భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు

భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు

 

ఆధారం –మా అమ్మాయి శ్రీమతి విలయలక్ష్మి అమెరికా నుంచిపంపిన  కుర్తాళం పీఠాదిపతి శ్రీ ప్రసాద రాయకులపతి వారి వీడియో –యుట్యూబ్

‘’భూమిలో ఇప్పటికీ లోకాలున్నాయని ,పట్టణాలున్నాయని అనేకమంది నమ్ముతున్నారు ఇప్పటికీ .హిమాలయ సిద్దాయోగులు భూమిగుండా వెళ్లి ఆలోకాలను దర్శిస్తారని నమ్మకం .1947ప్రాంతం లో అమెరికాయుద్ధ విమాన అధికారి అడ్మిరల్ బర్డ్ ఆర్కిటిక్ పర్వతప్రాంతం దగ్గరకు ఒక రౌండ్ తిరిగి మళ్ళీతిరిగి వచ్చేద్దామని చిన్న విమానం లో బయల్దేరి వెళ్ళాడు .ఒక చోట కాసేపు ఆగాడు .ఇంజన్ చెడిపోయింది. బాగు చేయటానికి చలాప్రయత్నించాడుకాని బాగు కాలేదు .ఆహరం లేదు అలసిపోయాడు .ఏం చేయటానికి తోచలేదు .ఇంతలో ఒకపెద్ద మంచు పెళ్ల ను పైకి లేపుకొని ఒకమనిషి బయటికి వచ్చి ‘’బర్డ్ !రా నాతొ రా ‘’అని పిలిచాడు ఆశ్చర్యపోయి చూశాడు అడ్మిరల్ బర్డ్ .సరే అని దగ్గరకు వెళ్ళాడు .ఆ మనిషి ‘’నీ విమానం చెడిపోయింది . బాగు కాలేదు చాలా ఆకలి, దాహంతో బాధ పడుతున్నావని నాకు తెలుసు నాతో రా .ఆహరం తీసుకొని కాసేపు విశ్రాంతిపొందుదువుగాని రా ‘’అని తనతో పాటు పెద్ద భూ గృహం లోకి తీసుకు వెళ్ళాడు .అక్కడినుంచి మరికొంచెం లోపలి వెడితే ,అక్కడ చాలామంది మనుషులులు కనిపించారు .అక్కడ ఆగి ‘’నువ్వు ముందు గా ఆహారం తీసుకో ‘’అన్నాడు ఆ కొత్తాయన ‘’’అసలు మీ రెవరు బాబూ ‘’?అని బ్రహ్మానందం లాగా ప్రశ్నించాడు .’’అవన్నీ తర్వాత చెబుతాను’’అని చెప్పి ఒక ఆకుపచ్చటి ద్రవం తాగటానికి ఇచ్చాడు .దాన్ని తాగాడు ఆకలి పూర్తిగా తీరిపోయింది .’’అసలు మీ రెవరు స్వామీ !భూమిలో ఇలాంటి ప్రదేశాలున్నాయని నేను వినలేదు కనలేదు ఆశ్చర్యంగా ఉంది ఎవరు మీరు ఇదేమిటి అంతా’’?అని మళ్ళీ అడిగాడు .

  అప్పుడు ఆ ఆగంతకుడు బర్డ్ తో ‘’ఇది భూలోకలోకం .ఇక్కడ అనేక  వందల ,వేల సంవత్సరాల వయసున్న మనుషులున్నారు . భారత దేశం లో హిమాలయ ప్రాంతం లో ‘’శంబల ‘’అనే గ్రామంలో  పరమేశ్వరుడైన నారాయణ దేవుడు ఉంటాడు .ఆయన అధీనం లో మేమందరం ఉంటాం .భూమిలో అనేక ప్రదేశాలలో ఇలాంటి పట్టణాలున్నాయి .లోపల కొన్ని వేలనుంచి లక్షలమందిదాకా జనం ఉంటారు .మేమందరం భూ ప్రపంచం లో ఉన్న సకల మానవాళి సుఖ సంతోష శాంతం తో ఉండాలని  ఎప్పుడూ కోరుకొంటాం .కానీ మీరేమో హైడ్రోజన్ ఆటం బాంబులు వేసి మానవుల్ని  చంపేస్తున్నారు  .అలాంటి మానవ హననం చేయవద్దని నీకు చెప్పటానికే ఇక్కడికి మేము నిన్ను పిలిపించాం .నువ్వు వెళ్లి మీ వాళ్లకు నచ్చ చెప్పు ‘’అన్నాడు .’’నేను చెబితే ఎవరు వింటారు ?నేనొక చిన్న అధికారిని .నా మాటకు విలువ యిస్తారనుకోను ‘’అన్నాడు బర్డ్ సౌమ్యంగా .’’కాదు .నువ్వు ఇక్కడ చూసింది,విన్నదీ పూర్తిగా వివరించి మీ వాళ్లకు మా మాటగా  చెప్పు.నీ విమానం బాగైంది .నువ్వు నిక్షేపంలా నీ ప్రయాణ౦ సాగించవచ్చు వెళ్లిరా ‘’అని చెప్పి పంపించారు .

   విమానం ఎక్కి ఆర్మీ అధికారులను చూడటానికి వెడితే వాళ్ళు ‘’ఏమిటి ఎక్కడున్నావ్ ఇంతాలస్యం చేశావేమిటి ‘’అని ప్రశ్నల వర్షం కురిపించారు .అప్పుడు బర్డ్ వారికి తాను  చూసిన, విన్న విశేషాలన్నీ వివరించాడు .వాళ్ళు విపరీతంగా నవ్వి ‘’లైట్ తీసుకొని ‘’ట్రాష్ .ఈమాటలు ఎక్కడైనా చెబితే నువ్వు వెర్రి బాగులవాడివని తాటాకులు కడతారు. నిన్నెవ్వరూ నమ్మరు ‘’అన్నారు ఆర్మీ ఆఫీసర్ .అతడు ‘’నమ్మినా నమ్మకపోయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ విశేషాలన్నీలోకానికి వెల్లడిస్తాను ‘’అన్నాడు బర్డ్ . ‘’ఇది ఆర్మీ డిసిప్లిన్ కు చెందిన విషయం .నీకు అనుమతినివ్వం ‘’అన్నారు ఆఫీసర్లు .తనమనసులోనే ఇవన్నీ భద్రంగా దాచుకొని బర్డ్ తాను  రిటైర్ అయ్యాక ఈ కథనం అంతా లోకానికి ఎలు గెత్తి చాటాడు . ఇంగ్లీష్ లో గోప్పరచయిత అయినయునేస్కేల్ తో కలిసి తన అనుభావాలన్నిటినీ రాసి ఒకపుస్తకం గా ప్రచురించాడు బర్డ్ .అది ఇంటర్నెట్ లో ‘’అగర్తా ‘’అనే పేరుతో అందరికీ లభ్యంగా ఉంది .అందులో ఫోటోలు విశేషాలు అన్నీ చాలా వివరంగా ఉన్నాయి .

 పాతాళంలోకి వెళ్ళే మార్గాలున్నాయి ప్రపంచం లో చాలా చోట్ల . పాతాళం లో చాలామంది మహానుభావులున్నారు .వారు భూమిపైకి వచ్చి లోకోద్ధారణ చేస్తుంటారు .ఇలాంటి వారితో సన్నిహిత సంబంధమున్న మనుషులున్నారు భూమిపైన .రష్యాలో కూడా ఇలాంటి కాంటాక్ట్ లున్న వ్యక్తులున్నారు .ఇతర చోట్లకూడా ఉన్నారు .అమెరికాలోని కొలరాడో లో డెన్వర్ దగ్గర ఉన్న గుహలలో నుంచి ఆలోకాలకు  వెళ్ళటానికి మార్గాలున్నాయి .అక్కడ జ్వాలా కూల్ అనే సిద్ధపురుషుడు న్నాడు . ఆయనకు సుమారు అయిదు వేలసంవత్సరాలవయసు ఉంటుంది .హిమాలయప్రాంతాలలో చాలాచోట్ల పాతాళం లోకి వెళ్ళే మార్గాలున్నాయి. కాశీలో,శ్రీశైలం లో కూడా ఉన్నాయి .

  కొద్దికాలం క్రితం ఫ్రాన్స్ లో సోఫియా అనే అమ్మాయి కి ఒక హిందూ యోగి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు .ఆమంత్రాన్ని దీక్షగా జపం చేసింది .ఒక రోజు ఆమె మనో భూమిక అంటే మెంటల్ ప్లేన్ లో ఆమెకు ఒక మెసేజ్ వినిపించింది . .అందులో ‘’కం టు హిమాలయాస్ –హిమాలయాలకు రా ,సిద్దాశ్రమానికి రా ‘’అని వినిపిచింది.వెంటనే ఇండియాకు బయల్దేరి వచ్చి గంగోత్రి యమునోత్రి వగైరాలను ఒక గైడ్  సాయంతో సందర్శించింది .పదిరోజుల తర్వాత మళ్ళీ ఆమెకు ‘’నీతోఎవరూ రాకూడదు వచ్చినవారిని వెనక్కి పంపించు  ‘’అనే మెసేజ్ వచ్చింది.తనతో ఉన్నవారిని వెనక్కి ప౦పేసి ఒక్కతే ముందుకు సాగింది . మంచు విపరీతంగా కురుస్తోంది. దారి కనపడటం లేదు .వచ్చినదోవకూడా కనిపించలేదు .బాగా అలసిపోయి ‘’నేను చాలాలసిపోయాను .నన్ను ఇక్కడికి పిలిపించిన సిద్ధయోగులు, మహానుభావులు నాకు సహాయం చేయకపోతే ఇక్కడే కుప్పకూలిపోతాను ‘’అన్నది సోఫియా .

  ఇంతలో ఆవులమందలు  దూడలతో మెడలో చిరుగంటల నాదం తో అక్కడికి వచ్చాయి .వాటితో సుమారు పన్నెండేళ్ళ బాలుడు మురళి చేతిలో పట్టుకొని వస్తున్నట్లు చూసింది .అతడితో ‘’నాయనా !నేను సిద్దాశ్రమానికి వెళ్ళాలి .దారి తెలియటం లేదు .నాకు సహాయంచేసి దారి చూపిచేర్పిస్తావా ?’’అని అడిగింది .ఆ గోపకుమారుడు ‘’నేను అందుకే వచ్చాను నా చెయ్యి పట్టుకొని భయం లేకుండా రా ‘’అన్నాడు .అతడి చెయ్యిపట్టుకోని నడిచింది .ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి. గాలిలో తేలిపోతున్నట్లని పించింది .ఎంతదూరం వెళ్లిందో తెలీదు .ఆకుర్రాడు ‘’ఇంక కళ్ళు తెరువు .’’అన్నాడు.కళ్ళు తెరిచి చూస్తే చిన్న దేవాలయ గోపురం కనిపించింది ‘’అది  నీ ఇస్ట దేవత లలితా దేవి ఆలయం .వెళ్ళు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .

  సోఫియా నెమ్మదిగా ఆ దేవాలయంలోకి వెళ్ళింది .అక్కడ ఆరు అడుగుల ఎత్తున స్పటిక మేరువు అంటే అమ్మవారి విగ్రహాలు పెట్టే పీఠం నుంచి శక్తి తరంగాలు రావటం గమని౦చింది .కళ్ళుమూసుకొని ధ్యానం చేసింది .ఇంతలో ఎవరో వచ్చి ‘’అమ్మా !ఒక సమావేశం జరుగుతోంది ‘’అని చెప్పి తీసుకు వెళ్ళాడు .అక్కడ ఒక వేదికపై ఒక యోగి కూర్చుని యోగ శాస్త్ర రహస్యాలు బోధిస్తున్నాడు .కాసేపటికి సమావేశం పూర్తయింది .ఆమెను తన కుటీరానికి తీసుకు వెళ్ళాడు .అతడిని ఆమె ‘’యోగ శాస్త్ర రహస్యాలు చెప్పిన ఆయోగి ఎవరు .పాతిక ఏళ్ళు దాటి వయసు ఉన్నట్లు కనిపించదు ‘’అని అడిగింది  .అప్పుడతడు ‘’అమ్మా ఆయనవయసు 112సంవత్సరాలు .ఆయనకు ముసలితనం రాదు .ఎప్పుడూ ఇలాగే కనిపిస్తాడు. ఎక్కడివాడో ఎవరికీ తెలియదు .ఆయన్ను జనకమహారాజు అని పిలుస్తాం . .ఆయన కుర్తాలం నుంచి వచ్చాడు. అదెక్కడో మాకు తెలీదు .’’అన్నాడు .మూడు రోజుల ఆతర్వాత ఆమెను పంపిస్తూ ‘’అమ్మా ఇక్కడ వందల వేల సంవత్సరాలవయసున్నయోగులు ఎందరో సిద్ధాశ్రమం లో ఉన్నారు  .మళ్ళీ నీకు సమాచారం-మెసేజ్  వచ్చినప్పుడు ఇక్కడికి రా ‘’అని వీడ్కోలు పలికాడు .

 సోఫియా తనదేశం వెళ్లి ఈ అనుభవాలన్నీ ఒక గ్రంథంగా రాసిప్రచురించింది .నేను (కులపతిగారు )అమెరికాలోని బోస్టన్ లో ఉన్నప్పుడు ఒకతను నాదగ్గరకొచ్చి ‘’కుర్తాలం ఎక్కడుంది ?’’అని అడిగితే నేను ‘’నీకెందుకు ?’’అన్నాను .దానికతడు ‘’నేనొక పుస్తకం లో కుర్తాలం స్వామి హిమాలయాలలో ఉండగా తానూ చూసినట్లు రచయిత్రి రాసింది .దాన్ని నేను  ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాను .కనుక కుర్తాలం విషయాలు పూర్తిగా తెలుసుకోవటానికి మీ దగ్గరకొచ్చాను ‘’అన్నాడు  .అప్పుడునేను ‘1879లో ఆయన కుర్తాలం అనే చిన్న గ్రామం లో ఒక జమీందారుకు పుట్టాడు .అతడిజాతకం వేసిన పురోహితుడు అకుర్రాడు సన్యాసి అవుతాడు అని చెప్పాడు.ఆజమీ౦దారు  ‘’మాకు సన్యాసి ఎందుకు? .మాకు వేలఎకరాల భూమి .అంతులేని  సంపద ,ధనం ఉన్నాయి వాటిని  చూసుకోనేవాడుకావాలికానీ’’ అన్నాడు .’’నేను జాతకం లో ఉన్నది చెప్పా అంతకంటే నాకు తెలీదు ‘’అన్నాడు పురోహితుడు . ఆబాలుడు క్రమ౦గా పెరిగి స్కూలు కాలేజీ చదువులు పూర్తి చేసి ఒకసారి అరవిందాశ్రమం వెళ్ళాడు .అక్కడి మదర్ బాగా ఆదరించి’’,చదువుమానేసి హిమాలయాలకు  వెళ్ళిపో ‘’  అని హితవు చెప్పింది .అలాగే వెళ్లి తపోధ్యానాలు చేసి సిద్దుడై హిమాలయాల్లో గుహలో ఉన్నాడు .ఆయననే ఆ ఫ్రెంచ్ రచయిత్రి సోఫియా హిమాలయాల్లో చూసింది ‘’అని చెప్పారు కుర్తాలం స్వామి ప్రసాదరాయ కులపతి .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-8-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.