కవనశర్మ

కవనశర్మ

వికీపీడియా నుండి

Jump to navigationJump to search

కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ (జ. సెప్టెంబర్ 231939) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. బెంగుళూరువిశాఖపట్నంల మధ్య తిరుగుతూ ఉంటారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు.

ఈయన రచనలలో కవనశర్మ కథలుసైన్సు నడచిన బాటవ్యంగ్య కవనాలు మరియు పరిధి ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.[1]

కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 2018 అక్టోబరు 25న మరణించాడు.

రచనలు

  1. సైన్సు నడచిన బాట
  2. సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి (అనువాదం)
  3. వ్యంగ్య కవనాలు
  4. కవనశర్మ కథలు
  5. పరిధి
  6. బంగారు రోజులు
  7. ఇరాక్ డైరీ
  8. కోతిరాతలు

కవన శర్మగారితో నా పరిచయం శ్రీ మైనేని గోపాక్రిష్ణ గారి వితరణత్వం వలన కలిగింది మచిలీ పట్నం లో కృష్ణా విశ్వ విద్యాలయం ఏర్పడ్డప్పుడు అక్కడ తెలుగు శాఖకోసం కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు కార్య దర్శి డా జివి పూర్ణ చ౦ద్గార్లు శ్రీ బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యం లో గొప్ప కృషి చేశారు 2008డిసెంబర్ లో ఉయ్యూరువాసి .,అప్పుడు  అమెరికాలో ఉంటున్న ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర వేత్త డా శ్రీ ఆరిగపూడి ప్రేంచంద్ గారిని ఉయ్యూరు ఆహ్వానించి వారికి ఘన సన్మానం చేయించే బాధ్యత నాపై పెట్టారు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు . ఆయన కోరిన విధంగా నభూతోగా కార్యక్రమం జరిపాం . దానికి ఖర్చులకోసం ఇబ్బడి ముబ్బడిగా నాకు డబ్బుపంపారు మైనేనిగారు  సభ జరుగుతుండగానే వారికి ఫోన్ చేసి 20వేల రూపాయలు ఆయన పంపిన దానిలో మిగుల్తున్నాయని ,కొత్తగా ఏర్పడిన కృష్ణా యూని వర్సిటికి,దానిని ఆయన పేరిట విరాళంగా అంద జేస్తే బాగుంటుందని చిన్న సూచన చేశా. క్షణం ఆలోచించకుండా  ”మంచి ఆలోచన వేదికపై ప్రకటించండి” అనటం, నేను ప్రకటి౦చేయటం జరిగి పోయింది.  వేదికపై గుత్తికొండ .,పూర్ణ చ౦ద్   విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గార్లు కూడా ఉన్నారు
  ఈ డబ్బును 2009ఫిబ్రవరి 10న బందరు బందరు కృష్ణా  యూని వర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమం లో నేను గుత్తికొండ వారి ఆలోచన మేరకు వైస్ చాన్సలర్ శ్రీ మైనేని కేశవ దుర్గా ప్రసాద్ ,గారికి వేదికపై ఉన్న బుద్ధ ప్రసాద్ గారి సమక్షం లో డ్రాఫ్ట్ రూపం లో అందజేశాను
 ఆ రోజు భోజన విరామ సమయం లో మాతోపాటు భోజనం చేస్తున్న కవన శర్మ గారు పరిచయమయ్యారు  భేషజం లేకుండా చాలా సరదాగా మాట్లాడారు నాతో . ఆయన రచనలు అప్పటికే చాలా చదివి ఆయనపై మంచి అభిప్రాయంఏర్పరచుకొన్నాను . అక్కడికి ఆ కధ. సమాప్తం .
  కొన్నేళ్ళతర్వాత అంటే సుమారు రెండేళ్ళ క్రితం మైనేనిగారు ”రచన ”మాసపత్రికకు నా పేర రెండేళ్ళచందా కట్టి నాకు తెలియజేశారు . పత్రిక ప్రతినెలా వస్తూనే ఉంది.  అందులో కవన శర్మగారి జ్ఞాపక శకలాలు నన్ను బాగా ఆకర్షించాయి  వాటిలో  ముఖ్యంగా కేరెక్టర్ యాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు .. డైరెక్టర్ కేవిరావు ,అలాగే రాజమండ్రి విశాఖ లోని కొందరు సాహితీ పరులపై రాసినవి బాగా నచ్చి ఆయన మెయిల్ అడ్రస్ కు ,రచన సంపాదకుడు సాయిగారికి మెయిల్స్ రాశాను. శర్మగారు ఎప్పటికప్పుడు వెంటనే జవాబు రాస్తూ తమ సౌజన్యాన్ని చూపారు.  కొన్ని మెయిల్స్ రచనలో లో కూడా ప్రచురితమయ్యాయి  ఇలా మళ్ళీ కవన శర్మ గారితో కలం స్నేహం చేసే అదృష్టం కూడా మైనేనిగారి వల్లనే నాకు దక్కింది .
  కారామాస్టారు శ్రీకాకుళం లో ఏర్పరచిన ”కధానిలయం ”కు శర్మగారు  సలహాదారు కూడా .మాస్టారి పై గొప్ప గౌరవమున్నవారుశర్మగారు. ఈ కధానిలయం కు సరసభారతి ద్వారా 15వేలరూపాయలు విరాళం పంపించిన ఉదార హృదయం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిది అని ఈ సందర్భంగా తెలియ జేస్తున్నాను ..
  కవన శర్మ అనే శ్రీ కందుల వరాహ నరసింహ శర్మ గారి నిర్యాణం సాహితీ లోకానికి ,ముఖ్యంగా ఆలోచనా పరులైన వారికి అందరికీ తీరని లోటు . వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ఊరట కలగాలని .,కోరుతున్నాను -దుర్గాప్రసాద్
image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.