తిరుపతి వెంకటాద్రి రాముడు-2

తిరుపతి వెంకటాద్రి రాముడు-2
శ్రీ కోదండ రామాలయం రెండవ ప్రాకారం పై వరాహ ,ఖడ్గ ,గోడలపై సూర్యుడు ఉండటాన్నిబట్టి దీన్ని కృష్ణ దేవరాయలు కట్టించాడని భావిస్తారు .మొదటిప్రాకారం పై ఉన్న మత్శ్యాలు గమనిస్తే పల్లవులు కట్టించినట్లు అనిపిస్తుంది .టిటిడి వారి వెబ్ సైట్ లో ఆలయం 10వ శతాబ్ది చోళరాజులు కట్టినట్లు ఉంది .
ఆలయ ప్రధాన గోపురం పడమటి ద్వారం కలిగి తూర్పు ఉత్తర దక్షిణ మాడ వీధులమధ్యచాలా విశాలం గా ఉంది .ఎదురుగా భక్తాన్జనేయస్వామి ఆలయం దక్షిణ మాడ వీధిలో స్వామివారి రధం ఉన్నాయి .మూడు ప్రాకారాల ఆలయం .మొదటిది దీర్ఘ చతురశ్రంగా ,పైమూలలావు గరుత్మంతుని విగ్రహాలు నమస్కార భంగిమలో ఉన్నాయి ..పడమట ఆలయ ద్వారం ఉంది ప్రాకారాన్ని ఆనుకొని ఉద్యానవనం ఉంది .ఆగ్నేయం లో వంటశాల రెండవ ప్రాకారం లో స్వామి వారి ఆస్థాన ముఖ మండపాలు ,మూడులోగర్భాలయం శయన మందిరాలున్నాయి .తిరుమలలో లాగా ఇక్కడా నిత్యపూజలో పంచ కుబేర మూర్తులున్నాయి .ఏకాంత సేవకు కృష్ణుడి విగ్రహం ఉంది .తిరుమల హాదీరాం బావాజీ వెండిపడి కావలి గోపురానికి అంటే సీతారామ గోపురానికి ,ఈ గోపురానికి ఏదో సంబంధం ఉన్నట్లని పిస్తుంది ,.ఆ గోపురం కిందభాగాన శ్రీ సీతారామ పట్టాభిషేకం దృశ్యం శిల్పంగా చెక్కబడింది .తిరుపతి పట్టణం మధ్య ఇంత విశాల ప్రశాంత వాతావరణం ఉన్న దేవాలయం ఉండటం మహాద్భుతం .
సామాన్య ఆలయ గోపుర కలశాలు3,5,7,11 ఉంటాయి ఈ ఆలయానికి 7కలశాలుండటం సప్తగిరులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది .ఈఆలయ ధ్వజ స్తంభం బలిపీఠం తిరుమలో లాగానే ఉంటాయి .ఇక్కడి బలిపీఠం బంగారు తొడుగుతో మహా సుందరంగా ఉంటుంది .ధ్వజానికి కింద స్వామికి ఎదురుగా గరుడ ,దక్షిణం లో శ౦కు చక్ర గదా ,మరోప్రక్క ఆంజనేయస్వామి చెక్కబడ్డాయి .ధ్వజానికి 70ఏళ్ల క్రితం బంగారు తొడుగు వేయించారు .ధ్వజం ఏర్పడిన బిందువు నుంచి ప్రాకారానికి సరళ రేఖ గీస్తే ,అది స్వామికి ఎదురుగా అచ్చం తిరుమలలో లాగానే ఉండటం,ప్రాకారం రెండు సమానభాగాలుగా విభజించటం విశేషం .ఇక్కడి అశ్వత్ద వృక్షం సుమారు 150ఏళ్లనాటిది .దీని ప్రదక్షణం సంతాన ప్రాప్తికి నిదర్శనం .
ఇక్కడి ఆస్థాన మండపం తిరుమల గరుదడాల్వార్ మండపం లాగానే ఉంటుంది .ఆస్థాన సేవకు అరుగుకూడా ఉంది .భక్తులు కోదండరాముని దర్శించి ‘’హి భగవాన్ బాలాజీ ‘’అనేవారట .విష్వక్సేన ఆలయం లో పెద్ద విగ్రహం ఉంది .ఇక్కడి విఘ్నేశ్వరుడు కాణిపాక వినాయకుని గుర్తుకు తెస్తాడు .ఇక్కడి రుషి విగ్రహాలు రాజర్షులు లాగా ఉంటారు .ఇక్కడి స్తంభాలు 18 భారతపర్వాలను భాగవత స్కందాలను గుర్తుకు తెస్తాయి.
శ్రీరామ భంగిమను ‘’త్రిభంగి మధురాకృతి’’అంటారు .ఆయన కోదండం లో 7గంటలు,ఏడుకొండలకు ప్రతీక .రాముడు , వేంకటేశ్వరుడు ఒక్కరే అని చెప్పటం కూడా .స్వామి కేశాలకు వెనక రాజ ముడి ఉంటుంది .ఎడమ చేయి భుజానికి ఆనించి ధనుస్సును పట్టుకొన్నట్లు ఉంటుంది .ధనుస్సు భుజం వరకే చెక్కబడింది.కుడి చేయి కిందకు పక్కకు తిరిగ బాణం ధరించినట్లు ఉంటుందికాని ఇక్కడ బాణం లేదు .దీన్ని జ్ఞానముద్ర అంటారు .కోదండం లేకుండా కోదండ రాముడు ఏమిటి అని అనుమానం వస్తుంది .కోదండం అంటే దేని చేత క్రీడింప బడుతుందో అది .రాముడు బాణ ప్రయోగం చేస్తున్నట్లు ఎవరికీ తెలియదు .28మహాయుగాలలో ద్వాపరయుగం లో పుట్టిన అర్జునుడు కూడా ఇలాంటి శక్తికలవాడు .ఈ మన్వంతరం లో 24వామహాయుగం లో త్రేతాయుగం లో జన్మించిన శ్రీ రాముడీకే’’కోదండ రాముడు అనిపేరు .బాణాన్ని లస్తకం వింటి మధ్యభాగం ఎడమ చేతి పిడికిలి తోపట్టుకొనే చోటును ప్రదరం అంటారు .రాముడికి లస్తకం తో పని లేదు .చాపం మొదలు చివర ,ధనుస్సు చివర మొదలు లలో ఏభాగమైనా ఆయనకు లస్తకమే .ఆయన బాణప్రయోగాబ్ది అంటే బాణాలు ప్రయోగించటం లో సముద్రుడు .విల్లు ఎలా ఉన్నా బాణం దూసుకు పోతుంది విల్లా తానా ఎవరు ముఖ్యం అంటే ఆయనే ముఖ్యం ..మరి విల్లు ఎందుకు ? విలుకాడు అని చెప్పుకోవటానికే .కాకాసురినిపై గడ్డిపరక ప్రయోగించాడు .కోదండ రాముడు అని పించుకోవటానికి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.