టైం ను హయ్యర్ డైమెన్షనల్ ఆకృతికి దారి తీసింది .క్వాంటం దీరీ ,రిలేటివిటి ,కాస్మాలజి ,గ్రావిటేషన్ లను కలిపి విశ్వానికి ఒక ఏక సూత్రత సాధించే ప్రయత్నం లో చివరి రోజులు గడిపాడు .
సైక్లిస్ట్ లు ఎక్కువ దూరం తొక్కే సామర్ధ్యానికి చెందిన’’ఎడ్డింగ్ టన్ నంబర్ ‘’ను కనిపెట్టాడు .ఎడ్డింగ్టన్ నంబర్ 60 అంటే ఒక సైక్లిస్ట్ సైకిల్నురోజుకు 60 మైళ్ళు 60 సార్లలో తోక్కాడని అర్ధం .62మైళ్ళు 100 కిలోమీటర్ లకు సమానం .కానీ తర్వాత లెక్కల ప్రకారం నంబర్ 62అంటే వందకిలోమీటర్లు 6 2రోజుల్లో తోక్కాడనే అర్హం కాని వందకిలోమీటర్లు వంద రోజుల్లో తోక్కాడని కాదు .1919 సూర్య గ్రహణం నాడు ఉమర్ ఖయ్యాం కవితకు పేరడీగా ఎడ్డింగ్ టన్ Oh leave the Wise our measures to collate
One thing at least is certain, LIGHT has WEIGHT,
One thing is certain, and the rest debate —
Light-rays, when near the Sun, DO NOT GO STRAIGHT.కవిత రాశాడు .
చంద్ర మండలం లో ఒక గుంటకు ,ఆస్టెరాయిడ్ 2761 కి ,ఆయన పేరు పెట్టారు .స్మిత్ ప్రైజ్, బ్రూస్ మెడల్,గోల్డ్ మెడల్ ,రాయల్ మెడల్,కింగ్ హుడ్ ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటివివి ఎన్నో పురస్కారాలు అందుకొన్నాడు .దాదాపు 15 పుస్తకాలు రాశాడు .
మన భారతీయ ఆస్ట్రో ఫిజిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్ర శేఖర్ లండన్ కేంబ్రిడ్జ్ లో చదువుతున్నప్పుడు ఎడ్డింగ్ టన్ ప్రొఫెసర్ .చంద్ర శేఖర్ ఫలితాలు బ్లాక్ హోల్స్ ఉన్నాయని తెలియ జేశాయి .ఆయన చంద్ర శేఖర్ లిమిట్ చాలా ప్రాచుర్యం పొందింది .అది భౌతికంగా అసంబద్ధమ౦ (అబ్సర్డ్ )అని కొట్టిపారేసి దాన్ని తిరస్కరించాడు తోక్కిపట్టేశాడు .పూర్తిగణితాదారిత నిర్ణయాలు యదార్ధ ప్రపంచానికి దుష్పరిణామాలు తెస్తాయన్నాడు .లేకపోతే అప్పుడే చంద్ర శేఖర్ కు నోబెల్ బహుమతి వచ్చి ఉండేది .తరువాత ఎడ్డింగ్ టన్ భావన తప్పు అని తేలింది .ప్రతిభకు పట్టిన గ్రహణం వీడింది .తరువాత ఎప్పుడో యాభై ఏళ్ళ తర్వాత ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది .ఎడ్డింగ్ టన్ అసూయా ద్రుష్టి,నిరంకుశత్వం ,పిడి వాదం, జాతి వివక్షత ఇంతపని చేసిందనిచరిత్రకారులు నిర్ధారించారు చంద్ర శేఖర్ కూడా చాలా వ్యధకు గురయ్యాడు .దీనినే నేను ‘’యాభై ఏళ్ళ ప్రతిభా ‘’చంద్ర’’ గ్రహణం ‘’పేరుతొ ఒక వ్యాసాన్ని సుమారు ఏడెనిమిదేళ్ళ క్రితం రాస్తే ‘’చినుకు ‘’మాస పత్రిక లో అచ్చయింది .
s . చంద్ర శేఖర్
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-16- ఉయ్యూరు
