నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారి జీవిత చరిత్ర చదివాను .వారు మెహబూబ్ నగర్ ప్రాంతం వారని జ్ఞాపకం ,అందులో వారు తాను సంస్కృత కావ్యాలను చదువుకోవాలనే ధ్యేయం తో కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గర ఉన్న చిరివాడ అగ్రహారం లో ఉన్న శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద శిష్యులై వారిఇంట్లో నే ఉంటూ వారి గురుత్వం లో అభ్యసించి ఇంతటి వాడినయ్యానని శాస్త్రి గారి వైదుష్యానికి ఎల్లలు లేవని గురుపత్ని అపర అన్నపూర్ణ అని రాశారు .ఆ తర్వాత శర్మ గారు అలంపురం విశేషాలను ,అక్కడి పురాతన వస్తువులు శ్రీశైలం డాం నిర్మాణం లో మునిగి పోతున్న విషయాలను గురించి రాసి అక్కడి మహా శక్తి పీఠం అయిన జోగులాంబ దేవాలయ వైభవాలను చారిత్రిక నిర్మాణాలను కాపాడే బాధ్యతా తానూ ఎలా తీసుకొని  ఆ పురాసంపదను ఎలా కాపాడినదీ వివరించారు తుంగ భద్రా కృష్ణా సంగమం వలన ఆలయం మునిగిపోకుండా ,పురా సంపద చిద్రం కాకుండా నదిలోగోడకట్టించి కాపాడిన వైనం అంతా ఒక డాక్యుమెంటరీ చిత్రం చూస్తున్న అనుభూతి కలిగేట్లు రాసిన తీరు చదివి వారి పాండిత్య ప్రకర్షకు వైదిక సంప్రదాయ నిబద్ధతకు ఆశ్చర్య పోయాను .అది గొ అప్పుడే నాకు అలంపురం గురించి ,అమ్మవారి గురించి తెలిసింది .అప్పటి నుంచి వెళ్లి సందర్శించాలన్న తహతహ పెరిగి పోయింది .అంత దూరం వెళ్ళాల్సిన పని ఉంటేకదా వెళ్లి చూసేది  .ఆ పని రాలేదు,సందర్భమూ కలగ లేదు  .ఇదిగో ఇప్పుడు’’ బీచుపల్లి రాయుడి దర్శనం’’ తో అనుగ్రహం తో  దానికి సుమారు 40 కిలో మీటర్ల దూరం లోనే అలంపురం ఉందని మా అబ్బాయి చెబితే, కారును అల౦పురానికి పోనిమ్మన్నాను మా మనవడు మనవ రాలు గొణుగుతున్నా,తిండి తిన్న వెంటనే బయల్దేరి మధ్యాహ్నం 12 -30 కి అలంపురం చేరాం .కర్నూలు హై వేకి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో సింగిల్ రోడ్ పై అలంపురం చేరాం .హై వే నుంచి కర్నూలు కేవలం 14 కిలో మీటర్లే . ఇన్నేళ్ళకు అలంపురం చూసే అదృష్టం కృష్ణ వేణీ పుష్కరం కలిగించింది .

ఆలంపుర క్షేత్ర వైభవం

ఒక్క జోగులాంబ అమ్మవారిని దర్శించాలంటే ఒక దారి ,కృష్ణా తుంగ భద్రా సంగమ ఘాట్ లలో స్నానం చేయాలంటే మరో దారి ఉంది .అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సర్క్యులర్ రోడ్ లాగా ఉంటుంది .మేము సరాసరి అమ్మవారి దర్శనానికే వెళ్లాలని అనుకొన్నాం .గుడికి దూరంగా కారు పార్క్ చేయాలని కాంట్రాక్టర్లు ‘’కిరి కిరి ‘’చేసినా మేము దాదాపు గుడి సమీపం దాకా వెళ్లి అక్కడే పార్క్ చేసి నడక శ్రమ తగ్గించు కొన్నాం .ఇక్కడ కూడా యే రకమైన సూచనలు ఇచ్చేవారుకాని దారి చూపే బోర్డ్ లు కాని లేవు .’’అడుక్కుంటూ ‘’వెళ్ళాల్సిందే అలానే వెళ్లాం .ముందుగా అక్కడున్న నవ బ్రహ్మాలయాలు చూశాం .తర్వాత శ్రీ బాల బ్రహ్మేశ్వర ఆలయమూ దర్షించాము .వీటిల్లో ఎక్కడా ‘’పూజార్ల దర్శనం’’ కాలేదు మాకు .తలుపులు తీసే ఉండటం తో స్వాముల దర్శనమే లభించింది .పేర్లు తేడా కాని అన్నీశివ లింగాలే .ఒకప్పుడు ఇది వీర శైవానికి కేంద్రం .బసవన మంత్రి ప్రభావం తో వీర శైవం  ఇక్కడ విజ్రు౦భిం చింది .కూడలి సంగమేశ్వరం లో సంగమేశ్వర స్వామి దర్శనం సకల పాపహరం .కృష్ణా తుంగ భద్రా నదుల్లో పవిత్ర స్నానాలు ,శివ మహాదేవుని దర్శనం ఒళ్ళు పులకరించే విశేషాలు .అలంపురం ఒకప్పుడు ప్రసిద్ధ విద్యాపీఠం గా ప్రసిద్ధి చెందింది ఇందులోని స్థానాది పతులు అందరూ మహావిద్వాంసులు .దాన శాసనాలలో చాలామంది కాలాముఖ శివా చార్యుల పేర్లు ఉన్నాయి .అందులో ‘’బ్రహ్మ రాసి పండిత ,వితరణే౦ద్రరాసి ,భువన శకిత పండిత ,సోమేశ్వర రాసి ,త్రిలోచనముని నాద,లోకాభరణ పండిత ,ఈశాన రాసి ,విద్యా రాసి ‘’మొదలైన పేర్లు శాసనాలలో తరచుగా కనిపిస్తాయి .కొందరు మంత్రులు విద్యాలయాలకు భూరి దానాలు చేసినట్లు ఉంది .ఆనాటి దేవాలయాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి .

జోగు లాంబ సందర్శనం

అమ్మవారి ఆలయం కిట కిట లాడుతోంది భక్త జన సందోహం తో .పెద్ద క్యూలున్నాయి .ఉచిత  దర్శనమే .మధ్యాహ్నం 1 గంటకు చేరిన వాళ్ళం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచచ్చేసరికి మధ్యాహ్నం 3 గంట లయింది .అయితేనేం మహా వైభవ దర్శనం లభించింది .అమ్మవారిని కనులారా దర్శించే అదృష్టం కలిగింది .సర్వాలంకార శోభితయై అమ్మవారు నయనానందకరం చేసింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాను .జన్మ ధన్యం, చరితార్ధం అయింది .పాతికేళ్ళ తహ తహ తీరి ఉపశమనం కలిగింది .అమ్మవారి అసలు పేరు ‘’యోగాంబ’’అదే కాల క్రమం లో జోగులాంబ అయింది .సతీదేవి శరీరాన్ని విష్ణు మూర్తి చక్రాయుధం తో 18ముక్కలు చేస్తే అవి పడిన ప్రతి చోటూ శక్తి క్షేత్రం అయింది అని మనకు తెలుసు సతీదేవి పై’’ పెదవి దంతాలు’’ ఇక్కడ పడటం వలన ఇది శక్తి క్షేత్రమై అయిదవ శక్తి క్షేత్రంగా ప్రాధ్యాన్యం పొందింది .ముసల్మానుల  దండ యాత్రలో పురాతన ఆలయం 1390 లో విధ్వంసం కాగా ,615 సంవత్సరాల తర్వాత అమ్మవారి ఆజ్ఞాను సారం ఆమెకు పాత ఆలయం ఉన్న చోటు ననే వాస్తు ప్రకారం పునర్నిర్మించి పాక్షికంగా ధ్వంసమైన అమ్మవారి పాత విగ్రహాన్నే ప్రతిష్టించారు  .అప్పటి దాకా అమ్మవారి విగ్రహాన్ని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో చిన్న గుడిలో ఉంచి పూజించారు 9 వ శతాబ్దం లో జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి ఇక్కడికొచ్చి అమ్మవారి దర్శనం చేసి ,అమ్మవారి భయంకర రూపాన్ని శాంతింప జేయటానికి శ్రీ చక్రం ను ప్రతిష్టించారు .విజయ నగర రాజు రెండవ హరి హర రాయల కుమారుడు మొదటి దేవరాయలు తండ్రి ఆజ్ఞపై ఇక్కడికి వచ్చి ముస్లిం సేనలతో యుద్ధం చేసి ఓడించి తరిమేసి ఆలయాన్ని కాపాడినట్లు చారిత్రకాధారం ఉంది .ఈసంఘటన 1390లో జరిగింది.ఆలయం చుట్టూ జలకుండం ,మధ్యలో దేవాలయం ,మండప స్తంభాలమీద  అష్టాదశ మహా శక్తుల మూర్తులు చెక్కబడి ఉన్నాయి .ముఖ మండప పైకప్పు బండలకు నాగం ,పద్మం తీర్చ బడ్డాయి .మిగతా దేవాలయాల్లోనూ ఈ చిత్రాలు ఉన్నాయి .నాగం మన శరీరం లోని మూలాధార చక్ర౦ లోని కుండలినీ శక్తి కి  ప్రతీక .పద్మం శిరసులోని సహస్రారంకు గుర్తు అని గ్రహించాలి .ఈ రహస్యం తెలుసు కొని అమ్మవారిని దర్శిస్తే పరమ వైభోగమే .

నవ బ్రహ్మాలయాలు

దక్షిణ కాశి అని ఆలంపూర క్షేత్రానికి పేరు .నవ బ్రహ్మేశ్వర తీర్ధం అనీ పిలుస్తారు శ్రీశైలాని అలంపురం పశ్చిమ ద్వారం అంటారు .శైవులకు మహా ఆరాధనీయ క్షేత్రం .నల్లమల కొండలలో వెలసిన బాలబ్రహ్మ ,జోగులాంబ దేవి ఆలయాలు నిరంతర౦ భక్తులతో కళకళ లాడుతాయి .తుంగ భద్ర నదికి పడమటి ఒడ్డున ఆలంపూర క్షేత్రం ఉంది .ఈ ప్రాంతం పూర్వం శాతవాహన ఇక్ష్వాకుల బాదామి చాళుక్యుల ,రాష్ట్ర కూటుల ,కల్యాణి చాళుక్యుల కాకతీయుల ,విజయనగరరాజుల ,గోల్కొండ కుతుబ్ షాహీ ల   ఏలుబడిలో ఉండేది .అల౦ పురం పూర్వపు పేరు హలం పురం ,హమలా పురం .ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుని క్రీ శ1101 నాటి శాసనం లో ‘’హటంపుర ‘’అని పేర్కొన బడింది .ఇక్కడి నవబ్రహ్మాలయాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు .ఆలయాలన్నీ ఎర్ర రాతి నిర్మాణాలే .భారతీయ పురాతత్వ శాఖ ఆలంపూర ఆలయాలను జాతీయ సంపదగా గుర్తించి రక్షిస్తోంది .శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం లో ఈఆలయ సముదాయాలు పురాతన వైభవ చిహ్నాలు మునిగి పోకుండా ఎత్తైన ప్రదేశం లో మ్యూజియం కట్టి భద్ర పరచారు .నవ బ్రహ్మ ఆలయాలన్నీ7 వ శతాబ్దికిబాదామి చాళుక్య రాజులు నిర్మించిన   శివాలయాలే .

స్కాంద పురాణం లో అలంపురం గురించి ఉంది బ్రాహ్మ దేవుడు అలంపురం లో శివుని కోసం ఘోర తపస్సు చేశాడని ,శివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు సృష్టి చేసే వరం ప్రసాదించాడని ఉంది. అందుకే దీనికి బ్రహ్మేశ్వర ఆలయం అనే పేరొచ్చింది .కుమార ,అర్క ,వీర ,విశ్వ ,తారక ,గరుడ ,స్వర్గ ,పద్మ ,బ్రహ్మేశ్వరాలయాలే నవ బ్రాహ్మాలయాలు .ఈ పేర్లు పురాణ ప్రసిద్ధ నవ బ్రాహ్మలు అంటే ప్రజా పతుల పేర్లుకావు .ఈ పేర్లు సిద్ధుడు పరుసవేది కోసం వాడిన మూలికల పేర్లు అయి ఉంటాయని గడియారం వారు తెలియ జేశారు .పాల్కురికి సోమనాధుడు ‘’పండితా రాధ్య చరిత్ర ‘’లో ఇక్కడిక్షేత్ర తీర్ధ విశేషాలను వర్ణించాడు .ప్రతి ఆలయం మీద అష్టదిక్పాలకులు ,శివ ,విష్ణువులు ,నటరాజు ,పురాణ కదా శిల్పాలు భావ గాంభీర్యం తో దర్శన మిస్తాయి ఈశిల్పాల ప్రత్యేకతకు దేశీయ విదేశీయ శిల్ప మర్మజ్ఞులు అబ్బురపడ్డారు .పై భాగం లో గరుడ ,గ౦ధర్వ,కిన్నెర ,కింపురుషాదులు ,మానవ మిదునాలు ,పంచ తంత్ర కావ్య కదా శిల్పాలు అందరినీ ఆకర్షిస్తాయి . ‘’శ్రీమార ,నాయన ప్రియాన్ ,శ్రీ కంఠా చార్యన్ మొదలైన శిల్పా చార్యుల పేర్లు చెక్కబడి ఉన్నాయి .పులకేశి కట్టించిన ‘’పట్టుద కల్లు’’దేవాలయాలకంటే అలంపురం లోని ఈ దేవాలయాలలో అపూర్వ వికాసం కనిపిస్తోందని శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు ‘’అల౦పూర్  క్షేత్రం ‘’పుస్తకం లో వివరించారు. అదృష్ట వశాత్తు నాకు వెదక బోయిన తీగ కాలికి తగిలి నట్లుగా ఈ పుస్తకం బయట పుస్తక ఫోటో షాపు లో దొరికింది కొని అందులోని విశేషాలనే తెలియ జేస్తున్నాను .

ఎందుకు దక్షిణ కాశి అయింది ?

శ్రీ శైల క్షేత్రానికి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలున్నాయి తూర్పు ద్వారం త్రిపురాంతకం .దక్షిణ ద్వారం సిద్ధవటం ,పడమర అలంపురం ,ఉత్తరాన ఉమా మహేశ్వరం ద్వారాలుగా ఉన్నాయి .స్థల పురాణం లో దీన్ని భాస్కర క్షేత్రమని ,పరశురామ క్షేత్రమని ,దక్షిణ కాశి అని వర్ణించారు .కాశీకి దీనికి చాలా దగ్గర పోలికలున్నాయి .కాశీలో ఉత్తర వాహినిగా గంగానది ,64 స్నాన ఘట్టాలు విశ్వేశ్వరుడు,విశాలాక్షీ  ఉన్నారు అలాగే అలంపురం లో కూడా ఉత్తరావాహినిగా తుంగ భద్రా నది ,పాపనాశిని ,మణి కర్ణిక మొదలైన 64 స్నాన ఘట్టాలు ,బాల బ్రహ్మేశ్వరుడు జోగులాంబా ఉన్నారు .కాశీకి దగ్గరలో ప్రయాగలో గంగా యమునా సరస్వతి కలిసి సంగమ క్షేత్రం ఉన్నట్లే ఇక్కడ కూడా కృష్ణానది తుంగ భద్రానదికలిసే కూడలి  సంగమ క్షేత్రం ఉంది .

మత దృష్టిలో కూడా అలంపురం చాలా ప్రాధాన్యత పొందింది .వైదిక మతాలైన శైవ వైష్ణవ ,శాక్తేయ ,గాణాపత్య ,సౌర స్కాంద అనే షణ్మతాలకు చెందినదేవతా మూర్తులు ఇక్కడ ఉండటం మహా విశేషం .ఇక్కడి బ్రహ్మేశ్వరాలయం రస సిద్దులైన శిల్పా చార్యుల చేత నిర్మింప బడింది .ఇక్కడి బాల బ్రహ్మేశ్వర లింగం మహా ఓషధీ సంస్కారం పొందిన మహా మహితాత్మక రసలింగం .ఇక్కడి అధిష్టాన దేవత అష్టాదశ శక్తి పీఠాలలో అయిదవది

ఈ క్షేత్రానికి 12 అధ్యాయాల స్థలపురాణం ఉంది .దీన్ని బట్టి బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడని అందుకే బ్రహ్మేశ్వరుడు అనే లింగానికి పేరొచ్చిందని ముందే చెప్పుకొన్నాం ఇతర క్షేత్రాలలో బ్రహ్మ విగ్రహాలు కనిపించవు కాని ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడి లింగం ‘’జ్యోతిర్ జ్వాలామయం ‘’.జమదగ్ని మహార్హి ఇక్కడే తపస్సు చేశాడని భార్య రేణుకా దేవిని అనుమానించి కుమారుడు పరశురాముని చేత వధింప చేశాడని తండ్రిమాట విని నందుకు మహర్షి సంతోషించి వరం కోరుకో మంటే తల్లిని బ్రతికించమని కోరి తిరిగి తల్లిని దక్కి౦చుకోన్నాడని  రేణుకాదేవి తల పరశురాముని గండ్ర గొడ్డలికి తెగి చండాల వాటిక లో పడినందున ,మొండెం తో తలను అతికించే వీలు లేక ఆ తల ‘’ఎల్లమ్మ ‘’అనే గ్రామ దేవతగా పూజలు  అందుకొంటు౦దని జమదగ్ని చెప్పాడు .ఇప్పటికీ ఆ ‘’మొండేమే’’ ‘’భూదేవి’’ పేరుతో పూజింప బడుతోంది .అష్టాదశ తీర్ధాలలో ‘’పాప నాశనం ‘’తీర్ధం విశిష్టమైనదని ,అక్కడి గదా ధర విగ్రహ సన్నిధిలో తీర్ధ ,శ్రార్ధాలు చేస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని స్థల పురాణం చెప్పింది. అంతేకాక ఆలంపూర్ దేవాలయాలను రససిద్ధుడు నిర్మించాడని ,కాశీ విశ్వేశ్వర ప్రేరణ తో రససిద్ధుడు ఇక్కడికి వచ్చి క్షేత్ర పాలకుల గురించి తపస్సు చేశాడని బ్రహ్మేశ్వరుడు తలపై నుంచీ ,జోగులాంబ నోటి నుంచి ,గణపతి బొడ్డు నుంచి రసాన్ని ఇచ్చారని ,దానితో ‘’పరుస వేది’’నితయారు చేసుకొని ఇక్కడి ఈఆలయాలను కట్టిస్తూ ఉన్నాడు .’’విలసద్రాజు’’అనేవాడు సిద్ధుడి నుంచి పరుస వేదిని లాక్కొనే ప్రయత్నంలో దాడి చేయటానికి వస్తున్నాడని తెలిసి ,ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాక ముందే గర్భాలయం లో ప్రవేశించి బ్రహ్మేశ్వర లింగం లో ఐక్యమయ్యాడని కధనం .సిద్ధుని శాపం చేత విలసద్రాజు రాజ్యాన్ని సర్వస్వాన్నీ పోగొట్టుకొని కస్టాలెన్నో అనుభవించి ఒక జింక చేత ఉపదేశం పొంది శివసాన్నిధ్యం చేరాడు .ఈ గాధ ప్రవేశ ద్వారం ముందున్న తోరణ స్థంభం పై చెక్క బడి ఉంది .

ప్రధానాలయం

నవ బ్రహ్మ ఆలయాలు ఉండటం వలననే ఇది బ్రహ్మేశ్వర క్షేత్రమైంది .ఆలయాలన్నీ ఒకే  కాలం లో కట్టినవి కావు బాదామి చాళుక్యులు పాలించిన రెండు వందల సంవత్సరాల కాల గమనం లో కట్ట బడినవి .భారతీయ వైదిక మత వికాసం ,వాస్తు ,శిల్ప రీతులు ,చారిత్రిక విశేషాలు తెలుసుకోవాలను కొనే వారికి ఇది తప్పక చూడ తగిన క్షేత్రం .ఆలయాలకు పడమర దిశ లో మహా ద్వారం ఉంది .దీన్ని 8 వ శతాబ్ది రాష్ట్ర కూట ధారా వర్ష ధ్రువ మహా రాజు సేనాపతి’’ బలవర్మ ‘’కట్టించాడు .శిల్ప రీత్యా దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి .పై కప్పు బండలకు మూడు అంక ణాలలోత్రిమూర్తులు ,మొదటి అంకణంలో పద్మంపై పాము పడగలు ఉండే విష్ణు మూర్తి ,మధ్య అంకణం లో అంధకాసుర సంహార మూర్తి రూపం లో శివుడు ,మూడవ అంకణం లో చతుర్ముఖ బ్రహ్మలను తీర్చి దిద్దారు .మహాద్వారం కింది భాగం లోరెండు వైపులా చిన్న గుళ్ళలో కంచి కామాక్షీ దేవి ,ఏకాంబరేశ్వర శివుడు ఉంటారు .కామాక్షి విగ్రహాన్ని 135 3లో ‘’ పెర్మాడి రాయని మంత్రి ‘’ప్రతిస్టించాడు .ఈవిగ్రహ పీఠానికి మధ్య భాగం లో మూడు మనిషి తలలు చెక్కబడి పరిశోధకులను తికమక పెడుతున్నాయని గడియారం వారు ఉవాచ .ఈ విగ్రహం చాలా ఎత్తుగా చేతిలో కత్తి పట్టుకొని పీఠం పై కూర్చుని ఉండటం మరో విశేషం .నల్లరాతి గంభీరాకృతి శిల్పం ఇది .తారక బ్రహ్మేశ్వర ఆలయాన్ని ఎవరో యే కాలం లోనో ధ్వంసం చేశారు .ఇప్పుడు ఆ దేవాలయం ఎక్కడ ఉందో గుర్తించటం కష్టం అంటారుగడియారం  శర్మగారు

బాల బ్రహ్మేశ్వరాలయం

నవ బ్రహ్మ ఆలయాలలో బాల బ్రహ్మేశ్వరాలయం ప్రధాన మైనది .దీనికి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి మార్గం ,ప్రాకారం ముఖ మండపాలను విజయాదిత్య మహా రాజు క్రీ శ.702  లో కట్టించాడు .ఆనాటి ప్రాకార ద్వారం ఇప్పుడు ప్రవేశాద్వారమైంది ..ప్రాకార శిల్పి ‘ఈశానా చార్యుడు ‘’మహా రాజ సత్కారం పొందాడు .ముందరి శాలలో త్రిమూర్తులు దక్షిణాన వీరభద్రుడు ప్రక్కన నవ గ్రహాలూ ఉన్నాయి .

రెండవ ద్వారం దాటితే ప్రదక్షిణా పధం ,మధ్య మండపం ,రధం ఆకారం లోని గర్భాలయం కనిపిస్తాయి మధ్య మండపానికి రెండు ప్రక్కలా రెండు ద్వార పాలకులను చెక్కిన బండలను నిల బెట్టారు .పైభాగం లో ఉండాల్సిన గజలక్షి ఆలయ మరమ్మత్తులలో మాయమైంది .అంతరాలయం లో నాలుగు స్తంభాల మధ్య శివలింగం ఉంది .ఇదే ‘’జ్యోతిర్జ్వాలమయ శివలింగం ‘’.జ్యోతిర్లింగాలలో చెరక పోయినా జ్యోతిర్లి౦గ మే .లింగం తల భాగం దోసిలి ఆకారం లో గుంటలు పడి ఉంటుంది .ఆ గుంటలు లింగాన్నుంచి రస సిద్ధులు రసం తోడిన గుంటలు అన్నారు గడియారం వారు .మంత్రం ,ఔషధ సంస్కారం పొంది బాలబ్రహ్మేశ్వరుడు కోరుకొన్నవారికి కొంగు బంగారమయ్యాడు

గర్భాలయానికి మూడు ప్రక్కలా గూళ్ళలో రససిద్ధి గణపతి ,ఆలింగ న మూర్తి ,రెండు సింహాలపై సమ భంగిమలో చేతిలో ఖడ్గం ధరించి నిలబడి ఉన్న దుర్గా దేవి ఉంటారు .దక్షిణం వైపు ప్రదక్షిణ మార్గం లో ఉన్న స్త్రీ మూర్తిని ‘’కన్యా కుమారి ‘అంటారు .ఉత్తరాన కొన్ని విగ్రహాలు పీఠాలపై ఉన్నాయి . ఇవి ఎక్కడా దొరకని అరుదైన విగ్రహాలు .హిరణ్య కశిపుని స్థానాది పతులు,విశ్వ విద్యాలయం లోని అధ్యాపక మూర్తులు  విగ్రహాలకింద’’వ్యాళ సింహ ,అభినవ త్రిలోచన ,ఈశాన రాశి ‘’,విద్యారాసి ‘’మొదలైన  వారి పేర్లు ఉన్నాయి .వాళ్ళ తలపాగాలు ,జడలు కట్టిన వెంట్రుకలు ,చూడ దగ్గవి .ఈవిగ్రహాల ప్రక్కన పాప వినాశిని నుంచి తెచ్చిన రెండు అపూర్వ విగ్రహాలను ఉంచారు .జ్వాలా నరసింహ ఆకృతిలో హరిహర పంచాయతన మూర్తి ,ఫాలనేత్రమూ కుడి చేతిలో సుదర్శన చక్రం ఎడమ చేతిలో త్రిశూలం ,కుడి చెవికి మకర కుండలం ,ఎడమ చెవికి నాగా భరణం ,కుడి చేత జ్ఞాన ముద్ర ,ఎడమ చేత బిల్వదళం ఉన్న ఈ శిల్పం ఎన్నో ఎన్నెన్నో భావాలకు గుర్తు .ఇలాంటి మూర్తి మరెక్కడా లేదని గంట కొట్టి గడియారం వారు మరీ చెప్పారు ..హిరణ్య కశిపుని కడుపు చీల్చి పేగులు మెడలో వేసుకొన్న పదహారు చేతుల ఉగ్ర నరసింహ మూర్తి గాంభీర్యానికి ప్రతీక. ఈ రెండు శిల్పాలను ఒకే శిల్పి చెక్కి ఉంటారని రామ కృష్ణ శర్మగారు ఊహించారు .గర్భగుడిపై చతురస్రం గా  ఎత్తుగా కట్టిన విమానం ,దానిపై మహా ఆమలకం ,,పైభాగాన శిఖరం ,చాళుక్యుల నాటి కళా వైభవానికి నిదర్శనం .నవ బ్రహ్మాలయాలన్నీ ఒకే రీతిలో ఉండటం ఇంకో విశేషం. గోపురానికి ముందున్న ‘’శుక నాశం ‘’గూడులో దండం పట్టుకొన్న పురుషుడి విగ్రహం ‘’లవ లీశ మూర్తి ‘’అని గడియారం వారు తేల్చి చెప్పారు .

ముందే గడియారం వారి పుస్తకాన్ని చదివి ఉంటే వీటినన్నిటినీ సమగ్రంగా దర్శించి తరించ గిలిగే వాడిని అని ఇప్పుడు అనిపిస్తోంది .యోగం ఉంటె మరొక సారి అలంపురం క్షేత్రాన్ని దర్శించి ఆ శిల్ప కళా విభూతికి జోహార్లు అర్పించాలని ఉంది .దీన్ని చదివి మీరు ధన్యులయ్యారు కనుక ఇవన్నీ గుర్తు ఉంచుకొని ఈ క్షేత్రాన్ని దర్శించమని మనవి .

ఇంకా కొన్ని విశేషాలున్నాయి ఈ సారి తెలియ జేస్తాను .

Inline image 5Inline image 6Inline image 1  Inline image 2Inline image 4Inline image 7Inline image 8Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -2 ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’

నా కృష్ణా పుష్కర అనుభవం -2

ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు అని 5-8-16 న రాశాను .నిన్న 15-8-16 సోమవారం భారత 70 వ స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణా లో కృష్ణా పుష్కర స్నానం చేశాము .ఆవివరాలే ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం ‘’శీర్షిక గా తెలియ జేస్తున్నాను ‘

‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’

నిన్న 15 వ తేది ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి స్నానం ,సంధ్య ,పూజ లు పూర్తీ చేసుకొని ,రెండు సార్లు కాఫీ త్రాగి ,నేనూ మా రెండవ అబ్బాయి శర్మ ,కోడలు ఇందిర మనవడు శ్రీ హర్ష ,మనవరాలు హర్షితా౦జని కలిసి మా వాడి కారులో వాళ్ళు ఉంటున్న హైదరాబాద్ లోని బాచు పల్లి నుండి శ్రీ ఆంజనేయ క్షేత్రం అయిన బీచుపల్లి కృష్ణా ఘాట్ కు ఉదయం 5 గం లకే బయల్దేరాం .దారిలో తినటానికి పులిహోర ,పెరుగన్నం ‘’మూటలు ‘’కట్టుకొన్నాం .మా శ్రీమతికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసి మూడు వారాలు అయినందున ఆవిడను ఇంట్లోనే వదిలి మేము మాత్రమే బయల్దేరాం నేషనల్ హై వే 44 మీద ప్రయాణం చేస్తూ షాద్ నగర్ జడ్చెర్ల మీదుగా మెహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్ కు ఉదయం 8- 30 గంటలకు అంటే సుమారు మూడున్నర గంటలు కారులో ప్రయాణం చేసి సుమారు 210కిలోమీటర్లు ప్రయాణించి చేరాం  జూరాల ప్రాజెక్ట్ చెర నుండి విడుదలైన కృష్ణమ్మ ఇక్కడ పరవశంగా పరవళ్ళు తొక్కుతూ మహా ప్రవాహంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది .బీచుపల్లికి రెండవ వైపు రంగా పూర్ ఘాట్ ఉంది .అక్కడ నీరు ఘట్లకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించింది నడక దూరం కూడా తక్కువగా ఉన్నట్లు ఉంది .జన రద్దీ కూడా అక్కడ బాగా ఉంది .కాని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి సుప్రసిద్ధుడు కనుక ఈ ఘాట్ లో కృష్ణా పుష్కర స్నానం చేయాలని వచ్చాం .

ఎ1  కార్ పార్కింగ్ లో కారు ను పెట్టి ,స్నాన సరంజామా ,పూజా సామగ్రి ,తిండీ అన్నీ మోసుకొంటూ సుమారు కిలోమీటరు పైగా ఉన్న బీచు పల్లి రేవు చేరాం .జనం అంత గా రద్దీగా లేరు .ఓ మోస్తరుగా ఉన్నారు .పార్కింగ్ దగ్గరే బస్ స్టేషన్ ఉంది.అక్కడి నుండి అలంపురం కర్నూలు మొదలైన చోట్లకు బస్సులున్నాయి .కర్నూలు చాలాదగ్గర .పుష్కర ఘాట్ లో దిగి మా అబ్బాయి కోడలు మనవ రాళ్ళ కు సంకల్పం చెప్పి కృష్ణా పుష్కర స్నానం చేయించి అర్ఘ్యాలు ఇప్పించాను .తర్వాత మా మనవడు ,నేను దిగి స్నానం చేశాము .కాలుష్యం లేదు మంచి ప్రవాహం .కానిమా  ఘాట్ కు పక్కనే ఉన్న రెండవ ఘాట్ లో కొంచెం లోతు ఎక్కువగా ఉంటె మధ్యలో ఉన్న చిన్న గోడ దాటి అందులో పూర్తిగా మునిగి స్నానాలు చేశాం. చాలా హాయి అనిపించింది ,కొత్త విద్యుత్హు శరీరం లోకి ప్రవేశించిందని పించింది .కరెంట్ అంటే ప్రవాహం కనుక జల విద్యుత్ శరీరం లోకి చేరిందన్నమాట .మాంచి ఉరవడి ఉండటం తో జీవ నదిలో స్నానం చేయటంతో గొప్ప అనుభూతి కలిగింది .అందరం చాలా ఆనందించాం.నేనూ మళ్ళీ సంధ్యావందనం చేసి కృష్ణవేణి కి ,బృహస్పతి శివ సూర్య మొదలైన దేవతలకు,ఋషులకు అర్ఘ్యం ఇచ్చాను. తర్వాత పితృదేవతలకు ,జలతర్పణం చేశాను .జ్ఞాపకం ఉన్న చనిపోయిన బంధువులకు మిత్రులకు కె ఎల్  రావు గారికి కాటన్ దొరకు ,కాంతారావు గారికి ఆర్ ఎస్కె మూర్తి మొదలైన మిత్రులకు జల తర్పణం చేశాను .తర్వాత మా కోడలి చేత  కృష్ణ వేణీ మాతకు అష్టోత్తర పూజ చేయించాను .అంతా అయ్యాక అందరం బట్టలు మార్చుకొని ఒడ్డునే ఉన్న శ్రీ రామాలయాన్ని సందర్శించే ప్రయత్నం చేసి జనం బాగా ఉన్నందున బయటి నుంచే నమస్కారం చేసిలడ్డూ ప్రసాదం కొని ,తిని  ,ప్రక్కనే ఉన్నఅతి ప్రాచీన  బీచు పల్లి ఆంజనేయ స్వామి ని కనులారా దర్శించి ,ప్రసాదం కొని,తిని  బయటికొచ్చి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకొన్న పులిహోర ,దధ్యోజనం తిని బరువు తగ్గించాం .మందులేసుకొని11గంటలకు  మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యాం .ఈ క్షేత్రం లోనే ‘’కణ్వ మహర్షి ‘’తపస్సు చేశాడని ఐతిహ్యం .ఇక్కడ కణ్వమహర్షి తపోవనం ,ఆయన కు గుడి కూడా కట్టి ఉంది .ఇక్కడ వి ఐ పి లకు ప్రత్యేకఘాట్ ,ప్రత్యేక పార్కింగ్ లు కూడా ఉన్నాయి ‘

బీచుపల్లి ప్రాధాన్యత

మెహ బూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన బీచుపల్లి లో కృష్ణానది ప్రవహిస్తోంది .నదిమీదుగా  బ్రిడ్జ్ కట్టి నేషనల్ హై వేకు కలిపారు .దీనివలన తెలంగాణా ,రాయల సీమలకు గొప్ప సౌకర్యమేర్పడింది .మధ్య ,ఉత్తర దక్షిణ భారత దేశాలను కలిపే భాగం గా నిర్మించబడిన బ్రిడ్జ్ లలో ఇది ఒకటి .మొదట్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కృష్ణా నది ఒడ్డుకు 20 0మీటర్ల దూరం లో ఉంది. దీనికి దగ్గర శివాలయముంది ..వర్షాకాలం లో కృష్ణకు ఉద్ధృతంగా వరదలొచ్చి శివాలయం  మునిగి పోయేది .19 92 లో ఒడ్డునే శ్రీ రామాలయం కట్టారు .బీచుపల్లి ఆంజనేయ స్వామి రెండు దీవుల మధ్యలో ఉన్నాడు .10 చదరపు కిలో మీటర్ల వైశాల్యం ఉన్న పెద్ద దీవిఉన్నగ్రామాన్ని గుర్రం గడ్డ అని అంటారు .దీనిలో పంటలు బాగా పండి రైతుల నివాస భూమిగా ఉంది. చిన్నదీవిని నిజాం కొండ అంటారు .బీచుపల్లి లో ఉన్న రెసి డేన్షియల్ స్కూల్ గత 30 ఏళ్ళుగా పదవ తరగతి పరీక్షలలో టాప్ రాంక్ సాధిస్తూ అగ్రభాగాన ఉంది .

శ్రీ బీచుపల్లి ఆంజనేయ వైభవం

15 వ శతాబ్ది లో విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవ రాయల ఆస్థాన గురువు వ్యాస రాయలవారు ఈ ప్రాంతం లో పర్యటన చేస్తూ ,శిష్యులతో ఒక సారి ఇక్కడే విశ్రాంతి తీసుకొన్నారు . ..ఈ ప్రదేశం పరమ పవిత్రమైనదిగా భావించి ఇక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు తన ఆలోచనలనన్నిటితో ఒక సుందర ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేయించారు  .తాను  ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక ఈ మూర్తిని ఎవరు అర్చిస్తారు అనే అనుమానం రాగా ,ఆ రాత్రి కలలో స్వామి కన్పించి దానికి పరిష్కారం చెప్పాడు అంతే .మంచి ముహూర్తంలో వ్యాస రాయలవారు శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్టించారు .మర్నాడు ఉదయం వ్యాస రాయలవారు నిద్ర లేవగానే ఒక  గిరిజన బాలుడు  తాను ప్రతిష్టించిన హనుమస్వామి విగ్రహానికి పూజ చేస్తూ కనిపించాడు .ఆ కుర్రాడి పేరే ‘’ బీచు పల్లి ‘’.బోయ జాతి కుర్రాడైన బీచుపల్లి ని ఆలయ అర్చకునిగా వ్యాస రాయలవారు నియమించారు .అప్పటి నుంచి ఆ జాతివారే ఆలయ అర్చకులు .అందుకనే స్వామిని ‘’బీచుపల్లి రాయుడు ‘’అని ఆప్యాయంగా పిలుచుకొంటారు .

నిత్యం బీచు పల్లి రాయుడికి తమలపాకుపూజ ,పంచామృత అభిషేకం నిర్వహిస్తారు .మార్గశిర పౌర్ణమి నాడు హనుమజ్జయంతిని  వైశాఖ శుద్ధ చతుర్దశినాడు నృసింహ జయంతిని ఘనం గా నిర్వహిస్తారు .ఈ క్షేత్రం లో వివాహ ఉపనయనాలు చేసుకొంటారు .ప్రశాంత వాతావరణం ఉన్న క్షేత్రం కనుక ధ్యానానికి అత్యంత అనుకూలం .ఈ ప్రాంతం వారికి బీచుపల్లి రాయుడు కులదైవం .ఉత్సవాల రోజున దేశం నలు మూలల నుంచి వేలాది భక్తజనం వచ్చి క్రిష్ణాస్నానం చేసి బీచుపల్లి రాయని దర్శించి మనసులోని కోర్కెను విన్నవించి సఫల మనోరదులౌతారు .

బీచుపల్లి పోతే వాఛి పోద్ది

ఆలయాల సందర్శనం తర్వాత ఎటు పోతే కారు పార్కింగ్ వస్తుందో తెలీక ,చెప్పేవారెవరూ లేక అక్కడి దిశా నిర్దేశం చేసే సూచికలు లేక ,తలో రకంగా చెప్పగా ‘’లాడూ లస్కూ ‘’బుజాన వేసుకొని పొలం గట్ల వెంట పడుతూ లేస్తూ నడుస్తూ ,దాదాపు రెండుకిలోమీటర్లు కాళ్ళు వాచేట్లు నడించి పార్కింగ్ చోటికి చేరితే ,అది వి ఐ పి పార్కింగ్ అని కానిస్టేబుల్ చెబితే మళ్ళీ అరకిలో మీటరు నడిచి కోళ్ళ ఫారాల ప్రక్కన నడుస్తూ ,ఆ కంపు నసాళానికి ఎక్కి చీదరింపు ఏవ గింపు కలిగినా ముక్కు మూసుకొని నడిచి ఎట్లాగో అట్లా మా ఎ 1 పార్కింగ్ చేరి హమ్మయ్య అనుకోని కారులో కూర్చుని  బయట పడే ప్రయత్నం చేశాము .జనమూ పెద్దగా లేరు ,కార్ల హడావిడీ తక్కువే అయినా ఘాట్ దాకా కార్లను పంపించకపోవటం దారుణం .ముసలీ ముతకా అంత దూరం నడిచి వెళ్ళాలంటే’’ కూసాలు ‘’కదిలి పోతాయి .పోనీ అంత స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు .ఆటోలు’’ పుష్పక విమానాల్లాగా’’ జనాలను ఎక్కించుకొని ,ఆఘమేఘాలమీద ఘాట్లకు పరిగెత్తుతూనె ఉన్నాయి .సుమోలు కార్లూ కూడా వెళ్ళటం చూశాం .చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేదు .’’డైరెక్షన్ లెస్ యాటి ట్యూడ్’’కు ప్రత్యక్ష నిదర్శనం ఇదే .

సరే అని కారులో బయల్దేరి బయట పడుదామంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు నిర్జన ,కొత్తగా వేసిన కచ్చా ఎర్రమట్టి సన్నని రోడ్డు మీద ప్రయాణిస్తేనే కాని  మెయిన్ రోడ్ కు చేరుకోలేక పోయాం .ఈ ఏర్పాటూ పరమ దారుణంగా ఉంది .అసలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు .బ్రిడ్జి మీదనుంచే వెనక్కి వెళ్ళే ఏర్పాటు చేస్తే ఎంతో సౌకర్యంగా ఉంది .బ్రిడ్జి కి ఆనుకొనే నది ఉంటె ఈతిప్పలెందుకు అని అందరూ ‘’సన్నాయి నొక్కులు ‘’నొక్కుతూనే ఉన్నారు . .

ఇంకో విశేషం హైదరాబాద్ దాటి వచ్చాక ప్రతి అరకిలో మీటర్  దూరం లోనూ రోడ్డుకు రెండువైపులా ‘’పుష్కర యాత్రికులకు ఉచిత ఫలహారం భోజనం ‘’అని బోర్డ్ లున్నాయి .కాని ఎక్కడా ‘’బావార్చి ‘’అంటే వండి వార్చి వడ్డించిన దృశ్యం కనిపించలేదు .ఇదొక మెహర్బానీ .సరే’’ టోల్ ఫ్రీ ‘’అని నెలల తరబడి మాధ్యమాలలో చెప్పించిన సర్కారు తోలు వలిచి మరీ టోల్ ప్లాజా లలో  టోల్ బాజా మొగిస్తున్నారని కార్ల వాళ్ళు ‘’కార్ కూతలు ‘’కూశారు .అందుకే ‘’బీచ్ పల్లి పొతే వాచి పోద్ది ‘’అన్నాను .

అలంపురం జోగులాంబ దర్శన విశేషాలు తరువాత తెలియ జేస్తాను .అంత దాకా ఓపిక పట్టండి .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హోసూర్ తెలుగుల ఉసురు పోసుకో కండి

తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ బడ్డ తెలుగు వారి ఘోష విని వారికి న్యాయం చేసి ,వారి ఉసురు తగల కుండా చూసుకో వలసిన బాధ్యత నిర్వాహకు లైన ఆంద్ర ప్రభుత్వం మీద ఉంది .ఆ బాధ్యత ను ఈ సభలు సక్రమం గా నిర్వ హించే ఆలోచన చేయక పోతే వారి ని ఓదార్చటం కష్టం .వారికి న్యాయంకల్గించక పోతే తెలుగుకే కాదు తెలుగు ప్రజలకు తెలుగు సంస్కృతికి తీరని అన్యాయం చేసి నట్లే .కనుక సభలు వారికి బాసట గా నిలవాలి .వారికి కావలసిన వన్నీ నెర వేర్చాలి .క్రితం ఏడాది నేను హోసూర్ వెళ్లి అక్కడి తెలుగు భాషోద్యమ నాయకులైన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ,యెన్.ఏం.కృష్ణప్ప ,డాక్టర్ శ్రీ వసంత్ ,శ్రీ కే.మునిరాజ్ శ్రీ ఆర్ .రఘునాధ రెడ్డి గార్లను కలిసి వారి ఘోష విన్నాను .చలించి పోయాను .వారి పోరాట పటిమకు ధన్యవాదాలు అందించాను .మాత్రు భాష పట్ల వారికి ఉన్న మమకారం అర్ధం చేసుకొని అభి నందించాను .అందులో నారాయణ రెడ్డి గారి పాత్ర గణనీయం ..వారితో రెండు గంటలకు పైగా జరిపిన సంభాషణ లో మీ అందరికోసం కొన్ని విషయాలన్దిస్తున్నాను .

.  1970 వరకు సేలం వరకు తెలుగు బోధనా ఉండేది .డి.ఏం.కే.అది కారానికి వచ్చిన తర్వాత తమిళాన్ని నెత్తిన రుద్దాడు కరుణానిధి ముఖ్య మంత్రి .తమిళ భాష దెబ్బతింటుందని హిందీ వ్యతి రేకోద్యమాన్ని నిర్వహించిన ఆ పార్టి తెలుగును కాల రాచటానికి చెయ్యని ప్రయత్నం లేదు .’’తెలుగు ఒళిగ’’అంటే ‘’క్విట్ తెలుగు ‘’ఉద్యమం చేపట్టింది ఆపార్టీ.తెలుగు స్కూళ్ళు అప్పటి వరకు వందకు పైగా ఉండేవి .జనాభా ఒక లక్ష .జనాభాలో తెలుగు వారి శాతం 60%ఉండేది .ఇప్పటికి అంతే కాని విద్యాలయాలు తీసేశారు .హోసూర్ కర్నాటకకు సరి హద్దు కు ఎనిమిది కిలోమీటర్లలో  ఉంది .అయితే తమిళ నాడులో ఉన్నది .పూర్వం దీన్ని ‘’హసవూర్ ‘’అనే వారు .హోయసల రాజుల కాలం లో ఉన్న నగరం .1956 లో సర్వే  చేసిన పటాస్కర్  కమిటీ ఇచ్చ్చిన నివేదిక ప్రకారం హోసూర్ వాళ్ళ ఇష్టప్రకారం యే రాష్ట్రం లో నైనా చేర వచ్చు అన్నాడు . .తెలుగు రాష్ట్రం సాధించే టప్పుడు అందరు హోసూర్ ను మర్చి పోయారు ..వారి ఘోష విని పించుకో కుండా నిర్ణయాలు తీసుకొన్నారు .

తమిళం ముందు చాప కింద నీరు లా చేరిపోయింది .ఇక్కడ తెలుగు సంఘం యాభై ఏళ్ళ పై నుంచే పని చేస్తోంది .తన భావాలను విష్పస్తం గా చెబుతూనే ఉంది .తెలుగు వాడే అయిన కోదండ రామయ్య గారు ఏం .ఎల్.సి.గా ఉండి పోరాటం చేశారు తమిళ నాడు లో తెలుగు భాషోద్యమాన్ని నిర్వహించారు .’’జై తెలుగు తల్లి ‘’నినాదం తో దేశం అంతా దద్దరిల్ల జేశారు .ఇక్కడి ‘’మిత్ర బృందం ‘’బోస్ బజార లో మొదటి సారిగా ఉద్యమాన్ని చే బట్టింది .ఘంటసాల మిత్ర బృందం ఉగాది వేడుకలు ఘంటసాల పాటలు నిర్వహిస్తారు ..’’నడుస్తున్న చరిత్ర ‘’సంపాదకులు శ్రీ సామల రమేష్ బాబు వీరికి గొప్ప ప్రేరణ .వీరితో కలిసి పని చేస్తూ ప్రోత్సహిస్తున్న వారు ప్రముఖ కధకులు ,సామాజిక కార్య కర్త శ్రీ సా.వేం.రమేష్ అంటే వీరందరి దైవ సమానం .స్వర్గీయ కైవారం తాతయ్య ఆధ్యాత్మిక ఆశ్రమం ఎంతో ప్రోత్సహిస్తుంది తాతయ్య గారి ని ,వారి సేవలను నిత్యం వీరు స్మరిస్తారు . తాతయ్య గారు ‘’దూషించు వారి –నయ భాషించి ప్రేమతో భూషించవ మనసా ‘’అని ఉద్బోధించే వారు . .

కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం 2001లో ఏర్పడింది .ప్రతి నెల మొదటి ఆది వారంకోదండ రామయ్య ఆంద్ర సాంస్కృతిక సంఘం భవనం లో  సమావేశమైకవితలు రచనలు చదివి విని పిస్తారు నెలలో మిగిలిన వారాలలో సభ్యులు ప్రాంతాలన్నీ తిరిగి సమస్యలను తెలుసు కొంటారు .తెలుగు బడుల్లో విద్యార్ధులను చేరుస్తున్నారు .మూడేళ్ళు గా కొంత అభి వృద్ధి సాధించారు తమిళ బడులు తెలుగు బడులు గా మారుస్తున్నారు .ప్రతి ఫిబ్రవరి ఇరవై  ఒక్కటి రోజున‘’మాత్రు భాషా దినోత్సవం ‘’నిర్వహిస్తున్నారు .మే నెలలో గిడుగు జయంతిని ,ఉగాది కవి సమ్మేళనాలను నిర్వహించి కవితలను పుస్తక రూపం లో తెస్తున్నారు .బ్రౌన్ ,వేమన జయన్తులను జరుపుతారు . 2004 లో ‘’తెలుగు వాణి ‘’స్తాపించి తెలుగు బోధనా పై శ్రద్ధ చూపుతున్నారు . .’’తల్లి భాష ‘’మాస పత్రిక ఏర్పరచి మంచి సాహితీ సేవ చేస్తున్నారు . రాయ వెల్లూర్ నుండి తెలుగు నేర్చుకోవటానికి హోసూర్ వస్తున్నారు .అజంతా వాచకం తయారు చేసుకొన్నారు కుప్పం వర్సిటి లో రిసోర్సు పెర్సన్ లకు శిక్షణ నిప్పిస్తున్నారు .శిక్షణ నిచ్చిన వారిలో శ్రీ పరిమి రామ నరసింహం గారు గొప్ప కృషి చేస్తున్నారు నూట ఇరవై గ్రామాల నుండి గ్రామానికి సుమారు యాభై మంది దాకా వచ్చి నేర్చుకొన్నారు .స్రీలు కూడా చాలా ఉత్సాహం గా పాల్గొనటం విశేషం .

ఆ ప్రేరణ తో తమిళ విద్యార్ధులు కూడా తెలుగు లో కవిత్వాలు రాశారు .హోసూర్ లో ‘’పల్లె కళల పరస (పండుగ )2007 లో రెండు రోజులు నిర్వహించారు .శ్రీ ఆర్ వి .ఎస్ సుందరం ,శ్రీమతి నాయని కృష్ణ కుమారి ,దేవ పుత్రా మొదలగు హేమా హేమీలందరూ వచ్చారు .తెలుగు కధలపై ‘’వర్క్ షాప్ ‘’నిర్వ హించారు .సా.వేం .రమేష్ ఆధ్వర్యం లో ‘’తిరుచి ‘’లో2008 లో అయిదు రాష్ట్రాల ‘’పల్లె కళల పరస ‘’నిర్వహించి గొప్ప ప్రేరణ కల్పించారు .అక్కడ ఉన్న పద్నాలుగు తెలుగు జాతుల వారిని ఏకం చేశారు .తిరుచి లో అందరు దాదాపు రెడ్లె వాసవీ మహల్ లో తిరుచి కోట ఆకారం లో వేదిక ఏర్పరచి అక్కడ సభు నిర్వహించారు .కేంద్ర ,రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు .’’దక్షిణ భారత పల్లె కళల పండుగ ‘’అనే బాన్నర్ కట్టుకొన్నారు ‘’మా తెలుగు తల్లికి ‘’పాటతో సభలు ప్రారంభించారు .వచ్చిన అతిధులు అంతా తెలుగు అభి వృద్ధికి హామీ లిచ్చారు .అక్కడ అందరు తెలుగు వారే తర్వాత తమిలులయారు .ఇప్పుడు హోసూర్ ఏం .ఎల్.యే.శ్రీ గోపీనాద్ తెలుగు వాడే మంచి తెలుగు మాట్లాడుతాడు .కూచి పూడి నాట్యం చూసి అంతా అప్రతిభులైనారు .’’తెలుగు ఇంత మధురమా ,తెలుగుకు ఇంత ప్రమాదం వచ్చిందా ‘’అని అందరు ఆశ్చర్య పోయారు .నాలుగు వందల మంది కలా కారులు రెండు రోజులు నిర్వహంచిన వివిధ కార్యక్రమాలను అందరి మనస్సుల్ని ఆకర్షించాయి .తల్లి భాష తెలుగు పట్ల అందరికి పూజ్య భావం ఏర్పడింది .ఇదంతా రమేష్ గారి చలువే అంటారు వీరు .ఈ స్పూర్తితో ప్రతి జిల్లా వారు తామూ ఇలా నిర్వహిస్తామని ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు

కరుణా నిది అది కారానికి వచ్చిన తర్వాతా తెలుగు వారిని తమిళులు గా’’ జన గణన ‘’లో మార్చి రాసి ద్రోహం చేస్తున్నారు ..తెలుగు అనేది ఇక నుంచి విని పించ రాదనీ కరుణానిధి కూతురు కని మొలి చెప్పి,తండ్రికంటే నాలుగాకులేక్కువే చదివానని పించింది .దీనితో నిరసన పెరిగింది .ఆందోళనలు ఉద్యమాలు చేశారు .మద్రాస్ నగర వీధుల్లో తెలుగు వాణిని వినిపించారు .ఒత్తిడి పెరిగి కరుణ నిర్బంధ తమిళ చట్టాన్ని రద్దు చేసుకొన్నాడు .అసలు ‘’ఎంగుం తమిళం ఎడియం తమిళం ‘’అంటే ఎక్కడైనా, ఎందులో నైనా తమిళం అనేది కరుణ నినాదం కాని వెనక్కి తగ్గాడు .ఓటర్ల లిస్టు లో తెలుగు పేర్లుంటాయి ఊరి పేర్లు మాత్రం తమిళం లో ఉంటాయి .ఆ నాటి ముఖ్య మంత్రులు ఎడ్యూరప్ప ,అచ్యుతా నందన్,రోశయ్య  కరుణ ను బానే హెచ్చ రించారు .బెంగళూర్ లో వేలాది మంది నిరసన స్వరం అట్టిగా విని పించారు .తెలుగు కన్నడ సంఘాలుకలిసి కట్టు గా పని చేసి జన జాగృతి చేశాఇ . .ఈ బాధ భరించలేక ఎన్నికల ముందు నిది గారు విధి గా తమిళం నేర్చుకోవాలి అన్న పట్టుదల సవరించుకొని ‘’ఎవరి భాష వాళ్ళు నేర్చుకో వచ్చు’’అని ప్రకటింఛి ఉత్తర్వు ను ఇచ్చాడు .అప్పటికే ఆలస్యం జరిగి తెలుగు వారంతా కరుణా నిది పార్టీకి వ్యతి రేకం గా ఓటేసి మట్టి కరిపించి జయ లలితకు పట్టం కట్టారు .ఇప్పటికీ తెలుగు అంటే ఈ ప్రాంతం లోనీ వారికి ప్రాణం .దాన్ని నిల బెట్టుకోవా టానికి యే త్యాగానికైనా సిద్ధమే .దేనికీ భయ పడే తత్త్వం లేని నిజాయితీ పరులు .మన రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఆసరా గా నిలబాది తమిళ నాడు ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి న్యాయం చే కూర్చాలి ఇప్పటికీ ఈప్రాంత గ్రామాల్లో తమిళం మాట్లాడితే ‘’దిగువ సీమ వాళ్ళు వచ్చారు ‘’ అని ఈసడించుకొంటారు .దిగువ  జాతుల వారే తమిళం మాట్లాడే వారట ..

ఇదీ హోసూర్ ముఖ చిత్రం .కనుక వారికి అన్ని కోణాల్లోనూ న్యాయం జరిపించాల్సిన బాధ్యత తెలుగు సభలు జరిపే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రముఖం గా ఉంది .తెలుగు ప్రజల మీదా ఉన్నాడని మర్చి పోరాదు అని గుర్తు చేయటానికే ఇదంతా రాశాను .వారి ఘోష మనకు ఉసురు కాకూడదు ..వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు .మన వెన్ను దన్ను కూడా అవసరం .ఇప్పటి దాకా తాత్సారం చేసిన ప్రభుత్వం ఇక అలానే ఉపేక్ష  గా ఉంటె తెలుగు వారు సహించరు అనేది గమనించాలి .హోసూర్ తెలుగు సోదర సోదరీ మణులకు మనం అందరం అండ గా నిలవాలి .జై తెలుగు జై జై తెలుగు తల్లి .

 

ఉత్త చవటల్ని గద్దె నెక్కిస్తే ఇలాగే ఉంటాయి ఫలితాలు ! తెలుగు నాట ఒక్క ఎన్టీఆర్ తప్ప తెలుగు కోసం కష్ట పడ్డ నాయకులు లేరు. యజమాని లేని పొలం లాంటిదే ప్రస్తుతం తెలుగు జాతి.

నాల్గవ తెలుగు ప్రపంచ సభల సందర్భం గా అందరికి శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-12- ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  25

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

272-శంకర శాస్త్రి గారి ప్రతిభ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం లో ఎంత ఉందో ,ఆధునిక శాస్త్రీయ సంగీతం లోనూ అంతే ఉంది .ఆర్కెస్ట్రా సంగీతం భారతీయం కాదు .మన సంగీతం లో ఒక్క కళాకారుడే సంగీత విద్యా ప్రదర్శన చేస్స్తాడు.తాళ ,మృదంగాలు కేవలం సహకారాలే .కాని ఆర్కెస్ట్రాలో అనేక వాద్యాలు ఒకే స్వరాన్ని పలికించటం విశేషం .అంటే గాత్రం లో బృంద గానం లాంటిది ఆర్కెస్ట్రా  అన్నమాట . అదుకే దీన్ని’’ వాద్య బృందం’’ అన్నారు .వాద్యబృందం లో శాస్త్రీయ సంగీతాన్ని వినిపింప జేయటం ,అందులో కూడా రాగం ,తానం ,పల్లవులను వినిపింప జేయటం ,అందులో మరీ ముఖ్యంగా తోడి రాగ౦ తానం ,పల్లవి కట్టటం అన్నీ  శాస్త్రి గారు చేసిన అద్భుతాలే .అద్భుతాలకే అద్భుతం .అద్భుతాలకే అద్భుతం అని పించారు .వీణపై తోడి రాగాన్ని వాయించటం లో శాస్త్రి గారు అద్వితీయులు ..తోడి రాగం లో ఇతర వాద్యాల తోడు గా వాద్య సమ్మేళన రచన గా తీర్చి దిద్ది కొత్త దారి వేసి మార్గ దర్శకులయ్యారు ..వాద్య సంగీతం అంటే సినిమాలో రీ రికార్డింగ్ సంగీతం లా ,లలిత సంగీతంలాఅని పిస్తుంది .శాస్త్రి గారు దీని ట్రాక్ లోంచి తప్పించి శాస్త్రీయ సంగీతాన్ని కూడా ,అందులోనూ రాగం ,తానం ,పల్లవి ని వాద్య సమ్మేళన రచనగా రూపొందించి దివ్యానుభూతిని కలిగించారు అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు .శాస్త్రి గారి వాద్య బృంద సంగీతం వింటుంటే ‘’ఆధునిక కర్నాటక వర్ణాలా !’’అని పిస్తాయన్నారు ఆచార్య శ్రీ .’’మనో ధర్మ సంగీతం శంకర శాస్త్రి గారి లో కొత్త రూపు ఎత్తింది .వీరి వాద్య బృంద సంగీత రచనలన్నీ వారి సృజనాత్మక ప్రతిభకు ఎత్తిన పతాకలు అని ముదిగొండ వారు అన్నమాట అక్షర లక్షలు చేసే సత్య వాక్యం .

273  -సంగీతం లో ఎన్ని ప్రయోగాలు చేసినా శాస్త్రిగారు శాస్త్రీయ సంగీతాన్ని వదిలి పెట్టలేదు .సంగీత శాఖలన్నిటిపైనా వారికి గౌరవమున్నా శాస్త్రీయ సంగీతాన్ని వీణ కచేరీలను వదలలేదు .తనకు అన్ని రాగాలు ఇష్టమే నని ముదిగొండవారి తో జరిగిన ఇష్టా గోష్టి లో చెప్పారు .కాని ‘’శంకర శాస్త్రి తనాన్ని’’ వాయించిన రాగాలలో శంకరాభరణం ,కల్యాణి ,తోడి ,గానమూర్తి ,కీర వాణి రాగాలున్నాయని’’ పసిగట్టారు ఆచార్య వర్యులు .’’శివ దీక్షా పరు రాలనురా ‘’అనే కురువంజి రాగ జావళి వారి వలన కొత్త ప్రాణం పోసుకొన్నదని ,ఆ రాగాలకు ’ పేటెంట్  ‘’శాస్త్రి గారిదే నని ముదిగొండ ఉవాచ .

275-దీర్ఘ ,లఘు కంపితాలతో,మంద్ర ,అనుమంద్ర తంత్రుల విని యోగం లో శాస్త్రి గారు మలయ మారుత వీచికలనే కాక ,ప్రళయ కాల ఝ౦ఝామారుతాలవరకు సృష్టించేవారు .రాగాలాపనలో అనవసర ప్రయోగాలు ,పునరుక్తులు ఉండేవికావు .స్వర ప్రస్తారం లో తాళం తీగెల మీద మీటు శాస్త్రి గారి మరో ప్రత్యేకత .కీర్తన పాఠం శంకర శాస్త్రి గారు వాయించి నంత స్పష్టంగా వాయించ గల వైణికులు ఒకరో ఇద్దరో ఉన్నారేమో నంటారు వీరభద్రయ్య గారు .తానం శాస్త్రి గారి చేతిలో కొత్త అందాలు సంతరించు కొన్నదని ,కచేరీలలో యే రాగం తర్వాత యే రాగం వాయించాలి ,యే రాగాలకీర్తనలకు రాగాలాపన ,స్వర ప్రస్తారం చేయాలి మొదలైన వాటికి శాస్త్రిగారు పెట్టిందే ఒరవడి గా నిలిచింది అన్నారు ముదిగొండ వారు .

276-ప్రతి కచేరీ చివర వీణ పై ‘’మంత్రం పుష్పం ‘’వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత .దీనికి ముందు ‘’కం సెప్టెంబర్ ‘’లోని పాశ్చాత్య సంగీతాన్ని వినిపించేవారు .దీన్ని ఎందుకు వాయించేవారు ?అనే ప్రశ్నకు ‘’ఇందులో ఒక రహస్యం ఉంది .దీని మీటు ‘’స్టక్కాటో’’ పద్ధతిది .తీగ మీద కలిగే’’ అనురణ నాన్ని ‘’ అంటే నిరంతర ప్రవాహాన్ని ఆపే పధ్ధతి అది అన్నమాట .వీణ మీద అన్నీ సాధ్యమేనన్న ‘’ధిషణాహంకారంప్రదర్శనం ‘’‘’శాస్త్రి గారిది అని మనకు తెలియ జెప్పారు ఆచార్య ముదిగొండ .విశ్వనాధ కున్న’’ ధిషణాహంకారమూ’’ ఇలాంటిదే .అది వారిద్దరి గర్వానికి చిహ్నాలు కావు. ప్రతిభ ఉత్పత్తి లకుదర్పణాలు.,పట్టాభి షేకాలు .వీణ లో మమైకం అయి శాస్త్రి గారు చేస్తే భారతీయ సాహిత్యం లో మమేకమై విశ్వనాధ చేశారు .కచేరీ చివరలో శాస్త్రి గారు ప్రవేశ పెట్టిన ఈ రెండు అంశాలు  వారిముఖ్య శిష్యుడైన చిట్టిబాబు గారి లో వృద్ధి పొంది ‘’వెడ్డింగ్ బెల్స్ ‘’అనే పాశ్చాత్య సంగీత క్యాసెట్ ఆవిష్కారమైంది .వేదమంత్రాలను చిట్టిబాబు గారు కూడా కచేరీ చివరలోనే వాయించి గురు సంప్రదాయాన్ని కొన సాగించారు

278 –శంకర శాస్స్త్రిగారు కచేరీలలో విద్వత్ ను ఎంతగా ప్రదర్శించేవారో ,అంతగానూ మాధుర్యాన్ని ఒలికి౦చేవారు . ఈ లక్షణం తోనే  వారి వాయిద్యం వీణ చిరస్మరణీయ మైంది .లాలిత్య ,మాధుర్యాలే లేక పోతే ఈమని శంకర శాస్త్రి లేరు .మాధుర్యానికి అడ్డం వచ్చేదాన్ని దేనినీ వారు అంగీకరించ లేదు .శాస్త్రిగారు అంటే  నిరహం కారులు , నిగర్వులు .తమ విద్య విషయం లో అహంకరించారు .’’సరస్వతీ మాత నా గుప్పిటి లో ఉంది ‘’అని చాటి చెప్పిన రోజూ ఉంది .అయితే ఇది విద్యాబలం వలన చేకూరిన శక్తి అని విస్పష్టంగా ప్రకటించారు ఆచార్య ముదిగొండ .

279-తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడి శాస్త్రి గారు గౌరవం పొందారు .యూని వర్సిటి  గ్రాంట్స్ కమిషన్  సభ్యులుగా నియమింప బడ్డారు .మద్రాస్ మ్యూజిక్ అకాడెమి లో ఎక్స్ పర్ట్ కమిటీ సభ్యులైనారు .కేంద్ర సంగీత నాటక అకాడెమీ గౌరవ సలహాదారుగా ఉండి,ప్రతిభకల విద్వాంసులనుజాతీయ స్థాయి లో  ఎంపిక చేసే బాధ్యతను స్వీకరించారు  .విద్యా మంత్రిత్వ శాఖకు చెందినా .కర్నాటక సంగీతానికి ఫౌండర్ చైర్మన్ గా  ,ఫిలిం అవార్డ్ కమిటీ  సభ్యులుగాఉన్నారు .

280 –‘’వైణిక శిరోమణి ,వీణా గాన గాంధర్వ ,గాన రూప కళా సరస్వతి ,వీణా వాదన తత్వజ్ఞ,,గాంధర్వ కళానిధి ,గాన కలాధర ,వీణా చక్ర వర్తి ,వల్లకీ వల్లభ’’ మొదలైన బిరుదాలు  శాస్త్రి గారి కీర్తి కిరీటం లో కలికితురాయిల వలె ధగ ధగ లాడాయి వారి ప్రతిభకు తార్కాణాలయ్యాయి .దక్షిణ భారత దేశ సంగీత విద్వాంసులలో  ప్రప్రధమంగా  వారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు లభించింది .సంగీత నాటక అకాడెమి ,సాహిత్య కళా పరిషత్ లు అవార్డులనిస్తే ,,ఆంద్ర విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ప్రదానంచేసింది . సంగీత సరస్వతికి చేసిన సేవను గుర్తించి భారత ఉప రాష్ట్ర పతి శాస్త్రి గారికి ‘’చతుర్దండి పండితః ‘’అని బిరుదునిస్తే భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారాన్ని ప్రదానం చేసి ఈ సంగీత సరస్వతిని  సన్మానించి ధన్యమైంది .

శాస్త్రిగారి కుమార్తె శ్రీమతి కళ్యాణీ నారాయణ రావు దూర దర్శన్ ,ఆకాశ వాణి లలో వీణ పై గొప్ప ప్రదర్శనలు చేసి తండ్రిగారి కీర్తి పతాకను ధరించి ముందుకు దూసుకు పోయింది .

 

సశేషం

Inline image 1  Inline image 2

భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 24 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7

ఇది విన్నారా కన్నారా !  24

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7

267-కేవలం వాద్యాలమీదనే కొన్ని స్వరాలతో సంగీత రచన చేసి ,దానిలో సంఘటనల వలన కలిగే అను భూతులను శ్రోతలలో కలిగించాలి అనే మహా విద్యలో శంకర శాస్త్రి గారు అద్వితీయులు .ఈఅనుభవం తో 80 కి పైగా ‘’వాద్య బృంద రచనలు ‘’చేసి వినిపించారు .ఇందులో కొన్ని సంఘటనా నేపధ్యం లో ఉంటె ,మరికొన్ని మహా పురుష జీవిత ఘటనా నేపధ్యం తో ఉన్నాయి .’’సౌమ్య పురుష ‘’అనే పేరుతొ మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలకు రచించారు .అలాగే ‘’భారత జ్యోతి ‘’,’’జవహర్ జ్యోతి ‘’దేనికది ప్రత్యేకం గా చేశారు .వీటిలో వీరి కీర్తిని ఎవరెస్ట్ శిఖరం పై అత్యున్నతంగా నిలిపినవి రెండు –ఒకటి ‘’ఆదర్శ శిఖరా రోహణ’’,రెండవది ‘’భ్రమర విన్యాసం ‘’అని ముందే చెప్పుకున్నాం .టేన్జింగ్ నార్కే ఎవరెస్ట్ ను ఎక్కటాన్ని  ‘’ఆదర్శం ‘’గా భావించి ఆ పేరు పెట్టారు ధ్వన్యాత్మకంగా .వాక్కు లేని హృదయ భాషను వారి వాద్య బృందం పలికించి ఆ సంఘటనను ‘’చిరస్మరణీయం ‘’చేశారు శాస్త్రి గారు .అలాగే తుమ్మెద అంటే భ్రమరం జీవితం లోని ఒక్క రోజు జీవితాన్ని సంగీతంగా అనువదించి మాటలకందని భావ వ్యక్తీకరణ చేసి తమ వీణానాదం లోని ఝ౦కా రాలను సహస్రదళ పద్మంగా వికసింప జేసి మహా మధురాను భూతి కలిగించారు .’’రస తేనే పట్టు ‘’ను నిర్మించి జుమ్మనే నాదం తో ,అమృతమయమైన కమ్మని జుంటి తేనె తాగించారు .

268 –ఈమని వారి ప్రతిభను యే కొంతకో పరిమితం చేయలేము .వారి ప్రయోగ వైవిధ్యం ఎల్లలు లేని సముద్రమే .సంప్రదాయ శాస్త్రీయ ,లలిత ,సినీ ,పాశ్చాత్య ,ఆర్కెస్ట్రా  హిందూ స్థానీ సంగీతాలలో ఎన్నో ఎన్నెన్నో మూలాలు , కిటుకులు  తెలిసిన మహా విద్వా౦సులాయన .అందుకే ఆర్కెస్ట్రా సంగీతం లో తోడి రాగ ఆలాపన ,తానం ,పల్లవులను రచించి లక్షలాది శ్రోతలకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించారు .శుద్ధ కర్నాటక శాస్త్రీయతను రంగరించుకొన్న తోడి రాగాన్ని వాద్య బృందానికి శాస్త్రి గారు తీసుకోన్నారంటే వారి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి .సాహసం, గుండె ధైర్యం ఉన్న వారు కనుకనే ఈపని చేశారు సార్ధకత నూ చేకూర్చారు .

269 -50 దేశాలు పాల్గొన్న ‘’ఏషియా రోష్ట్రం ఫైల్’’లో శంకర శాస్త్రిగారు ‘’స్వర రాగ సుధా రస ‘’అనే శంకరాభరణ కీర్తనను రాగ ,తాన ,స్వర కల్పన లతో మద్రాస్ ఆకాశ వాణి కేంద్రం లో రికార్డ్ చేసి ఆ పోటీకి పంపగా, దానికి న్యాయ నిర్ణేతలు ప్రధమ బహుమతినిచ్చి వారి సృజనకు నీరాజనాలు అందించారు .ఆ కాలం లో రష్యా దేశం లో శాస్త్రి గారి వీణా వాదన చాతుర్యాన్ని మెచ్చుకొని వారు లేనేలేరు అంటే అతిశయోక్తి కాదు అంటారు ఆచార్య ముదిగొండ వారు .’’యహూదీమెనుహిన్ ‘’ఈ పోటీ కి న్యాయ నిర్ణేత. శుద్ధ శాస్త్రీమైనా , సుందర లలిత సంగీతమైనా శాస్త్రి గారు దేనికి దానికే కట్టుబడి శ్రోతలను ముగ్ధులను చేయగలరు అన్నది శుద్ధ సత్యం అంటారు వీరభద్రయ్య జీ .

270-శాస్త్రి గారి ప్రయోగాలలో శిఖరారోహణం అయినది వారు రచించిన ‘’ఇందు ‘’.దీన్నే శ్రీ బి వి కె శాస్త్రిగారు ‘’మాగ్నం ఓపస్ ‘’అన్నారట .’’ఇందు ‘’వాద్య బృందం రచన లో కొన్ని ముఖ్యమైన సంగీత పర అంశాలున్నాయి .72 మేళ కర్తలు ,అందులో 6 రాగాలు .వీటిని ఒక్కొక్క సమూహంగా ,చేసి 12 సమూహాలుగా ఏర్పరచి ,ఒక్కో సమూహాన్ని ‘’చక్రం ‘’అనే పేరు పెట్టి ,మొత్తం 12 చక్రాల ఆవర్తనాన్ని సృష్టించారు .వీటికి 1-ఇందు 2 నేత్ర 3-అగ్ని 4 వేద 5-బాణ ,6-ఋతు7-ఋషి 8-వసు ,9-బ్రహ్మ ,10-దిశి ,11-రుద్ర 12 –ఆదిత్య అని నామకరణ౦  చేశారు .ఈ 12 చక్రాలలో మొదటి చక్రం ఇందు .

271 –ఇందుచక్రం లో 6 రాగాలు –కనకాంగి ,రత్నా౦గి ,గాన మూర్తి ,వనస్పతి ,మానవతి ,తాన రూపి లను పొందుపరచారు .ఈ ఆరు రాగాలలోనూ రిషభం శుద్ధ రిషభమే .అలాగే గాంధార మధ్యమాలు కూడా అంటే రి ,గ లు ప్రక్క ప్రక్కనే ఉంటాయి .ఇంకా తేలికగా అర్ధమవ్వాలంటే చతుశ్రుతి రిషభమే శుద్ధ గాంధారం .మధ్యమమూ శుద్ధమే .మరి ఈ ఆరు రాగాలకు ప్రత్యేకత దేనివలన వచ్చింది ?అంటే దైవత ,నిషాదాల వల్లనే వచ్చింది. కనకా౦గి లో అన్నీ శుద్ధస్వరాలు ,రాత్నా౦గి లో కైశికి నిషాదం ,గాన మూర్తి లో కాకలి నిషాదం ఏర్పడింది .ఈ ఆరు రాగాలతో ‘’ఇందు ‘’పేరు తో స్వర రచన చేసిన స్వర బ్రహ్మ శాస్త్రిగారు .అసలు ఈ ఊహ రావటమే మహా గొప్ప విషయం ,దాన్నిసవాలుగా  సాధించి నిరూపించి తమ ఉపజ్నను వెలుగులోకి తెచ్చారు .’’గాన మూర్తి ‘’రాగం పై శాస్త్రి గారికి –మహా గొప్పఅంటే అపారమైన  సాధికారత ఉంది  .ఒక్క ఎం .ఎల్. వసంత కుమారి తప్ప వేరెవ్వరూ ఈ రాగాన్ని ఇంతగా స్వాధీనం చేసుకో లేదు .గమకం లో స్పష్టత సాధించుకోలేని  వైణికునికి ఇందు చక్ర రాగాలను పలికించటం అసాధ్యమైన పని .అంతటి తపనా తపస్సు శాస్త్రి గారిది .సంగీత వైడుష్యాన్నీ ,మాధుర్యాన్నీ రెండిటినీ ద్రుష్టి లో పెట్టుకొని వాద్య బృంద రచన చేసి చిర యశస్సు సాధించిన ‘’మకుటం లేని మహావీణా  సంగీత చక్ర వర్తి’’ శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు అని సామాన్యులకు అర్ధం కాని ఈ విషయాలను అలవోకగా కరతలామలకం చేసి చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గురు మూర్తులు .

Inline image 2

సశేషం

70 వ స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 23 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6

ఇది విన్నారా కన్నారా !  23

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6

262-తానం లయ బద్ధమైన రాగాలాపనమే .ఆ లయకూ వీణ వాద్యం లో నాద మాధుర్యం లో ని౦ప గలిగే అవకాశం ఉంది .దీన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న మహానుభావులు ఈమని శంకర శాస్త్రి గారు .రాగాలాపన చేయటం లోనూ శాస్త్రి గారు వీణ లో ప్రత్యేకత సాధించారు .రాగాలాపనలో మీట్లుతక్కువ గా ఉంటాయి .ఐతే శాస్త్రి గారు తక్కువ మీట్లతో రాగాలాపన చేస్తూనే స్వరకల్పనలో లాగానే స్వర సమూహాలను వెంట వెంటనే మీటి రాగాలాపనలో భాగం గా వాటిని మెరిపించేవారు .వీరి తరవాతి వైణికులు కూడా దీన్ని బాగా అంది పుచ్చుకున్నారు అంటే శాస్త్రిగారి ప్రయోగం యెంత ఔన్నత్యాన్ని సాధించిందో అర్ధమవుతుంది .తానం మీట్లతో ,తాళం తీగలను మీట కుండా ,రాగా లాపనలో ఇమిడించటం కూడా శాస్త్రి గారి మరో విశిష్ట పద్ధతియే అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

263 –గాయకుని గొంతులో వంపు సొంపులు ఇచ్చా మాత్రం తో తేగలగడం ఎలాంటిదో ,వీణ లో మీటు అలాంటిది .అందరూ వీణ బాగానే వాయిస్తారు .కాని వాదన కళ ఈ వంపు సొంపులను సృష్టించటం లోనే ఉంది .వీటినేసంగీత శాస్త్రం ‘’గమకాలు’’ అన్నది .మీటులో నైపుణ్యమే  లేక పొతే గమకం సిద్ధి౦చనే సిద్ది౦చదు .మీటులో నైపుణ్యం కుదిరాక ఎడమ చేతితో దండం మీద తీగలను సాధించాలి .ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిస్తే ‘’వాదనం ‘’అవుతుంది లేకపోతే మిగిలేది ‘’రోదనమే ‘’అని చమత్కరించారు ఆచార్య జీ..శంకర శాస్త్రి గారికి  అటు కుడి చేతి మీటు లోను ,ఇటు ఎడమ చేతి వాయింపు లోను ఉన్నంత అధికారం మరే వైణికుడికి లేదని ఆచార్య ముదిగొండ ఘంటా పదంగా చెప్పారు .రెండిటికి సమప్రాదాన్యమిచ్చినప్పుడే ప్రేక్షక శ్రోత్రుజనం సంతోషిస్తారు .ఈ రెంటినీ సాధించినప్పుడే వైణికుడు కూడా తన ‘’కళలో రమిస్తాడు ‘’.ఒక రకం గా ఇది ‘’వైణిక సవ్య సాచిత్వం ‘’అని తేల్చారు వీరభద్రయ్య గారు .ఈ విద్యకు శంకర శాస్త్రిగారు పెట్టింది పేరు అని తీర్పునిచ్చారుకూడా .గతించి పోయిన వీణా వైభవాన్ని శాస్త్రి గారి ఈ సవ్య సాచిత్వం తోనే పునరుద్ధరించారు అని నిర్ద్వంద్వంగా ముదిగొండ వీరభద్రయ్య గారు ఆచార్యానుభవం తో నిర్ణయించి చెప్పారు .

264-వీణ పై తోడి రాగం వాయించటం కష్టమని ,మరీ ,’’హనుమత్తోడి’’లో సాధారణ గా౦ధారాన్నీ ,కైశిక నిషాదాన్నీ మెట్టు మీద చూపటం కుదరనే కుదరదని ,దీనికి దగ్గర గా ఉండే ఆనంద భైరవిలో సాధారణ గా౦ధారాన్ని పైనే చూప వచ్చని ,చూపాలి కూడా నని అన్నారు ఆచార్య శ్రీ .కాని కర్నాటక తోడి లో ఇది కుదరదు .దాన్ని ఖచ్చితంగా ఎప్పుడైనా చతుశ్రుతి రిషభం లోనే ,కంపిత గమకం తో చూపాలి .ఆరోహణలోనూ అంతే .అలాగే శుద్ధ దైవతం లోనే కైశిక నిషాదాన్ని చూపాలి .  దీనివలన స్వర కల్పనలో వేగ సాధనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని, కాని శాస్త్రి గారు సంప్రదాయాన్ని పాటిస్తూనే మధ్య మధ్యలో కైశిక నిషాదాన్నిమెట్టు పైననే చూపేవారని ,చాలా కొద్ది సార్లు సాధారణ గా౦ ధారాన్ని మెట్టు మీదే చూపేవారని  కాని అది ఏమాత్రం ఎబ్బెట్టుగా ఉ౦డేదికాదని,పైగా గొప్ప అందంగా ఉండేదని స్వర రాగ కషాయాన్ని కాచి వడబోసిన  ఆచార్య వర్యుల ఉవాచ .నాట రాగం లో షట్ శ్రుతి రిషభం ,షట్ శ్రుతి దైవతం లను వెనక స్వరాలలో లాగి చూపాల్సిందే తప్ప మెట్టు మీద వాయించటానికి వీలు లేదని ,అవరోహణలో మాత్రమప్పుడప్పుడు అలా వాయించినా ఓర్చు కొంటు౦దని  శాస్త్రిగారి వాదనలో ఈ మెలకువలన్నీ ఇమిడిపోయి ఎంతో రామణీయకం సృష్టింప బడేది అని వీణా వాదనా సామర్ధ్యమున్న ఆచార్య ముదిగొండ వీర భద్రయ్యగారు . విశ్లేషించి వెలికి తీసి చెప్పిన ‘’మహా వాక్యా’’లివి .

265-శాస్త్రం లో గమకాలూ’’ పది’’ అని, వాటిలో ఆరోహరణ అవరోహణ, మూర్చనలు విశేషం లేనివని ,ఢాలు,స్పురితం ,కంపితం ,ఆహతం ,ప్రత్యాహతం ,త్రిపుచ్చం ,ఆందోళనం అనే ఎనిమిది గమకాలూ వీణ మీద వాయిస్తే విశేష మాదుర్యాన్నిస్తాయని ,శంకర శాస్త్రి గారు వీటి నన్నిటినీ’’ నిర్దుస్టం’’గాను ‘’నిర్దిష్టం ‘’గాను పలికి౦చేవారని ,కాంటాక్ట్ మైక్ వీటికి ఎంతగానో తోడ్పడిందని ,ఈ ‘’దశ విధ గమకాలు  ‘’కాకుండా శాస్త్రి గారు మరొక ‘’12 గమకాలు ‘’వీణా వాదన లో సృష్టించారని ,వాటికి పేర్లు లేవని ,ఇప్పుడు వాటిని వాయి౦చేవరూ లేరని ,శాస్త్రిగారి కుమార్తె మాత్రం కొన్నిటిని వాయిస్తుందని తేల్చి చెప్పారు ఆచార్య వర్యులు .

266-వీణా తంత్రులను కృత్రిమ గోళ్ళను తొడుక్కొని వాయిస్తారు చాలామంది .వీటిని తీగలతోనే చేస్తారు .వీటిని మధ్య వ్రేలికి దాని ప్రక్క వ్రేలికి తొడుక్కుంటారు .అయితే శాస్త్రిగారు వీటిని అసలు వాడేవారు కాదు .అంతాసహజమైన గోళ్ళ ద్వారానే సాధించారు .నాదం లో హెచ్చు తగ్గులు కలిగేట్లు మీటడం వలన గొప్ప శ్రుతి సుభగాత్వాన్ని శాస్త్రిగారు సాధించే వారు అంటారు ఆచార్య ముదిగొండ శ్రీ .

 

Inline image 1 Inline image 2Inline image 4

 

చంద్ర లేఖ సినిమా లో  మూడు  దృశ్యాలు

సశేషం

15-8-16 సోమవారం 70 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 22 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5

ఇది విన్నారా కన్నారా !  22

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5

258-గాత్రానికి గాత్రత్వం ఎలాంటిదో వీణ కు ‘’వీణత్వం’’ అలాంటిది .చాలామంది వైణికులలో ఈ  వీణత్వం లోపిస్తుంది .7 తంత్రులను వీణ మీద మీటి నప్పుడు కలిగే నాద సౌభాగ్యం ఇతర వాద్యాలలోకాని గాత్రం లో కాని రాదు అంటారు ఆచార్య వీరభద్రయ్య .ప్రతి వాద్యానికీ ఒక పరిమితి ఉంటుంది .ఆ పరిమితి లోనే వీణ వృద్ధి చేశారు శంకర శాస్త్రి గారు .త౦త్రి మీద కంపిత గమకాన్ని సాధించటం కుదరదు .కాని ప్రయోగ శీలి అయిన శాస్త్రిగారు అనుమంద్ర తంత్రిని పరాన్ముఖంగా కాకుండా ,అభి ముఖంగా లాగి గమకాన్ని సాధించిన నేర్పు ఈమని వారిది అంటారు శ్రీ వీరభద్రయ్య .మంద్ర ,అనుమంద్ర తంత్రుల మీటులో సాధించిన మరో విశేషం ఉంది .వీణ బ్రిడ్జికి మేళాంతానికిమధ్య మీటటం కాక ,తార స్వరాలు పలికే మెట్ల మీద ఆ తంత్రులను బొటన వ్రేలితో మీటటం .మామూలు చోట మీటితే వచ్చే ధ్వనికి ,దండం పై తారస్థలం లో మీటితే వచ్చే ధ్వనికీ ఎంతో భేదం ఉంది అని విశ్లేషించి చెప్పారు ఆచార్య వీరభద్రయ్య .ఇక్కడే రసికులు ,సంగీత ప్రియులు గమనించాల్సిన అంశం ఒకటి ఉందంటారు ఆచార్య వర్యులు .తీగపై మీటు ఎక్కడ మీటాలి ?ఇది ఒక్కొక్క త౦త్రి పై ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది .సందర్భాన్ని బట్టికాకుండా అన్నిటికీ మేళాంతంనుంచి బ్రిడ్జి వరకు తీగలోని మధ్య బిందువు మీద కాని ,మేళాంతం లో కాని మీటటం సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు .కాని శాస్త్రి గారు మీటే స్థలాన్ని అక్కడక్కడ మారుస్తూ నాదం లో గొప్ప వైవిధ్యాన్ని సాధించారు .మీటును బ్రిడ్జి కి ఆనుకొన్న స్థలం లో మీటి రాగానికి ,స్వరానికీ ఎంతో భేదాన్ని చూపారు శాస్త్రి గారు మూడు చోట్ల మీటు ను మీటడం వలన వాద్యధ్వనిలో ఉండే యాంత్రికత ను తొలగించి’’ సజీవత్వం ‘’కల్గించటం శాస్త్రి గారి అద్భుత కృషి అన్నారు వీణ విమర్శకులైన ముదిగొ౦డవారు .

259-శాస్త్రి గారు సాధించిన మాధుర్యం మీటే స్థలాన్ని బట్టి తెప్పించారు . ఆ తంత్రులకు ‘’జీవం ‘’పెట్టారు .అంటే బ్రిడ్జి మీద ఈ రెండు తంత్రులకు ఒక ‘’గరుకైన ఉన్ని పోగు’’ను పెట్టి ,దానితో ఆ తంత్రులను మీటినప్పుడు ఒక విచిత్ర ,విశిష్ట మధుర ధ్వని కలుగుతుంది ఈ పధ్ధతి త౦బూరాలో ఉంది .దీన్ని వీణలోనూ తెచ్చారు శాస్స్త్రిగారు .వాయి౦పు లో మంద్ర తంత్రీ నాదానికి అనూహ్యమైన మాధుర్యాన్ని ఈ ‘’జీవం ‘’వలన సాధించేవారు శాస్త్రి గారు అని కనిపెట్టి చెప్పారు ముదిగొండ అయ్యవారు.అంతవరకూ మీటు విషయం లో ఇలాపరిశోధించిన వారు లేరని ముదిగొండ ఉవాచ .వీణా వాదనా మాధుర్యం లో సగం ఈ మీటు లోనే ఉంది  .

260-సారణి మీద పంచమాన్ని మీటి నప్పుడు పంచమ తంత్రిని కూడా జోడించటం సాధారణ వైణికులు చేసేపని .కాని శాస్త్రి గారు సారణి మీద వాయిస్తున్నప్పుడు, కేవలం స-ప-స- లను వాయిస్తున్నప్పుడు మాత్రమే కాక ,తక్కిన స్వరాలను మీటు తున్నప్పుడు కూడా ఇతర తంత్రులను అక్కడక్కడ మీటి ‘’అనితర సాధ్యమైన మాధుర్యాన్ని ‘’సృష్టించేవారు .వీటి గురించి తెలియాలంటే వారి ప్రయోగాలే శరణ్యం అన్నారుఆచార్య  వీరభద్రయ్య  .

261-తాళం తీగల విషయ౦ లో కూడా శాస్త్రి గారి వాదన లో ప్రత్యేకత ఉంది .పూర్వ సంప్రదాయం లో తాళాన్ని చూపేటప్పుడు మాత్రమే తాళం తీగలను మీటేవారు .తాళాన్ని చూపేటప్పుడు ‘’ఘాత ‘’ఎక్కడ చూపితే అక్కడ మాత్రమే తాళం తీగలను చిటికెన వ్రేలి గోరు తో పైకి మీటేవారు .తరువాత తర్వాత ఈ విధానం మారింది .అప్పుడు శాస్త్రిగారు తాళం తీగలను మాధుర్యం సృస్టించటానికి మాత్రమే వాడారు .ఇప్పుడు ఎవరూ వారి నైపుణ్యాన్ని అనుకరించ లేక పోతున్నారు శ్రుతికి ప్రత్యామ్నాయం గానిలపడమే కాక ,సారణి మీద వాయింపు కు మాధుర్యపు గుబాళింపు ,రోచిస్సు లను జోడించి ఘనత తెచ్చారు అని విశ్లేషించారు డాక్టర్ వీరభద్రయ్య .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 21 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4

ఇది విన్నారా కన్నారా !  21

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4

250-రేడియోలు గ్రామ ఫోన్లు ఇంకా జనం కొనుక్కోలేని రోజులవి .సంగీత విద్వాంసులు రికార్డులను తెస్తూనే ఉన్నా ప్రతి ఇంట్లో వినే అవకాశం లేని రోజులు .మోజున్నవారు డబ్బున్నవారు మాత్రమేకొని, విని ఆనది౦చ గలిగే రోజులవి .అలా౦టికాలం లో ఈమనివారు  1943 తిరుచినాపల్లి ఆలిండియా రేడియో స్టేషన్ నుంచి మొదటి వీణ సంగీత కచేరీ ఒక గంట సేపు  చేశారు .ఆ కచేరీతో కాకినాడ సరస్వతీమహళ్ సభాధ్యక్షులు శ్రీ దివాన్ బహదూర్ కొమ్మిరెడ్డి సూర్య నారాయణ మూర్తి నాయుడు గారితో పాటు ,అట్టడుగు వర్గం దాకా ఈమని వారి అభిమాను లయ్యారు .ఈ నాయుడు గారి వద్దనే శాస్త్రిగారు హిందూస్తానీ ,పాశ్చాత్య సంగీత మర్మాలను తెలిసికొన్నారు .వీటివలన శాస్త్రి గారి వీణా వాదన సామర్ధ్యం కొత్త అవతారమెత్తి అందరి అభిమానానికి పాత్రమైంది .

251-ఆ నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ సాంబ మూర్తి గారి సలహా మేరకు శాస్త్రి గారి తండ్రిగారు కుటుంబాన్ని మద్రాస్ కు 1940లో మార్చారు .ఇంటర్ పూర్తీ చేసి వాసన్ గారు నిర్మించిన జెమిని స్టూడియో లో పాప నాశన౦ శివన్ ,దండపాణి దేశికర్ ,సాలూరి రాజేశ్వర రావు వంటి దిగ్దంతుల సరసన 18 ఏళ్ళ శాస్త్రిగారు సంగీత బృందం లో చేరటానికి వీణను వాయించమంటే మూడు గంటలసేపు శాస్త్రిగారు కచేరీ చేయగా ముగ్ధులై వాసన్ గారు బృందం లో చేర్చుకున్నారు .తండ్రి పిల్లాడు పాడైపోతాడేమోనని బాధ పడ్డారు .శాస్త్రిగారికి చిన్నప్పటి నుంచి ఇతరులలో మేలిమి గ్రహించటం ,దాన్ని తనబాణీలోఒదిగేట్లుచేయటం రివాజు .చతురత సాధించాక వీణపై పాశ్చాత్య సంగీతాన్ని వాయించి మెప్పు పొందారు .దీని మీటు ,పధ్ధతి వేరు .కుడి ,ఎడమ చేతుల రెండింటి పని కర్నాటక సంగీతానికి బహు దూరం .సినిమాలకు వీణ వాయించినా ,సగీతదర్శకత్వం వహించినా వారి సృజన శక్తియే అగ్ర శ్రేణిలో నిలబెట్టింది .సినిమాలకు వాయించి ఉండక పొతే జాతీయ వాద్య బృందానికి నాయకత్వం వహించటానికి అవకాశం వచ్చి ఉండేదికాదు .శాస్త్రి గారి వాద్య బృంద రచనలు తర్వాత కాలం లో ప్రాంతీయ రేడియో స్టేషన్ లలోని వాద్య బృందాలకు ఒరవడి పెట్టాయి .

252 –జెమినీలో ఉండగా రెండవ ప్రపంచ యుద్ధకాలం లో సంగీత సంరంభం కొంత కాలం ఆగి పోయింది .దాక్షారామం వెళ్లి కచేరీలు చేయటం మళ్ళీ మొదలు పెట్టారు .జెమినీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చి వెళ్లి చేరారు .జెమినీ సినిమా ‘’దాసీ అపరంజి ‘’సినిమాకు రెండుపాటలు శాస్త్రి గారే కట్టారు .’’శ్రీ జయ పరమేశ’’పాట బాగా జన రంజక మయింది .సంగీత దర్శకులు కాకుండానే ఇలా ఎన్నో పాటలకు స్వరాలు కూర్చారు .బి యే పూర్తిచేయటానికి కాకినాడ వెళ్లి పాసై తిరిగి వచ్చారు .వాసన్ గారి దగ్గర మళ్ళీ చేరి ,తాము తీస్తున్న ‘’మంగళ ‘’హిందీ సినిమాకుట్యూన్లు కట్టమని కోరగా మాంచి బాణీలు కట్టారు   తెలుగు సినిమా ‘’సంసారం ‘’కు శాస్స్త్రి గారు కట్టిన ట్యూన్లు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాయి .ఇవికాక ‘’బహుత్ దిన్ హుయే ‘’,మిస్టర్ సంపత్ ‘’,నిషాన్ ,’’చంద్రలేఖ ‘’సినిమాలు శాస్త్రి గారి బాణీల ఓణీల తోనే జనాన్ని మెప్పించి దిగ్విజయమయ్యాయి  .చంద్ర లేఖ సినీ సంగీతం రికార్డ్ లను సృష్టించింది

253 –జెమినీలో ఉండగానే శాస్త్రిగారు వీణా వాద్యానికి ఎన లేనిసేవ చేశారు .వాద్య బృందం లో అప్పటి దాకా వీణ వెనక వరుసలో ఉండేది .ఎవరికీ దాని స్వారస్యం ఆనేదికాదు. ‘’అగస్త్య భ్రాత ‘’అయింది అప్పుడు వీణ .జెమినీలోని పాశ్చాత్య సౌండ్ ఇంజనీర్ ఏడాదికోసారి తన దేశానికి సెలవు మీద వెళ్లి వచ్చేవాడు .ఒకసారి అలాగే వెళ్లి వచ్చి అక్కడ గిటార్ కు కాంటాక్ట్ మైక్ అంటే పికప్ పెడుతున్నారని చెప్పి తెచ్చిచ్చాడు .ఈ పికప్ ను వీణకు అమర్చి తమ సంగీతాన్ని బాగా పికప్ చేశారు శాస్త్రీజీ .సున్నిత గమకాలను  నాజూకు మీట్లను పట్టుకొని శ్రోతలకు వాటిని వీణపై అందించి పరవశులను చేసేవారు .దీనితో వీణకు మళ్ళీ నాజూకుల నగలు ఆభరణాలుగా భాసి౦చాయి వీటికన్నిటికీ ఆద్యులు శంకర శాస్త్రి గారే .ఆ తర్వాత పికప్ అందరికీ ఆరాధ్యమై, మాంచి పికప్ సాధించింది

254 -1959 డిసెంబర్ 1 న శాస్త్రి గారు మద్రాస్ రేడియో స్టేషన్ లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా చేరారు .1961 లో ఢిల్లీ లో నేషనల్ ఆర్కెస్ట్రా కు కంపోజర్ గా ,కండక్టర్ గా ,డైరెక్టర్ గా పని చేశారు .అంతకు ముందే కొన్ని వాద్య బృంద రచనలు చేసి శ్రోతలను మంత్రం ముగ్ధులను చేశారు .

255-1940 నుండి -76 వరకు శంకర శాస్త్రి గారి సంగీత జీవితం విశిష్టంగా పాతికేళ్ళు సాగింది .అనుక్షణ సంప్రదాయ ,ప్రయోగాలు సాగాయి .వీణా వాదాన్నిశర వేగంగా ముందుకు తీసుకు వెళ్ళారు .శాస్త్రీయ సంగీతం తోపాటు లలిత ,వాద్య సంగీతాలకూ సత్పరిణామాలు సాధించి చూపారు .

256 –వీణ కర్నాటక సంగీతానికి ,సితార్ ,సరోద్ లు హిందూ స్తానీకి ప్రత్యేకత అని భావించే రోజులవి .ప్రపంచ సంగీత చరిత్రలో మొదటి సారిగా శాస్త్రిగారు శ్రీ రవి శంకర్ తో సితారా తో కలిసి వీణ వాయించారు ఆధార శ్రుతి నుంచి రెండు రీతుల బాణీలవరకుఅన్నీ సమస్యలే .వీటినన్నిటినీ పరిష్కరించు కొంటూ శాస్త్రిగారు సరి కొత్త ప్రయోగం చేసి రెండు వాద్యాలనుంచి రెండు బాణీల సంగీతం నుంచి మేలిమి ని ఈ కచేరీలో రాబట్టారు .దీన్ని ఆకాశ వాణి ప్రసారం చేసింది .భారతీయ సంగీత చరిత్రలో’’ తొలిజుగళ్ బందీ ‘’ఇదే .దీనికి ఆద్యుడుతెలుగు బిడ్డ  శాస్త్రి గారే కావటం మన అదృష్టం .వీణ వాయిస్తూ ఒక భజన పాడి వినిపించిన శాస్త్రి గారిని భారత ఉప రాష్ట్ర పతి, శాస్త్రి గారిని ‘’ఇంటే గ్రేటర్ ‘’అని ప్రశంసించారు .సితారా ,వీణా ,సరోద్ బాణీలను ఇంటేగ్రేట్ చేసిన ఘనత శాస్త్రి గారిదే .

257  -సినీ సంగీత ప్రపంచానికి పి బి శ్రీనివాస్ ను ,ఎ.ఏం రాజా ను గాయకులుగా పరిచయం చేసి కానుకగా ఇచ్చిన వారు శాస్త్రి గారే .ఇక వీణకు కానుకగా శ్రీ చిట్టి బాబు ‘’ను ,శ్రీమతి వి యెన్ సరస్వతిని వారసులుగా అందించారు శాస్త్రి గారు.

Inline image 2

సశేషం

కృష్ణా పుష్కర ప్రారంభ , వరలక్ష్మీ వ్రతం శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-16- కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 20 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

ఇది విన్నారా కన్నారా !  20

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

‘’మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు ‘’అనే కీర్తన ఎప్పుడూ పాడుకోనేవారట .శంకర శాస్స్త్రి గారు కూడా చివరి కచేరీలలో ఈ కీర్తనే వాయి౦చేవారట .వారు ముక్త పురుషులు .నాదం లో లయించేవారు .1987 డిసెంబర్ 23 న ఈమని వారు ‘’ఈమనికి ‘కి ’స్వస్తి చెప్పి శంకర గళ నిగళం లో చేరుకొన్నారు .వారు తూర్పు గోదావరిజిల్లా ద్రాక్షా రామపుణ్య క్షేత్రం లో  1922 సెప్టెంబర్ 23న జన్మించారు  .ఇక్కడే అశ్వత్ధ నారాయణుడూ వెలసి ఉన్నాడు. అంటే శివ కేశవ క్షేత్రం అన్నమాట .65ఏళ్ళు మాత్రమే  జీవించి ప్రతిక్షణాన్నీ సార్ధకం చేసుకొన్నారు  .తండ్రి అచ్యుతరామ శాస్త్రి  తాతగారుసుబ్బా రాయ శాస్స్త్రి గార్లు ఇద్దరూ మహా వైణికులే .శాస్త్రిగారికి నలుగురు అక్కయ్యలు .తల్లి మగపిల్లాడికోసం తపన చెంది అశ్వత్ధ నారాయణుడికి మొక్కుకొంటే ఆ స్వామి అనుగ్రహం తో శంకర శాస్త్రి గారు జన్మించారు .బాలసార నాడు వీరికి పెట్టిన పేరు ‘’శంకర సూర్య మాణిక్యాల రావు ‘’.

248 –అంత ధనిక కుటుంబం కాకపోయినా భుక్తికి లోటు లేనిదే .కొడుకు సంగీత వృత్తిలో స్థిరపడటం తండ్రిగారికి ఇష్టం ఉండేది కాదు .కాని శంకర శాస్త్రి గారికి నర నరానా ,ప్రతి రక్త బి౦దువులోనూ సంగీతమే ఉంది. ఏమీ తెలియని వారి శైశవ బాల్యాలలోనూ సంగీతమే ప్రవహి౦చింది వారిలో   .తండ్రిగారు ఇది విన్నారా కన్నారా !  20

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

247-‘’సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా ‘’.త్యాగరాజస్వామి వారు జీవితపు చివరి రోజులలో నాద లోలురై వీణ వాయించు కొంటూ ఉంటె వీరు నోటితోనే మృదంగ జతులను పలికే వారట .అంటే తాళ వాద్యం లేకుండానే తాళ ధ్వనులను పలికే వారన్నమాట .లయ ,తాళాలు అలా వారికి ఆజన్మ సిద్ధంగా లభించిన వరాలయ్యాయి .  తాళం తో పాటు మధురంగా పాడటం కూడా యే శిక్షణా లేకుండానే వచ్చేసింది .ఈ చైల్డ్ ప్రాజేడీ ప్రతిభ గుర్తించి తండ్రిగారు కొన్ని వర్ణాలు నేర్పారు .కాని సంప్రదాయ శిక్షణ కొడుకుకు అవసరం లేదని కొద్ది రోజుల్లోనే గ్రహించారు .కుమార సంభావ కావ్యం లో మహా కవి కాళిదాసు పార్వతీ దేవికి ప్రాక్తన విద్య తో సకల శాస్త్రాలు లభించినట్లు చెప్పాడు .అలాగే శాస్త్రిగారివిద్యఅంతా  కూడా ప్రాక్తన విద్య యే.ఉపదేశాకాలం లో ఈ ప్రాక్తన విద్య సహజంగా దానంతటికి అదే బయటికి వచ్చేది .అంతటి చిన్న వయసులోనే వీణ పై ప్రయోగాలు చేసేవారు .కొత్త ధ్వనులు సృష్టించేవారు ప్రకృతిలో విన్న ప్రతి ధ్వనినీ వీణ పై పలికించి అబ్బుర పరచేవారు .ఒక్క ఏడాది కాలం లోనే కచేరీ కి కావాల్సినంత పాఠం నేర్చుకొని ,ప్రయోగ శీలత తో దాన్ని గుబాళింప జేసేవారని ఆచార్య ముదిగొండ అన్నారు .

249-దాక్షారామం లో మూడవ ఫారం చదివి ,కాకినాడ వెళ్లి పెద్దక్క సరస్వతమ్మ గారింట ఉండి,పి ఆర్ కాలేజీలో ప్రిసిపాల్ పెద్దాడ రామ స్వామిగారిని పాట తో మెప్పించి సీటు సంపాదించారు .ప్రిన్సిపాల్ గారే వీరి పేరును ‘’ఈమని శంకర శాస్త్రి ‘’గా మార్చారు .ఇది ఆయనకు రెండవ బారసాల అయి ఆ పేరే స్థిర పడి విశ్వ వ్యాప్తమై పోయింది ‘’.పేరులోన పెన్నిధి కలదు ‘’అని రుజువైంది .’’సూర్య మాణిక్యాల రావు’’నోటితో మృదంగమే వినిపిస్తే ,శంకర శాస్త్రి జీవితమంతా వీణ నే వినిపించాడు .వీణ పై పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తున్నప్పుడు వ్రేళ్ళతో ఆ పాట లయను వీణ బుర్ర మీద కొట్టి వినిపించేవారు .వీరి కాలేజి చదువుకు రెండు సార్లు విఘ్నం కలిగింది .1930 లోని చదువు ,1945 కు కాని బి యే .పట్టాను ఇవ్వలేక పోయింది ‘

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-16 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 19 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2

ఇది విన్నారా కన్నారా !  19

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2

242-‘’హాలులో నాలుగు గోడలమధ్యబందీ అయిన వీణా వాద్యాన్ని ,ఆధునికకాలపు అభి రుచులకు అనుగుణంగా ,మైదానం లోకి తెచ్చి ,ప్రపంచ వ్యాప్త సంగీత రసికులను’’ శాంత రసం ‘’లోము౦చినవారు ఈమనివారు .ఇదివారి సంకల్ప శక్తీ ,నిరంతర అభ్యసనం ,సాధనారక్తీ ,వాద్యం పైనిబద్ధత ,నిరంతర కృషి ,పరిశోధనాసక్తీ,పరిశీలా దృష్టి వల్లనే సాధ్యమైంది .త్రిలింగ క్షేత్రమైన ద్రాక్షారామం లో పుట్టి,ఆనాటి తెలుగు దేశపు అగ్రశ్రేణి వైణిక విద్వాంసులైన పితృపాదులు శ్రీ అచ్యుత రామ శాస్త్రి గారి వద్ద నే వీణా వాదనా సామార్ధ్యాన్ని పొంది ,వీణను ’’తెలుగు వీణ ‘’గా అవతార మెత్తించి  అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టారు.   వీణను తెలుగు వీణగా ప్రతిష్టించిన ఘనత శాస్త్రి గారిదే .వీణ అంటే తెలుగు వాళ్ళది ,అనే గౌరవం సత్కీర్తి ఈమని వారే కలిగించారు .సంగీత వ్యాప్తికి తమిళులు ఎంతగా కృషి చేశారో వీణ వ్యాప్తికి ఈమని శంకర శాస్త్రి గారు అంతటి కృషి చేశారు’’అని విశ్లేషించిన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పలుకులు ‘’ప్రాబలుకులే ‘’.

243-ఈమని వీణావాదనం  ఎవరి వాద్యాన్నీ పోలి ఉండదు .అందులో వారి వ్యక్తిత్వమే ప్రతిధ్వనిస్తుంది .వాద్య రీతు లో వారి వాద్య రీతి కల్తీ చేయబడలేదు .అతి సున్నితమైన గులాబీ రెక్కల రెపరరెపలను చూపారు .మేఘ గంభీర నాదంతో ధను౦జయుని ధనుస్ట౦ కారాన్నీ చూపుతూ ,ఒక్కో రసానికి ఒక్కొక్క రీతిని ప్రయోగించిన విశేష నేర్పు వారిది .

244-ఈమని వారి వీణా నాద వైవిధ్యం అనితర సాధ్యం .ఒక్కొక్క సారి సితారా లాగా ,మరోసారి సరోద్ వలె ,మరికొన్ని సార్లు గిటార్ మెరుపులతో ,వేరొక సారి గోటు వాయిద్యంగా తంత్రీ వాయిద్యాల విభిన్న వ్యక్తిత్వాలనన్నిటినీ తమ వీణ లోనే పలికించి మెరిపించి మురిపించ గల నాద యోగ సిద్ధులు శంకర శాస్త్రి గారు .హృదయం లో మోగే ‘’అనాహతాన్ని ‘’తమ మీటుల నడుమ ‘’నిశ్శబ్దం’’ లో ‘’మ్రోగించే ‘’ఘనత శాస్త్రి గారిది .దీనినే వారు ‘’మ్యూజికల్ సైలెన్స్ ‘’అన్నారు .’’దీన్ని అనుభవించి ఆలాపనలో ఈ నిశ్శబ్ద స్థితి ని చూపలేని సంగీత కళాకారుడు ఎవ్వరికీ యే అనుభవాన్నీ ఇవ్వలేడు’’అన్న ఆచార్య ముదిగొండవారి మాటలు వారి అనుభవానికి చిరునామాలు .

245-భారత దేశం లో ‘’కాంటాక్ట్ మైక్’’(పికప్ )ను మొట్టమొదటగా వాడిన వారు ఈమని వారే .పికప్ వాడి వీణా నాదం లో ,మీటు లో ,నాజూకులు ,నయగారాలు తెచ్చిన ప్రప్రధమ వైణికులు శంకర శాస్త్రి గారు .లలిత సంగీతం లో శాస్త్రీయ వాసనలను ,శాస్త్రీయ సంగీతంలో  లలిత సంగీత ‘’లే పరిమళాలను ఘుమ ఘుమలను  ‘’అద్దిన ప్రయోగ శీలి శాస్త్రి గారు . ఈప్రయోగ శీలత యే వారిని ఢిల్లీ ఆకాశ వాణి కేంద్ర వాద్య బృంద సంగీత దర్శకుని ,మద్రాస్ జెమనీ సినీ స్టూడియో లో కొన్ని హిందీ ,తెలుగు సినిమాలకు సంగీత దర్శకుని చేసింది .

246 –లోకాన్ని ,లోకపు సంఘటనలను వీణా నాదం లోకి అనువదించటం అంతకు ముందు ఎన్నడూ లేనిది .శాస్తి గార ఈ పని చేసి చూపి ఆశ్చర్య పరచారు .టెన్సింగ్ నార్కే ఎవ రెస్ట్ శిఖా రాన్ని అది రోహించిన వార్త విని స్వయంగా స్పందించి ‘’ఆదర్శ శిఖరా రోహణ౦ ‘’అనే గొప్ప వాద్య బృంద సంగీతాన్ని సృష్టించి ప్రసారం చేయించారు .దీన్ని విన్న శ్రోతలందరూ తామే అధిరోహిస్తున్న అనుభూతికి లోనయ్యారు .అంటే వీణా వాదనతో ఇతర వాద్యాలను జోడించి సంగీతాన్ని ఎవరెస్ట్ శిఖరా రోహణ౦  చేయి౦చా రన్నమాట ఈమని వారు .టెన్సింగ్ ఎక్కి చరిత్ర సృష్టిస్తే సంగీతం తో ఎవరెస్ట్ నెక్కించి  శంకర శాస్త్రి గారు మరో చరిత్ర సృష్టించారు .అలాగే ‘’భ్రమర విలాసం ‘’అనే రసమయ సంగీత రచన చేసి వినేవారికి ‘’భ్రమర ఝంకారాన్ని ‘’అను భూతిలోకి తెచ్చారు .దీనిలోని సంగీత విశేషాలను తెలుసుకోనేట్లుకూడా  చేశారు .ఇలా తమ సంగీత యాత్రలో శాస్త్రి గారు వందలాది ప్రయోగాలు చేసి భేష్  సెహభాష్ అని పించుకొన్నారు .ఇలాశాస్త్రి గారి గురించి  యెంత రాసినా ,యెంత చెప్పినా తనివి తీరదు ..అద్భుత రసానందమే అనుభవైక వేద్యం అవుతుంది .ఒళ్ళు పులకించి పోతుంది .

Inline image 1  Inline image 2

సశేషం

రేపు 12-8-16 శుక్రవారం శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ ,శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణాపుష్కర, వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు

సాహితీ బందువులకు సాహిత్యాభిమానులకు 12-8-16 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ శుభాకాంక్షలు ,మరియు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్

Inline image 1Inline image 2

పుష్కరోత్సవం!
12-08-2016 01:32:19

                  పుష్కర ఘడియల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నది. తెలుగుసమాజం యావత్తూ భక్తిపారవశ్యంలో పులకరించి పోతున్నది. జలం జీవమై, మానవ నాగరికతలు నదీమతల్లుల ముద్దు బిడ్డలైనప్పుడు, పాడిపంటలు ప్రసాదించే ఆ జీవనదులను అర్చించి, తమ ప్రాణదాతలకు ప్రణమిల్లే సమున్నత సంప్రదాయం మనది. ఎండిన గొంతుకల సేదతీర్చి, తెలుగునేలపై నిండైన పచ్చదనాన్ని పరచే కృష్ణవేణమ్మ పుష్కర మహోత్సవాన, నిండుగా మునకేసి పునీ తులు కావడానికి కోట్లాదిమంది సంసిద్ధులైన తరుణంలో తెలుగు ప్రభుత్వాలు బృహత్తరమైన ఏర్పాట్లతో ప్రజాభీష్టాన్ని నెరవేరు స్తున్నాయి.

                  పుష్కరాలు భారతీయ ధార్మిక జీవనానికి ప్రతీకలు. ఉమ్మడి భావనకు చిరునామాలు. సమైక్యతకు నిదర్శనాలు. పుష్కరుడైన వరు ణుడు ఏడాదికొకటి చొప్పున, ఈ దేశంలోని పన్నెండు పుణ్యనదుల్లో నివాసం ఉంటాడన్న శాస్త్రోక్తితో పన్నెండేళ్ళకోమారు ప్రతీనదికీ పుష్క రాలు వస్తాయి. ఆయా కాలాల్లో ఈ నదీపరీవాహక ప్రాంతాలు పుణ్య భూములై పులకరించిపోతాయి. ఇప్పుడు దేవగురువు బృహస్పతి కన్యా రాశిలో కాలూనిన కాలంలో, దేశంలో మూడవ అతిపెద్ద, పుణ్యనదుల్లో ఆరవదిగా శాస్త్రాలు అభివర్ణించిన కృష్ణమ్మ పుష్కరుడి ఆగమనంతో పులకించిపోతున్నది. తన 1400 కిలోమీటర్ల ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల చారిత్రక, సాంస్కృతిక జీవనంలో ప్రముఖ పాత్రపోషిస్తూ, వివిధ పురాణాల ప్రశస్తిని పొందిన కృష్ణవేణి ఈ దారిపొడవునా అనేక ఆలయాలను అభిషేకిస్తున్నది. తెలుగునేల మీద ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం, అష్టాదశపీఠాల్లో ఒకటిగా ఉన్న అలంపూర్‌లతో పాటు అనేకానేక పుణ్యస్థలాలను స్పృశి స్తున్నది. ఆయా దివ్యక్షేత్రాల మహిమ, నదీ పవిత్రత కలగలసి పుష్కరకాలంలో తీరంలోని ఆలయాలు మరింత మహత్తును సంతరించుకుంటాయన్న విశ్వాసమే నదీస్నానం అనంతరం అలయ దర్శనాన్ని ఒక విధిగా మార్చింది. సహ్యాద్రి పర్వతసానువుల నుంచి హంసలదీవిలో సాగరసంగమమయ్యేవరకూ మార్గమధ్యంలో అనేక ఉపనదులను కలుపుకుంటూ పరవళ్ళు తొక్కే కృష్ణవేణి మానవ నిర్మిత ఆధునిక దేవాలయాలకూ ఆధారభూతమవుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీవంటివాటిని నిండుగా దీవిస్తూ, తెలుగునేలను సస్యశ్యామలం చేస్తూ, కోట్లమంది దప్పిక తీరుస్తున్నది.
                  పుష్కరుడి ఆగమనంతో పులకించే పుణ్యతీర్థాలు, భక్తజన పాదస్పర్శతో తడిసిముద్దవుతున్న వందలాది స్నానఘట్టాలు, అలం కరణలతో వెలిగిపోతూ, భక్తిపారవశ్యంలో పరవశించిపోతున్న ఆల యాలు తెలుగునేలన దర్శనమిస్తున్నాయి. చల్లనితల్లి కృష్ణమ్మకు తలవంచి నమస్కరించి, మునకలేసి తరించడానికి బారులు తీరు తున్న భక్తులకోసం ఘనమైన ఏర్పాట్లు చేయాలన్న దృఢ సంకల్పంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సుదీర్ఘకాలంగా శ్రమించాయి. తెలంగాణ ప్రభుత్వం 825 కోట్లతో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1200 కోట్ల కేటాయింపులతో, ఉమ్మడిరాష్ట్రంలో జరిగిన చివరి పుష్కరాల బడ్జెట్‌కు పదిరెట్లు ఇప్పుడు ఖర్చుచేస్తున్నాయి. 1992లో కోటీపాతికలక్షలున్న భక్తజనుల సంఖ్య, మరుసటి పుష్కరాలకు మూడుకోట్లయినప్పుడు ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకోట్లకు చేరుతుందన్న అంచనాలు కట్టి ఇంతటి వ్యయానికి నడుంబిగించినా, పనుల నాణ్యత విషయంలో ఎప్పటిమాదిరిగానే విమర్శలు తప్పడం లేదు. వాటిని అటుంచితే, ఈ సామాజిక మహోత్సవాన్ని సజావుగా ముగించడం ప్రభుత్వాల కర్తవ్యం. ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్ళతో భక్తజనకోటి రాకకోసం ఏర్పాట్లు చేసినప్పుడు డజనుకుపైగా ప్రభుత్వవిభాగాలు సయోధ్యతో, సమన్వయంతో మిగతా బాధ్యతలను కర్తవ్యనిష్ఠతో నెరవేర్చి ఈ పుణ్య స్నానాల ప్రక్రియను మధురానుభూతిగా మార్చవలసిన అవసరం ఉన్నది.
               ప్రయాణానికి వీలైన, పేరున్న ప్రాంతాలకే భక్తులు అధికంగా తరలివెళ్ళే చరిత్ర ఇటువంటి సందర్భాల్లో కనిపిస్తున్నదే. అందువల్ల తక్కిన ఘాట్ల వివరాలను ఆధునిక సమాచార వ్యవస్థద్వారా తెలియ చెప్పడంతోపాటు, ఎప్పటికప్పుడు రద్దీని కూడా విశదీకరించి మార ్గనిర్దేశనం చేయడం అవసరం. ప్రభుత్వ సమాచారాన్నీ, హెచ్చరికలను పెడచెవినపెట్టకుండా భక్తులు కూడా సంయమనంతో తోడ్పాటుతో వ్యవహరించినప్పుడే ఈ పుణ్యకార్యం ప్రమాదాలకు తావులేకుండా ప్రమోదాన్ని అందిస్తుంది.
                  తనకు ప్రాణాధారమైన నీటిముందు వినమ్రంగా మోకరిల్లే ఈ ఆధ్యాత్మిక క్రతువు ప్రకృతిపట్ల ప్రేమకూ ఆరాధనకు ప్రతీక. దీనికి ఆయాప్రాంతాల్లోని విభిన్నమైన ఆచారాలు, విధులు, విశ్వాసాలు తోడైనప్పటికీ, అది అందిస్తున్న సందేశాన్నీ, అంతిమసారాన్నీ తన జీవనపర్యంతం గుర్తెరిగి వ్యవహరించడం మనిషి బాధ్యత.


 
 
Inline image 3
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-8-16 బుధవారంహైదరాబాద్ లో మేము

, మా అమ్మాయి ,పిల్లలుమధ్యాహ్నం ఓల్డ్ బోయినపల్లి లో మా చిన్నక్కయ్యా బావా వాళ్ళింట్లో ,సాయంత్రం నల్లకుంటలోమా అన్నయ్య గారమ్మాయివేదవల్లీ ,రామ కృష్ణ గారింట్లో ను ,రాత్రి మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో ను గడిపిన చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

ఇది విన్నారా కన్నారా !  18

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

239ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తారని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే జగన్మాత వారి చేతులలో వీణ ను ప్రసాది౦చి౦దట .వారి వారసుల వద్ద ఆ వీణ ఇప్పటికీ ఉందట .ఆ వీణకు ‘’యాళి’’అదో ముఖంగా కాక ఊర్ధ్వ ముఖంగా ఉండటం విశేషం .అంటే వీణ శిరస్సు కిందికి కాక పైకి ఉంటుందన్నమాట .

240-మైకుల్లేనికాలం లో  దూరంగా ఉండేవారికీ వినబడాలని వైణికులు తంత్రులను బలంగా మీటేవారు .దీనివలన నాదం లోని అందం పోయేది .శివ మహా దేవుడు వీణ వాయించినట్లు త్యాగ బ్రహ్మ కీర్తనలో ఉంది .చాలామంది వీణ వాయించినా వారికే కీర్తి వచ్చిందికాని వీణకు రాలేదు .ఈమని వారు జన్మించి పరమేశ్వర వీణకు ఘనతను సాధించి పెట్టారు .వారు జన్మించి ఉండక పోతే ఇది సాధ్యమై ఉ౦డేదికాదంటారు ముదిగొండవారు .’’అన్ని వాద్యాల స్థాయిలో వీణను నిలబెట్టి ,కొత్త ఊపిరులూది ,నూతన జన్మ నిచ్చి ,సర్వ స్వతంత్ర ,సంపూర్ణ ,సమగ్ర ఘన వాద్యం గా నిలిపిన ఘనత మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి మహోదయులదే’’అన్నారు ఆచార్య ముదిగొండ .

241-‘’ఆర్కెస్ట్రాలో వెనక ఉండే దుర్దశ నుంచి తప్పించి దాన్ని ఉచ్చ స్థాయికి తెచ్చి ,గాత్ర ధర్మాల నన్నిటిలోను వీణను నిలిపి  ,గాత్రం కంటే ఎక్కువగా వీణ మాధుర్యాన్ని నింపి ,సంగీత ప్రపంచాన్ని అమృత పానం చేయించిన సంగీత జగన్మోహిని యొక్క పుంభావ మూర్తి శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు ‘’అని విశ్లేషించి చెప్పారు ముదిగొండజీ .వీణ ను బయటి వస్తువుగా భావించక ,తన ‘’దేహాత్మ’’ లలో ఒకదానిగా ,తన ఆత్మగా ,అంతరాత్మ గా  భావించి,దానితో లయించిన నాద యోగి ఈమని శాస్త్రీజీ .గాయకుని గొంతు కంఠంలో ఉంటే ,శాస్త్రి గారు తన గొంతును బయట ఉన్న వీణకు ఇచ్చి ప్రదర్శించారు .ఆయనలోని గొంతుకూ ఆయన ఒడి లోని వీణకూ భేదం లేనే లేదు .దీక్షితులవారు ‘’మీనాక్షి మేముదం దేహి ‘’అని పాడుతూ జగన్మాతలో లీనమైతే శంకర శాస్త్రిగారు నాలుగున్నర గంటల సేపు గుంటూరు లో వీణ కచేరి చేసి ,ఆజ్ఞాపక  లహరీ ప్రవాహం మనసు నిండా నింపుకొని అదే రోజు రైలులో ప్రయాణం చేస్తూ అనంత వాయువులలో తన ప్రాణ వాయువును లయింప జేసుకొన్నారు .వారి ప్రక్కనే వారి వీణ కూడా  ఉంది .ప్రాణోత్క్రమణ  కు ముందు చాలా కాలంగా వారు తమ వీణ తో మాట్లాడుతూ ఉండేవారట .ఆ మాటల్లో సారాంశం ‘’నేను ఎప్పుడు చెబితే అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు ‘’అని .వీణ వారికి జడపదార్ధం కాదు .అది ఆయనలోని సరస్వతీ మాత .వీణలో ఆవాహనమైన ఆ దేవతా మూర్తినే దర్శించేవారాయన  .పేరుకే కాక నిజంగానే భోళా శంకరులే శంకర శాస్త్రి గారు .వీణ మీద  ఈషణ్మాత్ర తిరస్కృతి  కూడా వారు సహించేవారు కాదు .ఒక సంగీత విమర్శకుడు ఒక సారి ఆయనతో చమత్కారంగా ‘’అయ్యా !ఇప్పుడు సరస్వతీ దేవి వీణ ను వదిలేసి ,అంతకన్నా సౌఖ్యమూ ,ఎక్కువ సౌలభ్యమూ ,వేగ సిద్ధీ ఉన్న వయోలిన్ ను పట్టుకోన్నట్లుంది ‘’అంటే శాస్త్రిగారు ఆయన వైపు ‘’గుడ్లురిమి ‘’చూశారట .వీణ అంటే వారికి అంతటి నిబద్ధత .శాస్త్రిగారికి ముందుకాలం లో  వీణను విద్వాంసులు కష్టం అనుకోని వేగంగా వాయించేవారు కాదు .ఆ లోటును పూడ్చి శాస్త్రిగారు మహా వేగంగా వాయించి యెంత తేలికో రుజువు చేశారు .సరోద్ వాయించే అమ్జాద్ ఆలీఖాన్ కు వేగంగా వాయించటం మహా ఇష్టం .అలాంటి ఖాన్ సాబ్ తో శాస్త్రి గారు వీణతో యుగళం  వాయించి ప్రపంచ శ్రోతలనే మెప్పించారు .వారి సాధన ,ప్రయోగం అంతటివి.

Inline image 1Inline image 2 Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-10-8-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 17

ఇది విన్నారా కన్నారా !  17

34-వైణిక సార్వ భౌమ –శ్రీ పప్పు సోమేశ్వర రావు

231 –వీణా ,జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు శ్రీ పప్పు సోమేశ్వర రావు .’’సోమేశ్వర కృతి కదంబం ‘’పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 199 7 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు .’’కృతి కదంబం ‘’పేరుతో సంస్కృత భాషా కృతులను రాశారు .నవగ్రహాలపై రాసిన కృతులు వీరి సంస్కృత భాషా  సంగీత పాండిత్యానికిప్రాతీకలు .

232-పప్పు వారు విజయనగర పద్ధతిలో తానం వాయించి ప్రత్యేకత సృష్టించారు .విజయవాడ రేడియోలో 14 వ ఏట మొదటి కచేరీ చేశారు బావగారు అయ్యగారి సోమేశ్వర రావు గారే గురువు .ఎన్నో రేడియో కేంద్రాలలో కచేరీ చేశారు .వీరి రాగం,తానం పల్లవి లకు ప్రత్యేకత ఉంది .100 పల్లవులను విభిన్న తాళాలలో వాయించే అరుదైన నేర్పున్నవారు అలా హైదరాబాద్ కేంద్రం లో వాయించి చూపారుకూడా .

233  -ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ సికందరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలలో వీణా చార్యులయ్యారు .వైణికుని కి పరీక్ష పెట్టె తోడి ,ఆనంద భైరవి ,శహన ,కేదార గౌళ ,కాపీ ,నీలాంబర రాగాలను సాధికారంగా వాయించే నైపుణ్యం వారిది .

234 –మరీ చిన్నతనం లో వాయించిన కచేరీలకు పారితోషిక ధనాన్ని తండ్రిగారి పేర చెక్ ఇచ్చేవారట .వీరికుమారుడు పప్పు చంద్ర శేఖర్ కూడా తండ్రికి తగ్గ వారే –‘’వీణానాద సుధార్ణవ ‘’,వైణిక సార్వ భౌమ ‘’బిరుదాంకితులు .12-9-2002 వైణిక సార్వభౌమ ,వైణికశిరోమణి  పప్పు సోమేశ్వర రావు గారు పరలోక గతులయ్యారు .

Inline image 1

35-వైణిక శిరోమణి –శ్రీ వాసా కృష్ణ మూర్తి

235 –వాసా వారి కుటుంబమంతావీణా వాదన  సంగీతం లో ధన్యమైనవారే .వాసా పెద జగ్గన్న గారి నుంచి రామ దాసు ,దాసన్న ,చిన జగ్గన్న,పెద కామయ్య ,నర్సయ్య ,అప్పయ్య ,చిన కామయ్య ,సాంబయ్య ,కృష్ణ మూర్తి ,వెంకటరావు సాంబ మూర్తి ,కృష్ణ మూర్తి గారి దాకా   పది తరాల వరకూ అందరూ వైణిక విద్వాంసులే అవటం అబ్బుర పరచే విషయం.

236- వాసా కృష్ణ మూర్తిగారు తయారు చేసిన శిష్యులు అనేకులున్నారు వీరి బాణీకి విశిష్టత ఉంది .హిందూ స్థానీ రీతిని కూడా మేళవించి వాయించే సామర్ధ్యం వారిది .వీరికుమారుడు వెంకటరావు గారుకూడా గొప్ప విద్వాంసులే .రెండు చేతులతోనూ వీణ మీటే ప్రత్యేకత కృష్ణ మూర్తిగారిది .కుడి చేతి వ్రేళ్ళతో మీటు ,ఎడమ చేతి వ్రేళ్ళతో వాదనమూచేసేవారు .రోజుకు కనీసం 10 గంటల సాధన చేసేవారు .

237 –తానం విషయం లో గొప్ప ప్రయోగ శీలి .తాళం తీగలను మీట కుండానే కృష్ణ మూర్తిగారు అప్పుడప్పుడు కొంతకాలం తానం వాయించి ,ఆ వెంటనే తాళం తీగల్ని మీటి దానితో కలిపేవారు .ఇదీ ప్రత్యేకత .ఆయన తానం పరవళ్ళు తొక్కే ప్రవాహం లాగా స్రవించేది .ఈవిధంగా స్పురిత ,ప్రత్యాహత ,సుళువులతో కూడిన మేళ రాగ పంచక తానం దురితం లో విజ్రు౦భించి వాయిస్తుంటే ‘’నాసామిరంగా’’- వినే వాళ్లకు సితార్ ,సరోద్ లు విన్నంతమదురాను భూతి కలిగేది

238 –నిర్మొహమాటి కృష్ణ మూర్తిగారు .ఎంత గొప్ప సంగీత విద్వా౦సుడైనా తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా   విమర్శించేవారు .1944 లో శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు కృష్ణ మూర్తిగారి వీణా వాదన విని ‘’శిరోమణి ‘’బిరుదునిచ్చారు .తర్వాత ‘’వైణిక శిరోమణి ‘’అయ్యారు .వీరి శిష్యులలో ప్రముఖులు –శ్రీ మంగు వెంకట రావు ,శ్రీ బి జగన్నాధం ,శ్రీ మతులు వసు౦ధరాదేవి,జోగులాంబ ,అ౦బుజవల్లి ,సుభాషిణి శాస్త్రి .కృష్ణమూర్తిగారిని ‘’వీణా వాదన పధ నిర్దేశికులు’’గా భావిస్తారు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలు –కొన్ని విశేషాలు

కృష్ణ వేణీ నది సాగర సంగమం అంత తేలిక గా జరి గిందా ?

అంటే జరగలేదనే చెప్పాలి .క్రిష్ణవేణీ నదికి సుమారు 20 ఉపనడదులున్నాయి .అవే తుంగ భద్ర ,భీమ ,పంచ గంగ ,ఘట ప్రభ ,పాలేరు ,మున్నేరు మొదలైనవి .వీటి జలకాలతో సంపూర్ణమై బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతూ బంగాళాఖాతం వైపుకు పరుగు పరుగున వస్తోంది .బెజవాడ దగ్గరకు రాగా ఇంద్ర కీలాద్రి ప్రవాహాన్ని ఆపేసింది .ఇక అంగుళం ముందుకు కదిలే వీలు లేక పోయింది.దీనికో కధ ఉంది .కీలుడు అనే కొండ అమ్మవారికోసం తపస్సు చేయగా ఆమె ప్రత్యక్షమైంది .వరం కోరుకో మంటే అమ్మవారిని హృదయ స్థానం లో నిలిచి పొమ్మని వేడుకొన్నాడు .అలానే అని కనక దుర్గమ్మ తల్లి కీలును హృదయ కుహరం స్వయంభువు గా నిలిచి పోయింది .సహ్యాద్రి నుండి ప్రవహిస్తూ అనేక ఓషధులను తనతో మోసుకొచ్చిన కృష్ణ వేణీ నది వలన భూములన్నీ సారవంతమై బంగారు పంటలు పండి కృష్ణా పరీవాహక ప్రాంతమంతా సశ్యశ్యామలమైంది .అదొక దివ్య క్షేత్రమైంది .అదే కీలాద్రి .ఇంద్రుడు మొదలైన దేవతలు కృష్ణ వేణీ నదిలో పవిత్ర స్నానాలు చేసి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించి పూజించారు .కనుక అది అప్పటి నుండి ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయింది .సముద్రుని చేరాలన్న కృష్ణానది తపన కీలుని వలన తీరకుండా ఆగి పోయింది .మళ్ళీ దేవతలందరూ కీలుడిని ప్రార్ధించి కృష్ణ వేణీ నదికి దారి ఇమ్మన్నారు .సరే అన్న కీలుడు తన కొండలో  ఒక సొరంగం ఎర్పడేట్లు చేసి నదీ ప్రావాహాన్ని దానిగుండా సాగి పొమ్మన్నాడు .అప్పటికే చాలాకాలంగా నిలిచి పోయిన కృష్ణ నీరు మహోద్రుతంగా సొరంగం ద్వారా ప్రవహించటం తో దానికి తట్టుకో లేక పెద్ద కొండ చరియ విరిగి తేలుకొంటూ సుమారు రెండు మైళ్ళు నదీ ప్రవాహం పై తేలుతూ కొట్టుకు పోయింది .దీనినే ‘’తేలు కొండ ‘’అన్నారు .అది విజయవాడ సమీపం లో ‘’యనమల కుదురు ‘’వద్ద ఆగి పోయి అక్కడ ఒక దివ్య క్షేత్రం వెలసింది .దీన్ని  ‘’ఫల్గుణ తీర్ధం’’అంటారు .ఇక ఉత్సాహంగా ప్రవహిస్తూ హంసల దీవి వద్ద  పాయలుగా చీలి సాగర సంగమం పొంది తరించింది .

‘’కృష్ణా పరీ వాహక ప్రాంతం లో మొత్తం 138 పవిత్ర క్షేత్రాలు ఏర్పడి ప్రసిద్ధి చెందాయి .

క్రష్ణానదీతీరాన్ని పాలించిన రాజులు –విశేషాలు

కృష్ణానది తూర్పు భాగ దేశాన్ని క్రీ శ.3 ,4 శతాబ్దాలలో ఇక్ష్వాక రాజులు పాలించారు .వీరి రాజధాని విజయపురి అంటే నేటి నాగార్జున సాగర్ .క్రీ శ.4 వ శతాబ్దిలో మచిలీ పట్నం దగ్గరున్న ‘’కూడూరు ‘’అంటే నేటి గూడూరు బృహత్పలలాయనుల రాజధాని .అప్పుడు అది గొప్ప రేవు పట్టణం కూడా .బందరు ఓడ రేవు నుండి యూరోపియన్ దేశాలకు ‘’మజ్లిన్ ‘’అనే చా సున్నిత సుందర వస్త్రాలు ఎగుమతి అయ్యేవి .అందుకే దానికి మచిలీ పట్నం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల ఉవాచ .

తరువాత శాలంకాయన , ఆనంద గోత్రీక రాజులు కృష్ణకు రెండు వైపులా పాలించారు .వీరి తరువాత పాలించిన విష్ణు కుండిన రాజులు మొగల్రాజ పురం ఉండవల్లి గుహలను నిర్మించారు .7 వ శతాబ్దం లో విష్ణు కుండిన రాజుల రాజ దాని బెజవాడ .వారి పాలనలో కళా ,సాంస్కృతిక వికాసం సమృద్ధిగా జరిగింది .ఇంతటి చారిత్రకల కృష్ణా నదికి పుష్కర శోభ కొద్దిరోజులలో వస్తోంది .అందుకే కృష్ణ వేణీ మాతకు –

‘’కన్యా గతే గురౌ యద్య –సప్త కోట్యఘ నాశనం –స్నాన మాత్రేణ సర్వేషాం-తావత్పుణ్య వివర్ధనం ‘’అని నమస్కరిస్తూ పుష్కర పుణ్య స్నానం ఆచరించాలి .

Inline image 1Inline image 2Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-8-8-16 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 16

ఇది విన్నారా కన్నారా !  16

32-వీణకు అంతర్జాతీయ వైభవం కల్పించిన –శ్రీ మొక్కపాటి నాగేశ్వర రావు

226-1926 లో శ్రీ మొక్కపాటి సత్యనారాయణ ,శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లకు జన్మించి ఏలూరులో వీణ నేర్చి ,మద్రాస్ లో సంగీత విద్వాన్ పాసై నిలువుగా నిలబెట్టి వీణ వాయించే వైదుష్యం శ్రీ నాగేశ్వర రావు గారిది .1956 నుండి పదేళ్ళు మద్రాస్ లో వీణ బోధించి అనేక శిష్యులకు గురువయ్యారు .వీరి శిష్యులలో విదేశీయులు ఎక్కువ మంది ఉండటం విశేషం

227 -1966 లో ఫ్రెంచ్ ప్రభుత్వమిచ్చిన స్కాలర్షిప్ పై ‘’గ్రిగోరియన్ బాండ్ ‘’వారి చర్చి మ్యూజిక్ పై పరిశోధనకు ఆహ్వానింప బడి ,పూర్తీ చేశారు అమెరికా వెళ్లి ‘’వేసిలీనియన్ ‘’విశ్వ విద్యాలయం లో ఆచార్యులుగా పని చేశారు .1969 లో ఇండియాకు తిరిగొచ్చి అనేక కచ్చేరీలు చేస్తూ శిష్యుల చేతా చేయించారు .1970లో మద్రాస్ లో స్థిరపడ్డారు .1974 లో శ్రీ దండమూడి రామమోహన రావు గారితో కలిసి యూరప్ దేశాలలో పర్యటించి పలు సంగీత కచేరీలు చేసి మెప్పించారు .1976లో పారిస్ విశ్వ విద్యాలయం లో కర్నాటక సంగీత ఆచార్యులుగా నియమింపబడి సేవలు అంద జేశారు .

Inline image 1

33-వైణిక బాల భాస్కర –శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు

228—చరిత్ర సృష్టించిన మహా వైణికులు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు .వీణ గురువరాచార్యులు ,వారి పౌత్రులైన వీణ వెంకట రమణ దాసు గార్లను బాల్యం లోనే మెప్పించినవారు సోమేశ్వర రావు గారు .’’వాగ్గేయ కార రత్న ‘’శ్రీ హరి నాగ భూషణం గారు మచిలీపట్నం లో సోమేశ్వరావుగారు 19 వ ఏట చేసిన కచేరీకి ముగ్ధులై ‘’వయసులో చిన్నవాడే అయినా కళ లో వ్రుద్ధుడే .కళలో పూర్తీ సిద్ధ హస్తుడు .’’వీణా కోవిద’’అని విజయనగర సంస్థ ‘’భారతీ తీర్ధ ‘’అందజేసిన బిరుదు కు అన్నివిధాలా తగినవాడు .అంతకంటే ‘’వైణిక బాల భాస్కర ‘’బిరుదం అత్యుత్తమంగా ఉంటుంది ‘’అన్నారు .మార్చి 25 న ఈ బిరుదప్రదానం హరి వారి చేతులమీదుగా అందుకొన్న చైల్డ్ ప్రాజేడి సోమేశ్వర రావు గారు .

229-17-5-1951న కోయంబత్తూర్ లో ,ఆ తర్వాత తంజావూర్ లో వీణ కచేరీచేసి మెప్పించారు .15-2-1952  న మచిలీపట్నం ‘’ఆంద్ర సారస్వత సమితి ‘’వారు ‘’వైణికరత్న’’బిరుదునిచ్చి సత్కరించింది .శ్రీ సోమేశ్వర రావు విజయనగరం జిల్లా వేగేశ అగ్రహారం లో 1920లో జన్మించారు .విజయనగర సంగీత కళాశాలలో చదివి ‘’డిప్లొమా ‘’అందుకొన్నారు .చిన్న తనం లోనే స్నేహితులను చుట్టూ కూర్చో బెట్టుకొని ‘’సంగీత ఆట ‘’ఆడేవారు .ప్రతిమాటకూ సమాధానాన్ని సంగీతం లో చెప్పటం అప్పటి వీరి ప్రత్యేకత గ్రామ. ఫోన్ రికార్డ్ లను బహు శ్రద్ధగా వినేవారు .ఆది భట్ల నాయన దాసుగారు వీరి బాల్య సంగీత ప్రతిభ గుర్తించి ,విజయ నగర సంగీత పండితులకు పరిచయం చేసి శ్రీ పేరి శ్రీరామ మూర్తి గారి వద్ద గాత్ర విద్యకు కుదిర్చారు

230 –శ్రీ వాసా కృష్ణ మూర్తి తో కలిసి వారింట వీణ సాధన చేస్తూ ,నిలబెట్టి వీణ వాయించేవారు .దేశమంతా పర్యటించి అనేక కచేరీలు చేసి చాలా.సువర్ణ ఘంటా కంకణాలతో  సన్మానింప బడ్డారు .వీరి ధర్మపత్నికూడా వీరి శిష్యురాలే .వీరి సంగీతారాధనకు అచ్చెరువొందిన బాపట్ల ప్రజలు సగౌరవంగా ఆహ్వానించి అక్కడే ఉండే ఏర్పాటు చేసి గౌరవించారు .14-7-1973 న సోమేశ్వరరావు గారు 53వ ఏటనే సోమేశ్వర సాన్నిధ్యం చేరుకున్నారు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-16- కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం )

481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం )

శివ కర్ణామృతం లో పుట్టపర్తి వారి కవితా గీర్వాణం

పుట్టపర్తి వారి సంస్కృత భాషా గరిమకు ,వారి ఊహా సౌందర్యానికి అద్దం పట్టేదే ‘’శివ కర్ణామృతం ‘’.కాని దీనిని కొందరు సాహితీ ప్రియులేకాక సాహిత్య వరిస్టులు కూడా తమ రచనలు గా , వారివిగా ప్రకటించుకొన్నారని ఆచార్య వర్యులు మధునాపంతుల సత్యనారాయణ గారికి జాబు రాస్తూ బాధ పడ్డారు ..ఇలా వ్రాత ప్రతిగాఉన్నప్పుడే చేతులు మారింది ఈ కావ్యం .కాని ఇందులోని శ్లోకాలను ఆచార్యుల వారు పలు సభల్లో చదివి వినిపించటం తో వారి సంస్కృత భాషా వైదుష్యం చాలా మందికి తెలుసు .50 ఏళ్ళ  తర్వాత వారి కుమార్తె శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారిని చేరటం,తండ్రిగారు 1990 సెప్టెంబర్ 1 న  శివ సాయుజ్యం పొందాక ,మరణానంతరం  16 ఏళ్ళ తర్వాత ఆమె దీన్ని 20 06 లో ఆమె  ముద్రించి సాహితీ లోకానికి అందించారు .ఇదీ దీని తెర వెనుక గాధ..పరమ వైష్ణవులైన నారాయణాచార్య పరమేశ్వర భక్తితో శివ తా౦డవమేకాక  ,ఈ కావ్యాన్నీ  రచించి తమ అద్వైత భావనకు ఉద్దీప్తి కలిగించారు .

శివ కర్ణామృతం అంతా పరమేశ్వరుని గుణగాన లహరీ విలాసమే .ఒకే అంశం తో ఒక గ్రంధాన్ని రాయటం సాహసమే కాక అరుదైన విషయం కూడా .121శ్లోకాలతో విరాజిల్లే ఈ కావ్యం శివ పారమ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పింది .ఉదాహరణకు కొన్ని శ్లోకాల సొగసు చూద్దాం –

‘’కళానిధి కళావతీ  కలిత జూట వాటీ లస –త్త్రివిస్టప తరంగిణీ లలిత తాండవాడంబరః

మదా౦చిత విలోచనో మధుర ముగ్ధ వేషస్సదా-పరిస్పురతు మానసే గిరి సుతాను రాగాంకురః’’

భావం –గిరిపుత్రి పార్వతికి శివుడు అనురాగ అ౦కురంగా ఉన్నాడు .ఆయన జటా జూటం చంద్ర వంక తో శోభిస్తోంది .ఆ జూటం లో గంగానది అతి మృదులంగా తాండవిస్తోంది .అందుకని ఆయనకళ్ళు మదాలనం గా ఉన్నాయి  .ఆకట్టుకొనే ఇలాంటి రూపం ఉన్న శివుడు నన్ను అనుగ్రహించాలి .

49 వ శ్లోకం లో తమ ధార్మిక నైజాన్ని మనోహరంగా వర్ణించిన శ్లోక వైభవం చూద్దాం –

‘’శేష శైల శిఖా రాది వాసినః –కిమ్కరాః పరమ వైష్ణవా వయం –తత్తధాపి శశి ఖండ శేఖరే –శా౦కరే మహసి లీయతే మనః ‘’

అర్ధం –శేష శైల శిఖరం పై వెలసిన శ్రీనివాసుని భక్తులం పరమ వైష్ణవులం అయిన మేము నెల వంక శిరో భూషణం గా విరాజమానమైన ఆ పరమ శివ కాంతి స్వరూపం లోనే మా మనసులు లీన మౌతున్నాయి ‘’ అని తమ శివ భక్తిని వైష్ణపరాయణత్వాన్ని చెప్పుకొన్న అద్వైత భావి పుట్టపర్తివారు .

‘’శివ కర్ణామృతకావ్యం స్తోత్ర కావ్యం .భగవానుని రూప గుణ మహాత్మ్య ,తత్వ  భక్తీ తన్మయత్వ స్తుతి ఇందులో ఉండటం వలన భక్తుని అభ్యర్ధనం పరమ రామణీయకంగా ఆవిష్కృత మైంది .శబ్దాలంకార శోభ నిజంగా  చెవులకు అమృతం గా అంటే కర్ణా మృతం గా  భాసిల్లింది .బ్దార్ధ ఉభయ అలంకార శోభ నెమలిలా పురి విప్పి నాట్యం చేసింది ‘.ఈ కావ్యం లో ఆచార్యులవారు శివునిదివ్య కాంతి స్వరూపునిగా స్తుతించారు .శివుని విభూతిని కాంతి ,తేజో రూపాలుగా వర్ణించి దైవం ఒక్కటే అని ఆ దైవం ఆమెకాని అతడు కాని కాదని అదొక దివ్య తేజం అని ,ఆతేజం మానవులకే కాక సకల విశ్వ సృష్టి కి ఆధారమైనది అని తన మనో భావాన్ని తెలియజేసి వేదోపనిషత్ రహస్యాన్ని విస్పష్టంగా విడమర్చి చెప్పారు ‘’అన్న శ్రీ శశిశ్రీ గారి మాటలు ముత్యాల మూటలే.ఆచార్య వర్యుల ముఖ్య అంతేవాసిగా వారు గ్రహించిన పూర్తి సత్యమే ఇది .

సాహితీ పుత్రుని జీవిత విశేషాలు

శ్రీ కృష్ణ దేవరాయల రాజ గురువు తిరుమల తాతాచార్యుల వారి వంశం వారు అనంత పురం జిల్లా చిత్రావతీ నదీ తీరం లోని పుట్ట పర్తి చేరి తిరుమలవారు పుట్టపర్తి ఇంటి పేరు వారయ్యారు .పెనుగొండ తాలూకా చియ్యేడు గ్రామం లో మాతామహుల ఇంట నారాయణా చార్యుల వారు 28-3-1914 న జన్మించారు .తండ్రి శ్రీ శ్రీనివాసాచార్యులు .తల్లి లక్ష్మీదేవమ్మ (కొండమ్మ ). నారాయణా చార్యులవారికి తొలి గురువు తల్లి . అణ్ణయ్య ఆచార్యులవద్ద సంస్కృతం అభ్యసించారు .   ధర్డ్ ఫారం చదివే రోజుల్లోనే ‘’అల కవితా లోకమునకు ‘’అనే కంద పద్యం అల్లిన కుశాగ్ర బుద్ధి వారిది .పెనుగొండ కలెక్టర్ భార్య పిట్ దొరసాని వీరి కుటుంబ శ్రేయోభిలాషి .ఆమె షేక్స్పియర్ ,మిల్టన్ ల సాహిత్యాన్ని ఆపోసన పట్టిన విదుషీ మణి .ఆచార్యులవారికి ఆంగ్ల భాషపరిచయం ఆసాహిత్యం పై అభిమానం కలుగ జేసింది .రంజకం మహా లక్ష్మి అనే నృత్యకళాకారిణి  వీరికోరికపై కూచిపూడి ,భరతనాట్యాలను నేర్పింది .పుట్టపర్తివారి బంధువు  మైసూరులో ఉన్న శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి వద్ద ప్రాకృత భాష ,దాని భాషా భేదమైన ‘’అపభ్రంశం’’కూడా నేర్చి అందులోని కావ్యమైన ‘’జనహర చరిత్ర ‘’అధ్యయనం చేసి  కావ్య రచన పై ద్రుష్టి పడి. పెనుగొండ గతవైభవం మనసులో మెదిలి ‘’పెను గొండ లక్ష్మి ‘’కావ్యంగా రాశారు .అప్పటికి ఛందస్సులో పూర్తి ప్రవేశమూ లేదాయనకు .చిన్నప్పటి నుంచి తిక్కన భారతం వాచో విదేయం అవటం తో తేలికగా రాయగలిగారు .ఆర్ధిక స్తోమత లేక ముద్రా భాగ్యం కలిగించే లేక పోయారు .

తిరుపతి సంస్కృత కలాశాలలో చేరాలని వెడితే ప్రిన్సిపాల్ కపిత్ధలం కృష్ణమాచార్యులు పూర్వపు చదువు ధృవీకరణ పత్రాలు కావాలన్నారు .అవి ఉండటానికి అయన ఎక్కడైనా చేరి చదివితేగా!అసహనంగా బయటికి వస్తూ ఆశువుగా ఆవేశంగా పద్యాలు చెబుతూ బయటికొచ్చిన వీరిని వెనక్కి పిలిచి సీటు ఇచ్చారు ప్రిన్సిపాల్ .అదే వారి యోగ్యతా పత్రమైంది ,ప్రవేశ పాత్రమైంది.వ్యాకరణ అలంకార శాస్త్రాధ్యయనం చేస్తూ తోటి విద్యార్ధులకు వీటిని బోధిస్తూ’’ వాలి చరిత్ర ‘’,ఇందుమతి’’ అనే రెండు కావ్యాలు రాసి నచ్చక చి౦చి పారేశారు .అవధానాలు చేసి అలరించారు .ఊహా శక్తి కి  అవధానాలు అడ్డం అని మానేశారు .పాఠ్య భాగాలు ఆయనకు ‘’ఆనలేదు’’ .నటన పై ధ్యాస పెరిగి సహ విద్యార్ధులతో ‘’బొబ్బిలి ‘’నాటకాన్ని కడప జిల్లా రాజం పేట లో ప్రదర్శించారు .వీరు తాండ్ర పాపారాయుడు పాత్రను, చలమచర్ల రంగా చార్యులుగారు రంగ రాయుడు పాత్రధరి౦చారు .నిరంతర సాహిత్య గోష్టి జరిపేవారు . వారి ధారణా శక్తి అమోఘం   భట్ట బాణుని కాదంబరి కావ్యం  షేక్స్పియర్ మిల్టన్ షెల్లీ కీట్స్ వర్డ్స్ వర్త్ కవుల రచనలను ఆసాంతం  అప్పగించేవారు .వాల్మీకి రామాయణం నాలుకపై ఎప్పుడూ నర్తి౦చేది .అలివేలుమంగా పురానికి ఉత్తరాది మఠం స్వామి శ్రీ సత్య ధ్యాన కీర్తుల వారొచ్చినప్పుడు వారి సమక్షం లో సంస్కృతం లో ఆశుకవిత్వం చెప్పి షట్ శాస్స్త్ర పండితులైన స్వామినే మెప్పించారు .తిరుపతిలో తాను చదవటానికి ఏదీ మిగలి లేదని పెను గొండ కు వెళ్లి పోయి పరీక్ష సమయానికి వచ్చి రాసి ఉత్తీర్ణులయ్యారు .

1934 లో14 వ ఏట’’  పెనుగొండ లక్ష్మి’’ కావ్యం రాశారు .19 వ ఏట ముద్రణ పొందిన ఆ కావ్యాన్ని  మద్రాస్ ప్రభుత్వం ఇంటర్ కు పాఠ్య గ్రంధం చేసింది .తిరుపతిలో ఉండగానే ఇంటర్ పరీక్ష రాసి తాను  రాసిన కావ్యానికి తానే విద్యార్ధిగా పరీక్ష రాసి చరిత్ర సృష్టించారు .ఏనుగొండ లక్ష్మి పై ఇచ్చిన రెండుమార్కుల ప్రశ్నకు 40 పేజీల సమాధానం రాసి సమయం అయిపోగానే మిగిలిన వాటి జోలికీ పోకుండా జవాబు పత్రం ఇచ్చేశారు .పార్సీ భాషాధ్యయనం చేసి 17 0పద్యాల ‘’షాజీ ‘’ ‘’సాక్షాత్కారం ‘’ రాశారు .పెనుగొండలో వివాహం చేసుకొని భార్య కొన్ని రోజులకే చనిపోతే విద్వత్ కవ యిత్రి  శ్రీమతి కనకమ్మ గారిని వివాహమాడి 5 గురు కుమార్తెలు ఒక కుమారునిని పొందారు . .ఆమె ఉత్తమ కవయిత్రి గా బహుమతి పొందారు .కాపురం ప్రొద్దుటూరు కు మార్చారు .కన్యకా పరమేశ్వరి దేవాలయం లో సంస్కృతం నేర్పారు విద్వాన్ పూర్తికాలేదింకా .భారతి పత్రికలో వీరి రచనలు ప్రచురితమయ్యేవి .మునిసిపల్ హై స్కూల్ తెలుగు పండితులుగా చేశారు .హిందీ సాహిత్యాన్ని అవలోడనం చేశారు .తులసీ తుకారాం కబీర్ రాస్ఖాన్ ,రాహీం ల కవిత్వాన్ని మధించారు .’’మేఘదూతం’’ ,శివ తాండవం’’ ‘’పండరి భాగవతం’’ రాశారు .కుందూ నది ఒడ్డున చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని శిష్యులతో ఉంటూ దాదాపు 7,0 00 కృతులు రాశారు .’’విజయనగర సామ్రాజ్య ప్రబంధం’’ రాశారు .మరాఠీ భాషానుభవంతో ‘’పాద్యం ‘’,అనే కావ్యాన్ని గురువు పూజ స్థానీయం పై రాశారు .పాండి చేరి వెళ్లి ,శ్రీ అరవింద ఘోష్ తో పరిచయం పెంచుకొన్నారు .అరవిందుల రచనలు తెలుగులోకి కొన్ని ఆవదించారు

రాళ్ళపల్లి వారి వద్ద సంగీతాన్ని సంధ్యా వందనం శ్రీనివాసాచారిగారితో కలిసి నేర్చుకొన్నారు .ఫిడేల్ పెద్ద జమాలప్ప ,వద్ద 150 కృతులు పాఠం చెప్పించుకొన్నారు ‘.ఘోరా కు౦ భార్ ‘’,తులసీదాస్’’, ‘’కాంగ్రెస్ చరిత్ర ‘’హరికధలు రాసి స్వయంగా గానం చేశారు. 60 వర్ణాలను కొక్కొండ సుబ్రహ్మణ్యం వద్ద నేర్చి ‘’శివ రంజని ‘’,శ౦కరి ‘’అనే రెండు కొత్త రాగాలను కనిపెట్టారు .త్యాగ రాజ స్వామి పై సంస్కృతం లో సుప్రభాతం రాస్తే మంగళం పల్లి బాల మురళీ కృష్ణ మధుర గానం చేసి అజరామరం చేశారు .ఇది ఆడియో కేసెట్ గా వచ్చింది .అగస్త్యేశ్వర సుప్రభాతం, చెన్నకేశవ సుప్రభాతం ఆచార్యులవారి ఇతర సంస్కృతకీర్తనలు . అన్నమాచార్యులవారి 100 కృతులకు బాణీల ఓణీలు వేశారు .

‘’గాంధీజీ మహా ప్రస్థానం ‘’తోపాటు కమ్యూనిస్ట్ భావ ప్రేరితంగా ‘’మేఘ దూతం ‘’,ఇంగ్లీష్ లో ‘’లీవ్స్ ఇన్ ది విండ్ ‘’కవితా సంపుటిని రాశారు . శంకరం బాడి బాడి సుందరా చార్యుల ప్రసిద్ధ గీతం ‘’మా తెలుగు తల్లి ‘’ని ఆంగ్లం లోకి అనువదించారు.సంప్రదాయ శైలి లో ‘’ది హీరో ‘’’’వైన్ గ్లోరియస్ ,’’భాగవతం ‘’రాశారు .ప్రొద్దుటూరు  నుండి కడప కు మకాం మార్చి శ్రీ రామ కృష్ణ హైస్కూల్ లో తెలుగు పండితులుగా చేరి ,జిల్లెళ్ళమూడి అమ్మ గారు కొనిచ్చిన ఇంట్లో చేరి , .మళయాళ నిఘంటువు నిర్మాణం చేసి, ఆ భాషలోని రచనలను తెలుగులోకి తెలుగు నుండి కొన్ని మలయాళం లోకి మార్చారు .మరాఠీ భాష లో’’ భగవాన్ బుద్ధ’’ ,స్వర్ణ పత్ర’’ ,’’ఉషః కా’’ల్ నవలలు రాశారు .కృష్ణ శంకర్ దేవ్ మరాఠీరచన ను ‘’సమర్ధ రామ దాసు ‘’గా తెలుగులోకి అనువాదం చేశారు .

తులసీదాస్ మహాకవి రామ చరితమానస్ ఆచార్యులవారికి కంఠో పాఠం..హిందీలోఉన్న  ‘’గాడీవాలా ‘’నవల ‘’కబీర్ వచనా వలి’’అనువదించారు .ఇంగ్లీస్ష్ నుంచి ‘’మెరుపులు –తలపులు ,’’అరవిందులు ,గీతోపన్యాసాలు’’ అనువాదం చేశారు .14 భాషలలో అనితర సాధ్య పాండిత్య ప్రకర్ష కలిగి ,సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించిన వీరికి ,ప్రతిభకు తగ్గ పురస్కారం ‘’పద్మశ్రీ ‘’నిభారత ప్రభుత్వం 1972జనవరి 26 న పుట్టపర్తి వారికి అందజేసి గౌరవించింది .1975 లో తిరుపతి విశ్వ విద్యాలయం ,1978 లో శ్రీ కృష్ణ దేవ రాయ విశ్వ విద్యాలయం లనుంచి గౌరవ డాక్టరేట్ పొందారు .’’జనప్రియ రామాయణం’’రాసి ,5 వ ఏట ఉర్దూ భాష నేర్చి ,ఘనంగా షష్టి పూర్తీ మహోత్సవం జరుపుకొని ,దేశం లోని అనేక సాహిత్య సంస్థలచేత సమ్మానింప బడి ,భార్య కనకమ్మగారి ప్రోత్సాహ , ప్రోద్బలాలతో 140 గ్రంధాలు రాసి తనకురావాల్సిన ‘’జ్ఞాన పీఠపురస్కారం ‘’మాత్రం దక్కక , 78 వ ఏట అభిమానులకు శిష్యులకు ‘’అవతారం చాలిస్తున్నానప్పా ‘’అని చెప్పి సరస్వతీపుత్రులు తల్లి సరస్వతీ సాన్నిధ్యానికి చేరారు .

ప్రొద్దుటూరు లో 20-9-1991 న పుట్టపర్తి వారి విగ్రహం ఏర్పాటు చేశారు .కడపలో వారి శిష్యులు ‘’సరస్వతీ పుత్ర అవార్డ్ ‘’ఏర్పరచి అర్హులకు అంద జేస్తూ వారి మధురస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఋణం తీర్చుకొంటున్నారు .కుమార్తెలు శ్రీ నాగపద్మినిగారు సోదరితో శ్రీమతి  అనూరాధ గారి తో కలిసి ‘సరస్వతీ పుత్ర’ నారాయణా చార్య ‘’’బ్లాగ్ ఏర్పరచి తండ్రిగారి రచనలను  అందరికి అందుబాటు లోకి తెచ్చారు .

Inline image 1  Inline image 2Inline image 3

సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం )

481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

స్వామిశివానంద చే’’ సరస్వతీ పుత్ర’’బిరుదాన్ని పొంది ,14 భాషలలో అఖండ పాండిత్యాన్ని సాధించి, తాను రాసిన ‘’పెనుగొండ లక్ష్మి ‘’కావ్యానికి తానే విద్యార్ధిగా  ఇంటర్ లో పాఠ్య గ్రంధంగా చదివిన ప్రపంచం లోనే అరుదైన వ్యక్తీ ,రెండు విశ్వ విద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్లు పొంది ,శతాధిక గ్రంధ కర్తయై ,పరమ వైష్ణవులైనా ‘’శివ తాండవ’’ కావ్యం నభూతో గా రాసి అఖండ కీర్తినార్జించి,భారత ప్రభుత్వం చే పద్మశ్రీ బిరుదాన్ని తమ అద్వితీయ కవితా, పాండిత్యాలకు అందుకొన్నవారు  శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు .అయితే వారు సంస్కృతం లో కూడా గ్రంధ రచన చేసిన విషయం శివ తాండవం మరుగున పడేసింది .అంతేకాదు 50 ఏళ్ళ తర్వాత మాత్రమె వారి ‘’శివకర్ణామృతం ‘’వెలుగు లోకి రావటం కూడా వింత విషయమే అయింది  గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం లో 481వ గీర్వాణకవిగా వారిని ఆలస్యంగా పరి చయం  చేస్తున్నందుకు మన్నించమని కోరుతూ వారి సంస్కృత భాషా వైశద్యాన్ని వివరిస్తున్నాను .

ఆచార్యుల వారి  సంస్కృత రచనలు –శివ కర్ణామృతం ,త్యాగ రాజ సుప్రభాతం ,అగస్త్యేశ్వర సుప్రభాతఃమ్ ,మల్లి కార్జున సుప్రభాతం ,మార్కాపుర చెన్నకేశవ సుప్రభాతం ,శివసహస్ర౦ అనే ఆరు రచనలు .ఇవికాక వారి శివ తాండవం లోనూ గీర్వాణ భాషను సందర్భాన్ని బట్టి వాడి,శోభ చేకూర్చారు .ముందుగా శివ తాండవ గీర్వాణ సౌందర్యం దర్శిద్దాం –

శివ తాండవం

కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం లో ఉదయ  సాయంత్రాలలో ప్రతి నిత్యం 108 ప్రదక్షిణాలు 40 రోజులు  చేసి ,అలౌకికానందాన్ని అనుభవించి శివ భక్తీ మహా ప్రవాహంగా మహోద్రుతంగా జాలువారి శివ తాండవం గా రూపు దాల్చింది .భక్తికి శివ కేశవ భేదం లేదని రుజువైంది .కన్నడం లోని రగడ ఛందస్సును తీసుకొని ,ఆ గేయ౦  ఛందస్సులో నర్తించే వైనాన్ని గ్రహించి కవితా తాండవమే చేశారు . నందీశ్వరుని నోట నా౦దీవాచాకాన్ని పుట్టపర్తివారు సంస్కృతం లో చెప్పించి అఖండ గౌరవం ప్రత్యేకతలను చేకూర్చారు  .తాండవాన్ని గూర్చి నంది వివరిస్తూ –

‘’అర్దే౦దూత్ఫుల్ల కేశం స్మిత రుచి పటలీ దంశితంగౌర వర్ణం –తార్తీయీకం ,వహంతం ,నయన ,మహికుల ప్రత్న భూషా వితానం

వృత్తారంభాట్ట హాస విచలిత కకుప్చక్ర ,మానంద  కందం—తమ్ వందే నీలకంఠం త్రిదశపతి శిరస్చు౦బి పదాబ్జ పీఠం ‘’

భావం –తలపై ఉన్న చంద్ర ఆభరణ కాంతులతో ,విచ్చుకొన్ని పరమ శివుని జటలు నిగనిగ లాడుతూ ,ఆయన చిరు నవ్వులు మూసుకున్న మూడవ కంటి పై గౌసన తొడగి నట్లుగా ,గట్టిగా నవ్వుతూ శివుడు  తాండవం  చేస్తున్నాడు .ఆ నవ్వుకు దిక్చక్రాలు అల్లలాడిపోతున్నాయి .ఆయన పాద౦  పీఠంపై   ఒంగి నమస్కరిస్తున్న దేవేంద్రుని శిరసును తాకు తోంది .

శివుని తాండవ రూపాన్ని వర్ణిస్తూ నందీశ్వరుడు –

‘’పాటల జటా ఘటిత ,జూట రుచి కోటి భ్రుష పాటిత తమిస్ర వలయం –కూట శబరం పటునిశాటకుల,జహాత సుఖ మోటనర సిక నిలయం

కోటి శత కోటి సమ కోటి నయనోత్దిత కృపీట భవ దగ్ధ  మండనం –నాటితభువం ప్రళయ నాటక మహా రచన పాటవ చణం హృది భజే ‘’

తాత్పర్యం –యఎర్రని జటా జూట౦  కాంతులతో చీకట్లను పార ద్రోలు తున్నాయి .రాక్షసుల సుఖ హారి ,మాయా కిరాతకుడు నూరు వజ్రాయుదాల కాంతితో సమాన కా౦తి కల మూడవ కంటి మంటతో మన్మధదహనం చేసినవాడు ,ప్రళయ నాటకం ఆడేవాడు సమస్త విశ్వాన్ని తా౦డవం తో సమ్మోహన ౦ తో అలరించే పరమ శివునికి ప్రణతులు .

పార్వతీ దేవి కడగంటి చూపు తో శివుని వక్షస్థలం నెమలి పురుగుల రంగుగా మారిందట .పార్వతి తన అందాలు చూసుకోవటానికి భర్త నేత్రాలే దర్పణాలుగా ఉపయోగిస్తోందట .వేదాలనే స్త్రీకి ఆయన సొమ్ము .జ్ఞాస్వరూపుడు శివుడు .శివాట్టహాసాలతో దిక్కులు పగిలిపోతున్నాయట ..చేతులు పైకెత్తి నాట్యం చేస్తుంటే ఆకాశం వెనక్కి పోతోందట .కాలి కదలికలకు భూమి ,పర్వతాలు కంపించి పోతున్నాయి .మొలకు చుట్టిన సర్పాభరణం మధ్య మధ్యలో ఊడి పోతుంటే సరి చేసుకొంటున్నాడు .ఇలాంటి శివునికి నందీశ్వరుడు –

‘’జయ జయ శంకర ,శత్రు భయంకర –జయ జయ ప్రధమ పిశాచన శంకర –జయ జయ తాండవ సంభ్రమ సుందర –జయ జయ ధైర్య విచలిత మందర ‘’అనిజయం పలికాడు .తరువాత శివతాండవాన్ని చక్కని తెలుగులో రాసి శివునితోపాటు మనల్నీ నర్తి౦చేట్లు చేశారు సరస్వతీపుత్రులు .గీర్వాణ ఆంద్ర భాషలలో తమ కవితా పాండితీ విభూతిని పండించి జన హృదయాలను రంజింప జేసే కవిత్వం రాసిన పుట్ట పర్తి వారు ధన్యులు .చదివి మనమూ ధన్యుల మవుతాం .ఆ అనుభూతి నాన్యతో దర్శనీయమని పిస్తుంది

తరువాత శివ కర్ణామృత విశేషాలు తెలుసుకొందాం

ఆధారం –సాహిత్య అకాడెమి ప్రచురించిన శ్రీ శశిశ్రీ రాసిన ‘’పుట్ట పర్తి నారాయణా చార్య ‘’గ్రంధం

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం

నా కృష్ణా పుష్కర అనుభవం

సహ్రుదయులైన సాహితీ బందులకు,సాహిత్య సాంస్కృతిక అభిమానులకు శ్రీ క్రష్ణవేణీపుష్కర శుభాకాంక్షలు ‘ఈ నెల 12 వతేదీ శుక్రవారం నుండి 23 వ తేదీ మంగళవారం వారం వరకు బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించటం వలన క్రిష్ణవేణీ నదికి పుష్కరాలు మహోద్రుతంగా ఆంద్ర దేశమంతా జరుగుతున్నాయి .ఈ సందర్భం గా వయసు ,జ్ఞానం లో పెద్ద లైన వారు తమ కృష్ణ వేణీ పుష్కర అనుభవాలను రాస్తే అందరికి విశేష విషయాలు తెలుస్తాయని పించింది .అందుకే ఈ శీర్షికలో అందరూ భాగ స్వాములై తమ అనుభవాలను దీనిలో రాసి అందరికి వాటితో పరిచయం కలిగించాలని మనసారా కోరుతున్నాను  .బాధ్యత ఎవరి మీదో వేసి నేను పక్కకు తప్పకొకుండా ముందుగా వయసు రీత్యా 77లో  ఉన్న నేనే ముందుగా నా అనుభవాలను పొందు పరుస్తున్నాను. మీరూ రాయండి .పంచుకోండి .సద్వినియోగం చేయండి .

1940 లో పుట్టిన నాకు  4 ఏళ్ళవయసులో 1944 లో పుష్కరం  వచ్చింది .కనుక దాని గురించి నాకేమీ తెలియదు .నాకు గ్రాయకం వచ్చాక వచ్చిన పుష్కరం 1956 లో వచ్చింది .కనుక దీన్ని రెండవ పుష్కరం గా భావిస్తాను .అప్పడు మా నాన్న గారున్నారు .అమ్మా నాన్నలతో కలిసి పుష్కర స్నానం బెజవాడ లో చేసినట్లు లీలగా గుర్తుంది .అప్పడు నేను ఎస్ ఎస్ ఎల్ సి పాసై బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంటర్ చదువుతున్నాను .మా చిన్న మామ్మఅంటే ‘’బుల్లిమామ్మ’’ గారింట్లో ఉండి చదువు కున్నా.అమ్మా నాన్న బుల్లిమామ్మ ఇంటికే వచ్చారు .అందరం కలిసి బారేజ్ ఇవతల ఘాట్ లో స్నానం చేసి ఉంటాము . అప్పుడే ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తే చూశాము .అప్పుడే మొదటి  సారి టీ.వి .ని చూశాము .భలే గొప్ప అనుభవం అది నాకు .ఇంకా చాలా ఉన్నాయి కాని నాకేమీ గుర్తులేవు .కాని ఆ తర్వాత నాన్న ,మా మేనమామ గుండు గంగయ్యగారు కలిసి తోట్ల వల్లూరు లో యధావిధిగా పుష్కరాలు పెట్టారు .వంట బ్రాహ్మణులను కుదిర్చి  మంచి బ్రాహ్మణులను పిలుచుకొని చాలా పెద్ద  ఎత్తున పుష్కర విధి నిర్వహించారు.బహుశా అదే మా రెండు ఇళ్ళల్లో జరిగిన పూర్తి పుష్కర సంబరం అని నాకు జ్ఞాపకం .

1968 లో మూడవ పుష్కరం చూశాను .నాన్న గారు 1961 లో మరణించటం ,అంతకు ముందే 1959లో మా అన్నయ్య మరణించటం,1964 లో నాకు ప్రభావతి తో పెళ్లి అవటం  వెంట వెంటనే పిల్లలు పుట్టటం తో మా ఇంట్లో పుష్కర హడావిడి ఏదీ జరిగిన గుర్తు లేదు .

1980లో నాలుగవ పుష్కరం చూశాను .బెజవాడ వెళ్లి మా తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తి గారి కుటుంబం తోకలిసి బారేజ్ కు ఇవతలే పుష్కర స్నానాలు చేశాము .అప్పుడే నా చేతి వాచీ ,బంగారు ఉంగరం తీసి మా తోడల్లుడి గారి అబ్బాయి ముదుకు జాగ్రత్త చేయమని ఇస్తే వాడు బాధ్యతా రహితంగా సంచీలో వేసుకొన్న వాటిని గాలిలో ఊపుతూ రేవు చేరేసరికి అవి ఇసుకలో ఎక్కడో పడిపోయాయి .వాడిని అడిగితె తెల్ల మొకం వేశాడు .కృష్ణార్పణం –పుష్కరార్పణం అనుకొన్నాను –గాలికి ఎగిరే పేల పిండిని కృష్ణార్పణం అన్నట్లుగా .

1992లో అయిదవ పుష్కరం చూశాను .అప్పుడు మా రెండో అక్కయ్యాశ్రీమతి దుర్గ  బావ గారుశ్రీ వివేకానంద్ గారు కూడా ఉయ్యూరు వస్తే అందరం కలిసి తోట్ల వల్లూరు వెళ్లి కృష్ణా స్నానం చేసి హిరణ్యం పెట్టాం .తర్వాత శ్రీ కాకుళం కూడా వెళ్లి అక్కడా పుష్కర స్నానాలు చేశాం.  మేమిద్దరం బెజవాడ వెళ్లి కృష్ణానదీ స్నానం చేసి కనక దుర్గమ్మ దర్శనం చేసి ఎక్సి బిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం లో స్వామిని దర్శించాం.అప్పుడే చిట్టి బాబు గారి వీణ కచేరీ చూసి పరవశించాం .కోకిల స్వరాలు వేదం చాలా అద్భుతంగా వీణ పై వాయించి దివ్యాను భూతి కలిగించారు చిట్టి బాబు .చిట్టిబాబు వీణ లో చాలా గట్టి బాబు అని పించారు .ఆకార్యక్రమాన్ని శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు సమన్వయ కర్త గా వ్యవహరించారు .ఎందుకోఆయన చిట్టి బాబు గారి వీణా వాదనను సరిగ్గా విశ్లేషించ లేక పోయారు అని పించింది నాకు .చేతిలో కాగితం లేదు. కాని చిట్టిబాబు గురించి చెప్పాలని తహ తహ గా ఉంది .ఎవరినో అడిగి పెన్ను తీసుకొని బస్ టికెట్ల వెనక నా స్పందన రాసి నూకల వారికిచ్చి చదవమని కోరాను .నా రాత అర్ధం కాక ఆయన ‘’ ఎవరో దుర్గా ప్రసాద్ గారట .చిట్టిబాబు గారి గురించి బాగా రాశారు .వారి నోట వింటే బాగుంటుంది .అని మాస్టారూ !మీరే పైకొచ్చి చదివి వినిపించండి ‘’అన్నారు  .నేను అక్కడ ప్రేక్షకజనాలకు బాబు గారికి నూకల వారికి నమస్కరించి నేను రాసిన ఆ చిన్న అక్షరాలలోని భావాన్ని ‘’చిట్టిబాబుగారు ఈ కృష్ణా పుష్కర సమయం లో మనల్ని అందరినీ తమ వీణా వాదనతో రస పుష్కరిణి లో ఓల లాడించారు .ఈ అనుభవం జీవితాంతం మరువ లేనిది .ఈ జీవితానికి ఈ అనుభవం చాలు అని పించింది .కోయిల స్వరాన్ని, వేద మంత్రాలను మహాద్భుతంగా వాయించి రస డోలికలలో ఊరేగించారు .ఆంద్ర జనం వారికి ఏమిచ్చినా ఋణం తీరదు .ఈమని వారిశిష్యులై గురువును మించిన శిష్యులనిపించారు .మరింత గా వీరు రాణించి సంగీత సర్వాతీ సమారాధన చేయాలని వినయ పూర్వకంగా కోరుతున్నాను ‘’అన్నాను .చిట్టిబాబు గారు తల వంచి నా పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు .నా జీవితం లో ఇది గొప్ప అనుభవం .అక్కడే శ్రీ మంగళం పల్లి బాలమురలీకృష్ణ గారి మేనల్లుడు శ్రీ పారుపల్లి రంగనాద్ గారి అన్నమయ్య కీర్తనలు విన్నాము .చాలా అలవోకగా భక్తీ భావ బంధురంగా పాడారు వారు .వేదిక దిగగానే అభినంది౦చాము .చాలా సంతోష పడ్డారు  ఆయన  చెబితే కాని  ఆయన బాలమురళిగారి మేనల్లుడు అని తెలియ లేదు .అప్పుడే బెజవాడ వాస్తవ్యులు  ప్రముఖ హరికధా విద్వాంసుల శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి   హరి కధనూ విన్నాం .ఆయన లబ్ధ ప్రతిస్టులైన భాగవతార్ .1963 లో నేను మోపి దేవి హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు పెద ప్రోలులో కాపురం ఉన్నాం. అప్పుడొక రాత్రి ఆయన పెదప్రోలులో కదా గానం చేశారు .వారికధాగానం వినటం అదే మొదటి సారి .ఇప్పుడు మళ్ళీ ..గాత్రం గానం విధానం చాలా బాగా ఉన్నాయి . .అయన మంచి నాటక నటులు కూడా .పొట్టిగా ఎర్రగా ఉంటారు ఈ పుష్కరాలలోనే మా అమ్మాయి విజయ లక్ష్మి  గుంటూరుగర్ల్స్ పాలిటెక్నిక్ లో చదువుతున్నప్పుడు అమరావతి కి కూడా వెళ్లి పుష్కర స్నానం చేసి అమరేశ్వర స్వామినీ దర్శించాం .

ఆరవ పుష్కరం2004 లో వచ్చింది .అప్పటికి నేను రిటైర్ అయి 6 ఏళ్ళు అయింది .అప్పటికే ఒక సారి 20 02 లో మొదటి సారి అమెరికా వెళ్ళాం .ఈపుష్కరానికి ఆరోగ్యాలు బాగానే ఉండటం తో వీలైనన్ని ఎక్కువ చోట్ల పుష్కర స్నానాలు చేశాం .స్నానం చేయాలి అను కొన్న రోజున తెల్లవారుజ్హామునే లేచి స్నానం సంధ్యా పూజా పూర్తి  చేసి టిఫిన్ తయారు చేసుకొని బాక్స్ లో పెట్టుకొని బస్ ఎక్కేవాళ్ళం .అక్కడ పుష్కర స్నానం చేసి దైవ దర్శనం చేసి అప్పుడు టిఫిన్ చేసేవాళ్ళం .ఆ తర్వాత మళ్ళీ ఏదో ఊరికి వెళ్లి  అక్కడస్నానాదులు చేసేవాళ్ళం .సాయంత్రానికి ఎప్పటికో  ఇంటికి చేరేవాళ్ళం .ఒకసారి ఉదయమే బయల్దేరి తోట్ల వల్లూరు రేవులో స్నానం చేసి ,పులిగడ్డ  నాగాయ లంక పెదకళ్ళే పల్లి  ,శ్రీకాకుళం ,పడవ పై కృష్ణ అవతలి ఒడ్డు చిలుమూరు చేరి అక్కడిగుంటూరు  రేవులో స్నానం చేసి రాత్రి కి  ఇంటికి చేరాం .ఈ ప్రయాణాలలో పండ్లు ఇంటి టిఫిన్ తప్ప ఎక్కడా భోజనం కాని టిఫిన్ కాని చేసేవాళ్ళం కాదు .

ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు .రేపు ఉదయమే మాఅమ్మాయి పిల్లలతో హైదరాబాద్ మా అబ్బాయి శర్మా వాళ్ళ ఇంటికి వెడతాం .అక్కడ అమ్మాయి ,పిల్లలు  13 తేది రాత్రి ఫ్లైట్ కు అమెరికా బయల్దేరి వెడతారు .మేము మా రెండో అబ్బాయి శర్మా  వాళ్ళింట్లో బాచుపల్లి లో ఉంటాం .అన్నీ కుదిరితే అక్కడే దగ్గరున్న ప్రదేశం లో కృష్ణా పుష్కర స్నానం చేస్తాం .అయినా సౌరమానం ప్రకారం గురుడు కన్యా రాశిలో ప్రవేశించాడని ముక్త్యాలలో ఒక గురువుగారు శిష్యులతో కృష్ణా పుష్కర స్నానం కిందటి మంగళవరామే చేశారని ఆంద్ర జ్యోతిలో చదివి కిందటి శుక్రవారం మేమిద్దరం మా అమ్మాయి పిల్లలిద్దరూ కలిసి కారులో ముక్త్యాల వెళ్లి పుష్కరస్నానం చేసి శ్రీ ముక్తేశ్వరస్వామిని కోటిలింగాలలోని శ్రీ పశుపతి నాదుడిని తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని ,పరిటాల శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఫెర్రీ వద్ద గోదావరి కృష్ణా సంగమాన్ని చూసి పులకించి ఆ పవిత్ర సంగమ ‘’గోదా –కృష్ణ ‘’జలాన్ని శిరసుపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చిన సంగతి మీకు  తెలిసిందే .అంటే మా పుష్కర కోయిల మా సరసభారతి ఉగాది కోయిలలాగా ముందే కూసి౦దన్నమాట .

మీరూ మీ అనుభవం రాసి ఈ శీర్షికను సుసంపన్నం చేయండి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-16—ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణానదీ వైభవ పద్యం ( శ్రీ ఉపాసన -జులై)

”శ్రీ  శైల మల్లేశు  చెంత పాతాళ గం  -గా ప్రవాహపు జలకముల లోన

నాగార్జున గురు విజ్ఞాన వీచీచ్చాయ-జీర్ణించుకొని యున్న జీవనముల
అమరావతీ  స్తూప  రమణీయ శిల్పశా -స్త్ర  జ్ఞాన ఘట్టంపు సాక్ష్య  తటిని
భవ్య దుర్గా శైల పాదోదక మిళిత -స్నాన ఘట్టముల చక్కటొకట
కృష్ణ శాంతించు మున్నంగి రేవు వద్ద -ఎక్కడో ఒక్క చోటైన ఒక్క క్రుంకు
చాలు నీ పుష్కర సమయ స్నపన మాంధ్రి-పావనాను భూతిశ్రీ ల పంట లిచ్చి ”

— సేకరణ -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలలో ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో కృష్ణ వేణీ మాతకు ప్రత్యేక పూజ

ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసియున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో పవిత్ర కృష్ణ వేణీ పుష్కరాల సందర్భంగా 12-8-16శుక్రవార0  నుండి 23-8-16 మంగళ వారం వరకు  ప్రతి రోజు ఉదయం 7 గం లకు, సాయంత్రం 7 గం  లకు  శ్రీ కృష్ణ వేణీ మాత విగ్రహానికి అష్టోత్తర పూజ నైవేద్యం హారతి తో ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నాము .భక్తులు పాల్గొని కృష్ణవేణీ మాతను సందర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి,   అనుగ్రహానికి పాత్రులై తరించ ప్రార్ధన .

Inline image 1Inline image 2Inline image 3

శ్రావణ శుక్రవారం ,కృష్ణా పుష్కరాలు వరలక్ష్మీ వ్రతం ,శ్రావణ పౌర్ణమి ,శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో

                                           గబ్బిట దుర్గా ప్రసాద్
                                ధర్మ కర్త –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం ,ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ ) 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్ -2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ )

91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్  కవి  –డిలాన్ ధామస్ -2(చివరిభాగం )

35 వ ఏట ‘’నేను ముసలి ,చిన్న ,నల్ల ,తెలివైన వాడుగామిలమిల మెరిసే కళ్ళతో జుట్టురాలిపోయి పళ్ళూడి పోయిన వాడిగా ఉన్నాను ‘’ అని చెప్పుకొన్నాడు .బలంగా,లావుగా ఉన్నా  చురుకుగా కదిలేవాడు  .మూడో సారి అమెరికా వెళ్ళినప్పుడు ఇగార్ స్ట్రా విన్స్కి తోకలిసి ఒక ఒపెరాకు పని చేయాలనుకొన్నాడు .కద ముందే సిద్ధం చేసుకొని సంగీతం కాలిఫోర్నియాలో కూర్చాలనుకొన్నారు .అతని ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’అప్పుడే సెన్సేషనల్ విజయం సాధించింది .న్యూయార్క్ లో 39 వ పుట్టిన రోజు ను ఘనంగా సంతోషంగా జరుపుకొన్నాడు .సంబరాలు అంబరాన్ని అంటుతున్న సమయం లో తీవ్రంగా జబ్బు పడ్డాడు .వెంటనే సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు .అక్కడ మెదడుకు సంబంధించిన ‘’యెన్ సెఫలో పతి ‘’అనే జబ్బు తో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు .సుమారు రెండు వారాలలోపే డిలాన్ ధామస్ 9-11-1953  న మరణించాడు .

ధామస్ ఇరవై ఏళ్ళ లోపే ‘’యైటీన్ పోయెమ్స్ ‘’అచ్చు అయింది .స్విన్ బరన్ కవిత్వమా అనిపించింది .అణ గారిన నాగరకత ,సాక్సన్ వెలుగున్న సెల్టిక్ నీడ అతనికవిత్వం లో కనిపిస్తుంది .అతని ముందు మూడు  పుస్తకాలను కలిపి ‘’ది వరల్డ్ ఐ బ్రీత్’’పేర ఒకే పుస్తకంగా తెచ్చారు .డిలాన్ ను అత్యద్భుత నవ కవిత్వ సృష్టికర్త గా గుర్తించి అతని కవిత్వాన్ని సర్రియలిజం కవిత్వం అన్నారు .వీటిలో పగటికలలు ,సబ్ కాన్షస్ లో విహారం కనిపిస్తాయి .ఫ్రాయిడ్ ప్రభావమూ ఉంది .’’poetry is the rhythmic ,inevitably narrative ,movement from an over clothed blindness to  a naked vision .Poetry must drag further into  the clear nakedness of light more even of the hidden cause than Freud could realize ‘’అంటాడు ధామస్ .చనిపోవటానికి ఏదాదిముందు అచ్చు అయిన ‘’ఇన్ కంట్రీ స్లీప్ అతనే చెప్పినట్లు ‘’record of my individual struggle from darkness toward some measure of light .To be stripped of darkness is to be clean ,to be  stripped of darkness  is to be clean ,to strip of darkness is to make clean ‘’.

చివరి రచన ‘’అండర్ మిల్ వుడ్ ‘’బి బి సి లో ప్రసారం కావాల్సింది  అమెరికాలో  ప్రాభవం పొంది౦ది  .ఇందులో ఒక మచ్చుతునక –‘’it is spring moonless night in the small town starless and –bible black ,the cobble streets silent and hunched –courtiers and rabbit’s wood limping invisible down to –the slow back ,slow ,black  crow black ,fishing boat hobbing sea ‘’

లారెన్స్ బిన్యాన్  బ్లేక్ ద్విపదులలాగా కప్లేట్స్ రాశాడు ,-‘’the spirit born to bless –lives but in its own excess ‘’

పేదరికం లో గడిపిన ధామస్ డబ్బు సంపాదించటం ఎట్లాగో తెలియదు .తాను ‘’I want to write only poems of God ‘s world –by a man who does not believe in God ‘’అంటాడు డిలాన్ .వేర్నార్ వాట్కిన్సన్ ఇచ్చిన పారితోషికానికి కృతజ్ఞత తెలుపుతూ జాబు రాస్తూ ‘’మీరిచ్చిన గుండ్రని సిల్వర్ ట్రాష్ ‘’ను నేను అమ్ముకొంటే నెల రోజుల గ్రాసం లభిస్తుంది ‘.నా లాంటి వాడు చేతిలో పెన్నీ లేకుండా జీవించటం దారుణం ‘’అన్నాడు .ధామస్ చనిపోయాక ప్రాభవం మరింత పెరిగింది ,అతని చిన్న కధలు బాగా క్లిక్  అయ్యాయి .అతని రచనలో బాల్యం ,సెక్స్ సామర్ధ్యం ,కల్లోల మత౦  చావు లే విషయాలు .’’My world was christened in a stream of milk and earth and sky were alone airy hill –I dreamed my genesis in swear of sleep ‘’అంటాడు .అండర్ మిల్క్ వుడ్ బి బి సి లో ప్రసారం కావాల్సింది 1953 లో అమెరికాలో అయింది .ఇందులోని రెండు భాగాలను ధామస్ స్వంత గొంతుకతో చదివాడు .తనకవిత ప్రతిదాంట్లోనూ మనిషి ప్రేమ ,దేవుని ప్రస్తుతి ఉంటాయని అవే లేక పోతే తాను  నిరర్ధక జీవినే అవుతానని చెప్పుకొన్నాడు .అతడు చదువుతుంటే విశ్లేషణకు అందనంత వేగంగా దూసుకు పోతుంది కవిత్వం. అదే ఆయన ప్రత్యేకత.

ధామస్ ను చిరంజీవిని చేసిన కవితలు   ‘’డు నాట్ గొ జెంటిల్ ఇన్ దట్ గుడ్ నైట్ ‘’,’’ఎ డెత్ హావ్ నో డొమినియన్ ‘’నాటకాలు ‘’ప్లే ఫర్ వాయిసెస్ ‘’,’’అండర్ మిల్క్ వుడ్ ‘’లు ,.ఏ సాహిత్య ముఠా కు చెందనివాడు ధామస్ .నియో రొమాంటిక్ ,ఫ్రాయిడ్ ప్రభావం వెల్ష్ జాతీయ ప్రభావం ఉన్నవాడు .అమెరికా వెళ్ళినప్పుడు ధామస్ హార్డీ కవితల్ని ఆయనకే చదివి వినిపించినవాడు .వెల్ష్ జాతీయుడేకాని దాని జాతీయత పై అంతగా ఇష్టం లేనివాడు .ఆ జాతీయతను ‘’హిల్ ఫారం మొరాలిటి ‘’అంటాడు .శబ్ద ప్రయోగం లో అందేవేసిన కవి .పోతనకవి  లాగా చెవులకింపైన పద ప్రయోగం చేసి మనసులను ఆకర్షిస్తాడు ధామస్ సమాధిపై ఆయనే రాస్సుకొన్న కవితను చెక్కించి ఘన నివాళి సమర్పించారు –‘’Not for the proud man apart from the raging moon I write on these spindrift pages not for the towering dead with their right angles and psalms but for the lovers ,their arms round thee griefs of the ages who pay no heed my craft or art ‘’

సమాప్తం

Inline image 1

‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’సంపూర్ణం

ఆధారం –లూయీ అంటర్ మేయర్ రాసిన ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’

మనవి –సుమారు సంవత్సరన్నర క్రితం రాయటం ప్రారంభించిన ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’ధారావాహిక 245 ఎపిసోడ్ లలో  91 మంది ప్రముఖుల జీవితాలను గురించి రాసే అదృష్టం  నాకు దక్కింది .ఈపుస్తకాన్ని నాకు నామీద అభిమానం తో ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా )నేను కోరిందే తడవుగా కొని నాకు 20-10-2014న అందేట్లుగా పంపారు .వెంటనే చదవటం ప్రారంభించి760 పేజీలున్న ఈ బృహత్ గ్రంధాన్ని 23-1-2015 నాటికి చదివి పూర్తీ చేశాను .వెంటనే దీన్ని తెలుగులో రాస్తే బాగుంటుంది అనిపించి శ్రీ గోపాల కృష్ణ గారికి మెయిల్ రాస్తే ‘’నేనే చెబుదామనుకోన్నాను .మీకూ అదే ఆలోచన వచ్చింది కనుక ప్రారంభించండి ‘’అన్నారు .వెంటనే  అంతర్జాలం లో రాయటం ప్రారంభించాను .మధ్య మధ్య లో మరెన్నో వాటిపై దృష్టి పెట్టటం వలన సుమారు సంవత్సరంన్నర కాలం పట్టింది పూర్తీ అవటానికి .అంటర్ మేయర్ రైట్ సోదరులను విడివిడిగా రాసి 92 మంది తో పుస్తకం రాస్తే, నేను రైట్ సోదరులను ఇద్దర్నీకలిపి ‘రాయటం వలన  సంఖ్య 91 అయింది .అంటర్ మేయర్ చాలా వివరణాత్మకంగా గ్రంధం రాశాడు .దాదాపు ఆయన చెప్పిన దానిని దేనినీ వదలకుండా నేను తెలుగులోకి తెచ్చాను .అయినా నాకు సంతృప్తి కలగక వీకీ పీడియా లో వెతికి మరింత సమాచారాన్ని చేర్చి సంతృప్తి చెందాను .అంత మాత్రం చేత ఇది సంగ్రమూ సంపూర్ణమూ అని నేను అనుకోవటం లేదు .ఇంకా చెప్పవలసింది విశ్లేషించ వలసినది చాలా ఉండే ఉంటుంది .ఆ మహానుభావులను పరిచయం చేయటానికే నేను ప్రయత్నం చేశాను .ఇందులో నాకు తెలియని వారు చాలా మందే ఉన్నారు .చాలామంది వీరి గురించి విని ఉండక పోవచ్చు .వీరంతా తమ కార్యకలాపాలతో ఆధునిక యుగ నిర్మాణానికి తోడ్పడినవారే  .అన్ని రంగాలకూ చెందిన వీరి కార్య క్షేత్రాలు కళ, సంస్కృతీ, రాజకీయం, శిల్పం, సంగీతం  నాట్యం  వేదాంతం ఆర్కి టేక్చర్ ,కవిత్వం ,సినిమా, నాటకం ,సైన్స్ ,టెక్నాలజీ మొదలైనవి .ఏదో ఒక రంగం గురించి ఏదో కొంచెం ఆవగింజలో అరవై భాగం మాత్రమే తెలిసిన నాకు ఇన్ని రంగాల లోని విషయాలు తెలుసుకొని అర్ధం చేసుకొని అందరికి తెలిసేట్లు రాయటం బ్రాహ్మ ప్రళయమే అయింది .నా శక్తి యుక్తులన్నీ పణంగా పెట్టి రాయాల్సి వచ్చింది .దీనిలో నేనుఎంతవరకు సఫలీకృతుడిని అయ్యానో మీకే తెలుసు .ఏదైనా, ఒక మంచి ప్రయత్నం చేశాను అన్న సంతృప్తి మాత్రం నాకు లభించింది .

ఈ మహామహులపై మరింత పరిశోధన చేసేవారికి ఇది కొంత వరకు కరదీపిక అవుతుందని నమ్ముతున్నాను .అంటర్ మేయర్ ఆంగ్లం లో రాసిన గ్రంధాన్ని నాకు పంపి చదివించి తెలుగులోకి అంతర్జాలం లో దాన్ని తెచ్చే ప్రయత్నానికి  నన్ను ప్రేరేపించిన ,ప్రేరణ నిచ్చిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞుడను .ప్రతి ఎపిసోడ్ చదివి ,స్పందింఛి ప్రోత్సహించిన వారి ఋణం తీర్చు కోలేనిది . అసలు దీన్ని పూర్తీ చేయగలనా అని అనుమానం వచ్చింది .70 మంది మీద రాసే దాకా నమ్మకం కుదరలేదు .ఇక లాభం లేదని సుమారు నెల రోజులనుండి పగలూ ,రాత్రి విడవ కుండా మిగిలిన వారిపై రాసి ఇవాల్టితో పూర్తీ చేసి ఊపిరి పీల్చుకొని  అమ్మయ్య అనుకొన్నాను .ఒక రకంగా భగీరధ ప్రయత్నమే ఇది .

అంటర్ మేయర్  ఆంగ్లకవులపై రాసిన పుస్తకాన్ని పూర్వం నాకు పంపగా ,చదివి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా నేను నెట్ లో వారి ప్రోత్సాహంతోనే ధారావాహికంగా రాయటం ,దానికి తామే పూనుకొని గ్రంధ రూపం లోకి తెచ్చి వారి బావగారు శ్రీ డా .రాచకొండ నరసింహ శర్మ ఏం డి గారికి  ‘ అ౦కితమిప్పించటం మీకు తెలిసిందే . వారికి నాపై ఉన్న ఆత్మీయతకు ఇంత కంటే నిదర్శనమేముంది ?

అంకితం –‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’అన్న  92 మంది మహా మనీషుల పై రాసిన ఈ 245ఎపిసోడ్ ల ధారావాహిక ను అందులో ఉన్న ఆ 92మంది మహానుభావు లందరికివారి కృషికి  ,వీరి నందరిని తన పుస్తకం లో ఆవిష్కరించిన లూయీ అంటరర్ మేయర్ కు ఆయన రచనా విధానానికి   , ఇంక ఏమీ చేయలేక  సవినయంగా అంకితమిచ్చి ఋణం తీర్చుకొంటున్నాను ..దీన్ని చదివి ఆదరించిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను ‘

Inline image 2

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4 of 17,977 Print all In new window ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244

91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్  కవి  –డిలాన్ ధామస్

ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో డిలాన్ ధామస్ జ్వలించే విప్లవ భావ ,సాటి లేని శైలీ శయ్యా సౌభాగ్యాలతో ప్రపంచం పై విరుచుకు పడ్డాడు ..రాయగానే స్వాగతించక పోయినా ,వారసత్వ కవితా లక్షణాలు లేక పోయినా తనకాలపు ఉత్సాహ ఉద్రేక కవి అయ్యాడు .దురదృష్ట వశాత్తు చిన్న వయసులోనే చనిపోయినా సాహిత్య లోకం పై బలమైన ముద్ర వేశాడు .కొన్ని కవితలు ,కదా సంపుటాలు కొన్ని ,స్వీయ చరిత్రలాంటి స్కెచ్ లు మాత్రమే రాసి లబ్ధ ప్రతిస్టుడయ్యాడు .అతని ‘’పోర్ట్రైట్ ఆఫ్ ఎ పోయెట్ అస్ ఎ యాంగ్ డాగ్ ‘’తోపాటు మరొక నాటకం ఆయన్ను సాహిత్యం లో చిరంజీవిని చేశాయి .వీటితో ఆంగ్ల సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ,అనుపమ సంగీత సౌభాగ్యం కలిగించి ,కొత్త దృశ్యాలను చూపించి నూతన శబ్దాలు వినిపించి ,సమకాలీన సాహిత్యానికి జవ జీవాలు కల్పించి సంచలనం సృష్టించాడు .

27-10-1914 న వేల్స్ లోని వెల్ష్ సీ పోర్ట్ లోని స్వాన్సేయా లో ఇంగ్లీష్ టీచర్ కొడుకుగా డిలాన్ ధామస్ పుట్టాడు .టౌన్ లోని గ్రామర్ స్కూల్ లో చేరి క్లాస్ రూమ్ పాఠాల కంటే ,స్థానిక జానపద గీతాలపై ఆసక్తి పెంచుకొన్నాడు .’’చిన్నప్పుడు నేను చిన్న ,సన్న ,చురుకైన  వెంటనే మురికి అయ్యేట్లు ,ఉంగరాల జుట్టు తో ఉండేవాడిని ‘’అని చెప్పుకున్నాడు .సాధారణ చదువు పూర్తీ అయి ,గ్రామర్ స్కూల్ వదిలి నటుడిగా రిపోర్టర్ గా ,రివ్యూ రాసేవాడిగా ,స్క్రిప్ట్ రైటర్ గా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ పొట్ట కూటికి డబ్బు సంపాదించాడు .రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ‘’యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్నర్ ‘’గా పని చేశాడు.ఈ అనుభవాలన్నీ కవితల్లోకి చేరాయి .21 కి కైర్లిన్ మాక్నమారా తో వివాహమై ,లివిలీన్ కాలం అనే ఇద్దరు అబ్బాయిలు ,ఐరాన్ అనే కుమార్తెను కనీ, లాఫర్నే  ,కర్మర్తాన్ షైర్ అనే చేపలు పట్టే గ్రామం లో స్థిరపడ్డాడు .అక్కడ తన ఇల్లు ‘’బోట్ హౌస్ ‘’మాత్రమే నని చెప్పుకొన్నాడు . ఈ గ్రామం ఒకప్పుడు ఫెర్రీల రేవుగా ఉండేది .

ఇరవైలలో ఉండగా తాను  రాసిన కవితలను బి బి సి రేడియో లో చదివి వినిపించేవాడు .1950 లో మొదటి సారి అమెరికా వెళ్లి రెండేళ్ళ తర్వాత తిరిగొచ్చి మళ్ళీ 1953 లో వెళ్ళాడు .అక్కడ  తనవి, తనవి కానివి పాటలు పాడి రంజింప జేసేవాడు .ఆతను పాడేది అతని స్వంతమో ఇతరులదో ఎవరికీ తెలిసేదికాదు .’’కాళిదాసుకవిత్వం కొంత నా పైత్యం కొంత ‘’అన్నట్లు ఉండేది .అతని గానమాదుర్యం ,తాదాత్మ్యత తో పాడటం   అందరినీ ముగ్ధులను చేసేవి . .అతనిలో షెల్లీ మళ్ళీ కనిపించినట్లు ఉండేది .మంత్రం ముగ్ధమై విని పరవశి౦చేవారు .కాగితం పై ఉన్న ఆయన కవిత్వం అర్ధం కాక పోయినా ఆనాటి హృదయాకర్షణ పాటకుడు అనిపించాడు .అమెరికా స్వంత ఇల్లు అయింది .’’నాకు న్యూయార్క్ అంటే నమ్మకం లేదుకాని సౌత్ ఎవెన్యు ను ప్రేమిస్తాను ‘’అనేవాడు .సీమెన్స్ బార్ అంటే ఇష్టం .అక్కడ అతన్ని వెల్ష్ జాతివాడిగా గుర్తించి మాట్లాడేవారు .అది సాహిత్య సాంఘిక కార్యకలాపాల క్లబ్ గా ఉండేది .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243

90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆడెన్ 30 వ ఏట రాసిన ‘’ఆన్ దిస్ ఐలాండ్ ‘’లో  మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘’అనదర్ టైం ‘’లో సా౦ఘికవిషయాలు చోటు చేసుకొన్నాయి .భాషా చాలా సరళంగా విషయం సూటిగా ఉంది .అప్పటి వరకు ఉన్న మూస పదబంధాలను త్రోసి రాజని కొత్త ఉదాత్త భావ జాలాన్ని చొప్పించాడు .నిత్య జీవిత విషయాలు కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పాటకజన పాటలు ,జానపద గీతాలు ,లయతో ఊగిపోయేట్లు రాశాడు .సైన్స్ ఆవిష్కరణలను కొత్త నాటక శైలిలో రచించాడు .డిగ్నిటి తోపాటు రౌడి యిజం కూడా ఏకకాలం లో కన్పించటం ప్రత్యేకత .ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రక్క కనిపిస్తూనే ప్రజాకవిగా వెలు గొందాడు .ఈ ద్విముఖ కవితా మార్గం ఆశ్చర్య పరచింది .’’The poet was essentially a wit after the caustic mockery of ‘’Law ‘’అనిపిస్తాడు అంటాడు గార్దేనేర్స్ .ఉదాహరణకు ఒక కవిత –

‘’Law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law is as you know I suppose –law is but let me explain it once more –law is the law ‘

సామాన్య లిరికల్ కవి మాత్రమే రాయగలిగిన ఒక లవ్ పోయెం రాసి మరీ ఆశ్చర్య పరుస్తాడు ఆడెన్ –

‘’Lay your sleeping head ,my love-human on my faithless arm –time and fevers burn away –individual beauty from –thoughtful children ,and the grave –proves the child ‘s ephemeral –but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty but to me –the entirely beautiful ‘’

ఆధునికకవులయిన  ఆడెన్ ఒక్కడే పాత ఫాషన్  బాల్లడ్ లో లేక విలానేల్లె లో భావ వ్యక్తీకరణ చేసే సామర్ధ్యమున్నవాడు .ఫ్రెంచ్ సంప్రదాయాలైన సేస్టినా మొదలైన ఫారంస్ లో కూడా ఆడెన్ ఒక్కడే ఇలాచేయగాలిగాడు .ఆడెన్ ఇంగ్లాండ్ లో అందరితో కలిసి పోయాడు .ఒక్కొసారీ ‘’మరీ ఎక్కువ భారం వేశాడు ‘’అనిపిస్తాడు .ఆడెన్ కవిత్వం లో ‘’A vitality ,an explosive violence ,that leaves his contemporaries dazed ‘’అన్నాడు స్పెండర్ .ముప్ఫై లలో ‘’ది డబుల్ మాన్ ‘’,’’ఫర్ ది టైం బీయింగ్ ‘’లలో ఆయన ఎంత విరుద్ధ భావ ప్రేరణ కవియో ,తన తరాన్ని ఎంత గొప్పగా ప్రబావితం చేశాడో తెలుస్తుంది .’’ది డబుల్ గేమ్’’  700 లైన్లు ఉన్న సుదీర్ఘ కవిత . ఇందులో ఆడెన్ మల్టిపుల్ మాన్ గా కనిపిస్తాడు అంటే-బ్రావేరాపెర్ఫార్మార్ గా ,ఫినికల్ క్రాఫ్ట్స్ మన్ గా జాంటి ఐకనో క్లాస్ట్ గా ,రిజర్వేడ్ క్లాసిసిస్ట్ గా కనిపిస్తాడన్నమాట .దీన్ని చూసి ఆయన మళ్ళీ లైన్ లో పడ్డాడని సమకాలీన కవులలో ప్రయోగ శీలి అని ,పోప్ మార్గ గామి అనిపిస్తాడు .కాని ‘’ది టెంపుల్స్ ‘’లో క్లాసిక్ కలోక్వియల్ లను కలిపి చాలా అందంగా  పారడాక్స్ గా రాశాడు.ఇదీ ,దీనితరువాత రాసిన వాటిల్లో ఒక అపూర్వతను సాధించాడు –అదే లైట్ వర్స్ కు ఆరేటరికి ,ఉన్నత భావాలకు ,ఉన్నత తీవ్రతకు మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి పారేశాడు .

ఇలియట్ కవిలాగా ఆడెన్ నిరాశా నిస్పృహ సంక్షోభాలను లతో కవిత్వం తో ప్రారంభించి,పరిపక్వత పొందాక తన స్వీయ భావ జాలం తో క్రూరత్వానికి నిరసనగా రాశాడు .మంచితనం లేని సౌందర్యాన్ని మెచ్చలేదు .గాయ పడిన మానవ హృదయ ఘోష వినిపించాడు .ఆధునిక మానసిక శాస్త్రాన్ని ,సాంఘిక శాస్త్రం తో జోడించాడు .ఇలియట్ పాత సంప్రదాయం లో పాతుకు పోతే ఆడెన్ భవిష్యత్తుపై దృష్టి నిలిపాడు .కొన్ని సార్లు సలహాలిచ్చాడు .మరికొన్ని సార్లు కర్క్ గార్డ్ ,ఫ్రాయిడ్ ,హెన్రి జేమ్స్ ,మాధ్యూ ఆర్నాల్డ్ ,యేట్స్ ,రిల్కే ,ఐన్ స్టీన్ ఎడ్వర్డ్ లియర్ ల  అవసర మూల విషయాలు అభి వర్ణించాడు .కాని వాటిల్లో పూర్తిగా మునిగి పోలేదు .ఇలియట్ రాసిన మాస్టర్ పీస్ ‘’వేస్ట్ లాండ్ ‘’లాంటిది ఆడెన్ రాయక పోయినా ఇలియట్ తర్వాత అంత ప్రభావం చూపిన కవిగా చరిత్రలో నిలిచి పోయాడు .దీనికి భౌగోళిక ,కవితాత్మక న్యాయం. ఉంది ఆడెన్ ఇంగ్లాండ్ లో పుట్టినా అమెరికాలో స్థిరపడ్డాడు .ఇలియట్ అమెరికాలోని మిస్సోరిలో పుట్టి ,బ్రిటన్ చేరి బ్రిటిష్ పౌరుడయ్యాడు .ఇలియట్ లాగానే ఆడెన్ సినిసిజం నుంచి మిస్టిజం కు ,నాగరకతా వ్యామోహాన్ని త్యజించి మత విశ్వాసానికి చేరువయ్యాడు .తన తరానికి ‘’ఏజ్ ఆఫ్ యాన్ క్సైటీ’’అని పేరుపెట్టి రాసిన దానికి పులిట్జర్ బహుమతి 1948లో  పొందాడు  .1940 నాటి భాషను వాడుతూ అందులోని వింతైన యాసకు ప్రాణం పోశాడు .ఇది పూర్వపు ఆంగ్లో సాక్సన్ రోజుల్లోకి తీసుకు వెడుతూ కొత్త అందాన్ని కల్పించింది

40 లలో ఆడెన్ రచయిత సంపాదకుడు కొల్లాబరేటర్ ,అనేక కవితా సంపుటుల నాటకాల ,వ్యాసాల కర్త అయ్యాడు .తన తర కవుల కు తన సామర్ధ్యం వలన శత్రువూ అయ్యాడు .అతని అభిమాన బృందాన్ని ‘’A circle of merchandising ,cooperative than a literary school ‘’అన్నారు ఈర్ష్యతో .మార్క్సిజం పట్ల ఆరాధన ఆయనలో ఎప్పుడూ పూర్తిగా పాదుకొని లేదు .మర్చేపోయాడు తర్వాత .పబ్లిక్ స్కూల్ బాయ్ గా ,గార్డెన్ పార్టీలతో జేరాల్ద్ హెర్డ్ తో కాలక్షేపం తో బి బి సి కి సైన్స్ పాప్యులరైజర్ గా ‘’అమెరికన్ హాలి ఉడ్ వీరీ రేలిజియాసిటికి ‘’వ్యాఖ్యానకర్తగా బిజీ బిజీ గా గడిపాడు .బారుగా ,స్ట్రా ఎల్లో రంగు జుట్టు తో ,తేలిక మిరుమిట్లు గొలిపే కళ్ళతో ఒక’’ పక్ ‘’ అనిపించేవాడు ఈ పక్కిజమే అతని అభిమానుల్ని కలవర పరచింది .కవిత్వ టెక్నిక్ లో అనితర సాధ్యుడు ఆడెన్. చివరి రోజుల కవిత్వం ‘’నోన్స్ ‘’లో ‘’అనదర్ టైం ‘’లలో మానవత్వం పై మమకారం ,వినయం కనిపిస్తాయి .కోపం స్థానం లో జాలి చోటు చేసుకొన్నది .ప్రపంచ వికృత స్థితిపై రాసిన కవిత –

‘’Intellectual disgrace –stares from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’వేదనామయ కాలం నుండి ,చావు ఆలోచనలనుండి ఐక్యతా అనుభవం లోకి ప్రవేశించాడు .అతని ప్రస్తానం ‘’from doom is dark and deeper than any sea dingle ‘’నుంచి ‘’we must love one another and die ‘’లోకి ప్రవేశించింది .తన కాలపు కవుల్లో పూసల్లో మణి లాగా వెలిగాడు ఆడెన్ .యేట్స్ కవి మరణాన్ని భావ గర్భితంగా గొప్పగా వర్ణించాడు –

‘’in the deserts of the heart –let the healing fountain start –in the prison of the days –teach the free man how to praise ‘’

గడచిన రెండు శతాబ్దాలలో అమెరికా బ్రిటన్ దేశాల లో కవులు రెండు వందలకు పైగా ఉన్నారు .ఇందులో విస్మ్రుతులేవరో సంస్మ్రుతులేవరో కాలమే నిర్ణయించాలి .అందులో 16 గురుకవులు మాత్రం తమ కాలసమస్యల్ని ఒత్తిడులను తట్టుకొని నిలిచారు 20 వశతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాల తాకిడికి తట్టుకొని నిలిచింది .వీటివలన శాంతి యేర్పడ లేదుకాని ఘర్షణ వాతావరణం ఏర్పడింది .మూడో ప్రపంచ యుద్ధం రావచ్చుననే భయం దేశాలమధ్య కొంత సయోధ్యతను చే కూర్చింది .సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ దోరో నమ్మినట్లు‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every  one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలు ,లోపలి టెన్షన్ లకు గురైన వాళ్ళు .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు అలవికాక విసిరి వేయబడ్డారు .మరికొంత మంది పలాయనం చిత్తగించారు .నిలిచి వెలిగిన  ఆందోళన కాలపు  కవే ఆడెన్ .ఆధునిక మానవుని భయాందోళనలు ,కలవరం అసూయ నిరాశాలకు ఆడెన్ ప్రతి రూపమే అయ్యాడు .తనకాలాన్ని అందరికంటే ఎక్కువ ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .

వ్యక్తిగా కవిగా తనకొక స్థానం కల్పించింది అమెరికాయే నన్నాడు ఆడెన్ ..అమెరికా తనను రాయటానికి ఆకర్షించిన దేశం అని మురిసిపోయాడు .అమెరికన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’పురస్కారం పొందాడు .అందులో సభ్యుడై గౌరవం పొందాడు కూడా .చాలా కాలేజీలు ,యూని వర్సిటీలలో బోధించాడు .1956 లో లండన్ వెళ్లి ఎమ్డెన్ గా లెక్చర్లిచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ‘’,’’ఎ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’గ్రంధాలు రాశాడు .’’ది ఎంచేఫ్ద్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు .కాల్రిడ్జి ,లూయీస్ మాన్లి ,హాప్కిన్ మేల్విల్లీ ,బాడర్లేర్ ,జూల్స్ వేర్న్స్ మొదలైన ప్రముఖులపై సాధికారిక ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,కర్క్ గార్డ్ ,పాస్కల్ ఓల్టేర్,మాంటేగ్ ఐన్ స్టీన్ లపై కమ్మని కవితలల్లాడు .’’కాదేదీ కవితను అనర్హం ‘’అని చాలా సార్లు రుజువు చేసి మన శ్రీ శ్రీకి దారి చూపాడు .న్యూయార్క్ లోని ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .ప్రేమ రాజకీయం ,మత౦  నీతి ,పౌరసత్వం ,సైకాలజీ లపై గొప్ప శైలీ టెక్నిక్ తో కవిత్వం రాశాడు .ఆయన భావాలపై ఎన్నో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీశారు .’’ఫునెరల్ బ్లూస్ ‘,అన్ నోన్ సిటిజెన్ ‘’,సెప్టెంబర్ ఫస్ట్ ‘’,రెఫ్యూజీ  బ్లూస్’’కవితలను ఇప్పటికీ జనం చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లోకి దూసుకు వెళ్లి ,ఆధునిక కవులలో శ్రేష్టుడు గా ఉన్నాడు ఆడెన్ .నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడు కాని అందలేదు .29-9-1973న 66 వ ఏట ఆస్ట్రియా లోని వియన్నా లో ఆడెన్ మరణించాడు .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు .20 వ శతాబ్దపు గొప్ప రచయిత అనిపించుకొన్న ఆడెన్ ‘’ఒపేరా లిబర్టోస్ ‘’రాసి బలంగా భావ ప్రదర్శన చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243

90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆడెన్ 30 వ ఏట రాసిన ‘’ఆన్ దిస్ ఐలాండ్ ‘’లో  మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘’అనదర్ టైం ‘’లో సా౦ఘికవిషయాలు చోటు చేసుకొన్నాయి .భాషా చాలా సరళంగా విషయం సూటిగా ఉంది .అప్పటి వరకు ఉన్న మూస పదబంధాలను త్రోసి రాజని కొత్త ఉదాత్త భావ జాలాన్ని చొప్పించాడు .నిత్య జీవిత విషయాలు కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పాటకజన పాటలు ,జానపద గీతాలు ,లయతో ఊగిపోయేట్లు రాశాడు .సైన్స్ ఆవిష్కరణలను కొత్త నాటక శైలిలో రచించాడు .డిగ్నిటి తోపాటు రౌడి యిజం కూడా ఏకకాలం లో కన్పించటం ప్రత్యేకత .ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రక్క కనిపిస్తూనే ప్రజాకవిగా వెలు గొందాడు .ఈ ద్విముఖ కవితా మార్గం ఆశ్చర్య పరచింది .’’The poet was essentially a wit after the caustic mockery of ‘’Law ‘’అనిపిస్తాడు అంటాడు గార్దేనేర్స్ .ఉదాహరణకు ఒక కవిత –

‘’Law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law is as you know I suppose –law is but let me explain it once more –law is the law ‘

సామాన్య లిరికల్ కవి మాత్రమే రాయగలిగిన ఒక లవ్ పోయెం రాసి మరీ ఆశ్చర్య పరుస్తాడు ఆడెన్ –

‘’Lay your sleeping head ,my love-human on my faithless arm –time and fevers burn away –individual beauty from –thoughtful children ,and the grave –proves the child ‘s ephemeral –but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty but to me –the entirely beautiful ‘’

ఆధునికకవులయిన  ఆడెన్ ఒక్కడే పాత ఫాషన్  బాల్లడ్ లో లేక విలానేల్లె లో భావ వ్యక్తీకరణ చేసే సామర్ధ్యమున్నవాడు .ఫ్రెంచ్ సంప్రదాయాలైన సేస్టినా మొదలైన ఫారంస్ లో కూడా ఆడెన్ ఒక్కడే ఇలాచేయగాలిగాడు .ఆడెన్ ఇంగ్లాండ్ లో అందరితో కలిసి పోయాడు .ఒక్కొసారీ ‘’మరీ ఎక్కువ భారం వేశాడు ‘’అనిపిస్తాడు .ఆడెన్ కవిత్వం లో ‘’A vitality ,an explosive violence ,that leaves his contemporaries dazed ‘’అన్నాడు స్పెండర్ .ముప్ఫై లలో ‘’ది డబుల్ మాన్ ‘’,’’ఫర్ ది టైం బీయింగ్ ‘’లలో ఆయన ఎంత విరుద్ధ భావ ప్రేరణ కవియో ,తన తరాన్ని ఎంత గొప్పగా ప్రబావితం చేశాడో తెలుస్తుంది .’’ది డబుల్ గేమ్’’  700 లైన్లు ఉన్న సుదీర్ఘ కవిత . ఇందులో ఆడెన్ మల్టిపుల్ మాన్ గా కనిపిస్తాడు అంటే-బ్రావేరాపెర్ఫార్మార్ గా ,ఫినికల్ క్రాఫ్ట్స్ మన్ గా జాంటి ఐకనో క్లాస్ట్ గా ,రిజర్వేడ్ క్లాసిసిస్ట్ గా కనిపిస్తాడన్నమాట .దీన్ని చూసి ఆయన మళ్ళీ లైన్ లో పడ్డాడని సమకాలీన కవులలో ప్రయోగ శీలి అని ,పోప్ మార్గ గామి అనిపిస్తాడు .కాని ‘’ది టెంపుల్స్ ‘’లో క్లాసిక్ కలోక్వియల్ లను కలిపి చాలా అందంగా  పారడాక్స్ గా రాశాడు.ఇదీ ,దీనితరువాత రాసిన వాటిల్లో ఒక అపూర్వతను సాధించాడు –అదే లైట్ వర్స్ కు ఆరేటరికి ,ఉన్నత భావాలకు ,ఉన్నత తీవ్రతకు మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి పారేశాడు .

ఇలియట్ కవిలాగా ఆడెన్ నిరాశా నిస్పృహ సంక్షోభాలను లతో కవిత్వం తో ప్రారంభించి,పరిపక్వత పొందాక తన స్వీయ భావ జాలం తో క్రూరత్వానికి నిరసనగా రాశాడు .మంచితనం లేని సౌందర్యాన్ని మెచ్చలేదు .గాయ పడిన మానవ హృదయ ఘోష వినిపించాడు .ఆధునిక మానసిక శాస్త్రాన్ని ,సాంఘిక శాస్త్రం తో జోడించాడు .ఇలియట్ పాత సంప్రదాయం లో పాతుకు పోతే ఆడెన్ భవిష్యత్తుపై దృష్టి నిలిపాడు .కొన్ని సార్లు సలహాలిచ్చాడు .మరికొన్ని సార్లు కర్క్ గార్డ్ ,ఫ్రాయిడ్ ,హెన్రి జేమ్స్ ,మాధ్యూ ఆర్నాల్డ్ ,యేట్స్ ,రిల్కే ,ఐన్ స్టీన్ ఎడ్వర్డ్ లియర్ ల  అవసర మూల విషయాలు అభి వర్ణించాడు .కాని వాటిల్లో పూర్తిగా మునిగి పోలేదు .ఇలియట్ రాసిన మాస్టర్ పీస్ ‘’వేస్ట్ లాండ్ ‘’లాంటిది ఆడెన్ రాయక పోయినా ఇలియట్ తర్వాత అంత ప్రభావం చూపిన కవిగా చరిత్రలో నిలిచి పోయాడు .దీనికి భౌగోళిక ,కవితాత్మక న్యాయం. ఉంది ఆడెన్ ఇంగ్లాండ్ లో పుట్టినా అమెరికాలో స్థిరపడ్డాడు .ఇలియట్ అమెరికాలోని మిస్సోరిలో పుట్టి ,బ్రిటన్ చేరి బ్రిటిష్ పౌరుడయ్యాడు .ఇలియట్ లాగానే ఆడెన్ సినిసిజం నుంచి మిస్టిజం కు ,నాగరకతా వ్యామోహాన్ని త్యజించి మత విశ్వాసానికి చేరువయ్యాడు .తన తరానికి ‘’ఏజ్ ఆఫ్ యాన్ క్సైటీ’’అని పేరుపెట్టి రాసిన దానికి పులిట్జర్ బహుమతి 1948లో  పొందాడు  .1940 నాటి భాషను వాడుతూ అందులోని వింతైన యాసకు ప్రాణం పోశాడు .ఇది పూర్వపు ఆంగ్లో సాక్సన్ రోజుల్లోకి తీసుకు వెడుతూ కొత్త అందాన్ని కల్పించింది

40 లలో ఆడెన్ రచయిత సంపాదకుడు కొల్లాబరేటర్ ,అనేక కవితా సంపుటుల నాటకాల ,వ్యాసాల కర్త అయ్యాడు .తన తర కవుల కు తన సామర్ధ్యం వలన శత్రువూ అయ్యాడు .అతని అభిమాన బృందాన్ని ‘’A circle of merchandising ,cooperative than a literary school ‘’అన్నారు ఈర్ష్యతో .మార్క్సిజం పట్ల ఆరాధన ఆయనలో ఎప్పుడూ పూర్తిగా పాదుకొని లేదు .మర్చేపోయాడు తర్వాత .పబ్లిక్ స్కూల్ బాయ్ గా ,గార్డెన్ పార్టీలతో జేరాల్ద్ హెర్డ్ తో కాలక్షేపం తో బి బి సి కి సైన్స్ పాప్యులరైజర్ గా ‘’అమెరికన్ హాలి ఉడ్ వీరీ రేలిజియాసిటికి ‘’వ్యాఖ్యానకర్తగా బిజీ బిజీ గా గడిపాడు .బారుగా ,స్ట్రా ఎల్లో రంగు జుట్టు తో ,తేలిక మిరుమిట్లు గొలిపే కళ్ళతో ఒక’’ పక్ ‘’ అనిపించేవాడు ఈ పక్కిజమే అతని అభిమానుల్ని కలవర పరచింది .కవిత్వ టెక్నిక్ లో అనితర సాధ్యుడు ఆడెన్. చివరి రోజుల కవిత్వం ‘’నోన్స్ ‘’లో ‘’అనదర్ టైం ‘’లలో మానవత్వం పై మమకారం ,వినయం కనిపిస్తాయి .కోపం స్థానం లో జాలి చోటు చేసుకొన్నది .ప్రపంచ వికృత స్థితిపై రాసిన కవిత –

‘’Intellectual disgrace –stares from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’వేదనామయ కాలం నుండి ,చావు ఆలోచనలనుండి ఐక్యతా అనుభవం లోకి ప్రవేశించాడు .అతని ప్రస్తానం ‘’from doom is dark and deeper than any sea dingle ‘’నుంచి ‘’we must love one another and die ‘’లోకి ప్రవేశించింది .తన కాలపు కవుల్లో పూసల్లో మణి లాగా వెలిగాడు ఆడెన్ .యేట్స్ కవి మరణాన్ని భావ గర్భితంగా గొప్పగా వర్ణించాడు –

‘’in the deserts of the heart –let the healing fountain start –in the prison of the days –teach the free man how to praise ‘’

గడచిన రెండు శతాబ్దాలలో అమెరికా బ్రిటన్ దేశాల లో కవులు రెండు వందలకు పైగా ఉన్నారు .ఇందులో విస్మ్రుతులేవరో సంస్మ్రుతులేవరో కాలమే నిర్ణయించాలి .అందులో 16 గురుకవులు మాత్రం తమ కాలసమస్యల్ని ఒత్తిడులను తట్టుకొని నిలిచారు 20 వశతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాల తాకిడికి తట్టుకొని నిలిచింది .వీటివలన శాంతి యేర్పడ లేదుకాని ఘర్షణ వాతావరణం ఏర్పడింది .మూడో ప్రపంచ యుద్ధం రావచ్చుననే భయం దేశాలమధ్య కొంత సయోధ్యతను చే కూర్చింది .సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ దోరో నమ్మినట్లు ‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every  one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలు ,లోపలి టెన్షన్ లకు గురైన వాళ్ళు .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు అలవికాక విసిరి వేయబడ్డారు .మరికొంత మంది పలాయనం చిత్తగించారు .నిలిచి వెలిగిన  ఆందోళన కాలపు  కవే ఆడెన్ .ఆధునిక మానవుని భయాందోళనలు ,కలవరం అసూయ నిరాశాలకు ఆడెన్ ప్రతి రూపమే అయ్యాడు .తనకాలాన్ని అందరికంటే ఎక్కువ ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .

వ్యక్తిగా కవిగా తనకొక స్థానం కల్పించింది అమెరికాయే నన్నాడు ఆడెన్ ..అమెరికా తనను రాయటానికి ఆకర్షించిన దేశం అని మురిసిపోయాడు .అమెరికన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’పురస్కారం పొందాడు .అందులో సభ్యుడై గౌరవం పొందాడు కూడా .చాలా కాలేజీలు ,యూని వర్సిటీలలో బోధించాడు .1956 లో లండన్ వెళ్లి ఎమ్డెన్ గా లెక్చర్లిచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ‘’,’’ఎ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’గ్రంధాలు రాశాడు .’’ది ఎంచేఫ్ద్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు .కాల్రిడ్జి ,లూయీస్ మాన్లి ,హాప్కిన్ మేల్విల్లీ ,బాడర్లేర్ ,జూల్స్ వేర్న్స్ మొదలైన ప్రముఖులపై సాధికారిక ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,కర్క్ గార్డ్ ,పాస్కల్ ఓల్టేర్,మాంటేగ్ ఐన్ స్టీన్ లపై కమ్మని కవితలల్లాడు .’’కాదేదీ కవితను అనర్హం ‘’అని చాలా సార్లు రుజువు చేసి మన శ్రీ శ్రీకి దారి చూపాడు .న్యూయార్క్ లోని ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .ప్రేమ రాజకీయం ,మత౦  నీతి ,పౌరసత్వం ,సైకాలజీ లపై గొప్ప శైలీ టెక్నిక్ తో కవిత్వం రాశాడు .ఆయన భావాలపై ఎన్నో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీశారు .’’ఫునెరల్ బ్లూస్ ‘,అన్ నోన్ సిటిజెన్ ‘’,సెప్టెంబర్ ఫస్ట్ ‘’,రెఫ్యూజీ  బ్లూస్’’కవితలను ఇప్పటికీ జనం చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లోకి దూసుకు వెళ్లి ,ఆధునిక కవులలో శ్రేష్టుడు గా ఉన్నాడు ఆడెన్ .నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడు కాని అందలేదు .29-9-1973న 66 వ ఏట ఆస్ట్రియా లోని వియన్నా లో ఆడెన్ మరణించాడు .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు .20 వ శతాబ్దపు గొప్ప రచయిత అనిపించుకొన్న ఆడెన్ ‘’ఒపేరా లిబర్టోస్ ‘’రాసి బలంగా భావ ప్రదర్శన చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్

     ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242

90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్

35 ఏళ్ళ లోపు విస్టన్ హఘ్ ఆడెన్ కలవరపరచే విషయమైనాడు .అట్లాంటిక్ సముద్రానికి రెండు వైపులా ఆయన అత్యంత ప్రభావం కలిగించాడు .ఆయన కవిత్వం ఒక మైలు రాయిగా ఉండటమే కాక ,ఒక అత్యంత గొప్ప మలుపు కూడా తిప్పింది .ఆధునిక కవులపై  రాసిన ఉద్గ్రంధం ‘’ఆడెన్ అండ్ ఆఫ్టర్ ‘’గొప్ప విశ్లేషణాత్మకమైన గ్రంధం .దీని ఉప శీర్షిక ‘’కవిత్వ విముక్తి 1930-43 ‘’కూడా అంతటి ప్రాముఖ్యం పొందింది .దీన్ని బట్టి ఆయన ఒక యుగ కర్త అనిపిస్తాడు .

21-2-1907న ఇంగ్లాండ్ లోని యార్క్ లో ఆడెన్ జన్మించాడు తండ్రి రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ .హాల్ట్ లోని గ్రేషమ్స్ స్కూల్ లో చదివి,ఆక్స్ ఫర్డ్ లో క్రైస్ట్ చర్చ్ కాలేజిలో చేరి ,23 వ ఏటనుండి అయిదేళ్ళు మాల్వేర్న్ లోని స్కూల్ లో బోధించాడు ‘అతని ‘’ఓడ్  -టు మై ప్యూపిల్స్ ‘’లండన్ అంతా ప్రతిధ్వనించింది .మరుసటి ఏడాది ఒక ఫిలిం ఫర్మ్ లో పని చేశాడు .30 లో కింగ్స్ పోయెట్రి మెడల్ అందుకొన్నాడు . .స్పెయిన్ వెళ్లిస్పానిష్ విప్లవ సమయం లో  లాయలిస్ట్ లకోసం ఒక అంబులెన్స్ నడిపాడు .రెండేళ్ళ తర్వాత ఎరికా మాన్ అనే ధామస్ మాన్ కుమార్తెను పెళ్లి చేసుకొని అమెరికాకు తాను  రాసిందంతా తీసుకొని  వెళ్ళాడు .1946 లో అమెరికా పౌరుడయి ,అప్పటికే నాలుగు కవితాసంపుటులు ,మూడు నాటకాలు ,3 వచన సంపుటులు ,యాత్రపై రెండు, 3 ఆ౦ ధాలజీలు   రాసి  రచయితగా పేరొందాడు .

   ఆడెన్ మొదటి కవితా సంపుటి లోనే ఆయన కవితా చాతుర్యం మనసులోని ఫిలాసఫీ వ్యక్తమయ్యాయి .’’పాత ముఠా’’’ను నిర్దాక్షిణ్యంగా ఖండించాడు .వారికవిత్వం ఏడుపు గొట్టు ,విషాదభరితమన్నాడు.కాని తానూ కొత్త దారి తొక్క లేక పోయాడు .యుద్ధపు కరుకుదనం లో శాంతిలో అలక్ష్యం చేయబడిన వారి పక్షాన చేరాడు .వాళ్ళలో ఒకడు కాక పోయినా మనసారా సానుభూతి చూపాడు  .ఆయన పూర్తిగా పాల్గొనక పోవటానికి కారణం కవిత్వం లో బిగుసుకు పోవటం అడ్డంకి అయింది .తనకోసం తన చుట్టూ ఉండే కొద్ది మంది కోసమే ఆడెన్ రాశాడు అని ఆయనపై అభియోగం ఉంది .తన పరిధి దాటి ఇతరులతో కలవటానికి చేసే ప్రయత్నం ,అంతశ్శోధన ,అనిశ్చిత ముగింపు లు కనిపిస్తాయి .

Inline image 1

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -241 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే-2-చివరిభాగం

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -241

89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే-2(చివరిభాగం 0

ఐక్యత ,ఒంటరితనం రెండూ ముఖ్యమైనవే అని కాని ప్రతిగంటకు అత్యవసరమైనవే అని సాత్రే అంటాడు ..’’అండర్ గ్రౌండ్  కార్యకలాపాలలో ఉన్నవారి పరి పోరాట స్థితులు కొత్త తరహా అనుభావాలనిచ్చాయి . .వాళ్ళు సామాన్య సైనికులు లాగా బయట పోట్లాడరు .అన్ని పరిస్థితులలోనూ వారు ఒంటరివారే .ఆ ఏకాంతం లోనే వేటాడబడి ,ఏకాంతంలోనే అరెస్ట్ అయినవాళ్ళు .పూర్తీ నిరాధార ,స్నేహరహిత౦గా హింస ,దౌర్జన్యాలలో నగ్నంగా ఏకాంతంగా అనుభవిస్తూ ,నున్నగా గొరగబడి ,బాగా తిండి పెట్టబడి ,మంచి వస్త్ర ధారణ తో ,బలిసిన ఒళ్ళు చూసుకొని మురుస్తూ కనిపించే ప్రతిదీ సరైనదిగా భావిస్తారు .ఒంటరిగా స్నేహ రహితంగా ,ప్రోత్సాహం కలిగించే  ఒక్కమాటా లేకుండా ,ఒంటరితనపు అగాదాల్లో ఇతరులను ఆ ఇతరులనే తమ కామ్రేడ్ లనే నిలవరించటానికి ఎదిరిస్తూ బతికారు .సంపూర్ణ బాధ్యతా సంపూర్ణ ఒంటరితనంలోనే .ఇదికాడా మన విముక్తి కి  నిర్వచనం ?వ్యక్తిగతంగా ,కమాండర్ ఇన్ చీఫ్ పరంగా రిస్క్ తోకూడిన సమానత్వాన్ని పొందుతున్న ఇలాంటి సైన్యం ప్రపంచం లో ఎక్కడా ఉండదు .క్రమశిక్షణలో అదే ప్రమాదం అదే పూర్తీ బాధ్యతా అదే త్యాగం ,అదే సంపూర్ణ స్వేచ్చ .ఈ విధంగా చీకట్లో ,రక్తం లో ఒక రిపబ్లిక్  సర్వశక్తి వంతమైన రిపబ్లిక్ ఏర్పడింది .స్వేచ్చలో తనకుతాను ఎంచుకొంటూ ,అందరి స్వేచ్చనూ ఎంచుకొన్నాడు ‘’అని రాశాడు సాత్రే .

   ఫ్రాన్స్ విముక్తమయ్యాక టీచర్ ,పోరాట యోధుడు అయిన సాత్రే మరింత శక్తి వంతమైన రచయిత అయ్యాడు. పోరాటం లో తానూ అనుభవించిన కస్టాలు బాధలు అన్నీ ఆయనకు బాగా గుర్తు ఉండిశారీరక మానసిక వేదనలను గ్రహించి మానవ సమాజ ప్రవర్తన ,వారి దయనీయ స్థితిగతుల పై రాశాడు .సానుభూతిలేని స్వచ్చతతతో మనిషి ఈ వేదనామయ ప్రపంచం లో తన ఉనికికి ఏదీ సహకరించని పరిస్థితులను అన్వేషించి రాశాడు .మనిషి స్వేచ్చాయుత మనసే అతని జీవితానికి దారి అన్నాడు .మనిషి నిరాశా నిస్పృహలను వేదనను ‘’ది ఏజ్ ఆఫ్ రీజన్ ‘’,ది రిప్రీవ్ ‘’,ది లాస్ట్ చాన్స్ ,నాసియా ‘’మొదలైన వాటిలో రాశాడు .నాటకాలుగా ‘’ది ఫ్లైస్ ‘’,నో ఎక్సిట్ ,లను నరకం భూమికగా రాసి ,ది రేస్పెక్ట బుల్ ప్రాస్టి ట్యూట్ ‘’మెలోడ్రామా రాశాడు ఇవన్నీ అభిమానుల్ని అలరిస్తే దియేటర్ వాళ్ళు అధిక్షేపించారు .38 వ ఏట సాత్రే తన ప్రముఖ ఫిలసాఫికల్ రచన ‘’బీయింగ్ అండ్ నాన్ బీయింగ్ ‘’రాశాడు .

 కరక్ గార్డ్ దృష్టిలో ఆదర్శ జీవితం అంటే నిరంతర అన్వేషణ ,దైవ సాక్షాత్కారానికి అనంత తపన .ఇద్దరికీ బహుదూరం కనుక జీవితమంతా కడగండ్ల అనుభవమై చివరికి దక్కుతుంది .దీన్ని సాత్రే పూర్తిగా వ్యతిరేకించాడు .అందుకే ‘’The self  that existentialism seeks is each person’s individual self ,which he must forge for himself out of such senseless circumstances ,such meaningless limitations as are given him .This self creation –the making of ones  essence from mere existence –is demanded by each of us because according to existentialism,there is no single essence of humanity to which we may logically turn as standard or model for making ourselves thus or so .And there is no single concept of humanity because there is no God ‘’అని వివరించాడు .

మనిషి  తను చేస్తున్నదానికి తానున్నదానికీ పూర్తీ  బాధ్యుడు .మనిషికి మించిన విలువలు లేవు .కనుక సమయ సందర్భాలను బట్టి తనకు కావలసింది ఎన్నుకొని తన మార్గం లో ప్రవర్తించాలి .హ్యూమనిజానికి మరోపేరు అస్తిత్వ వాదం .మనిషిమాత్రమే మూలమూ సృష్టికర్త అన్ని విలువలకు .మానసికంగా పరి పక్వం చెంది ముందుకు మానవుడు నడవాలి అని సాత్రే వేదాంత సారాంశం .ఎవరికి వారే స్వతంత్రులుకనుక వేరోకరిపై బలవంతంగా దేనినీ రుద్దరాదు .అయితే తన స్వేచ్చను ఆషామాషీగా భావించ కూడదు .స్వాతంత్ర్యం అంటే వరం కాదు అదొక భరించరాని బాధ్యత.ప్రపంచం లో మనిషి విరుద్ధ ద్వంద్వాలలో ఇరుక్కుని ఉన్నాడు .విముక్తికోసం నిరంతరం పోరాటం చేస్తాడు .అలారం గడియారాలు ,సైన్ బోర్డ్ లు ,పోలీసులు వంటివి భయపెట్టే ఎన్నో అడ్డంకులు .నాకు నేను తెలియబడితే వీటి అర్ధం తెలుస్తుంది ‘’అంటాడు సాత్రే .అస్తిత్వవాదం విరుద్ధత ఏమిటి అంటే జంకని పెసిమిస్ట్ మోరలిస్ట్ అవటం ,అన్నిటినీ కాదనే నిరీశ్వరవాది మాంచి ఆధ్యాత్మిక గురువు అవటం .అయితే సాత్రే మాత్రం ప్రపంచాన్ని ప్రశ్నించే ఎదిరించే వారి ప్రతినిధి .యంత్ర ఉత్పత్తికి ,మెటాఫిజిక్స్ కు వ్యతిరేకి .అందుకే ఆయనను ‘’ది ఎమోషనల్లి అన్ ఎంప్లా ఎడ్’’అన్నారు

 ఇంకా అసలైన అస్తిత్వ వాద సిద్ధాంతం ఏర్పడలేదు .ఎమిలీ జోల ,ఇబ్సెన్ ల కాలం నాటి నేచురలిజం ను మించినది అస్తిత్వవాదం .అస్తిత్వ వాదానికి కొన్ని మంచి లక్షణాలే ఉన్నాయి .కాని దాని అచేతనత్వమే అందర్నీ భయ పెడుతోంది .అది అచేతనత్వానికి విరుగుడు మాత్రం కాలేక పోయింది .విశ్వ వ్యాప్త రుగ్మత పై అది కొత్త మతాన్నికాని స్పష్టమైన మానవ జాతి ని కాని  నిర్మించ లేక పోయింది  .కాని ప్రపంచ వ్యాప్త వేదనను అస్తిత్వ వాదులు అర్ధం చేసుకొన్నారు .

సాత్రేకు సైమన్ డీ బోవియర్ తో సన్నిహిత సంబంధాలుండేవి .ఇద్దరూకలిసి సాంఘిక  సాంస్కృతిక భావాలను ఎదిరించారు .19 64 లో సాత్రేకు సాహిత్యం లో నోబెల్ బహుమతిని ప్రకటిస్తే తీసుకోవటానికి తిరస్కరిస్తూ ‘’A writer should not allow himself to be turned into an institution ‘’అన్నాడు .తనకు అధికారిక మర్యాదలు ఇష్టం లేదన్నాడు .పారిస్ లో 15 -4-1980 న 74  వ ఏట జీన్ పాల్ సాత్రే జీవన యాత్ర ముగించాడు .

In 1975, when asked how he would like to be remembered, Sartre replied:

I would like [people] to remember Nausea, [my plays] No Exit and The Devil and the Good Lord, and then my two philosophical works, more particularly the second one, Critique of Dialectical Reason. Then my essay on GenetSaint Genet…. If these are remembered, that would be quite an achievement, and I don’t ask for more. As a man, if a certain Jean-Paul Sartre is remembered, I would like people to remember the milieu or historical situation in which I lived,… how I lived in it, in terms of all the aspirations which I tried to gather up within myself.[52]

గుస్తేవ్ ఫ్లాబర్ట్ జీవిత చరిత్ర రాశాడు సాత్రే .సాత్రేను  పబ్లిక్ ఇంట లేక్త్యువల్ అంటారు వామభావ పక్షపాతి .దాదాపు ఇరవైకి పైగా కల్పనా సాహిత్య పుస్తకాలు ,,10 ఫిలసాఫికల్ వ్యాసాలూ ,4 జీవిత చరిత్రలు ,15 విమర్శన వ్యాసాలూ రాశాడు

The war opened Sartre’s eyes to a political reality he had not yet understood until forced into continual engagement with it: “the world itself destroyed Sartre’s illusions about isolated self-determining individuals and made clear his own personal stake in the events of the time.”[70]Returning to Paris in 1941 he formed the “Socialisme et Liberté” resistance group. In 1943, after the group disbanded, Sartre joined a writers’ Resistance group,[71] in which he remained an active participant until the end of the war. He continued to write ferociously, and it was due to this “crucial experience of war and captivity that Sartre began to try to build up a positive moral system and to express it through literature”.[7

Inline image 1  Inline image 2

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్—2-8-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240

89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే

ఫ్రెంచ్ నాటక నవలా  కర్త, ఫిలాసఫర్ , రాజకీయ నాయకుడు ,జీవిత చరిత్రకారుడు ,అస్తిత్వ వాద ద్రుగ్విషయ వాదసిద్ధాంత మూల పురుషులలో ఒకడు ,20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఫిలాసఫీ మార్క్సిజం లో నిష్ణాతుడు జీన్ పాల్ సాత్రే .ఆయన రచనా ప్రభావం సోషియాలజి,,క్రిటికల్ దీరీ ,పోస్ట్ కలోనియల్ దీరీ ,లిటరరీ స్టడీస్ ల పై గొప్ప ప్రభావం చూపాయి .

సోరెన్ కర్క్ గార్డ్ ఫిలాసఫీ అనేక విరుద్ధ విషయాలను ప్రతిపాదించింది .ముఖ్యంగా మానవుడు దేవుని సమీపిస్తున్నకొద్దీ శూన్యం దగ్గరకు చేరతాడు ,ఈ శూన్యం అతని అస్తిత్వ వాదసాఫల్యమే .కర్క్ గార్డ్ మరణించిన వందేళ్ళకు మానవ అస్తిత్వ సమస్య ఆధునిక యుగం లో రెండు విభిన్న సిద్ధాంతాలకు దారి తీసింది .అందులో మొదటిది –మానవునికి ప్రాధమికంగా విశ్వాసం ఉండాలని మత సాంప్రదాయాలను పాటించాలన్నది ,దాని సారాంశం గ్రహి౦చాలన్నది . రెండవది –అసలు దేవుడూ గీవుడూ’’ జంతా నై ‘’అంటూ  అన్ని సువార్తలను ,మెటా ఫిజికల్ జ్ఞానాలను పూర్తిగా తిరస్కరించి అస్తిత్వ వాదననే నమ్మటం అనేది .రెండవ సిద్ధాంతానికి మళ్ళీ రెండు భిన్నమార్గాలు ఏర్పడి విమర్శకులు కూడా రెండు గుడారాలలో చేరారు .ఫిలాసఫీలో కొత్త నిష్క్రమణ అని ,అసలు ఫిలాసఫీ  తిరస్కరించటమేనని ,అన్నారు .కొత్త విభేదం వచ్చినప్పుడల్లా అస్తిత్వ వాదం మహా వేగంగా పెరిగింది .దాని మూల ద్వేషం నిరాశ మూలాలపై ఆధార పడింది .1940 లోరెండవ ప్రపంచ యుద్ధం తో ఏర్పడిన  ఆశారాహిత్యం తో  ఇది వెంటనే ప్రాభవం పొంది౦ది .దీనికి ప్రేరణ జీన్ పాల్ సాత్రే వల్లనే జరిగింది .

 5-6-1905న పారిస్ లో జన్మించిన సాత్రే బాల్యం నుంచి ఫిలాసఫీ ని ఇష్టపడటం విశేషం .ఈకోల్ నార్మేల్ లో చదివి 25 ఏళ్ళకే డిగ్రీ పొంది ,పారిస్ లోని లీ హార్వే ,లయాన్ లలో ఫిలాసఫీ బోధించాడు .30 లలో జర్మని ,ఇటలి స్పెయిన్ ,గ్రీస్ ,ఇంగ్లాండ్ లలో పర్యటన చేసి,రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ఆర్మీలో చేరాడు .1939 లో ఆల్సేస్ లోఆర్టిలరి అబ్సర్వర్ గా  ఉన్నాడు .ఏడాది తర్వాత బందీ అయి జర్మన్ జైలు లో 9 నెలలు గడిపాడు  .ఎలాగోలాతప్పించుకోనిఫ్రాన్స్ అధీనంకాని జోన్ కు చేరి ,35 వ ఏట టీచింగ్ చేశాడు .నాజీ ప్రభుత్వం ఫ్రాన్స్ దేశాన్ని కబళించినప్పుడు సాత్రే పారిస్ లోనే ఉండిపోయి అండర్ గ్రౌండ్ లో రెసిస్టన్స్ మూవ్మెంట్ ‘వాళ్లకు రిస్క్ తీసుకొని సహాయం చేశాడు .

ఈ పరిస్థితులోనే  సాత్రే తన స్వంత’’ పారడాక్స్ ఫిలాసఫీ ‘’పై ఆలోచించి రూపు దిద్దాడు.ఇందులో ముఖ్య విషయం ‘’బయటి అణగార్చే తనం వలననే విముక్తి  శక్తి ఏర్పడుతుంది .అది మానవులోని లోపలి మనిషిని తనకు రోజూ ఏదికావాలంటే అది చేసుకోనేట్లు చేసి తెగించే నిర్ణయాలను చేయిస్తుంది .సాత్రే ‘’రిపబ్లిక్ ఆఫ్ సైలెన్స్’’గ్రంధం రాశాడు .ఇందులో ‘’జర్మన్లు ఆక్రమించినప్పుడు మేము పొందిన స్వేచ్చ అంతకు ముందు ఎప్పుడూ పొందలేదు మా హక్కులన్నీ హరి౦చేశారు .మాట్లాడే హక్కుతో సహా .ప్రతి రోజు మమ్మల్ని మా ముఖమీదే అవమానిస్తున్నారు .వాటిని మేము మౌనంగా భరించాం ఏదో ఒక నెపంతో వర్కర్లుగా జ్యూలుగా రాజకీయ ఖైదీలుగా మమ్మల్ని సామూహికంగా దేశంనుంచి బహిష్కరించారు .నోటీస్ బోర్డు లపైనా , వార్తాపత్రికలలో ,సినిమాహాళ్ళలో మమ్మల్ని అతి నీచంగా అవమానకరంగా చిత్రింఛి మేము ఆ అణగార్చే ముఠాకు లొంగి పోయేట్లు,వాళ్ళ మాట వినేట్లు  చేసే ప్రయత్నాలన్నీ చేశారు .అందుకే వీటన్నిటి వలన మేము ఫ్రీగా ఉన్నాం .నాజి విషం మా ఆలోచనల్లోకి ఎక్కిపోయింది .ప్రతి సరైన ఆలోచనా ఒక విజయమే అయింది .అన్నిరకాల అంతమంది పోలీసులు మా నోళ్ళు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేసినా ,మా లోంచి వచ్చిన ప్రతిమాట ఒక సిద్ధాంత విలువగా ప్రకటిత మైంది .మమ్మల్ని వేటాడి పడ గొట్టటం వలన ,మాలోని ప్రతి కవళికఒక గట్టి  నిబద్ధతకు బలాన్నిచ్చింది .’’అంటాడు తీవ్ర స్టాయిసిజం తో .’’వాళ్ళ హింసలు ,దౌర్జన్యదురాగతాలు కూడా మాకు హాయిగా జీవించే స్థితి కల్పించాయి .భ్రమ ,అబద్ధపు అవమానం ,భయంకర బతకలేనితనం అన్నీ మాకు మానవ అదృష్టంగా కలిసి వచ్చాయి ‘’అన్నాడు సాత్రే .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-8-16-ఉయ్యూరు  

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం )

మూడవ ఇంటర్నేషనల్ నుండి 1927 లో  చాంగ్ కై షేక్ విడిపోయి కమ్యూనిస్ట్ లతో కలిసిపోయినప్పుడు మాల్రక్స్ యూరప్ తిరిగి వెళ్లి పోయాడు .అక్కడ చేతులు ముడుచుకొని కూర్చో లేదు .యాంటి ఫాసిస్ట్ ఉద్యమ నాయకుడై ,యూరప్ లోని అండర్ గ్రౌండ్ వర్కర్లకు ,అన్ని ప్రదేశాలలోని ‘’సామాన్య జన సమూహానికి సేవ చేయటానికి అంకితమయ్యాడు.’’డే ఆఫ్ రాత్’’లో ఫాసిజం సమస్యను నాటకీయం గా రాశాడు .ఇది మాన్స్  ఫేట్ కంటే విపరీతంగా కిక్ అయింది .ఇందులో కేంసేన్ పాత్ర అండర్ గ్రౌండ్ జర్మన్ మనిషి .కమ్యూనిస్ట్ ల జాబితాను ఇవ్వమని ఆయన్ను అడిగినప్పుడు తిరస్కరిస్తేతొమ్మిది రోజులు కటిక చీకటి  జైలులో పెట్టారు ఎవరో ఒక బకరా కమ్యూనిస్ట్ తానె కాస్నేర్ అని ఒప్పుకున్నందున అసలు వాడిని విడుదల చేశారు .. మాల్రక్స్ సాంఘిక సేవ పేపర్లకే పరిమితం కాలేదు .పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఆవేశంగా నాజియిజం నిజాన్ని గురించి ,ముసోలిని బ్లాక్ షర్ట్  సాహసాల గురించి మాట్లాడే వాడు .అబిసీనియా పై క్రూర దాడిని నిరసించాడు .’’ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైటర్స్ ’’సంస్థను సంస్కృతీ పరిరక్షణకోసం ఏర్పరచాడు .

1936 లో మాల్రక్స్ మళ్ళీ విప్లవోద్యమ౦లో చురుకుగా పాల్గొన్నాడు .స్పెయిన్ కు ఫ్రాంకో డిక్టేటర్ అయినప్పుడు మాల్రక్స్ లాయలిస్ట్ లతో కలిశాడు .ఒక విమానం తీసుకొని మాడ్రిడ్ వెళ్లి విమానం నడిపే అనుభవం ఎక్కువ గా లేకపోయినా ధైర్యంగా ఫాసిస్ట్ సామ్రాజ్యం పై 65 దాడులు చేశాడు .ఆ దాడిలో రెండు సార్లు గాయ పడ్డాడు .స్పెయిన్ ముందుకు దూసుకు రాకుండా ఆపగలిగాడు .ఫ్రాన్స్ ,అమెరికాలలో ప్రయాణించి లాయలిస్ట్ లకు అండగా నిలవాలని ఆదేశాలను ఒప్పించి వారికి ధనసహాయం కోసం విరాళాలు సేకరించాడు .స్పానిక్ సివిల్ వార్  మొదటి దశ విషయాలన్నిటిని ‘’మానస్ హోప్స్ ‘’లో రాశాడు .వీదియుద్దాల భీభత్సం ,సాయుధ శ్రేణుల వీరోచిత పోరాటం అసలైన హీరో అయిన రిపబ్లిక్ ఆర్మీ విషయాలను చాలా ఖచ్చితంగా వర్ణించాడు .అనేక మంది ఇతర రచయితలలాగా రెండు పడవలలో కాళ్ళు పెట్టాడు అన్నారు .

మాల్రక్స్ కు ఈ మారటాలు మామూలే .స్టాలిన్ ను కొన్ని రోజులు ట్రాట్ స్కి ని కొన్ని రోజులు సమర్ధించాడు .మార్క్సిస్ట్ ల విజయోత్సవాలను ,వాళ్ళ పరాజయపరంపరాలను చూశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో టాంక్ దళం లో పేరు నమోదు చేయించుకొని ,అరెస్ట్ అయి ,తప్పించుకొని ,అండర్ గ్రౌండ్ మార్క్విజ్ ల తో చేరి పనిచేశాడు .యుద్ధం పూర్తీ అవగానే మాల్రక్స్ పూర్తీ రైటిస్ట్ ప్రభుత్వాన్ని సమర్ధించి తన అభిమానుల్ని అనుచరుల్ని విపరీతంగా ఆశ్చర్యం లో పడేశాడు .నియంత చార్లెస్ డిగాల్లీ ని సమర్ధించటం మరీ విడ్డూరం అని పించింది .విప్లవవాది డీగల్లీకి వ్యతిరేకి అయి యుద్ధాన్ని ద్వేషించాడని ఆయన యుద్ధ ప్రేమికుడని నింద మోపినప్పుడు మాల్రక్స్ ‘’నేను మారలేదు ప్రపంచం మారింది ‘’అని సమాధానమిచ్చాడు .బాహ్యంగా ఆయనలో పెద్ద మార్పేమీ లేదు .50 ఏళ్ళ వయసులో ఆయన నీలి కళ్ళు ఇంకా జ్వలిస్తూనే ఉన్నాయి .జుట్టు నల్లగా నిగ నిగ లాడుతూ ,మూతి మాత్రం ఇదివరకటి కంటే బిగుసుకు పోయి కనిపించాడు .

భార్య క్లారాతో వివాహ జీవితం సమాప్తమై విడాకులు తీసుకొన్నారు .రచయిత్రి జోసేట్టి  క్లోటిస్ ను పెళ్ళాడాడు .ఇద్దరు పిల్లలు పుట్టారు .ఆమెరైలు ప్రమాదం లో చనిపోయింది .మూడో పెళ్లి హాఫ్ బ్రదర్ రోలాండ్ భార్య మేరీ మెడలీన్ ను చేసుకొన్నాడు .రోలాండ్ గెస్టపోలో ,మరో హాఫ్ బ్రదర్ క్లాడ్  రెసిస్టన్స్ మూవ్ మెంట్ లో చనిపోయారు .1953 లో అ౦తగా ఉత్తేజం ఇవ్వని ‘’ది వాయిసెస్ ఆఫ్ సైలెన్స్ ‘’ప్రచురించాడు .మనిషి ,అతని ఆర్టిస్టిక్ కళా చిత్రాన్ని నియో లిథిక్ కాలం నుంచి ఆధునికకాలం వరకు రాసి ‘’ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ‘’పేరుతొ ప్రచురించాడు .’’All art Malraux implies is a revolt ,a protest against extinction ,a rebellious act against death and man’s tragic mortality .మాల్రక్స్ద్రుస్తిలో కళ కదా అంటే మనిషి కద కూడా .

రెండవ ప్రపంచ యుద్ధకాలం లో మాల్రక్స్ చివరి నవల ‘’ది స్ట్రగుల్ విత్ ది ఏంజెల్ ‘’రాశాడు .యుద్ధం తర్వాత ప్రెసిడెంట్ డీగల్లి 1945 లో మాల్రక్స్ ను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ను చేశాడు .సైకాలజీ ఆఫ్ ఆర్ట్ పై మూడు పుస్తకాలు రాశాక మూడిటిని కలిపి కొంత మార్చి ఒకే పుస్తకంగా తెచ్చాడు .1958 లో దీగాల్లి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక మాల్రక్స్ ను మొట్టమొదటిసారిగా కల్చరల్ ఎఫైర్స్ మినిస్టర్ ను చేశాడు .నల్లకప్పేసిన పురాతన ఫ్రెంచ్ బిల్డింగ్ లను శుభ్రపరచి రంగులతో శోభాయమానం చేశాడు .ఫ్రాన్స్ దేశ జాతీయ వారసత్వాన్ని కాపాడే అనేక చర్యలు తీసుకొన్నాడు .1957  లో ‘’మెటా మార్ఫసిస్ ఆఫ్ ది గాడ్స్ ‘’మూడు భాగాలలో మొదటిది  ప్రచురితమైంది .మిగిలిన రెండు భాగాలు ఆయన మరణానంతరం వెలువడ్డాయి .బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని మాల్రక్స్ సమర్ధించాడు .1971 లో భారత ప్రధాని ఇందిరా గాంధి పారిస్ సందర్శించినప్పుడు మాల్రక్స్ ఆమెతో బంగ్లా దేశ సమస్యను చర్చించాడు .యుద్ధానంతరం పాక్షిక జీవిత చరిత్రభాగాలు రాసి ప్రచురించాడు .పారిస్ దగ్గర క్రిటేల్ లో 23-11-1976 న మాల్రక్స్ 75 వ ఏట మరణించాడు .

మాల్రక్స్ అనేక అవార్డ్ లు పొందాడు అందులో ముఖ్యమైనవి –ప్రిక్స్ కాన్కర్ట్ అవార్డ్ ,మేదేల్లె డీ లా రెసిస్టన్స్ ,టాక్స్ డీ గేర్రే .అంతర్జాతీయ మాల్రక్స్ సొసైటీ అమెరికాలో ఏర్పడి౦ది .పారిస్ లోనూ ఇలాంటి సంస్థ ఏర్పడింది .మాల్రక్స్ కొటేషన్ లు కొన్ని చూద్దాం –

1-      man is dead ,after God .

2-      the artist is not the transcriber of the world ,he is its rival

3-      what is man ? a miserable little pile of  secrets .

4-      Art is an object lesson for the gods

5-      The art museum is one of the places that give us the highest idea of man .

మాల్రక్స్ దాదాపు 20 గ్రంధాలు రాశాడు .

Inline image 1
Inline image 2

సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-16 –ఉయ్యూరు .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238

88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్

యాభై రెండేళ్ళ వయసులో నవలాకారుడు రాజకీయ వేత్త ,వామ భావాలనుండి,రియాక్షనరి కుడి భావాలకు మారి ,అమెరికా వెళ్లి రాజకీయాలు మానవ మనుగడను భయపెట్టిబెదిరిస్తున్నాయని ,కళ ఒక్కటే అందర్నీ కలిపి ఉంచే ఏకైక సాధనాం అని చెప్పిన వాడు ఫ్రెంచ్ నవలా కారుడు  ఆండ్రే మాల్రక్స్ .ఈ విషయాన్ని తన ‘’ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ ‘’మ్యూజియం వితౌట్ వాల్స్ ‘’లో చెబుతూసంపూర్ణ కళ తప్ప  అన్ని సంపూర్ణ విషయాలు అదృశ్యమైపోతాయి అన్నాడు.నూతన మానవత్వం ,ఆధ్యాత్మిక వాస్తవం ,కళ  ‘’నూతన మతంలో ఒక భాగం .ప్రతి ఉద్గ్రంధమూ  సూటిగానో ,బహిర్గాతంగానో గుడ్డి విధి పై మానవ విజయాలను తెలియ జెప్పేవే .కళాకారుడు తన శక్తితో తెలుసుకొని ఆవిష్కరిస్తాడు .దానికి మానవత్వ పలుకుబడిని కలిగిస్తాడు .కాల గర్భం లో కలిసి పోకుండా నిలిచినా అవన్నీగడచి పోయిన  మానవ నాగరకత యొక్క లోపలి స్వరాలే (ఇన్నర్ వాయిస్ ).ఈ సజీవ ,ఇంకా అమరం కాని  దేవతలను చేరే స్వరం దాని సాఫల్యత కోసం అవిశ్రాంత మరణ వాద్య బృందమే అవుతుంది .అన్ని నాగరకతల కళ లో ఇది సర్వ సాధారణం .అది దైవ ఘటన కు వ్యతిరేకమైన రక్షణనె వ్యక్త పరుస్తుంది ‘’అన్నాడు మాల్రక్స్ .

  మాల్రక్స్ చెప్పే ‘’డిఫెన్స్ ఎగైనెస్ట్ ఫెటాలిటి’’అతనిలో భిన్న రూపాలద్వారావ్యక్తమైంది .అనేక జీవుల ఉద్ధరణకు దారి తీసింది .3-11-1901 న మాల్రక్స్ పారిస్ లో పుట్టాడు .తండ్రి సమర్ధుడైన సంపన్నుడైన సివిల్ ఉద్యోగి .కొడుకు ఉన్నత విద్య లో  రాణించాలనుకొన్నాడు .లైసె కాండో ర్సేట్ లో క్లాసిక్స్ చదివి పారిస్ స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ లో చేరి సంస్కృత ,చైనా భాషలతో పాటు ఆర్కియాలజీ కూడా క్షుణ్ణం గా నేర్చాడు .ఇరవై వ ఏట మొదటి వచన పద్యాన్ని రాసి ప్రచురించాడు .జర్మన్ జ్యూయిష్ ఫైనాన్సేర్ కూతురు క్లారా గోల్డ్ ష్క్మిత్ ను పెళ్లి చేసుకొన్నాడు .23 వ ఏట ఇండో చైనాకు తండ్రితో వెళ్లి ఆర్కియాలజికల్ పరిశోధనలో గడిపాడు .పురాతన స్థలాలను త్రవ్వించి శిధిల దేవాలయాలను ,భూ గర్భం లోని బౌద్ధ శిల్పాలను వెలికి తీయించాడు .ఏడాది కాలం ఈ పనిలో గడిపి గతం పై బోర్ కొత్త వర్తమానం పై అభిరుచితో కాలనీ ప్రజల స్థితి గతుల అన్వేషణలో పడ్డాడు .’’అన్నమైట్ తిరుగు బాటు ‘’కు ఆకర్షితుడై ‘’అన్నాం లీగ్ ‘’లో చేరి దాని స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామి అయ్యాడు .చైనా సరిహద్దు దాటి లోపలి ప్రవేశించి మాల్రక్స్ రాజకీయాలలో పూర్తిగా మునిగిపోయాడు .1925 నేషనల్ లిబరేషన్  ఉద్యమం లో పాల్గొని సన్యట్ సేన్ స్థాపించిన కోమిటాంగ్ లో చేరి అసోసియేట్ సెక్రెటరి జనరల్ అయ్యాడు .చాంగ్ కై షేక్ సహ సభ్యుడుగా ఉన్న కమిటీ ఆఫ్ ట్వెల్వ్ లో పని చేస్తూ కాంటన్ తిరుగు బాటులో పాల్గొని కోమిటాంగ్ కు కమ్యూనిస్ట్ పార్టీ ల సయోధ్య కుదిర్చాడు .అతని వాగ్ధాటి ,ఉత్సాహం గుర్తింప బడి క్వా౦ టంగ్ క్వాన్ గ్సి ప్రాంతాల ప్రాపగాండా కమీషనర్ గా నియమింప బడ్డాడు .26 వ ఏట పూర్తీ తిరుగు బాటు దారుడని పించుకొన్నాడు .

   ఇండో చైనా ,షాంఘై ,హాంగ్ కాంగ్ లలో చూసిన దారుణ పరిస్థితులన్నీ మొదటి మూడు నవలలో చేరాయి అధికారానికి డిమాండ్ లు దానికోసం కార్యా చరణ వీటిలో కనిపిస్తాయి .’’ది కాన్కరర్స్ ‘’లో హీరో చైనాలో సోవియెట్  ప్రతినిధి .19 25 లో హాంగ్ కాంగ్ సమ్మె కు ప్రాపగాండా చేస్తాడు .దీన్ని ట్రాట్స్కి ‘’romanticized chronicle of revolution ‘’అన్నాడు .కాని మాల్రక్స్ అది వ్యక్తికీ సామూహిక చర్యకు ఉన్న సంబంధమేకాని సామూహిక చర్య మాత్రమే కాదు అన్నాడు .ఏడాది తర్వాత వచ్చిన ‘’ది రాయల్ వే’’లో కంబోడియాలోని పురాతత్వ విషయాలు న్నా అందులో మాల్రక్స్ ఏకాకి జీవితం ,మావుడు చావును జయి౦చలేని  స్థితి ,దానిపై తన అజాగ్రత్త వినాశకర శక్తి తో పోరాటం ఉన్నాయి .

మూడవ నవల ‘’మానస్ ఫేట్ ‘’మాల్రక్స్ ను అంతర్జాతీయ వ్యక్తిని చేసింది .మాస్టర్ పీస్ అనే పేరొచ్చింది .కాన్కోర్ట్ ప్రైజ్ సాధించింది .అన్ని జీవద్భాషలలోకి తర్జుమా అయింది .హెమింగ్వే లాగానే మాల్రక్స్ కూడా చావు ,హింస లానే ఎంచుకొన్నాడు .హెమింగ్వే లా కాక ప్రతి చర్యను సమర్ధించాడు దానికి కారణాలు అన్వేషించి చెప్పాడు .జనరల్ చాంగ్ కై షేక్ కు ,కోమిటాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ కి మధ్య జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని నేపధ్యంగా రాసిన నవల ఇది ‘.షాంఘైలోని19 27 నాటి రెండు రోజుల  సంక్షోభాన్ని చాలా అన్వేషణాత్మకంగా ,నాన్యతో దర్శనీయంగా రాశాడు .’’డాస్టోవి స్కి ,గోర్కీ ల తర్వాత ఇంత వివరంగా ప్రజా సంక్షోభాన్ని వర్ణించిన పుస్తకం ఇదే ‘’అన్నాడు ఫిలిప్ హే౦ డేర్సన్..’’Malraux  ‘s people  are however not merely the products of their environment ,bitterly fighting their way to opposite goals but shares a philosophy –an acceptance of cruelty and its barriers against communication ,a determination to force the moment to its utmost ,and desperate affirmation of terror ,loneliness and sacrifice for some un definable but greater future .’’’ఇందులో జరుగుతున్నకాలం నిర్ణయాత్మకమైన కాలం అని ,ఒక జాతి భవిష్యత్తు మొత్తం కొద్ది మంది యుద్ధానికి సన్నద్ధ మౌతున్న ప్రచారకుల (ప్రాపగాన్డిస్ట్)లచేతుల్లోనే ఉంది అని పిస్తుంది .

Inline image 1   Inline image 2

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-8-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

31-7-16 ఆదివారం మా ఇంట్లో మా శిష్యుడు చిలుకూరి దంపతులు

This gallery contains 23 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237 87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237

87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

ఉల్ఫ్ మరణానంతరం ప్రచురింప బడిన ‘’వెబ్ అండ్ ది రాక్ ‘’,యు కం నాట్ గొ హోం అగైన్ ‘’లోను గాంట్-వెబర్ పాత్రను కాలం తో బాటు మారి ముసలితనం తో ఉన్నట్లు చిత్రించాడు .ఆపాత్ర దయనీయంగా ,వాస్తవ విరుద్ధంగా ,ఒక్కోసారి పారనయిక్ గా కనిపిస్తుంది .అతడు అతనికంటే ఎక్కువ వాడనిపిస్తాడు .తన బలహీనలతలు తెలిసిన వాడు .ఆత్మసానుభూతి ని అవహేళనతో జోడించాడు .ఆతను అమెరికా ఆర్టిస్ట్ గా కాక అమెరికా చిహ్నంగా దర్శనమిస్తాడు .పాతను నిరాకరిస్తూ ,తమదికాని సంప్రదాయాన్ని కాదంటూ ఎమర్సన్ విట్మన్ లలాగా దుఃఖిస్తూ ఆ దేశం లోనే ఆ మట్టి తోనే తమ జీవితాలను తామే వెలిగించుకొంటూ ,శక్తి సామర్ధ్యాలు సమకూర్చుకొంటూ ,తమ భాషా సంస్కృతులను కాపాడు కొంటూ ,తమ కళా సారాన్ని అనుభవిస్తూ జీవించాలి అనే సందేశం కనిపిస్తుంది .

  ఈ విషయాన్ని రూపు చెందించే సమయం ఆయనకు లేక పోయింది .తన ఆకలి హృదయాన్ని సంతృప్తి పరచలేక పోయాడు .’’Billion forms of America ,the savage violence ,and the dense complexity of all its swarming life ‘’ను రూపొందించ లేక పోయాడు .1938 జులై లో జబ్బుపడి మందుకు అలవాటుపడ్డాడు .న్యుమోనియా వచ్చి కోలుకొంటూ కాంప్లికేషన్స్ పెరిగి సెరిబ్రల్ ఇన్ఫెక్షన్ ఏర్పడి  ఆపరేషన్ చేయాల్సి వచ్చి  .బాల్టిమోర్ లో జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ లో 15-9-1938 న 38 వ పుట్టిన రోజు 15 రోజుల్లో వస్తుందనగా ధామస్ ఉల్ఫ్ చనిపోయాడు .ఆయన తప్పులు చాలా ఉన్నాయి వాటి నిగ్గు తేల్చాల్సింది విమర్శకులే .’’one can only respect Wolfe for his determination to realize himself on the higher level and to be satisfied with nothing short of greatness ‘’అన్నాడు బెర్నార్డ్ డీ వోటో.అతని రచనా సర్వస్వం ఆవేశాత్మక ప్రక్రియ (ఫోర్సింగ్ ప్రాసెస్ ).అతను చెప్పిన ప్రతి మాటలో ఇంతకూ ముందు యే మానవుడూ భూమి మనిషి గూర్చి చెప్పని అద్భుత ఆశ్చర్య కర విషయాలున్నాయి  .ప్రపంచం మొత్తం మీద వీటిని ఇంత గొప్పగా అర్ధం చేసుకొని ఇంత అద్భుతంగా చెప్పిన వారు లేరు అనిపిస్తాడు .అతనిది హింసాత్మక ప్రయత్నచరిత్ర  అంటారు (వయలెన్స్ ఎండేవర్ ).అతని వెబ్ అండ్ ది రాక్ అతని రచనల్లో గొప్పది అన్నాడు జేబీ .ప్రీస్త్లి .

తప్పులెన్నిఉన్నా రచనలో శిఖరారోహణ చేశాడు ‘’I believe that we are lost in America ‘’అని అరిపిస్తాడు నిజమైన అమెరికాను ఆవిష్కరించే పని మనది అన్నాడు .The true discovery of America is before us .I think the true fulfillment of our spirit ,of our people ,of our mighty and immortal land ,is yet to come ‘’అని కలవరి౦చిన వాడు ధామస్ ఉల్ఫ్ .ఎంతో కస్టపడి ఎంతో దూరం ప్రయాణించి సంపూర్ణత్వం సాధించాడు .ఆయన కాల దేశాలకు అతీతమైన భావన ఉన్నవాడు .శైలిని తృణీకరించి ,అనుభవ సారాన్ని మానవ హృదయ భారాన్ని ఒక గుండు సూది మొనమీదనిలబెట్టిన వాడు .’’నేను కవిగా నే ఉంటాను తప్ప ఇంకా ఏదీ కాను ‘’అన్నాడు .ఉల్ఫ్ మరణానంతరం విడుదలైన రెండు పుస్తకాలు ‘’ది ఫేస్ ఆఫ్ ఎ నేషన్ ‘’,అనేది కవితా సంపుటి .’’ఎ స్టోన్ ,ఎ లీఫ్ ,ఎ డోర్ ‘’అనే వచనాలను కవిత్వీకరించిన సంపుటి .సహజ కవి అయినా వచన మాధ్యమాన్ని ఎంచుకొన్నాడు .తాను  కవి అని ఆయనే గుర్తించలేక పోయాడు .’’లుక్ హోం వర్డ్ ఏంజెల్ ‘’లో నగ్న సౌందర్య కవిత్వాన్ని ఒలక బోశాడు .ఆ కవితా వైభవాన్ని చూద్దాం –

‘’Which of us has known his brother ?which of us has – -looked into his father’s heart ?which of us has not –remained forever prison pent ?which of us is not-forever  a stranger and alone ‘

అతని కవితా శైలి పై లూయీ అంటర్ మేయర్ ‘’Wolfe ‘s diffuse style ,such a passage is so perfectly shaped ,so classic in design ,that its clear and almost formal rhythms reveal ,the spirit free of the heavy flesh .They speak for the clairvoyant poet ,beyond life out living death ,completed and fulfilled ‘’అని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేశాడు .తన తరానికి మహా గొప్ప ప్రతిభ ఉన్నవాడు ఉల్ఫ్ అన్నాడు విలియం ఫాక్నర్ .బీట్ జెనరేషన్ కు చెందినజాక్ కరౌక్ ,రే బ్రాడ్ బరి ,ఫిలిప్ రాత్ బెట్టి స్మిత్  లపై ఉల్ఫ్ ప్రభావం చాలా ఎక్కువ .స్వీయ చరిత్ర రాసిన  వారిలో  సర్వ ప్రధముడు ఉల్ఫ్ .నార్త్ కరోలీనాకు చెందిన మహా రచయిత .అతని ప్రసిద్ధ పద బంధం ‘’ఫియర్ అండ్ లోదింగ్ ‘’భయం ,ద్వేషం ‘’.

ధామస్ ఉల్ఫ్ సొసైటీ ఏర్పడి ఆయన సాహిత్యాధ్యయనానికి కృషి చేస్తోంది .నార్త్ కరోలిన లోని ఆయన ఇల్లు ఎస్టేట్ జాతీయ సంపదగా రక్షింప బడుతోంది .యెన్ సైక్లో పీడియా   బ్రిటాన్నికా లో ‘’Wolfe was gifted with the faculty of almost total recall, and his fiction is characterized by an intense consciousness of scene and place, together with what is often an extraordinary lyric power. In Look Homeward, Angel and Of Time and the River, Wolfe was able to imbue his life story and the figures of his parents with a lofty romantic quality that has epic and mythopoeic overtones. Powerful emotional evocation and literal reporting are combined in his fiction, and he often alternates between dramatically effective episodes of recollection and highly charged passages of rhetoric. Though The Web and the Rock and You Can’t Go Home Again contain episodes of great vividness, they are too often uncontrolled in their form and fail to sustain the epic tone of Look Homeward, Angel, which has become an American classic.’’అని రాశారు .అయన కోటబుల్ కోట్స్ కొన్ని చూద్దాం –

Culture is the arts elevated to a set of beliefs.

One belongs to New York instantly. One belongs to it as much in five minutes as in five years.

The reason a writer writes a book is to forget a book and the reason a reader reads one is to remember it.

Inline image 1  Inline image 3
Inline image 2                   ఉల్ఫ్ ఎస్టేట్

Inline image 4Inline image 5Inline image 6Inline image 7

     సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236 87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236

87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్

అమెరికా విస్తృత జీవన శక్తి కి ప్రతీక ధామస్ ఉల్ఫ్ .అమెరిక దేశపు హీరో .నిర్మించినది ప్రతిదీ అతి విస్త్రుతమైఉండేది  ,నిప్పులు రాల్చే కళ్ళతో నల్ల జుట్టుతో ,కాల గమన హింసతో ,ఏకాకి జీవిత వ్యధతో ,కోల్పోయిన దిగులుతో ఉండేవాడు .వాల్ట్ విట్మన్ లాగా అమెరికాను అన్నికోణాల్లో దర్శించినవాడు  ,ఆ జీవితాన్ని ప్రతి స్థాయి లోను అనుభవించి,అమెరికా ప్రేమికుడై ఆరాధన తో నాలుగు నవలలతో సాహిత్య చిరంజీవియై 38 ఏళ్ళు రాకుండానే  మరణించిన వాడు . అమెరికా లో నార్త్ కారోలీనా ఆష్విల్ లో 3-10-1900 న జన్మించి ధామస్ క్లేటన్ ఉల్ఫ్ గా నామకరణం చేయబడ్డాడు .తండ్రి రాళ్ళు చెక్కేవాడే అయినా సాహిత్యం అంటే మోజున్నవాడు .కవిత్వాన్ని గట్టిగా ఆనందంగా పఠించేవాడు .ఉల్ఫ్ చిన్నతనం షేక్స్ పియర్ సాలి లోక్వి ల   రిథం బట్టీ పట్టటం గ్రే కవి ‘’ఎలిజీ ‘’అప్పగించటం తో గడిచింది .ఈ రెండూ కూడా వేదనా భరితమైనవే .తల్లి ఒక బోర్డింగ్ హౌస్ కీపర్ .టాం ఏడుగురు పిల్లలలో చివరివాడు .కుటుంబ బాధ్యతకూడా మీద పడింది .బాల్యం లోనే ఇంటింటికీ పేపర్లు వేసి ,ఎవరైనా పని చెబితే చేసి ,కొన్ని పెన్నీలు సంపాదిస్తూ నీగ్రో క్వార్టర్ లకు వెళ్లి ఒక నీగ్రో వాడిని బోర్డింగ్ కు కుదిర్చే వాడు ..15 వ ఏట టాం ను నార్త్ కరోలినా యూని  వర్సిటికి పంపే స్తోమత వచ్చింది..అక్కడ కాలేజ్ మేగజైన్ కు  న్యూస్ పేపర్ కు  ఎడిటర్ అయాడు . జర్నలిస్ట్ కాని లాయర్ కాని కావాలనుకోనేవాడు .కాలేజీ లో చివర రెండేళ్లలో చాలా ఏకాంకిక నాటికలు  రాశాడు .కాని తానూ ప్రోఫెషనల్ రచయిత అవుతానని కలలో కూడా అనుకోలేదు  .ఆతను రాసిన నాటిక ఒకటి కాలేజి స్టేజ్ పై ప్రదర్శింప బడింది .18 వ ఏట వర్జీనియాలో న్యు పోర్ట్ న్యూస్ లో ఉద్యోగం లో చేరాడు .కవితలు నాటక కధలు మనసులో సుళ్లు తిరిగేవి .1920 లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి హార్వర్డ్ వెళ్లి అక్కడ  ప్రొఫెసర్ జార్జ్ పియర్స్ కు చెందిన ప్రసిద్ధ ‘’47 వర్క్ షాప్ ‘’లో చేరాడు దీనిలోనే ఆ తర్వాత ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ కూడా చేరాడు .

   టాం కు రాయటం అవలీలగా వచ్చేసింది .పదాలు నదీ ప్రవాహం లాగా దొర్లుకొంటూ వచ్చేసేవి .అవి తమంతటికి తామే వచ్చి ఎక్కడ ఉండాలో అక్కడ చేరినట్లు ఉండేవి .టాం కోసమే తాము సిద్ధంగా ఉన్నట్లు అనిపించేది .ఆ ప్రవాహం అడ్డూ ఆపూ లేకుండా మహా ప్రవాహంగా చేరి కుదిరి సార్ధకంయ్యేవి .20 వ ఏట రోజూ తనను  మోసుకు పోయే ఈశబ్ద ప్రవాహం అకస్మాత్తుగా పొంగి ప్రవహించింది .కొత్త నాటికలు రాస్తున్నాడు బాగున్నాయని అంటున్నారుకాని తిరస్కరింప బడేవి .అందరూ మెచ్చుకోనేవాళ్ళే కాని ప్రదర్శించటానికి ఎవరూ ము౦దు కోచ్చేవారు కాదు .ఇదంతా అతని సహనానికి పరీక్షగా ఉండేది  .ఈ సందర్భంగా అతనిలో ఒక రకమైన తాత్విక చింతన ప్రారంభమై ఇలా రాసుకొన్నాడు –‘’I am acquiring patience .i am quite willing to wait for the unveiling   exercises .All that really matters right now is the knowledge that  I am twenty –three and a  golden May is here .The feeling of immortality in youth is upon me .I am young and I can never die .Don’t tell me that I can .Wait until I am thirty .Then I believe you ‘’

      కాని అంతగా ఓపిక పట్టలేక హార్వర్డ్ లో ఏం యే .చేసి ,న్యు యార్క్ వర్సిటి   వాషింగ్టన్ స్క్వేర్ కాలేజి ఇన్ స్ట్రక్టర్ ఉద్యోగం పొందాడు .చాలా నిబద్ధత తో  చదువు చెప్పాడు  .తనది ఉద్యోగంగా భావించి నాటక కర్త కావాలనుకొన్నాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ చైర్మన్ హోమర్ వాట్ కు ‘’నా ద్రుష్టి అంతా నాటకాల మీద ఉంది .కొద్ది రోజుల్లో నేను దియేటర్ నాటకాలు రాయగలను అనే దైర్యం ఉన్నవాడిని.అది తప్ప నాకి౦కేదీ చెయ్యాలని లేదు ‘’అని ఉత్తరం రాశాడు .వాళ్లకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు .తన పరిసరాలను ,చుట్టూ ఉన్నవాళ్ళను పెద్దగా పట్టించుకొనే వాడుకాదు .వీళ్ళను ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’లో ‘’స్కూల్ ఫర్ యుటిలిటి కల్చర్స్ ‘’శీర్షిక తో వ్యంగ్యంగా ఏకేవాడు .ఆరేళ్ళు న్యుయార్లో టీచింగ్ లో ఉన్నా క్లాస్ రూమ్ లనుండి విశ్రాంతి గానే గడిపాడు .విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక నవల ఇతి వృత్తం మనసులో మెదిలింది .మళ్ళీ టీచింగ్ లో చేరాల్సివచ్చి ,చేరి మళ్ళీ పారిపోయి 19 26 లో లండన్ లో కనిపించాడు .విదేశం లో ఒంటరిగా ఉంటూ రాయటం మొదలు పెట్టాడు .రెండున్నర ఏళ్ళ తర్వాత న్యు యార్క్ వచ్చి ,పగలు చదువు బోధించటం లో రాత్రుళ్ళు రచనలో గడిపి పుస్తకం పూర్తీ చేశాడు .’’పుస్తకం నన్ను కట్టి పడేసింది నన్ను స్వంతం చేసుకొంది’’అని రాశాడు .ఈ నవలపేరు ‘’ది స్టోరీ ఆఫ్ ఎ నావెల్ ‘’. దీన్ని గురించి ‘’నవల దానికదే రూపు దిద్దుకోన్నది .నాకు ప్రతి యువకుడూ ఇష్టమే .నేను ఆరాధించే రచయితల ప్రభావం నాపై ఉంది .అప్పుడు జేమ్స్ జాయిస్’’యులిసెస్ ‘’తో  చాలా ప్రసిద్దుడు .ఈ పుస్తక ప్రభావం నా నవలపై పడింది .అయినా నాదైన  యువ శక్తి ,అగ్ని దానిపై బాగా పని చేశాయి .జాయిస్ లాగానే నేనూ నాకు తెలిసిన వస్తువుల గురించి ,ఇప్పటి జీవిత౦ అనుభవం గూర్చి చిన్ననాటి విషయాల గురించి రాశాను .జాయిస్ కున్న సాహిత్య అనుభవం నాకు లేదు .ఇంతకూ ముందు యే పుస్తకామూ నేను ప్రచురించలేదు .నాకు రచయితలూ ,పబ్లిషర్లు ,పుస్తకాలు ,దూరపు ప్రపంచం ఏవీ తెలియవు .చిన్నతనం లో ఎలా రొమాంటిక్ గా లేవో ఇప్పుడూ అలాగే అంది .కాని ఈ నవలలో నేను సృష్టించి చిత్రించిన మనుషులు ,రంగులు విశ్వ వాతావరణం అన్నీ నన్ను తమవాడిని గా చేసుకోన్నాయి .అందుకే నేను ఆ దీప శిఖ తో  ఒక యువకుడు ఇంతకూ పూర్వం ఏదీ ప్రచురించనివాడు రాసినట్లు  ఇక ముందు అంతా మంచి జరగాలని జరుగుతుందని ఆశ తో రాశాను.’’అని చెప్పాడు .

  ఈ నవల నమ్మశక్యం కానంత బృహత్ నవల. .మూడులక్షల యాభై వేల పదాల నవల .దీన్ని ‘’ఓ లాస్ట్ ‘’అనిపిలవాలనుకొన్నాడు .దీని ప్రచురణకు ఇద్దరు మిత్రుల సాయం అందుకొన్నాడు .చివరికి ఈ పుస్తకానికి ‘’లుక్ హోమ్వర్డ్ ఏంజెల్ ‘’అని పేరుపెట్టాడు .29 వ పుట్టిన రోజు విడుదల చేశాడు దీన్ని .తనను తాను  మరీ నగ్నంగా ప్రదర్శించుకోన్నానేమో అనుకొన్నాడు .కాని విమర్శకులు చాలా గొప్పగా  పెద్ద పెద్ద విశేషణాలతో మెచ్చుకొనే సరికి మహా దానంద౦  పొందాడు  .కొందరు దీన్ని వీధి మూలల్లో తిట్టటం ,అతని అభిమాని ఒకామె ఫిర్యాదు చేయటం మనసు ను కల్లోల పరచింది .’’బాబోయ్! ఇది ఫిక్షనే కాని ఎవరి జీవిత చిత్రణా కాదు మొర్రోయ్ ‘’అని చెప్పుకొన్నాడు .అయినా అది ఆయన జీవిత చరిత్రే అనటం లో సందేహం లేదు .దీనిపై ఉల్ఫ్ ‘’మన జీవితాలలో అన్ని క్షణాల మొత్తమే మనం .మనలో ఉన్నదే వాళ్ళలోనూ ఉంది మనం తప్పించుకోవటంకాని ,దాచటానికి కాని ఏదీ ఉండదు .జీవితం మట్టి లోనుంచే  ప్రావిర్భావం చెందుతుంది  .అందరూ దీన్ని ఉపయోగించాల్సిందే .తప్పించుకోలేరేవ్వరూ . ఒక లైబ్రరీలో సగం చదివి కానిఒక మనిషి  ఒక పుస్తకం రాయలేడు అన్నాడు డాక్టర్ జాన్సన్ .అదే విధంగా నవలాకారుడు నగరం లో సగం మంది జనాన్ని పరామర్శిస్తే కాని ఒక పాత్రను మలచ లేడు.’’అని చెప్పుకొన్నాడు .

పుస్తక విజయం ఆనందం కన్నా ఆందోళన కలిగించింది ఉల్ఫ్ కు .మరోటి రాస్తే యే రకంగా విమర్శకులు స్పందిస్తారో అనే ఆందోళన ఎక్కువైంది .నవల అమ్మకాలు మహా జోరుగా ఉండటం తో న్యు యార్క్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు .గుగ్గెన్ హీం ఫెలోషిప్ అవార్డ్ పొందాడు .మళ్ళీ విదేశాలకు వెళ్లి పారిస్ లో ‘’హోం సిక్’’అయి బుర్రనిండా రాయబోయే రచనల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరై తుఫానుకు కదిలిపోయినట్లు కదిలిపోయాడు .రెండవది అదే వేగం తో రాసేశాడు .’’నేను రాయలేదు .నవలే నన్ను రాసింది ‘’అన్నాడు పోతనలాగా .దీన్ని ‘’అక్టోబర్ ఫైర్’’అందామనుకొన్నాడు .కాని తట్టుకోలేని ఒడ్లను కూలుస్తూ సాగే ఆ భావాల వరద ,ఉరవడి అతడిని వివశుడిని చేసి పేరు ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’గా మార్చాడు .మొదట్లో దానికి రూపం నిర్మాణం ఏవీ  లేవు .ఆతను అన్నది నిజమే .అది ఉద్ధరి౦ప బడని అనంత ఉత్సాహ పూరిత మహా ప్రవాహమే .’’అమెరికాలోని చీకటి వెలుగుల గురించే రాశాను .పది వేల చిన్న పట్టణాల జనాల గురించి రాశాను .నిద్ర మోతు మొహాలగురించి చెప్పాను .నదులు చీకటిలో ఎలా ప్రవహి౦చా యో రాశాను .పది  వేల మైళ్ళ తీరం ,దానిపై వరద ఉద్ధృతి ,ఘోరారణ్యాలపై చంద్ర కాంతి మిలమిల ,పిల్లి కళ్ళలోని  పసుపు రంగు మెరపు ,చావు,నిద్ర ,మనం సిటి అని ముద్దుగా పిలుచుకొనే శిలా సదృశ మానవ జీవితం ,అక్టోబర్ నెల సోయగం ,పెద్దపెద్ద రాళ్ళూ రాక్షస అరుపులతో రాత్రిళ్ళు పరిగెత్తే రైళ్ళు విధం ,ఉదయం లో స్టేషన్లు ,షిప్స్ గురించి ,హార్బర్ లో జనం ,షిప్ ల వద్ద ట్రాఫిక్ ‘’అన్నీ రాశాను’’ అని చెప్పాడు ఉల్ఫ్ .

  అమెరికాకు1931 లో  తిరిగొచ్చాక మళ్ళీ మనసంతా నువ్వే అన్నట్లు మనుషులు ,కేకలు ,దీప ప్రభలు ,అదృశ్య ముఖాలు సూర్యరశ్మి రావటంపోవటం పొదలపై ఆకుల రెపరెపలు ,రాయి రప్పా ,ఆకు అలము ,తలుపు చెక్కా –ఒకటేమిటి సమస్త జీవం అతని కళ్ళముందు మనసులో నిండి పరవళ్ళు తోక్కుతూపరవశం కలిగిస్తున్నాయి .సౌత్ బ్రూక్లిన్ లో అసీరియన్ క్వార్టర్ లోని బేస్ మెంట్ లో ఉంటూ తన హీరో యూజీన్ గాంట్ జీవితం పై  పేజీల పై పేజీలు  గుట్టలు గుట్టలుగా రాసి పారేస్తున్నాడు .అవి లెడ్జేర్ మీద లెడ్జేర్ గా అనేకపెద్ద పెద్ద  పాకింగ్ కేసుల  నిండా నింపేశాడు .పుస్తకానికిముగింపు పలక లేక పోయాడు .పెర్కిన్సన్ ఏదో సలహా ఇవ్వటం దాన్ని అంగీకరించి మరో ఎపిసోడ్ రాయటం ,బ్రూక్లిన్ వచ్చి రాసింది నెమరేసుకొని ‘’అరె ! ఇదేమీ చాలినట్లు లేదే ‘’అనుకోని మళ్ళీ దాన్ని పెంచి రాయటం తో అంత విస్తృత మైన నవలగా రూపొందింది .పెర్కిన్సన్ సహాయం తో మళ్ళీ తగ్గించుకొంటూ వచ్చాడు .అయినా ఒక మిలియన్ పదాలతో మహా నవల అయింది సాధారణ నవలకు రెట్టింపు అన్నమాట .టాల్స్టాయ్ తాత ‘’వార్ అండ్ పీస్ ‘’కు ద్విగుణీకృతం .వర్జీనియా రాత్రి రైల్ ప్రయాణం తో నవల మొదలు పెదదామనుకొన్నాడు .కానీ ఉపోద్ఘాత అధ్యాయమే లక్ష పదాలయింది .అంటే చిన్న సైజు పుస్తకం .దాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది చివరికి .’’ఈ రక్తపాత హత్య నేను భరించలేక పోయాను ‘’అన్నాడు దాన్ని తీసేస్తూ .యాభై వేలపదాలున్నచాప్టర్ లను కుది౦చాడు ‘పుస్తకం పూర్తీ అయింది ఇక ప్రెస్ కు పంపటమే తరువాయి అనుకొన్న సమయం లో ‘’అబ్బే ! ఇదేమీ సంపూర్ణంగా లేదే అసమగ్రంగా ఉందే’’’అనిపించి మళ్ళీ నరికేసినవి మళ్ళీ కుట్టాడు . ఇంకా ఎన్నో చెప్పలేక రాయలేక పోయానే అనే దుగ్ధ ఎప్పుడూ ఉండేది . ఉల్ఫ్  చికాగో వెళ్ళిన సందర్భం లో పార్కిన్సన్ నవలను  సంక్షిప్తంగా ఎడిట్ చేసి  ప్రింటర్ చేతిలో పెట్టి ఉండకపోతే ఆ నవల ఎన్నటికీ వెలుగు చూసేదికాదు .ఉల్ఫ్ తిరిగొచ్చి నెత్తీ నోరూ మొత్తుకొని తనకింకా ఆరు నెలల సమయం కావాలన్నాడు ‘’నువ్వేమైనా ఫ్లాబర్ట్ లాగా పెర్ఫెక్షన్ కోసం నగిషీలకోసం  రాస్తున్నానను కొంటున్నావా?’’అనిచివాట్లు పెట్టి నా ,ప్రూఫ్ పేజీలమీదేతాను రాయాలనుకోన్నది అంతా రాసి ఉల్ఫ్ కోరిక తీర్చుకొన్నాడు  .ఇలా రాస్తో తిరిగి రాస్తూ ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’నవలను పూర్తీ చేయటానికి ఆరేళ్ళుతీసుకొన్నాడు .1935 మార్చ్ లో ఇది వెలుగు చూసింది .

ఈ నవల స్పందన ఎలా వస్తుందో అనే లోపల భయం ఉంది ఉల్ఫ్ కు ‘’నేను నా జీవితాన్ని వినాశకరంగా ఆవిష్కా రించు కోన్నాను .దయనీయమైన తెలివి తక్కువ వాడిగా ప్రవర్తించాను .ఏదో ప్రలోభం బుద్ధి చాంచల్యం తో రాశానేమో ‘’అన్నాడు .పబ్లిష్ అయినరోజు  దేశం వదిలి  పారిస్ లోఉన్నాడు .మొదటిభాగం లాగానే రెందవదీ విజయం సాధించింది అని వినగానే నమ్మ లేక పోయాడు .తరువాత రాసిన పుస్తకాలలోస్వీయ జీవిత చరిత్రను రాయటం తగ్గించేశాడు .తన హీరో యూజీన్ గాంట్ ను అతని ఆకృతులను మార్చేశాడు ఉల్ఫ్ .తరువాత రెండు నవలలు మొదటి రెండిటి గొలుసు నవలలే అయినా నాలుగూ కలిసి ఒకటే పుస్తకం .ఒక శిఖరాయమాన స్వీయ జీవిత చరిత్ర అయింది .ఇప్పడు హీరో కు  జార్జ్ వెబర్  పేరు పెట్టాడు . గాంట్ ను  మానసిక వికలాంగ ముఖం ‘’అని అంటే ఇప్పుడు వెబర్ ను ‘’చతికిల పడ్డ మనిషి ‘’అన్నాడు .వెబర్ ను స్నేహితులు ‘’మాంక్ ‘’రుషి అని పిలిచేవారు . వెబర్ అంటే రూపం మార్చుకొన్న కఠినంగా మారిన  గాంట్.అని పిస్తాడు.

Inline image 1

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-31-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235

86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

పారిస్ లోఉంటూ , టైరోల్ లో స్కైయింగ్  స్పెయిన్ వెళ్లి బుల్ ఫైట్ లతో కాలక్షేపం చేసేవాడు హెమింగ్వే .ఈకాలం లో ఆయన అత్యుత్తమ కధలను రాశాడు .1927 లో మొదటి పెళ్లి విడాకులతో పూర్తీ అవగానే పాలీన్ పీఫెర్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు మగ పిల్లలని  కన్నాడు .అమెరిక వెళ్లి మరో చిన్న కదా సంపుటి ‘’మెన్ వితోట్ వుమెన్ ‘’ప్రచురించాడు .కి వెస్ట్ కు వెళ్లి నైపుణ్యం గల చేపల వేటకాడయ్యాడు .అధిక శ్రమవలన ఆయన పాత గాయాలు మళ్ళీ ఇబ్బంది పెట్టాయి .1928 లో ‘’ఫేర్ వెల్ టు ఆర్మ్స్ ‘’నవల పూర్తీ చేశాడు .చిన్నకదను పుస్తక ప్రమాణంగా ద్వైవీ భావం తో ప్రేమ ,యుద్ధ పతనాలను జోడించి రాశాడు .చిన్న కధలోని సమాప్తం నవలలో దుఃఖ విచారాలయ్యాయి ‘’.మరణ మృదంగం ‘’అని ఆయన విమర్శకులు అన్నట్లు ఆయన రచనల్లో అది పూర్తిగా ఆక్రమించింది .దీనినే ‘’డెత్ ఇన్ ది  ఆఫ్టర్ నూన్ లో బుల్ ఫైటింగ్ ను ఒక కళ గా ,అదొక ప్రత్యేక ఉన్నత శైలి వధ గా వర్ణించాడు .ఏదో రకమైన ప్రమాదం ఉన్న ప్రేమ ను వదిలి బుల్ ఫైటింగ్ లో పడ్డాడు .కాని అనుభవ రాహిత్యం ఇబ్బందిపాలు చేసింది ..బొక్కలు (బొమికలు )విరిగి ఒళ్ళు పుళ్లు అయి అసలే నిప్పుల బాధలో ఉన్నవాడికి మరింత ఇబ్బంది కలిగింది .ఈ బాధల్లోంచే ఒక్కోసారి వినోదం ,మరోసారి ప్రకాశ వంతం కలిగిస్తూ రచనలు చేశాడు .’’విన్నర్ టేక్ నధింగ్ ‘’ ‘’గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా ‘’లలో బుల్ ఫైటింగ్ బదులు వేటకు ప్రాదాన్యమిచ్చాడు .’’టు హావ్ అండ్ జావ్ నాట్ ‘’లో చావు ,కరిగిపోవటం లను కలిపి రాశాడు .ఈ కద కీ వెస్ట్ లో జరిగింది .ఇక్కడ చావు మరో తరహాగా ఉంటుంది .39 లో ప్రవేశించిన హెమింగ్వే స్పానిష్ రిపబ్లిక్ కూలి పోవటం తో  ఆదవాని ప్రపంచమంతా ప్రతిధ్వనించినట్లు అనిపించింది .హెమింగ్వే ఫాసిస్ట్  వ్యతిరేకి .’’ప్రపంచ రక్షకులు ‘’అని పించుకొంటున్నవారిని ఇంకా పూర్తిగా  సమర్ధించ లేదాయన .అతని హారీ మార్గాన్ ఒక మోసకారి స్మగ్లర్ పేద్దహీరో గా కుళ్ళిపోతున్న సమాజానికి ఉద్దారకుడిగా ,ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడయ్యాడు .ఇందులో లక్ష్య నినాదం ‘’ఇప్పుడెవరూ ఒంటరికాదు ‘’.వేధించే సాంఘిక సమస్య హెమింగ్వే కు కొత్త .కనుక పుస్తకం రెండు భాగాలుగా రాసి ప్రచురించాడు .

  చావు కోరిక ,పునరుత్పత్తి  సిద్ధాంతం లను కలిపి ‘’ది ఫిఫ్త్ కాలం ‘’నాటకం గా రాశాడు .దీన్ని నవల చదివినంత హాయిగా చదువుకో వచ్చు .యుద్ధ పరిణామాలలో విఫల ప్రేమ ఉంది .హీరోకు చంపటం లో అర్ధం ఉందనిపిస్తుంది .19 38 లో ఈనాటకం తో కలిపి కొన్ని ఆయన ప్రసిద్ధకధలతో చేర్చి ‘’ది ఫిఫ్త్ కాలం అండ్ ది ఫస్ట్ ఫార్తీనైన్ స్టోరీస్ ‘’గా తెచ్చాడు .ఇవి హాలీవుడ్ సినిమాలకు గొప్ప వరమైనాయి .వీటిలోనూ చావువాసనే వుంది .45 వ ఏట హెమింగ్వే అతని అతిపెద్ద ,అతి ప్రాముఖ్యమైన నవల ‘’ఫర్ హూం ది బెల్ టాల్స్ ‘’రాశాడు .పూర్వపు ఆలోచనే అయిన చావు ,జీవితం దీనిలోనూ ప్రాధాన్యం పొందింది .స్పెయిన్ లో ఫాసిస్ట్ లపై లాయలిస్ట్ ల పోరాటం గుర్తించాడు .మానవ స్వేచ్చకు  బాధ్యతకు భంగం కలిగించే వాటిపై నిరసన గళమే ఆయన .పూర్వం ఆయన కు కీట్స్ కవి చెప్పిన ‘’many a time I have been half in love with easeful death ‘’భావనకు వ్యతిరేకి .జీవితాన్ని ప్రమాద పరచే ప్రేమ అంటే ఆయనకు చాలా ఇష్టం .చావు నిరాశామయమని ,చావు కు అర్ధం లేదని అనుకొనేవాడు .ఇప్పుడు ఆయనకు జీవిచటం లో మరణించటం లో ప్రయోజనం ఉందని తెలిసింది .దానికి కారణం కూడా ఉంటుందని అన్నాడు .స్పానిష్ యుద్ధం పై ఆయన రిపోర్ట్ లో స్పానిష్ ప్రజల పై అధ్యయనం పెద్దగా లేదని కాని అది ఎపిక్ ధైర్యాన్ని ,అనుకంపను కలిగిస్తుందని అంటారు .గెరిల్లాలపై సానుభూతి చూపాడు .మానవత్వం పై పెద్ద ఆశ కనిపిస్తుంది .అంటే కాదు మొదటి సారిగా సోదరత్వం గోచరిస్తుంది .

   కాని లాయలిస్ట్ ల ఓటమి త్యాగం ,సంతోషం ,సహవాసాలు ఆయన్ను  సిగ్గుపడేట్లు చేశాయి .చివరికి ఇవి ఆయనలో పూర్తిగా మృగ్యమైపోయాయి .ఎనిమిదేళ్ళ తర్వాత ‘’అక్రాస్ ది రివర్ అండ్ ఇంటూ ది ట్రీస్  ‘’రాశాడు .ఎంతో ఆశగా ఎదురు చూసిన జనానికి చుక్కలు చూపించి నిరాశ కలిగించింది .రచనా విధానం పేలవమై విసుగు పుట్టించింది .కాని చావు మళ్ళీ ప్రత్యక్షమైంది ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’లో .54 వయసు .చిన్ననవలె కాని మనిషి అదృష్టం తో డీకోనటం కద.జీవించటానికి ,మరణింప చెయ్యటానికి ప్రబలమైన ప్రకృతి శక్తులతో మనిషి పోరాటాన్ని గొప్ప గా చిత్రించాడు .ట్రాజిక్ డిగ్నిటి కి పట్టం కట్టాడు .ఇలాంటి కధను ఇంతకూ ముందు హెమింగ్వే కాని ఆయన సమకాలికులు కాని రాయనే లేదు .క్లాసిక్ అయింది .నవల లో ఓల్డ్ మాన్ తో చెప్పించిన మాటలు గొప్ప జీవిత సత్యాలు అన్వేషణా ఫలితాలూను –‘’Now we  are  joined together And  no one to help either one of us .Fish I love you and respect you very much .You are my brother –you are killing me ,fish .but you have a right to .Never have I seen a greater ,or more beautiful or calmer or more noble thing than you .,brother .Come on and kill me .I do not care who kills who ‘’.ఆ మహా మీనాన్ని చంపెదాకా టెన్షన్ బాగా పోషింప బడింది .గొప్ప భావోద్రేకాన్ని ,మహా ప్రతీకాత్మకంగా తెలియ జేశాడు .1953 లో దీనికి పులిట్జర్  బహుమతి లభించినందుకు అతని అభిమానులు యెగిరి గంతేసి పాతికేళ్ళు ఆలస్యంగా వచ్చిందని అంటే  వ్యతిరేకులు ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకొన్నారు .మరుసటి ఏడాదే నోబెల్ పురస్కారం అయన  ‘’style making mastership ‘’శైలీ విన్యాసం లో అద్వితీయతకు ‘’ లభించింది .ఆయన తనను తానూ కాల్చుకొని చనిపోకముందే నోబెల్ సంస్థ ఆయన్ను సత్కరిమ్చాలను కొన్నది .1954జనవరిలో రేడియో లో అకస్మాత్తుగా హెమింగ్వే మరణ వార్త ప్రసార మైంది .భార్యతో ఆఫ్రికాకు సఫారి కోసం వెళ్ళాడు .వీళ్ళు ప్రయాణం చేసే విమానం ముక్కలై ఎగువ నైలు నదీ ప్రాంతం లో  కూలిప్రేలి పోయింది ..ఇంకేముంది ప్రసార మాధ్యమాలు ‘’మహా గొప్ప నవలా కారుడు హెమింగ్వే మరణించాడని ‘’మరణాన్ని ఆనందంగా అనుభవించాడు అని శీర్షికలు పెట్టి ప్రసారం చేశాయి .అప్పటిదాకా హెమింగ్వే రచనలను చదవని వేలాది మంది చావు ఆయన సాధారణ కదా విషయం అని ఎప్పటికప్పుడు చావు సమీపానికి వచ్చి తప్పించుకొంటాడని  తెలుసు కొన్నారు .మర్నాడు ఉదయం పత్రికలూ ఆయన చావ లేదని రెండు సార్లు మృత్యువు కోరలలోంచి బ్రతికి బయట పడ్డ రచయిత అని పతాక శీర్షికలతో రాశాయి .కూలిన విమానం లో నుంచి నెమ్మదిగా ఇద్దరూ పాకు కొంటూ బయట పడ్డారు   ఒక మోటార్ లాంచ్ రక్షించి౦ది ..రక్షణ విమానం వచ్చి తీసుకొని వెడుతుండగా అది అగ్నిప్రమాదానికి గురై మళ్ళీ భార్యా భర్తలిద్దరూ బ్రతికి బయట పడ్డారు .అప్పుడు ఆయన ‘’My luck –she is still running good ‘’అన్నాడు .

 హెమింగ్వే ఏదిరాసినా సంచలం సృష్టించింది .విమర్శకులు తమపని తాము చేసుకుపోతున్నారు .ఆయన క్యూబా లో  పూర్వపు యుద్ధ విలేకరి నాలుగవ భార్య మేరీ వెల్ష్ ని 1946 లో పెళ్లి చేసుకొని తో హేపీ హేపీ గా ఉన్నాడు. అతని శైలి గొప్పతనం గురించి చెప్పలేక పోతున్నారు.ఫోర్డ్ మాడాక్స్ ఫోర్డ్ ‘’ Hemingway ‘s words strike you ,each one as if they  were pebbles fetched fresh from a brook ..They live and shine each in its place .’’అని గొప్ప విశ్లేషణ చేశాడు .జీవద్భాష తో ఆయన మాటలు ఒక దానితో ఒకటి పోటీ పడతాయి .’’His style is distinctly the man hard ,clean ,close clipped persistently masculine –his very adjectives  are appropriately ,even aggressively athletic and accurate .’’ఇంతటి గొప్ప రచయిత అయినా ఆయన చదువురాని బాస్కెట్ బాల్ ఆటగాడిలా మాట్లాడే వాడు .ఇది ఆయనలో పెద్ద లోపం .తాను  చావును చావుకోసం చూడనని చంపటం అనేది తిరుగు బాటుకు ,దాని అమలుకు పోరాటభావన  అన్నాడు .

1950 చివరిదాకా రచన చేస్తూనే ఉన్నాడు .1959  లో స్పెయిన్ వెళ్లి లైఫ్ మేగజైన్ కు బుల్ ఫైటింగ్ పై పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు .1960 లో క్యూబా వెళ్లి ‘’లైఫ్ ‘’కోసం పది వేలమాటల రచన ప్రారంభిస్తేఅది విపరీతంగా పెరిగి పోయింది .హాచ్నర్ సాయం తో దాన్ని నలభై వేలమాటలకు కుది౦చాడు .కాని ముద్రాపకులు  పూర్తీ స్క్రిప్ట్ ఇవ్వమని అడిగితే లక్షా ముప్పై వేల మాటలతో రాసిచ్చాడు .హెమింగ్వే దారి తప్పుతూ కంగారుగా ఉన్నట్లు అనిపించేవాడు .1960 జులై లో భార్యతోకలిసి క్యూబా వదిలాడు మళ్ళీ రాలేక పోయాడు .లైఫ్ మేగజైన్ ఫ్రంట్ కవర్ పేజి కోసం స్పెయిన్ వెళ్ళాడు .కొద్దిరోజుల్లో తీవ్రమైన జబ్బు చేసిందని చావు బతుకులలో ఉన్నాడని వార్తా ప్రసారమైంది .కాని భార్యకు ఆయనకులాసాగానే ఉన్నాడని కేబుల్ వచ్చింది .అక్కడ ఒక్కడే పక్కకే అంకితమై ఉన్నాడు .తాను  బ్రేక్ డౌన్ లో ఉన్నానని గ్రహించాడు .లైఫ్ మేగజైన్ లో ‘ డేంజరస్ సమ్మర్ ‘’1960 సెప్టెంబర్ లో మంచి రివ్యూలతో వచ్చింది .అక్టోబర్ లో స్పెయిన్ వదిలి న్యూయార్క్ చేరాడు .భార్య మేరి అపార్ట్ మెంట్ వదిలి వెళ్ళనన్నాడు తనమీద ఎవరో నిఘా ఉన్నారని అనుమాన పడ్డాడు .వెంటనే ఆమె ఇడాహోకు తీసుకువెళ్ళి డాక్టర్ కు చూపించింది .డబ్బు కోసం రక్షణ కోసం ఇబ్బందిపడ్డాడు .అమెరికా ఎఫ్ బి ఐ అనపై నిఘా పెట్టి౦ద నుకొన్నాడు .మేయో హాస్పిటల్ లో ఉన్నాడు .ఆరోగ్యం తగ్గగా జూన్ లో డిశ్చార్జ్ అయ్యాడు .1961 ఏప్రిల్ లో కేట్చెం చేరారు .మే లో ఆతనివద్ద పెద్ద షాట్ గన్ ఉన్నట్లు భార్య గ్రహించింది .భయపడి సన్  వాలీ హాస్పిటల్ లో చేర్పించింది .మళ్ళీ మేయో లో చేరి షాక్ ట్రీట్మెంట్ తీసుకొన్నాడు .జూన్ లో డిశ్చార్జ్ అయి 30 కి ఇంటికి వెళ్ళాడు .19 61 జులై 2 న తన డబుల్ బారెల్ షాట్ గన్ తో కాల్చుకొని చనిపోయాడు .

చనిపోయేముందు హెమింగ్వే పరిస్థితి తండ్రి ఆత్మ హత్య చేసుకొన్నా దాని లాగానే ఉంది .హీమో క్రోమాటిస్  అనే మానసిక వ్యాధి తండ్రినుంచి ఆయనకు సంక్రమించింది .హీమో క్రోమోటాసిస్ కూడా ఉందని ఆయన అమితంగా తాగేవాడని  ఆ తర్వాత రిపోర్ట్ లలో తేలింది .ఆయన సోదరి సోదరుడు కూడా ఆత్మహత్య తోనే చనిపోయారు .

Hemingway’s style was fundamentally shaped “in reaction to [his] experience of world war”. After World War I, he and other modernists “lost faith in the central institutions of Western civilization” by reacting against the elaborate style of 19th-century writers and by creating a style “in which meaning is established through dialogue, through action, and silences—a fiction in which nothing crucial—or at least very little—is stated explicitly.”[18]

Hemingway learned to “get the most from the least, how to prune language, how to multiply intensities and how to tell nothing but the truth in a way that allowed for telling more than the truth.”[168] Hemingway called his style the Iceberg Theory: the facts float above water; the supporting structure and symbolism operate out of sight.[168] The concept of the iceberg theory is sometimes referred to as the “theory of omission”. Hemingway believed the writer could describe one thing (such as Nick Adams fishing in “The Big Two-Hearted River”) though an entirely different thing occurs below the surface (Nick Adams concentrating on fishing to the extent that he does not have to think about anything Hemingway habitually used the word “and” in place of commas

Fiedler believes Hemingway inverts the American literary theme of the evil “Dark Woman” versus the good “Light Woman”. The dark woman—Brett Ashley of The Sun Also Rises—is a goddess; the light woman—Margot Macomber of “The Short Happy Life of Francis Macomber“—is a murderess.[181] Robert Scholes admits that early Hemingway stories, such as “A Very Short Story“, present “a male character favorably and a female unfavorably”.[184] According to Rena Sanderson, early Hemingway critics lauded his male-centric world of masculine pursuits, and the fiction divided women into “castrators or love-slaves”.

Inline image 1

Inline image 2Inline image 3

  సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-16 –ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234

86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

హెమింగ్వే  ఒక కొత్త దృగ్విషయం గా ఉండేవాడు .ఈస్తేటేస్ లో అతను అథ్లెట్ .ఆరడుగుల పొడవు సింహం తల ,పురుషాహంకార చాతీ తో ఒక ప్రైజ్ రింగ్ లోకి ప్రేవేశించినట్లు రూమ్ లో కి ప్రవేశించేవాడు .ఆయన గొప్ప బాక్సర్ మాత్రమే కాదు దానిలో శిక్షణ కూడా ఇచ్చే గురూజీ కూడా .దవడ కింద చలాకీగా కొట్టటం ఆయన నేర్చిన గొప్ప పాఠం.25 లో జర్నలిస్ట్ కంటే రచయిత కావాలనుకొని మొదటిచిన్న పుస్తకం వదిలాడు .ఏదో ఒక అనామక ప్రెస్ లో అంతగా ఆకర్షణ లేని విధంగా అది ప్రింట్ అయింది .దానికి ‘’త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయెమ్స్ ‘’అని పేరుపెట్టాడు .కొద్దికాలానికే రెండవది ‘’ఇన్ అవర్ టైం ‘’అచ్చు వేశాడు . ఎక్కువగా సంప్రదాయాన్ని పట్టుకు పాకులాడినట్లని పించింది .యుద్ధానంతర పరిస్తితి ,ఎపిగ్రాఫ్ లతో ఉంది .దీన్నే కొంత మార్చి 1924 లో న్యు యార్క్ నుండి ‘’ఇన్ అవర్ టైం ‘’గా ప్రచురించాడు .ఇందులో ఆయన శక్తి వంతుడైనసృజనాత్మక  రచయిత అనిపిస్తాడు .కాని ఇంకా పరిపక్వానికి రాని ,జీవితం ,కళ అంటే ఏమిటో తెలీని వాడుగా కనిపించాడు .ఇదొక నవల గా ఉంటుంది .ప్రతి అధ్యాయానికి శీర్షిక ,పాత్రల మధ్య సమన్వయం ఉంటుంది .నిజంగా ఇది చిన్నకదల సమాహారమే కాని ఒకదానికొకటి సంబంధం కలిగి పాత దానికి శబ్ద చిత్రం అనిపిస్తుంది .ఏక సూత్రత ఉండటం విశేషం .చూడగా ఈ రెండూ వేరు వేరుగా అనిపిస్తాయి .ఇందులో యుద్ధం ,హింస అకస్మాత్తు చావులు ఉంటాయి .మరోరకం గా అతని బాల్య స్వీయ చరిత్ర తండ్రితో చేపలు పట్టే విశేషాలున్నాయి..యుద్ధానికి ముందుకూడా లోకం లో శాంతి లేదని బాధ పడటం చూస్తాం .25 లో ఉగ్రవాద ౦ ,పెద్ద పెద్ద విషాద సంఘటనలలో ఏర్పడిన క్రౌర్యం అంటే ఆయనకు మోజుగా ఉండేది .ప్రతి రోజు జీవితం లో విషాదం ,క్రూరత్వం ,హృదయం లేని భావం అతన్ని బాగా పీడించేవి .వీటినన్నిటిని ‘’టోరెంట్స్ ఆఫ్ స్ప్రింగ్ ‘’లో రాశాడు .ఇది షేర్ వుడ్ ఆండర్సన్ కు నివాళి గానే కనిపించినా పరిహాసమూ ధ్వనిస్తుంది .ఆండర్సన్ చెప్పే సెక్సువల్ మిస్టి సిజం ‘’లాస్ట్ జెనరేషన్ ‘’కు పూజనీయమైంది .శాంతికోసం ఆరాటం అందులో కనిపించకపోవటం ఆ సిద్ధాంతం లో హెమింగ్వే కు కనిపించింది .

      హెమింగ్వే ఆకస్మాత్ ప్రాభవానికి ఆయన దృక్పధం, శైలి ముఖ్యకారణాలు .ఈ రెండు కూడా ఆగ్రహం లోంచి వచ్చినవే .వేలాది యువకుల నిరాశా నిస్పృహలు ,స్థితి త్రుణీకరణం ,ఆశల వైఫల్యం పై ఆయనకు కోపం ఎక్కువ .ఈ కోపం స్టాయిజం ముసుగులో కాని ఆ తరం సాంఘికంగా విలువలపరంగా తగినంత స్థాయిలో లేకపోవటం ఆయనకు బాధ కలిగించింది .కూలి పోయిన ప్రపంచం లో స్త్రీ పురుషులు ఏదో రకంగా సర్దుకు పోతూ ,చిద్రమైన బోహిమియన్ లలాగా జీవించటం చూసి ‘’ది సన్ ఆల్సో రైజేస్ ‘’రాసి పెద్ద సంచలనమే సృస్టించాడు .మంత్రముగ్ధంగా బిగపట్టిన నరాలతో హింసాత్మకంగా ,పిచ్చి సంగీతం కోసం ,మరింత కిక్కిచ్చే మద్యం కోసం అరవటం కనిపిస్తుంది .ప్రేమ లేని సెక్స్ ,సెక్స్ లేని ప్రేమ ఇందులో పుష్కలం .

ఇందులోని హీరోలు బుల్ ఫైటర్లు  ,హంటర్లు ,క్రీడాకారులు ,ఆదిమానవులు .వీరంతా 20 వ శతాబ్ది బలహీన సంస్కృతికి ప్రతినిధులు .హెమింగ్వే వారి ప్రవక్త .వారి కస్టాలు బాధలు వేదనల కన్నీరు నిరాశా నిస్పృహ లపై సానుభూతి చూపాడు .వీళ్ళను తాను అధిగామించినవాడు .ఆయన రచయితమాత్రమేకాక ,,ఫైటర్ ,ప్రిమిటివ్   ,భౌతిక కార్యాన్ని ఘనంగా చెప్పినవాడు .చాలా ముక్కు సూటిగా అత్యంత సరళంగా ,యే అల౦కారం లేని విధంగా రాయటం ఆయన ప్రత్యేకత .’’his tone was dry and flat but the implications were exciting .-the dialogues were as as artlessly plastic as conversation  but they were un cannily precise and almost unbearably intense ‘. .ఈ దివాలా ప్రపంచాన్ని సమాజాన్నీ  ఆయన తిరస్కరించాడు .తన స్వంత శబ్ద ప్రపంచాన్ని సృష్టించుకొని శబ్ద బ్రహ్మ అనిపించాడు .ఆయనది ఒక భాషా విద్యాలయమే అయింది .సాహిత్య విప్లవం కోరుకొన్నాడు ..ఆయన విధానాన్ని రచయితలూ అనుకరించటానికి ఉబలాట పడ్డారు .కొందరు మాత్రం ఆయన రచనలు చదవ లేదని  ప్రగల్భాలు పలికారు .ఆయన అండర్ స్టేట్ మెంట్ లు  ఉడికే రక్తానికి ప్రతినిదులయ్యాయి .ఫాషన్ కూడా అయింది .’’sick brutality and twisted sentimentality లను వింతగా జోడించి రాయటం ఆయన ప్రత్యేకత .At twenty –seven Hemingway had set the keynote for a new kind of literature .it was felt half the young writers tried to imitate him and the other half tried not ‘’

Inline image 1

Inline image 2Inline image 3
   సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూర్య సిద్ధాంతం ప్రకారం కన్యా రాశిలో గురుడు 26 వ తేదీమంగళ వారమే ప్రవేశించాడని తెలిసి

మేము 29-7-16 శుక్రవారం ముక్త్యాల ఉత్తర వాహిని కృష్ణా నదిలో పవిత్ర పుష్కరస్నానం చేసి శ్రీ ముక్త్యేశ్వర స్వామిని సందర్శించి కోటిలింగాలలో శ్రీ పశుపతి నాద లింగానికి అభిషేకం చేయించి ,తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర ,పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఫెర్రీలో గోదావరి -కృష్ణా సంగమాన్ని దర్శించి జలాలను శిరసుపై చల్లుకొని ఉయ్యూరు తిరిగి వచ్చిన ఫోటోలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232

85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )

 లిబ్రటిస్ట్ లయిన జార్జెస్ ఎస్.కాఫ్మన్ ,మోరీ రిస్కిండ్ ల ప్రోత్సాహం తో జేష్క్విన్ మరో కొత్త ఇదివరకు ఎన్నడూ ప్రయత్నించని అమెరికా సంస్కృతీ –మ్యూజికల్ సెటైర్ పై తన ముద్ర వేశాడు .యుద్ధం ,రాజకీయం ,బడా బిజినెస్ ,,ఉన్నత విషయాలలో డోల్లతనాలను సరదాగా నవ్విస్తూ’’స్ట్రైక్ అప్ ది బాండ్ ఆఫ్ దీఐ సింగ్ ‘’ద్వారా  బయట పెట్టాడు .దీనికి ‘’పులిట్జర్ ప్రైజ్ ‘’వచ్చింది .మొదటి సారిగా ఒక మ్యూజికల్ కామెడీకి ఈ బహుమతి రావటం చారిత్రాత్మకమైనది .అలాగే ‘’లెట్ దెంఈట్ కేక్ ‘’అనేది మరొకటి .వీటికి అన్న ఇరా లిరిక్స్ రాశాడు .ఈ రెండు 1930 -33 మధ్య వచ్చాయి .ఈ త్రయం కొత్త కోణాలలో భావాలతో పూర్వం కేవలం వినోదం అన్న దానికి భిన్నం గా గొప్ప సృజనాత్మకంగా దియేటర్ సంగీతానికి సొగసులద్దారు .

   1933 లో జేర్శ్విన్ ‘’పోర్జీ అండ్ బెస్స్ ‘అనే మొదటి అసలైన అమెరికన్ మ్యూజిక్ డ్రామాకు స్కెచెస్ తయారు చేశాడు .’’డు బోస్ హేవార్డ్’’ నవల ఫోక్ ఒపేరా ఆధారంగా దీన్ని రెండు ఏళ్ళ లో తయారు చేశాడు .ఇందులో ఆర్కేస్ట్రై జేషన్ కే తొమ్మిది నెలలు పట్టింది .కోరికలు భయాలు ,సంతోషాలు కలిసి గొప్ప వైవిధ్యం తో రూపు దిద్దాడు .అలాగే జోలపాట ‘’సమ్మర్ టైం ‘’బాగా పాప్యులర్ అయింది .అరడజను దాకా రాసినా పూర్తీ శాస్త్రీయ బద్ధ సంగీతం లో రాయలేదు అన్నాడు ఆస్కార్ లెవంట్ .’’he could never accustom to such restraints as sonatas ,rondos ,or any of the classic molds .the thematic fluency ,the easy going rhythmic freedom of the rhapsody or un restricted fantasy was his natural genre ‘’అన్నాడు ఆస్కార్ .వయసు 30 కి రాకముందు 30 మ్యూజికల్ కామెడీలు స్టేజ్ కి  సినిమాలకు రాశాడు  .1936 లో సోదరు లిద్దరూ మళ్ళీ కాలి ఫోర్నియా చేరారు .అప్పటికే నాలుగవ సినిమా ‘’ది గోల్ద్విన్ ఫాలీస్ ‘’కు సంతోషంగా సంగీతం కూరుస్తున్నాడు .అకస్మాత్తుగా తలనెప్పి వచ్చి బాధ పడ్డాడు .మొదట్లో స్నేహితులు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు .ఇవి హాలీ వుడ్ కు వ్యతిరేక మైన డిఫెన్స్ మేకానిజానికి చెందిన  సైకో సోమాటిక్ న్యూరోటిక్ ప్రొటెస్ట్ లనుకొన్నారు .ఒక్కసారిగా అతని పియానో టెక్నిక్ విఫలమవటం తో  స్టూడియో లోనే కుప్ప కూలాడు .డాక్టర్ దగ్గరకు వెంటనే తీసుకు వెళ్ళారు .అక్కడ కూడా ఆయన దీన్ని సీరియస్ గా భావించలేదు .అతన్ని పరీక్షించి నెర్వస్ బ్రేక్ డౌన్ అని చెప్పారు .రెండవ సారి వచ్చింది .ఎక్స్ రే రిపోర్ట్  అత్యవసరమైంది .మెదడులో కణితి పెరిగిందని గుర్తించారు .ఎమర్జెన్సి ఆపరేషన్ చేశారు .కాని కోలుకోలేదు లాస్ ఏంజెల్స్ లో 11 -7-19 37 న 39 వ ఏట సంగీత శిఖరారోహణ చేసిన జార్జ్ జేష్విన్ అకస్మాత్తుగా అమరుడైనాడు .మరిన్ని సృజనలతో మెరిపించి మురిపించాల్సిన సంగీత కర్త బ్రెయిన్  ట్యూమర్ తో మరణించాడు .

  ఆయన చనిపోయిన సుమారు 20 ఏళ్ళకు కూడా ఆయన సంగీతం తరచుగా వినటం మెచ్చుకోవటం జరుగుతోంది .అతని పెద్ద రచనలు అంతగొప్పవి కావని విమర్శకాభి ప్రాయం .కాని ఆయన జీనియస్ ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదు .రికార్డ్ కంపెనీలు ఆయన పాత పాటలను దుమ్ము దులిపి బయటికి తీసి కొత్త తరానికి అందిస్తూ ఆన౦దించేట్లు చేస్తున్నాయి .ఎన్నో సంగీత స్వరాలను కూర్చి పరవశింప చేయటమేకాక పూర్వం ఎప్పుడూలేనిసరికొత్త విధానం ప్రవేశ పెట్టాడు .పాప్యులర్ ,క్లాసిక్ సంగీతానికి మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి లేక ఫార్మల్ నాన్ ఫార్మల్ సంగీత హద్దుల్ని చెరిపేసి విలువైన అమర సంగీతాన్ని అందించాడు .1955 లో ‘’పోర్జి అండ్ బీస్ ‘’ని ప్రదర్శిస్తూ యూరప్ అంతా   చుట్టిన కంపెనీకి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు .అంటే ఇప్పటికీ సంగీత ప్రపంచం లో రష్యాతోపాటు అనేక దేశాలలో అతని కీర్తి స్థిరంగా సురక్షణలోనే ఉంది అని తేలింది .””He had pronounced the tone and the tempo of his age –he had given music a new racy speech  and for the first time in history an American accent ‘’.

ఆతని ఎస్టేట్ అన్నకు ,తల్లికి సంక్రమించింది .అతని సంగీతం పై వచ్చే రాయల్టీ, కాపీరైట్ హక్కులు ఆ కుటుంబానికే దక్కాయి .ఆతను సంపాదించిన డబ్బును లెక్కేసి గార్డియన్ పత్రిక అన్నికాలాలోని సంగీత కారుల కంటే అత్యంత సంపన్నుడు అని తేల్చింది .మిచిగన్ యూనివర్సిటి లో అతనిపేర ఒక సంగీత కళాశాల ఏర్పరచారు .ఆయనకు వచ్చిన అవార్డులు చాలా విలువైనవి –కంగ్రేషనల్ గోల్డ్ మెడల్ ,స్పెషల్ పులిట్జర్ ప్రైజ్ ,ఇరా జార్జ్ సోదరులకు జీవన సాఫల్య పురస్కారం  ,లాంగ్ ఐలాండ్ మ్యూజిక్ హాల్ లో పేరు చేర్చారు .ఆర్కెస్ట్రా తో చేసినవి 10 ,సోలో పియానో లు 2 ,ఒపెరాలు 2 ,లండన్ మ్యూజికల్స్1 , ,బ్రాడ్వే మ్యూజికల్స్ 18 ,సినిమాలకు 5 జేర్శ్విన్ సంగీతం సమకూర్చాడు 

Inline image 1  Inline image 2Inline image 3

.

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231

85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్

‘’తనకు తగిన తేజస్సు తో జీవించాడు ‘’ అని మెచ్చుకొనే అమెరికా ప్రజారంజక సాంప్రదాయ స్వరమాదుర్య సంగీత కర్త జార్జ్ జెష్విన్.38 ఏళ్ళకే అకస్మాత్తు సంఘటనలో మరణించే దాకా అమెరికాలోని ప్రజాదరణ సంగీతాన్ని గొప్ప మలుపు తిప్పట మేకాక  పశ్చిమ దేశాల లో సంగీత నాడిని వేగం చేసిన వాడు .అమెరికాలో న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో 26-9-1898 న జన్మించాడు .తల్లి మార్రిస్. తండ్రి రోజ బ్రస్కిన్  జెర్ష్విన్ .చిన్నతనం అంతా మాన్ హాటన్ లోని లోయర్ ఈస్ట్ సైడ్ లో గడిచింది .తండ్రి అనేక పనులలో అంటే రెస్టారెంటులు ,రష్యన్ ,టర్కిష్ బాత్ లు ,బేకరీలు సిగార్ స్టోర్స్ ,ప్పోల్ పార్లర్ లలో ఇప్పుడు గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అని పిలిచే బ్రిటన్ బీచ్ రేస్ ట్రాక్ దగ్గర పనులు చేసేవాడు .ఎక్కడా స్తిరంగా ఉండక ఎప్పుడూ ఏదో చోటికి మారు తూ ఉండేవారు .ఒక వ్యాపారాన్ని అమ్మేసి ఇంకో దాన్ని ప్రారంభించినప్పుడు ఆయనతో పాటే  కుటుంబమూ ‘’జెండాపై కపిరాజు ‘’అంటూ అక్కడికి  వెళ్ళేదన్నమాట  .అన్న ఇరా తమ్ముడు జార్జ్ తాము దాదాపు 25 చోటుల్లో ,అపార్ట్ మెంట్ లలో మారుతూ బతికామని చెప్పుకొన్నారు .సెకండ్ ఎవెన్యు లోకి మారినప్పుడు తల్లి ఒక పియానో కొన్నది .అప్పటికి జార్జ్ వయసు 12 .

       ఈ పియాని అన్న ఇరా కోసమే కొన్నా ,తమ్ముడు జార్జ్ దాని దగ్గర కూర్చుని ఎడమ చేత్తో చక్కగా వాయించేవాడు .తర్వాత చార్లెస్ హామ్బ్రిద్జర్ వద్ద చోపిన్ ,డేబూసీ ల సంగీతాన్ని నేర్చాడు  .ఈ చార్లెస్ జార్జ్ కి సంగీతంలోని ప్రాధమిక విషయాలు టెక్నిక్ లు క్షుణ్ణం గా నేర్పాడు  .దీనితో హై స్కూల్ ఆఫ్ కామర్స్  లో ఉదయం అసెంబ్లీకి సౌసా మార్చ్ సాంగ్ లు వాయించే నైపుణ్యం వచ్చింది  .15 వ ఏట నే ప్రొఫెషనల్ అయి పోయి ,ఒక మ్యూజిక్ పబ్లిషింగ్ సంస్థలో వారానికి 15 డాలర్ల జీతం తో చేరాడు .సాంగ్ స్లాగ్గర్ లతోకలిసి వాడే విల్లీ హౌసెస్ ,లకు వెళ్లి అక్కడ జరిగే వాటిని రిపోర్ట్ చేస్తూ ,ఆచరణ యోగ్య మైన స్వరాలు కట్టేవాడు .మూడేళ్ళ తర్వాత స్వంత ఒక పాట పబ్లిష్ అయింది .21 వ ఏట ‘’లాలా లూసేల్లి ‘’అనే కామెడి కి 1919 లో మొత్తం సంగీతాన్ని కూర్చాడు .అదే ఏడాది టిన్ పాల్ అల్లే లో పాటగాడు ఆల్జాల్సన్ స్వీనీ తో రాక్ పాటలు పాడటం తో జార్జ్ పేరు దేశమంతా మారు మోగింది .

 స్వీనీ  ఒక నమూనా (ప్రోటో టైప్ )పాటఆనాటి మూస సెంటిమెంటల్ మ్యూజిక్ కామేడీలకు అతి భిన్నంగా ఉండి విప్లవాత్మకమైంది .ఇది అప్పటిదాకా ఉన్న పాత వియన్నీస్ ఒపెరెట్టాఫాషన్  లకు కాపీగా కాకుండా ,పూర్తీ గా మార్పు చేసి వేగవంతమైన ,విపరీత ఆశ్చర్యాన్ని  కలిగించేట్లు ,ఉత్తేజం ,వినోదాల సంగీత విందు ఇచ్చింది .ఇందులో అన్నీ పరమ ఆశ్చర్య కరాలే .అందులోని స్వదేశ భావన ఆరాధన హాస్యపు గుబాళింపు తో మేళవించి ,పదాలు ,సంగీతం చాలా సరదాగా కలిసిపోయి ,విపరీతమైన శ్లేష తో ఆది నుంచి అంతం దాకా నమ్మకాన్ని విశ్వాసాన్ని అందించింది .ముఖ్యం గా ఇందులో స్వదేశీయ అమెరికా హృదయ ధ్వని భాసించి ఇదీ మా అసలైన  సంగీతం అని రుజువు చేసింది .

        దీని తర్వాత వచ్చిన పాటలన్నీ చాలా హాయిగా తేలిగ్గా లాబ దాయకంగా ప్రవ హి౦చాయి .ఇలాంటి స్వరాలు మాధుర్యం ఇంతకూ ముందు ఎన్నడూ అమెరికన్ దియేటర్ లో వినిపించనే లేదు ఇదొక విప్లవం .అమెరికన్ మూలాల లో పాదాలు ఉంచి నరాల ఉత్తుంగ ఉత్తేజం తో బ్రాడ్వే మ్యూజికల్స్ కు అనేక ప్రైవేట్ పాటలకు స్వరాలు కూర్చి స్వదేశీ భావసుమాలకు  పరిమళాలు అద్ది  రస  భరితం చేశాడు .అలాంటి వాటిలో ‘’ఐ గాట్ రిధం ‘’,సమ్ బడి లవ్స్ మి ‘’మే బి ‘’,’’లిజా ‘’,అవర్ లవ్ ఈజ్ హియర్ టు స్టే’’చాలా ప్రసిద్ధమైనవి .శారీరకంగానూ ఆయన చాలెంజింగ్ గానే ఉన్నాడు .ఎత్తుగా సన్నగా ఉన్న పర్సనాలిటి .ముఖం నలుపు సన్నం .నుదురుఎత్తు గా ఉండేది .మొత్తం మీదచూస్తే అసీరియన్ శిల్పం లాగా ఉండేవాడు .వేగవంతంగా నవ్వేవాడు. తనకు తగిన తేజం తో గోచరి౦ చేవాడు .ప్రజలను నమ్మక పోవటం లేదుకాని వాళ్ళను అర్ధం చేసుకొనే అవసరం ఉండేదికాదు .జీవితాంతం పెళ్లి చేసుకొనే లేదు .పియానో నే ఆయన పెళ్ళాం ఆంతరంగిక సహచరి .పియానో ఉంటె అన్నీ మర్చిపోయి అందులోనే ఆనందం తృప్తీ పొందేవాడు .ఇతర పియానిస్ట్ లు గదిలో ఉన్నా ఆయన ద్రుష్టి అంతా తన పియానో మీదే ఉండేది అంతటి తాదాత్మ్యం ఆయనది .’’చూడండి –నేను వాయిస్తుంటే అందరూ హాపీ ,కాని ఇతరు లెవరైనా వాయిస్తుంటే నేను దయనీయం గా ఉంటాను ‘’అని చెప్పాడు .సంప్రదాయ సంగీతకారుల సంగీతంపై బాగా ఇష్టం ఉన్నా ,సమకాలికుల స్వరాలు కొన్ని నచ్చినా ,మెచ్చుకొన్నా ,పియానో దగ్గర ఉంటె మాత్రం వాళ్ళను ఎవర్నీ మెచ్చిన దాఖలాలు లేవు .’’ఆయనతో సాయంత్రం గడపటం అంటే అది జేష్విన్ సాయంత్రమే ‘’అన్నాడు ఆయన స్నేహితుడు ,సాటి పియానిస్ట్ ఆస్కార్ లేవెంట్ . మరోసారి తన పాటకు మెరుగు పెట్టు కొంటూ ’’నా సంగీతం ఇంకో వందేళ్ళ తర్వాత ఎవరైనా వాయిస్తారా ?’’అని ఆస్కార్ ను అడిగితే ‘’తప్పకుండా నువ్వు వాళ్ళ మధ్య ఉంటే ‘’అని  నీరసంగా జవాబు చెప్పాడు ఆస్కార్ .

  వయసు ఇరవై లలో ఉండగా ఆయనకు నాటకీయంగా కొత్త జీవితం ప్రారంభమైంది .బాండ్ లీడర్ పాల్ వైట్ మన్ డాన్స్ మ్యూజిక్ ను ఉద్ధరించాలనుకొన్నాడు .ఆధునిక సంగీత ప్రయోగం పేరుతొ ఒక సంగీత కచేరి ని లింకన్ పుట్టిన రోజు 1924 లో ఆలోలియన్ హాల్ లో నిర్వహించాడు .అంతకు ముందేజనవరిలో  వైట్ మాన్  ప్రెస్ వాళ్లకు జేర్శ్విన్ తన స్వంతపాట పాడుతారని  ప్రకటించాడు .అందరి కంటే జేర్శ్విన్  ఎక్కువ ఆశ్చర్య పోయాడు ‘’నువ్వు ఏదో ఒక రోజు నా కు ఒక కాన్సేర్ట్ పీస్ రాయాలి ‘’అని అడిగాడు .’’ఏదో ఒకరోజు రాస్తాలే ‘’అన్నాడు యదా లాపంగా .పేపర్లో ప్రకటన చూశాక ఆ సంఘటన జ్ఞాపకమొచ్చి ,వెంటనే పనికి ఉపక్రమించాడు .ఒక సరదా విషయం తీసుకొని నోట్ బుక్ లో రాసుకొని దాన్నే ప్రార౦భ గీతంగా పాడాలనుకొన్నాడు .అది క్లారినెట్ పై సుదీర్ఘంగా ఉదాత్త అనుదాత్తాలతో సాగింది .అలా౦టి పాట ఆకాల౦  లో ఎవరూ వాయించటానికి సాహసిమ్చేవారుకాడు . అతి కష్టమైనదికూడా . .జేష్విన్ దాన్ని గొప్ప పద బంధం తో ,పై స్థాయిలో ‘’రాప్సోడి ఇన్ బ్లూ’’తో మొదలయ్యేటట్లు రాశాడు ..ఈ రాఫ్సోడి ని మూడు వారాల్లో పూర్తీ చేశాడు .దీన్ని అప్పుడు అక్కడ ప్రదర్శిస్తే దాని ప్రభావం చెప్ప తరంకాక విపరీతంగా విజయ వంతమైంది .సాగతీత ,పాత వాసనలతో విసుగెత్తిన జనాలకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది .సీరియస్ సంగీతం పై పిచ్చ అభిమానమేర్పడింది .దాని వేగం ,తీక్ష్ణత  అందులోని పరోక్ష ఇతి వృత్తానికి అన్నితరగతుల వారు మురిసి పోయారు  అందరూ కొంతకాలం దాకా దీన్ని గురించే మాట్లాడుకొనేవాళ్ళు .రాఫ్సోడి అమెరికన్ ట్రేడ్ మార్క్ అయి పోయింది .అమెరికా చరిత్రలో ఇంత అద్భుతమైనది అంతకు ము౦దుకాని ఆ తర్వాత కాని రాలేదు ,అంత తరచుగా వినబడలేదు అంత ప్రపంచ ప్రసిద్ధం కాలేదు .’’సన్  ఆఫ్ ది సాయిల్ ఇన్ మ్యూజిక్’’ అని పించుకొన్నాడు జేర్శ్విన్ .

ఇంకా విస్తరించాలి అని అభిమానులు కోరుకున్నారు .అందుకే చిన్న కమ్మర్షియల్ బిట్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద వాటిదాకా పనిచేసి అందరికి సంతృప్తి కల్గించాడు .వైట్ మాన్ అరెంజర్ అయిన ఫెర్డే గ్రోఫే రాఫ్సోల్ది ‘’కి ఆర్కెస్ట్రా సమకూర్చాడు .ఇక స్వంత ఏర్పాటు చేసుకోవాలనుకొన్నాడు జార్జ్ ..కాలక్షేపానికి ఎప్పుడైనా టెన్నిస్ ఆడేవాడు స్పోర్ట్స్ కు దూరం .దీనికి బదులు స్టుడియోలలో రాబిన్ గోల్డ్ ఆర్క్ ,జోసెఫ్ శిలింజర్ వంటి ముఖ్య సంగీత కారులతో కూర్చుని కాలం గడిపేవాడు .జార్జ్ కూర్చిన ‘’టిన్ పాన్ అల్లే ‘’శిల్లిన్జర్ కు బాగా నచ్చి అందులోవింత ట్రయేడ్,టేట్రాడ్స్ వలన కలిగిన గణిత కీలక భావనలు అంతకు పూర్వం తెలియని హై పిచ్ స్కేల్స్ ,అవి తీగల నిర్మాణం తో సంబంధం కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగించి ‘’rhythmic  groups resulting from the interference of several synchronized periodicities ‘’  ,’’groups with the fractioning around the axis of symmetry ‘’అని రాశాడు .

  రాఫ్సోడి ప్రదర్శన తర్వాత ‘’కంసేర్టో f’’ లో సోలోయిస్ట్ అవతారమెత్తాడు .దీన్ని వాల్టర్ డాం రాష్ న్యు యార్క్ సి౦ ఫనికి చేశాడు ‘’యాన్ అమెరికన్ ఇన్ పారిస్ ‘’,సెకండ్ రాఫ్సోడి’’’’రాఫ్సోడి ఇన్ రివర్స్ ‘’వంటివి ఎన్నో చేశాడు .The rhapsody in blue was amounting adventure in excitement full of the flamboyant youth and pulsing energy of the nation .The jazz  driven ‘’concerto ‘’widened Gershwin ;s gamut ‘’దీనిలో ఏముంది అంటే –‘’the nerves ,repressions and complexities of the modern world ‘’అమెరికన్ జాతీయాలను యాన్  అమెరికన్ ఇన్ పారిస్ ,సెకండ్ రాఫ్సోడి’’లు మరింత విస్తృతం చేశాయి .ఈ పాటలతో నగరాలు పల్లెలు వీది వీధినా మారు మోగాయి .

Inline image 1

  సశేషం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-28-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -230 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –3 (చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -230

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –3 (చివరి భాగం )

  స్టాక్ హోమ్స్ లో పురస్కార ప్రదానోత్సవం నాడు ఫాక్నర్ మాట్లాడిన తీరు అందరూ మాట్లాడే రీతికి భిన్నంగా చాలా హుందాగా ,వినయపూర్వకంగా ,చాంపియన్ షిప్ గా ఉండి అందర్నీ ఆశ్చర్య పరచింది .అందులో కొన్ని బంగారు పలుకులు ఆయన మాటల్లోనే –‘’The old universal truths ,lacking which any story is ephemeral and doomed ..Until the writer re learns these things ,he will write as though he stood among and watched the end of man .I believe that man will not merely endure –he will prevail ..He is immoral ,not because he alone among creatures has an inexhaustible voice but because he has a soul ,a spirit capable of compassion and sacrifice and endurance The poet’s ,the writer’s ,duty is to write about these things .It is his  privilege to help man endure by lifting his heart ,by reminding him of the courage and honor and hope and pride and compassion and pity and sacrifice which have been the glory of his past ‘’.ఈ స్టాక్ హోమ్స్ ఉపన్యాసం అందరూ మెచ్చుకొన్నారు .విషాద ,నిరుత్సాహ వాతావరణం లో ఎప్పుడూ మాట్లాడే ఫాక్నర్ ఇంత గొప్పగా మాట్లాడుటాడని ఇంతటి ఆశ ను చిగురింప జేస్తాడని ఎవరూ ఊహించలేదు .వాళ్ళకిప్పుడు గొప్ప ఊరట కలిగింది .మనుషులను ఓదార్చి వాళ్ళ కడగండ్ల నుండి ఉద్ధరించటం రచయిత బాధ్యత.వాళ్లకు బలమైన పునాదులతో ఆశా సౌధం నిర్మించాలి అనే ఆయన సిద్ధాంతానికి బలం చేకూరింది .యెంత నీచ అల్ప విషయమైనా దానికి జీవం చేకూర్చే పని ఫాక్నేర్ చేయగలడు అని నమ్మారు .ఫాక్నేర్ నేచురలిజం ను ఫ్రెంచ్ రచయిత బాడర్లేర్ ‘’డయ బాలిజం ‘’తోనూ రష్యా రచయిత డాస్టోవ్ స్కి ‘’గిల్ట్ సఫరింగ్ డ్రైవ్ ‘’తోనూ పోల్చారు .

   నోబెల్ ప్రైజ్ పొందిన నాలుగేళ్ళకు ‘’యే ఫేబుల్ ‘’రచన ప్రచురించాడు .పాత గొలుసు నవలలకు భిన్నంగా తన జీవిత ఆకాంక్షను తెలియ జేస్తూ రాశాడు .ఇందులో జాలి దయ ,ఆశ నింపాడు .ఇది ఒక నవలలాకాక ప్రతీకల సమూహంగా ఉంది .’’ది బేర్ ‘’లో ఒకే వాక్యం లో రెండు వందలకు పైగా పంక్తులు రాశాడు .మరో గొప్ప విషయం ఏమిటంటే ఆయన జీవనకాలం లో ఆయన్ను మించి రాసిన వారెవరూ లేక పోవటం ‘’he combines the novel of direct action with the novel of analysis ..ఏది రాసినా దానికొక పరమార్ధం ఉండేట్లు రాశాడు .మొత్తం మీద ‘’threatened with disaster and at times dementia ,Faulkner ‘s world is scarcely alluring ,but it is unmistakably a world ,and it is unquestionably his own ‘’

The manuscripts of most of Faulkner’s works, correspondence, personal papers, and over 300 books from his working library reside at the Albert and Shirley Small Special Collections Library at the University of Virginia, where he spent much of his time in his final years. The library also houses some of the writer’s personal effects and the papers of major Faulkner associates and scholars such as his biographer Joseph Blotner, bibliographer Linton Massey, and Random House editor Albert Erskine.

Southeast Missouri State University, where the Center for Faulkner Studies is located, also owns a generous collection of Faulkner materials including first editions, manuscripts, letters, photographs, artwork, and many materials pertaining to Faulkner’s time in Hollywood. The university possesses many personal files and letters kept by Joseph Blotner, along with books and letters that once belonged to Malcolm Cowley, another famous editor for William Faulkner. The university achieved the collection thanks to a generous donation by Louis Daniel Brodsky, a collector of Faulkner materials, in 1989.

Further significant Faulkner materials reside at the University of Mississippi, the Harry Ransom Center, and the New York Public Library.

·         radine (“Spotted Horses”) and Arliss Howard (“That Evening Sun”, “Wash”). Winner of AudioFile Earphones Award.

·         William Faulkner Reads: The Nobel Prize Acceptance Speech, Selections from As I Lay Dying, A Fable, The Old Man. Caedmon/Harper Audio, 1992. Cassette. ISBN 1-55994-572-9

·         William Faulkner Reads from His Work. Arcady Series, MGM E3617 ARC, 1957. Faulkner reads from The Sound and The Fury (side one) and Light in August (side two). Produced by Jean Stein, who also did the liner notes with Edward Cole. Cover photograph by Robert Capa (Magnum).

·         From 1957 to 1958, William Faulkner was the University of Virginia’s Writer in Residence (the first). There are audio recordings of his time at the University of Virginia, and they have now been made available online at Faulkner at Virginia

                       64 ఏళ్ళ వయసులో ఫాక్నేర్ 6-6-1962 న మిసిసిపి లోని బైహాలియా లో చనిపోయాడు .నోబెల్ ప్రైజ్ తోపాటు పులిట్జర్ ప్రైజ్ నేషనల్ బుక్ అవార్డ్ లు కూడా పొందాడు Faulkner was known for his experimental style with meticulous attention to diction and cadence. In contrast to the minimalist understatement of his contemporary Ernest Hemingway, Faulkner made frequent use of “stream of consciousness” in his writing, and wrote often highly emotional, subtle, cerebral, complex, and sometimes Gothic orgrotesque stories of a wide variety of characters including former slaves or descendants of slaves, poor white, agrarian, or working-class Southerners, and Southern aristocrats.

In an interview with The Paris Review in 1956, Faulkner remarked:

Let the writer take up surgery or bricklaying if he is interested in technique. There is no mechanical way to get the writing done, no shortcut. The young writer would be a fool to follow a theory. Teach yourself by your own mistakes; people learn only by error. The good artist believes that nobody is good enough to give him advice. He has supreme vanity. No matter how much he admires the old writer, he wants to beat him..

   ‘’యే మార్బుల్ ఫాన్ ‘’ది గ్రీన్ బో ‘’అనే రెండు కవితా సంపుటులను కూడా ఫాక్నర్ రాశాడు న్యు క్ర్తిటిక్స్ కు ఆయన ఆరాధనీయుడు .. He donated part of his Nobel money “to establish a fund to support and encourage new fiction writers”, eventually resulting in the PEN/Faulkner Award for Fiction, and donated another part to a local Oxford bank, establishing a scholarship fund to help educate African-American teachers at Rust College in nearby Holly Springs, Mississippi. The government of France made Faulkner a Chevalier de la Legion d’Honneur in 1951.

   పోస్త్మాస్తర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పై అధికారులకు ఆయన రాసిన ఉత్తరం ఎలా ఉందొ చూద్దాం – As long as I live under the capitalistic system, I expect to have my life influenced by the demands of moneyed people. But I will be damned if I propose to be at the beck and call of every itinerant scoundrel who has two cents to invest in a postage stamp.

This, sir, is my resignation.

Inline image 1   Inline image 2Inline image 3Inline image 4

Inline image 5

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఫాక్నర్ అంతగా ప్రసిద్ధి చెందక పోయినా ఆయన గురించి జనం బాగా చెప్పుకొనేవారు .ఆయన డార్క్ మేజిక్ ,దెయ్యాలు రిరిగే తీర భూముల  భీకర అందాల గురించి చర్చించుకొనేవారు .ఆ ప్రదేశం ఎందుకు దెయ్యాల ఆవాసభూమి అయిందో పాల్క్నర్ ఎప్పుడూ విడమరచి చెప్పలేదు కాని చావు ,పతనం ఆయన రాసిన వాటిలో ఉన్నాయి .అందుకే ఆయన రచనలు ‘’dark grandeur of destruction ‘’అని పించాయి .ఆ భూములు వాటి యజమానులు బానిసత్వం వలన బలసి పోయారని అన్నాడు .అరిస్టాక్రసి ,ధనదాహం తో వాళ్ళు ధైర్యం  గౌరవాలను పోగొట్టుకొన్నారు .దీనిని వ్యతిరేకించే ఆయన, వాళ్ళ ఓటములను కధలుగా చెప్పాడు .వాళ్ళందరూ శాపోపహతులు అంటూ ఫాక్నర్ ‘’this whole land the whole of South is cursed ‘’అన్నాడు అందులోని పాత్ర మెక్ కాల్సిం ‘’అక్కడి నుంచి వచ్చిన మేమంతా నల్లవాళ్ళు తెల్ల వాళ్ళు పోషింపబడి ఆ శాపం లోనే ఉండిపోయాం ‘’అని అరుస్తాడు .

32 వ ఏట ఇద్దరుపిల్లల తల్లి ఎస్టెల్లా ఓల్డ్ హాం ఫ్రాంక్లిన్ ను పెళ్ళిచేసుకొన్నాడు .ఈ పెళ్లి వలన ఒక శిశువు పుట్టి చనిపోయింది .తర్వాత కూతురు జిల్ పుట్టి ఆయనకు గర్వ కారణమైంది .తరువాతి నవల ‘’ఆస్ ఐ లేడైయింగ్ ‘’ను బొగ్గు ప్లాంట్ లో పని చేస్తుండగా వీల్బారో వెనక కూర్చుని రాశానని చెప్పుకున్నాడు .ఇందులో బంద్రెంస్ అనే పేద తెల్ల వాడి గురించి ఆడీ బ్రన్దేన్ అనే కొండ జాతి అమ్మాయి గురించి ,ఆమె కుటుంబ బాధలగురించి ,ఆమె శరీర మాంసం శిధిలమై పోతుండా గా ఆమెను జెఫర్సన్ సేమిటరికి చేర్చటం , ఆమె శరీరాన్ని పీక్కు తినటానికి ఆకాశం లో గద్దలు రాబందులు తిరుగుతూ భయోత్పాతాన్ని కల్పించటాన్ని ఆమె కొడుకు పిచ్చివాడిగా మారటం భర్త పెట్టుడు పళ్ళ తో తనకు  భార్య శవాన్ని పూడ్చటానికి పలుగూ పారా అప్పుగా  ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం  పరమ హృదయ విదారకంగా రాశాడు ఫాక్నర్ .విషయం నిరాసక్తమైనదే అయినా ఆయన నిర్వహించిన తీరుతో అది ,గుండెలోకి సూటిగా దూసుకుపోయే శబ్దజాలం తో ,ముడి కవిత్వంతో ‘’బాక్ వుడ్స్ ఎపిక్ ‘’అయింది .సమాప్తానికి ముందు అందులోని ఒక పాత్ర మానవుని నిష్ప్రయోజకత ను వ్యక్తీకరిస్తుంది ఇది ఫాక్నర్ గొంతు అని భావం అని మనం గ్రహించాలి-అతడే మన్నాడో ఆ పాత్ర మాటల్లో ఇంకా గొప్పగా ఉంటుంది చూడండి –‘’ How do our lives ravel into the no wind ,no sound ,the weary gestures wearily recapi tulant  echoes of ld compulsions with no hand on no strings –in sun set we fall into furious attitudes ,dead gestures of dolls ‘’ఇలాంటి స్టేట్మెంట్ కౌంటర్ పాయింట్ గా ‘’ఇలియట్ రాసిన ‘’హాలో మెన్ ‘’కు దీటుగా అనిపిస్తుంది –ఒక్కసారి ఇలియట్ కవిత్వం లోకి దీనికోసం తొంగి చూద్దాం –

‘’shape without form ,shade without color –paralyzed force ,gesture without motion –remember us –if at all –not as lost –violent souls  but only –as the hollow men –the stuffed men ‘’

వయసు 30 మధ్యలో ఉండగా సీరియస్ నవలల తో విజయం సాధించాలనుకొన్నాడు .’’సాన్ క్ట్యుయరి ‘’రాసి అబ్బే చాలా చీప్ గా కాసులకోసం కక్కూర్తి గా రాసినట్లుంది   అనుకొన్నాడు .నమ్మ శక్యం కాని దృశ్యాలు హింసాత్మకంగా ,వేశ్యా గృహం లో పూర్తిగా జరిగే కధగా దారుణ వాస్తవికంగా రాశాడు .ఇది కూడా అతని సౌత్ లాండ్ లో జరిగే నిత్య కృత్య రేపులు ,దిగాజారుడులే .సెన్సార్ వాళ్ళు కత్తెర వేశారు కాని కనక వర్షం కురిపించింది .దీన్ని అదనుగా తీసుకొని హాలీ వుడ్ స్క్రీన్ ట్రీట్ మెంట్ రాయటానికి ఆహ్వానించింది .అక్కడ కద అంతా మారి పల్చనై ‘’ది స్టోరీ ఆఫ్ టెంపుల్ డ్రీకర్ ‘’గా విడుదలైంది .మిగిలిన కొన్ని కధలను సినిమాలు తియ్యటం కోసం ఆయన్ను పెట్టుకొన్నారు .డబ్బు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చలో హాలీ వుడ్ .కనుక బతకటానికి వేరే ఉద్యోగం అక్కర్లేకుండా పోయింది .పోస్ట్ మాస్టర్ గా ఎలా నిర్వాకం చేశాడో ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ గా అలానే చేశాడు .ఒక దానికి స్టూడియో లో కాకుండా ఇంటి దగ్గరే రాయటానికి అనుమతి తీసుకొన్నాడు .ఈయన అద్దెకున్న ఇల్లు వెదికి  డైరెక్టర్  వెడితే మనవాడు మిసిసిపి కి జంప్ జిలానీ అయ్యాడని తెలిసి పర్మిషన్ అడగటం ఒక సాకు మాత్రమే అని అర్ధమైంది .

   పూర్తిగా ఊహా ప్రపంచాన్ని సృష్టించాలన్న కోరికతో ‘’యాక్న పటా వాఫా ‘’సాగా సీరియల్ గా రాయ దలచి అతి భీకర ,మహా విపత్ భరిత ,అత్యంత వేదనా భరిత నవల ఇది వరకెన్నడూఅమెరికాలో  రాయని విధంగా రాశాడు .అందులో ‘’లైట్ ఇన్ ఆగస్ట్ ‘’లో కుళ్ళి శిధిలమై పోతున్న నాగరకతను కళ్ళకు కట్టించాడు .ఇందులో రెండుకధలున్నాయి ఒకటి గర్భిణి అయిన ఒక పర్వత ప్రాంత అమ్మాయి కడుపులోని బిడ్డకు తండ్రి అయిన వాడిని వెదకటం ,సెక్స్ కోరికలతో సతమతమవుతూ నీగ్రోలకు సాయం చేసే తన ప్రేమ గూడులో చిక్కిన ఒక కుర్ర వాడిని చెడగొట్టి తానూ నాశనం అయ్యే  ఒక ముసలి మెయిడ్ కద..’’అబ్సలాం అబ్సలాం ‘’అనేది ఒక మేలో డ్రామా ఇందులో కోరిక ,సమ్మోహన బుద్ధి ,వావి వరసలు లేని శృంగారం లతో పతనమైన ఒక  వంశ చరిత్ర ఉంది .కధను అనేక పాత్రలద్వారా అసందర్భంగా చెప్పించినా నిర్మాణం వెనుకా ముందూ ప్రస్తావన లతో ఫాక్నర్ లోని ద్వైవీ భావాన్ని బయట పెడుతుంది .మానవత్వ  హుందాతనంతో పాటు నీగ్రో ,అన్నా ఆమె అన్నా అయిష్టత గోచరిస్తుంది ‘’ది అన్ వాన్క్విషెడ్’’లో మరో కుటుంబ కద ఉంది  ,రాసిన  ప్రచురితమైన అనేక కధలలో తన తాత గారి వ్యక్తిత్వ ఆరాధనా ఆయన ‘’సార్టోరిస్ ‘’వంశానికిచెందిన వాడుగా నిలబెట్టాడు .’’వైల్డ్ పామ్స్ ‘’ది హామ్లెట్ ‘’,ఇంట్రూడర్ఇన్ ది డస్ట్ ‘’మొదలైనవి ఈ  శ్రుమ్ఖలానికి చెందినవే .మాల్కం కౌలీ ‘’ది పోర్టబుల్ ఫాక్నర్ ‘’లో ‘’part of the same living pattern .In this pattern and not the printed volumes in which part of it is recorded that Faulkner ‘s real achievement ..he has little need to construct .,he needs only to call upon what is already waaiting for him ‘’అంటూ చక్కగా చెప్పాడు .

  50 వ ఏట ఫాక్నర్ జాతీయ వ్యక్తి అయ్యాడు .ప్రముఖ రచయితగా గుర్తింపు పొంది రచయితల సంఘాలకు ,సాహిత్య సమావేశాలకు దూరమైనాడు .విమర్శను దూషించేవాడు కాదు .న్యు క్ర్తిటిక్ ల పై యే అభిప్రాయం ఆయనకు లేదు .కళా ఈస్తెటిక్స్ మొదలైన వాటికి దూరంగా ఉండేవాడు ‘’నేనొక సామాన్య రైతును.ఏదో అప్పుడప్పుడు కధలు రాస్తాను  ‘’అని చెప్పుకునేవాడు .ఈ రైతు రచయిత కే ఎంతో విశిష్టమైన నోబెల్ సాహిత్య బహుమతిని నవంబర్ 1949 లో అందజేసి గౌరవించింది నోబెల్ పురస్కార సంస్థ .ఈ వార్తను  భార్య ఆయనకు చెప్పేదాకా తెలియనే తెలియదు .

Inline image 1  Inline image 2Inline image 3

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్

టి ఎస్ .ఇలియట్ లాగా విలియం ఫాక్నర్ ‘’అతి ‘’వలన  పరాజయం పొందిన ,దాని అపరాధానికి అంతమైన ,దాని గర్వానికి,మాయ నటనకు  నాశనమైన,శిధిలమవుతున్న ప్రపంచం లో ఎదురు చూపులు చూస్తూ ,చావును కోరుకొంటూ బతికిన వాడు . ఇలియట్ లాగానే రాసిన శక్తివంతమైన కొన్ని ,ఆకాలపు పెసిమిస్టిక్ సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందాడు .ఇలియట్ లాగా కాకుండా తను పుట్టిన  తనకు అన్నం పెట్టిన మట్టినే నమ్మి తాను  ఎంచుకొన్న తన ‘’ఊసర క్షేత్రం ‘ సౌత్ లాండ్ ను ’ పండించే ప్రయత్నం చేస్తూ ,జన్మ భూమిని ,సంస్కృతిని ,పౌరసత్వాన్ని ఎప్పుడూ నిందించని వాడు ఫాక్నర్ .

     25-9-1897 న నలుగురు సోదరులలో పెద్దవాడుగా అమెరికా లో న్యు ఆల్బనిలోని మిసిసిపి లో పుట్టాడు .బాల్యం లోనే తండ్రి’’ గౌరవ మర్యాదల ‘’ కోసం హత్య చేయ బడ్డాడు .తాతగారు చేయించిన ఈ ఘాతుకం లో ఎవరూ చావ లేదు.తల్లి కుటుంబాన్ని యూని వర్సిటి టౌన్ ఆక్స్ ఫర్డ్ కు మార్చింది .కుటుంబం లో ఈ హత్యలు మామూలే .ఫాక్నర్ తాత విలియం కూబర్ట్ ఫాక్నర్ చాలా ఊహా ప్రపంచ జీవితం గడిపాడు .14 వ ఏటనే ఇంట్లోంచి పారిపోయి ,మెక్సికన్ యుద్ధం లో చేరి ,కెప్టెన్ గా తిరిగొచ్చి ,లా చదివి ,చిన్ననాటి స్వీట్ హార్ట్ ను పెళ్ళాడి ,సివిల్ యుద్ధకాలం లో ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పరచి ,యుద్ధం తర్వాత గొప్ప లీగల్ ప్రాక్టిస్ చేసి 40 లో  ప్రసిద్ధుడయ్యాడు  .50 నాటికి లెజేండరివ్యక్తీ అయి ,ఒక బ్యాంకర్ తో భాగస్వామి అయి ,రైల్ రోడ్ నిర్మించి ,రచయితగా పేరు పొంది ‘’వైట్ రోజ్ ఆఫ్ మెంఫిస్ ‘’’’లిటిల్ బ్రిక్  చర్చ్’’,లను ‘’అంకుల్  టామ్స్ కేబిన్ ‘’కు దీటుగా రాసి స్టేట్ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు .ఈ బహువిధ జీవన వ్యాపారం తన భాగస్వామితో జరిగిన పోట్లాటలో ద్వేషంగా మారి కాల్చిఆయన్ను  చంపి పారేసేదాకా వచ్చింది .అందరూ తాతను కల్నల్ అని పిలిచేవారు ఆయనే ఫాక్నర్ కు ఆదర్శం .తాను  రాసిన నవలలో కధల్లో ఆ పాత్రను అద్భుతంగా పండించాడుకూడా .

  తాతకాలం నుండి కుటుంబాని గౌరవ ప్రఖ్యాతులు పుష్కలంగా ఉండేవి  .ఫాక్నర్ తండ్రి  స్వంత   ఫామిలి రైల్ రోడ్ కు కండక్టర్  . ఫాక్నర్ గతకాలపు స్మృతులలో తేలుతూ వర్తమానాన్ని పట్టించుకొనే వాడు కాదు .స్కూల్ లో చదవటం ఇష్టం ఉండేదికాదు .హైస్కూల్ చదువు కూడా పూర్తీ చేయలేదు .చదువులో దిశా నిర్దేశం లేక ,తప్పుల్ని సరిదిద్దేవారు లేక చాలా అతిశయం తో కీట్స్ కవి స్వచ్చ రోమాన్టిజం నుంచి ఫ్లాబర్ట్ రియలిజం  దాకా దేకాడు.యవ్వనం లో ఉన్నప్పుడే కవిత్వం రాశాడు .మొ .ప్ర .యుద్ధం ప్రారంభమవగానే విమాన దళం లో చేరాడు .అమెరికా వాయుసేన విమానాలు నడపటానికి తిరస్కరించాడు .’’యాంకీల ‘’బాసిజాన్ని నిరసించే భేషజం ఉన్నవాడు .21 వ ఏట బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ లో చేరి ,ఫ్రాన్స్ యుద్ధం లో గాయపడి ,యుద్ధం పూర్తీ అయినా ఫ్లైట్ ట్రెయింగ్ లోనే ఉండి ,తాను  గొప్పలు చెప్పుకొనే గాయం యుద్ధం లో కాక ఆర్మిస్టిక్ డే ఉత్సవాలలో తగిలిన గాయమే అది అని తెలిస్తే ఎవరైనా  నవ్వి పోతారు .’’నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ‘’రకం .

   ఆక్స్ ఫర్డ్ లో చేరి చిన్నఇంటికి పెయింటింగ్ ,కప్పు బాగు చేత ,కార్పెంటరి ఉద్యోగాలు చేస్తూ బతికాడు .అప్పుడే రైతులు ,కౌలు దార్లు నీగ్రోలు చెప్పిన అనేక కధలను విన్నాడు వాటిని సేకరించాడు .అనేక పుకార్లు నమ్మాడు .మళ్ళీ ఒకసారి బడి చదువు ప్రయత్నం చేశాడు ఆక్స్ ఫర్డ్ లో మిసిసిపి యూని వర్సిటి లో చేరి లెక్కలు ఇంగ్లీష్ లలో తప్పి ,రెండో ఏడాది చదవకుండానే బయటికొచ్చాడు .యూని వర్సిటి లో ఉన్న మిసిసిపి రచయిత స్టార్క్ యంగ్ ఫాక్నర్ ఆశించేది న్యు యార్క్ లో దొరుకుతుంది అని సలహా ఇవ్వగా  ఉత్తరానికి వెళ్ళాడు .అక్కడ ఏమీదోరకలేదు .యాంగ్ తో కలిసి ఉండి గ్రీక్ హోటల్ లో బొచ్చెలు కడిగి ఏవో  కొన్ని రాళ్ళు సంపాదిస్తూ ,డిపార్ట్మెంట్ స్టోర్స్ లో పుస్తకాలు అమ్ముతూ గడిపాడు .ఆరు నెలల  పస్తుల బతుకు తర్వాత తన స్వగ్రామం ఆక్స్ ఫర్డ్ లో పోస్ట్ మాస్టర్ గా పని చేద్దామని తిరిగొచ్చాడు .ఏ పని సమయానికి చేసేవాడుకాడు .ఉత్తరాలు సార్ట్ చేయాలంటే బద్ధకం .అకౌంట్ పుస్తకాలు జాగ్రత్తగా నింపటం ,,రికార్డ్ లను భద్ర పరచటం లో అలసత్వం చూపుతూ తన ఇష్టం వచ్చినప్పుడు పోస్టాఫీస్ ను తెరుస్తూ మూస్తూ పబ్లిక్ సంగతి పట్టించుకోకుండా చెత్త పోస్ట్ మాస్టర్ అనిపించుకొన్నాడు .కస్టమర్లు పైకి ఫిర్యాదు చేయగా రాజీనామా ఇచ్చేశాడు ‘దీనిపై రాస్తూ ‘’I am glad I will no longer have to be at the beck and call of any  one who happens to have two cents ‘’అన్నాడు .

   రెండేళ్ళు వ్యవసాయం ,చేపలుపట్టటం , వేట  చేసి 27 వ ఏట విసుగెత్తి యూరప్  వెళ్ళాలనుకొని న్యు ఆర్లియన్స్ చేరాడు .తనకిష్టమైన చిన్నకదా రచయితా షేర్ వుడ్ యా౦డర్సన్ ను కలిసి ,మొదటిసారిగా రచయితలతో కలిసే అవకాశం పొందాడు .’’పార్శియన్ బోహేమియన్స్ ఆఫ్ ది లెఫ్ట్ బ్యాంక్ ‘’ కు బదులుగా  ‘’న్యు ఆర్లియాన్స్ ఫ్రెంచ్ క్వార్టర్ ‘’ఏర్పాటు చేశారు .వీళ్ళ ‘’ది డబుల్ డీలర్ ‘’పత్రికకు ,సిటీలో పేరున్న మరో పత్రిక కు ‘’మస్క్విటోస్’’అనే సెటైర్ ను ‘’సోల్జర్స్ పే’’అనే అనే ఉడుకు రక్తపు రిపోర్ట్ రాశాడు ,హీరో హీరోయిన్ లు లేకుండా రాశాడు .పెద్దగా క్లిక్ కాలేదు కొన్ని చిన్న కధలు రాసి అమ్మాడు .రచనతో పొట్ట గడుపులేను అనుకొన్నాడు .’’సార్టారిస్’’,’’ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ ‘’లలో తన సొంత సాహిత్య సీమను సృష్టించుకొన్నాడు.ఒక ఊహా దేశం ‘’యోక్న పటా వఫా’’ సృష్టించు కొన్నాడు  ..ఇదే అసలైన అమెరికన్ ఆదిమానవుల యోకనా రివర్ పేరు .ఒకప్పుడీ ప్రాంతం బంగారు పంట పండిన ప్రదేశం ,ఇప్పుడు భవంతులతో పాట సంస్కృతీ వినాశనం తో వెల వెల పోతోందని భావించాడు  .ఎస్టేట్లు ,నాశనమై తెల్లబంగారం అనబడే పత్తి క్షేత్రాలు కనుమరుగై ,రైతుల నడుములు విరిగి ,అవినీతి నిలయమైన పట్టణాలతో ,చిత్తడినేలలు ,అడవులతో అమెరికన్ యూనియన్ లో  అత్యంత పేదరిక ప్రదేశమైనందుకు బాధ పడ్డాడు ఫాక్నర్ .అచ్చంగా ‘’వేయి పడగలు’’ నవల లో విశ్వనాధ పడిన ఆవేదనే పడ్డాడు ఫాక్నర్ .

     ఈ సౌండ్ అండ్ ఫ్యూరీనవల ఫాక్నర్ రచనలలో ఉత్కృష్ట మైనదిగా ,చెదిరిన సంస్కృతీ విలసిననానికి దర్పణంగా  బావిస్తారు అతని రచనా పాటవానికి అబ్బుర పడతారు ‘’లైఫ్ బీయింగ్ యే టేల్.టోల్డ్ బై యాన్ ఇడియట్  సిగ్ని ఫైయింగ్ నధింగ్ ‘’అన్న షేక్స్ పియర్ సూక్తికి ఇది సజీవ నిదర్శనం .ఫాక్నర్ శీర్షికతో నే కాకవిధానం తో కూడా చదువర్లు దారి తప్పారు .సామాన్య వివరణ కు భిన్నంగా దీన్ని రాయటం అతని ప్రత్యేకత.’’Faulkner  disrupted the usual sequence of events ,he juggled the sections to show the violent disintegration of a family sharpened characterization by the use of interior monologs in the Joycean ‘’stream of consciousness ‘’and made time seem as way ward as the mind of the idiot Benjy Compson  the symbol of ultimate ruin .’చాలా మంది ఈ విధానం అస్పష్టం అని వెనక నుంచి చదువుకోవాలని మళ్ళీ మళ్ళీచదివితే కాని బుర్రకు ఎక్కదు అన్నారు .దీనికి భిన్నంగా పెద్ద పెద్ద సిటీల జనం అతని  శైలీపరిణతికి  నిశ్చేస్టు లయ్యారు .  రాత లోని దూకుడు ,దాని ప్రభావం అనిర్వచనీయం .అంతకు ముందు కాని ఆ తర్వాత కాని ఈ పుస్తకం ప్రజల మనసులలో దూరినంత గా, యే పుస్తకం చేరలేదు .’’It presented a marvelous and unprecedented amalgam of innocence and depravity of sick delusions maturity ‘s yearning for the security of early family affection ,and child hood ‘s memories lost in hopeless longings or as in the case of Benjy twisted into madness ‘’

Inline image 1 Inline image 3

Inline image 2
         సశేషం

             మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-3(చివరి భాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్3(చివరి భాగం)

  అమెరికాకు తిరిగొచ్చాక తాను  ఏదో ప్రశాంతమైన స్థలం లో ఉండి తనమనసులో ఉన్న విషయాలపై రచన సాగిస్తానని ప్రకటించాడు ఫిట్జెరాల్డ్ .మళ్ళీ నిలకడ లేనితనం ,బాధ్యతారాహిత్యం తో ఉండి పోయి పదేళ్లకు కాని ఏదీ రాయలేక పోయాడు .హాలీఉడ్ కు ఆఫర్ వచ్చి’’ బంగారు లప్ప ‘’ఏదో దొరుకు తుందని తిరస్కరించకుండా వెళ్ళాడు .అక్కడా పార్టీల హోరు  ప్రాక్టికల్ జోకుల తో యే పనీ చేయలేదు .ముడ్డి మీదకు ముప్ఫై ఏళ్ళు వచ్చినా పాత పధ్ధతి మారక ‘’ఆడాల సెంట్ స్థాయి’’ నుంచి ఎదగ లేదు .’’తాగు బోతు  నాయాల’’గానే ప్రవర్తించాడు .కాన్స్తాంట్ టల్మాడ్గే అని జాజ్ యుగపు విఫల వ్యక్తిపై కద రాస్తే  తిరస్కరిస్తే భార్యతోకలిసి తూర్పుకు వెళ్లి డేలావార్ విల్లింగ్టన్ దగ్గర  ఒక పాత ఇంటిని కొని ఇంటినీ వ్యవహారాన్ని బాగు చేసుకొని బాగున్నారు  .విదేశాలలో ప్రారంభించిన కొత్తనవల దాదాపు ఇక్కడ పూర్తీ చేశాడు .కొంప చాలా పెద్దదవటం నిర్వహణ కస్టమవటం తో రోజూ జల్దా తో పోట్లాడే వాడు  .ఇరుగుపొరుగు తో నిత్యం తగూ పడేవాడు .పనిలో కూరుకు పోయేవాడు .ఏడాది లోపేదీన్ని వదిలేసి మళ్ళీ పారిస్ చేరారు .వయసు పెరిగి ఇక డాన్స్ చేయలేక జేల్డా తన వ్యాపకం ఏదో చూసుకోవాలని అనుభవం లేక పోయినా 28 ఏళ్ళకు ప్రొఫెషనల్ బాలెట్ డాన్సర్ అయింది .అంతకు ముందు ఏడాది ఫిట్జెరాల్డ్ రాబడి సుమారు ముప్ఫై వేల డాలర్లు .అయినా గురుడు అప్పుల అప్పారావే అయ్యాడు .తరువాత రెండేళ్ళు యూరప్ ,అమెరికాల మధ్య ఆసులో గొట్టం లాగా తిరిగాడు .జేల్డా ఉత్సాహం తెచ్చుకొని వ్రుత్తి లో నిలబడితే అయ్యగారు మొరోజ్ గా తన పాత కదల రిపేర్ లో పడ్డాడు .భార్యపైనా తనపైనా ఇర్రిటేషన్ఆపుకోలేక తరచుగా డిప్రెషన్ లో పడి కయ్యానికి కాలు దువ్వుతూ మానసిక క్షోభ పడుతూ ఆమెకూ కలిగించి ,ఇక తగ్గడు అన్నట్లుగా ప్రవర్తించాడు. జేల్డా డాన్సర్ గా ఫెయిల్ అయి,బాగా దెబ్బ తింది.1930 లో ఆమె బాగా కుంగి పోయింది .స్విట్జెర్లాండ్ లో మానసిక చికిత్స కోసం ఆమెను తీసుకు వెళ్ళాడు .ఆమె ‘’స్కిజియో ఫ్రేనేక్ ‘’తో బాధ పడుతున్నట్లు నిర్ధారణ అయింది .ఇక జీవితాంతం  మానసిక దెబ్బతిన్న ఆమెను కని పెట్టుకొని ఉండాల్సిన స్థితి కలిగింది .శానిటోరియంలలో కొంత నయమని పించినా మళ్ళీ తిరగ బెట్టేది .పూర్తిగా ఎప్పుడూ కోలుకొనే లేదు .అయనా ఆమె ఇంటలిజేంస్ లెవెల్ ఏమాత్రం తగ్గలేదు .1932 లో బాల్టిమోర్ హాస్పిటల్ లో చేర్చాడు .ఈ హాస్పిటల్ లో ఉండగానే అక్కడ జరిగిన అగ్నిప్రమాదం లో జేల్డా మరణించింది .

          1932  లో ఆల్కహాల్ బానిసత్వంనుండి బయట పదాలనుకొన్నాడు .కాని మందు ఎందుకు తాగాడో కారణాలు బాగా చెప్పటం ప్రారంభించాడు .ఒక స్నేహితుడి తో పోట్లాడి ,డిప్రెషన్ లో తనంతకు తానే   స్నేహితులు లేనిలోకం లో  జీవించసాగాడు .హెమింగ్ వే గురించి చెబుతూ ‘’ఆతను ఎప్పుడూ విజయాల గురించే గట్టిగా చెబుతాడు  .నేను సాధికారికంగా ఓటముల గురించి చెబుతాను ‘’అన్నాడు .ఏదో విధంగా తంటాలు పడి తొమ్మిది చిన్న కధలు గిలికాడు .ఎక్కువ ధర కావాలని డిమాండ్ చేయలేదు .ఇప్పటిదాకా రాసిన పుస్తకాలపై  రాయల్టీ లు ఇప్పటికి సున్నకు సున్నా  హళ్లికి హళ్ళి.’’టెండర్ ఇన్ ది నైట్ ‘’1934 లో కొన్ని వేలకాపీలు మాత్రమె అమ్ముడయ్యాయి .విమర్శకులు సానుభూతి చూపకుండా దారుణంగా విరుచుకు పడ్డారు .చదువరులు మాత్రం దెబ్బతిన్న సమాజాన్ని బాగా చూపించాడని భవిష్యత్తుపై ఆశ కల్పించాడని అనుకొన్నారు .’’All gods dead ,all faith in man shaken ‘’అని రాస్తూ సి హార్ట్లి గ్రాటేన్ ‘’the feverish beauty of a class  in decay ,the polished charm of a decadence that is not yet self conscious ‘’అన్నాడు . ‘’the story of a psychiatric husband and a psychoneurotic wife who ruin each other ‘’అనిపిస్తుంది ఇలియట్ తన వేస్ట్ లాండ్ తో పోల్చాడు .టెండర్ ఈజ్ ది నైట్ లో గుండెపగిలే  బుర్ర తిరిగే సంఘటనలు ఉన్నా ,ఆదుర్దా అలసట లు ఉన్నాయి వీటినే ఫిట్జెరాల్డ్ ‘’ఎమోషనల్  దివాలాతనం ‘’అన్నాడు .ఇదే ప్రతి చోటా కనిపిస్తుంది .

  38 వ ఏట పాత ట్రాక్ నుంచి దారిమార్చుకొని ఇదివరకెప్పుడూ ప్రయత్నించని విధానం లో 19 వ శతాబ్దపు హిస్టారికల్ రోమాన్స్ ‘’ది కౌంట్ ఆఫ్ డార్క్ నెస్ ‘’రాశాడు .9 లో ఇదివరకు అచ్చుకాని కధలను పోగేసి ‘’టాప్స్ ఎట్ రివెల్లి ‘’పేరుతొ ప్రచురించాడు .పసలేని పుస్తకం అయింది .విమర్శకులు విపరీతంగా విరుచుకుపడి ‘’దారుణం అలా ఉండ కూడదు ‘’అన్నారు .నలభై వ పడి లో ఫిట్జెరాల్డ్ తన పని అయిపోయి౦దనుకొన్నాడు .ఇప్పుడు రాసిన కధలు ఇది వరకేప్పుడూ లేనట్లు గా తిరిగొచ్చాయి .నిరాశా నిస్పృహలతో జీవిత చరిత్ర శకలాలు రాస్తున్నాడు .తాత్కాలిక ఉపశమనానికి రక్షణకు మళ్ళీ హాలీ వుడ్ వెళ్ళాడు .41 ఏడు సమీపిస్తుండగా నలభై వేల డాలర్లు బాకీ పడ్డాడు .అసలే ‘’లాస్ ‘’అయి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి ‘’లాస్ ఏంజెల్స్ ‘’వెళ్ళాడు .కొత్త ఆశ కొత్త జీవితం కొత్త మాధ్యమం కోసం ఎదురు చూశాడు .కాని ‘’వెనకటి గుణ మేల మాను వినరా సుమతీ ‘’అన్నట్లు పాత కద మళ్ళీ మొదలెట్టి తాగి తందనాలాడాడు .సృజన పోయి అవతలి వాడి రచనలకు మార్పులూ చేర్పులూ చేస్తూ గడిపాడు .కాని అయ్యగారి ట్రీట్ మెంట్ స్పందన కలిగించ లేక పోయింది .తను ఎంతో గొప్ప రచన అనిగర్వంగా  చెప్పుకొనే ఒక నవలను హాలీ వుడ్ జనం పూర్తిగా మార్చేసి ఫిట్జెరాల్డ్ సంభాషణలలో కిక్  ,వినోదాలు లేవని ’’ డై’’లాగులు’’ ‘’కుట్టారు .అతని గౌరవం ఒక్క సారిగా కూలి పోయింది .పబ్లిక్ అతన్ని అసలు పట్టించుకోవటం మానేశారు .అతనితోపాటు స్క్రిప్ట్ రైటర్ గా ఉన్న బడ్ శుల్ బెర్గ్ ‘’స్కాట్ ఫిట్జేరాల్డా 1 అతడు చనిపోయాడను కొన్నాను ‘’అన్నాడు అదీ హాలీవుడ్ లో ప్రముఖ రచయిత ఫిట్జెరాల్డ్ పరిస్తితి .అతని ఏజెంట్ లు  ఫిట్జెరాల్డ్  ఏదీ రాయ లేదని ,స్వయం గాఇక  ఏదీ రాయలేడని కధలకు అడ్వాన్స్ లు ఇవ్వటం మానేశారు.హాలీ వుడ్  లో ఉద్యోగం ఏది రాదు .హాలీవుడ్ లో ఏదీ రాకపోయినా ‘’ఆల్కహాల్ ‘’లో అన్నీ ఉన్నాయని తెగ తాగి అందరి చేత ఛీ కొట్టి౦చు కొంటూ ,మనిషి కనిపిస్తే పురుగును చూసినట్లు దూరం పారి పోతూ వెగటు పుట్టించే స్థితి కొని’’ సారీ ’’ ‘’తాగి’’ తెచ్చుకొన్నాడు .’’నేను ముసలివాడినై జబ్బు తో ఉన్నాను ‘’అని ఫిర్యాదు చేశాడు .నలభై మూడు కే ముసలి తనం ! విడ్డూరం .ఈ హాలీవుడ్ భాగోతాన్ని బయట పెడుతూ ఒక నవల రాయాలని ప్రయత్నం లో ఉండివందలాది విషయాలను నోట్ చేశాడు .

  1940 లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది .భయ పెట్టింది కాని ధైర్యం తెచ్చుకొని ఆ హాలీవుడ్ నవల పై మళ్ళీ ద్రుష్టి పెట్టాడు .దీనికి ‘’ది లాస్ట్ టైకూన్ ‘’పేరుపెట్టాడు కాని పూర్తీ చేయలేక పోయాడు .దీన్ని అత్యంత విస్తృతంగా మనసు పొరల్లోకి దూసుకు పోయేట్లు రాయాలనుకొన్నాడు .’’I want to write scenes that are frightening and inimitable ‘’అని చెప్పుకొన్నాడు .మరో నెలకు మరో సారి విపరీతమైన గుండె జబ్బు వచ్చి21-12-1940  న 44 దాటిన మూడు నెలలకే స్కాట్ ఫిట్జెరాల్డ్ చనిపోయాడు .

ఫిట్జెరాల్డ్ లాగా యే రచయితరచనా ,జీవితం ఒకటై భాసి౦చలేదు .ఎక్కడ తనకద ముగిస్తాడో ఎక్కడ లేజేండరి పాత్ర ప్రారంభిస్తాడో తెలీకుండా రాసే నేర్పు అతనిది .వేది౦పబడిన రచనా సృష్టికర్తను ,సంతోషం లేని పాత్రలనుండి వేరు చేయలేము .ఆతను అతని ఫిక్షన్ ఫిగర్లు పరిణతి చెందని కలల బేహారులు  విజయం పొందినప్పుడు పొందిన ఆదుర్దా ,అపజయం లో వేదన లను ఒకే తీరున పంచుకొంటారు .హాలీ వుడ్ కు వెళ్ళక ముందు ‘’ఎందుకు నేను వ్యధను కోరుకు న్నానో  వేదన పొందానో ఆలోచించటానికే  ,విచార భావం విచార ప్రవర్తన ,ట్రాజెడీ పై ట్రాజిక్ ప్రవర్తన ,ఎందుకు నేను నా భయానక పరిస్థితి ,జాలి,దయల తో ఏకీభవించి పోయానో ఆలోచించటానికే నేను  పూర్తీ ప్రశాంతతను కోరాను’’అని చెప్పాడు  .ఫిట్జెరాల్డ్ చనిపోయే నాటికే అతని రచనలన్నీ ప్రచురితమైనాయి ‘

అయిదేళ్ళ తర్వాత ఫిట్జెరాల్డ్ ను మళ్ళీ కనుగొని ఆవిష్కరించారు .ఫిట్జెరాల్డ్ తిరిగి రాక ఎడ్మండ్ విల్సన్ ఎడిట్ చేసిన ‘’ది క్రాక్ అప్ ‘’ప్రచురణ తో జరిగింది .ఇందులో అత్యంత స్వీయ ఒప్పుకోళ్ళు,వ్యాసాలూ ,నోట్స్ ,ప్రక్షిప్తాలు ,కూతుళ్ళకు ప్రేమ ఆప్యాయతా ఉట్టిపడేలా రాసిన ఉత్తరాలు ఉన్నాయి .దీని తర్వాత డోరోతి పార్కర్ ఎడిట్ చేసిన ‘’ఎఫ్ .స్కాట్ .ఫిట్జెరాల్డ్ –ది మాన్ అండ్ హిస్ వర్క్ ‘’1950 లో వచ్చింది .అతని గ్రేట్ గాట్స్ బి నవల వ్యక్తీ సంక్షోభానికి అదే విశ్వవ్యాప్త సూత్రతకు డాక్యుమెంట్ గా నిలుస్తుంది

 ఫిట్జెరాల్డ్ ప్రభావం ఆయన మొదటి రచన ప్రచురణ అయిన నాటి నుంచే ఉంది .గాట్స్ బి నవల చదివి ఇలియట్ ఆయనకు ఉత్తరం రాస్తూ హెన్రి జేమ్స్ తర్వాత అమెరికన్ ఫిక్షన్ ను పండించిన వాడు అతనే అన్నాడు   Don Birnam, the protagonist of Charles Jackson‘s The Lost Weekend, says to himself, referring to The Great Gatsby, “There’s no such thing … as a flawless novel. But if there is, this is it.”[53] In letters written in the 1940s, J. D. Salinger expressed admiration of Fitzgerald’s work, and his biographer Ian Hamilton wrote that Salinger even saw himself for some time as “Fitzgerald’s successor”.[54] Richard Yates, a writer often compared to Fitzgerald, called The Great Gatsby “the most nourishing novel [he] read … a miracle of talent … a triumph of technique”.[55] It was written in a New York Times editorial after his death that Fitzgerald “was better than he knew, for in fact and in the literary sense he invented a generation … He might have interpreted them and even guided them, as in their middle years they saw a different and nobler freedom threatened with destruction.”

21 వ శతాబ్దం లో గాట్స్ బి మొదలైన ఫిట్జెరాల్డ్  రచనలు  మిలియన్ ల కొద్దీ కాపీలు అమ్ముడయ్యాయి .గాట్స్ బి ఎప్పుడూ బెస్ట్ సెల్లర్ గానే ఉంది’ స్కూళ్ళు కాలేజీలలో దాన్ని బోధిస్తున్నారు ఆయన 5 నవలలు , 3 నావేల్లాలు ,10 చిన్నకదా సంపుటాలు రాశాడు .ఆయన నవలలు సినిమాలుగా వచ్చాయి .ఎన్నో సంస్థలు ఆయన పేరు పెట్టి గౌరవించాయి .ఆయన రాత ప్రతులు బహు భద్రంగా భద్ర పరచ బడ్డాయి .

Inline image 1

Inline image 2Inline image 3

సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-7-16- ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్-2

  ‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’అనే పాక్షిక జీవిత చరిత్ర-అంటే కాలేజి జీవితం ,ఖుషీపార్టీలుఅడ్వర్ర్టైజ్ ఏజెన్సీ ,,విఫలప్రేమ ,మూడు వారాల తాగుబోతు దేవదాసు జీవితం అన్నీ కలగలిపి రాసిన రచన  ,అంచనాలకు మించి  విజయవంతం అయింది .విమర్శ మిశ్రమంగా వచ్చింది .అరువు తెచ్చుకొని ,క్షమించరాని తప్పులతో ఉందని  కొందరు అన్నా ,అందులోని ఉత్తేజాన్ని ఎవరూ కాదన లేక పోయారు .’’ ఈనవల లో రచయిత చేయాల్సిన పాపాలన్నీ చేశాడు కాని క్షమించరాని తప్పు ఒకటి ఉంది –అదే బతకటానికి విఫలం కాకూడదని .కాలేజి జీవితానికి చెందిన అత్యంత రొమాంటిక్ ,నిరాశాలను కాచి వడపోసిన అమెరికన్ నవల అని పించుకోన్నది .కొన్ని నెలలలోపే ఈ పుస్తకం అండర్ గ్రాడ్యుయేట్ల ‘’బైబిల్ ‘’అయింది ఆరాధ్యమై కూర్చుంది .నవలా కారుడు ఫిట్జెరాల్డ్ జాజ్ యుగపు ఉడుకు లెత్తే యువ రక్త నాయకుడు అయ్యాడు .స్టాక్ మార్కెట్ స్పెక్యు లేషన్ కు ,రాజకీయ అవినీతికి అది బంగారు కాలం .నిష్ఫలమైన మద్యపాన నిషేధాలు,  బలిసి దొంగ లిక్కర్ తయారు చేసే బడా వ్యాపారులకు అది అంది వచ్చిన కాలం .ఈ యుగానికి ఫిట్జెరాల్డ్ ప్రతినిధి అయ్యాడు –‘అద్భుత భవిష్యత్త్ ఉన్న ’గోల్డెన్ బాయ్ ‘’అని పించుకొన్నాడు .

   చాలా ఏళ్ళ తర్వాత భయంకరమైన బీదరికపు  హద్దులు ,మరీ భయపెట్టే ధన ప్రభావాల గురించి స్వగతాలు రాశాడు .డబ్బు యావ మాత్రం అతన్ని వదలలేదు .అది జేల్డా చుట్టూ తిరుగుతూనే ఉంది .జేబులో గలగలమంటూ డబ్బు ఉంటె ఆమెను ఒక ఏడాది తర్వాత పెళ్లి చేసుకొని  అపనమ్మకం ,వైరాను   దూరం చేసుకొని ,ఒక విప్లవ కారుడిగా కాకుండా రగిలిపోయే రైతుగా ఉండాలనుకొన్నాడు .తనతో బాటే ఉంటున్న తన స్నేహితులకు అంత డబ్బు ఎలా ఎక్కడి నుంచి వస్తోందో  అర్ధం కాలేదు .అంత డబ్బున్న తన స్నేహితులలో  ఎవరికో ఒకరికి  ఆ అమ్మాయిని ఇచ్చి కట్ట బెడితే ?ఇలాంటి ఆలోచనలన్నీ బుర్ర నిండాసుళ్లు తిరుగుతున్నాయి .

         మొత్తం మీద కల నెరవేరి యువ దంపతులై ఒక కూతురు ఫ్రాన్సెస్ ను  కన్నారు. ఆ నిరాశా జనక కాలం లో కూతురు తండ్రి బొమ్మలను ఆరాధిస్తూ గడిపింది .అవి హీరో హీరో యిన్ ల గురించి అతిశయోక్తులకే అతిశయోక్తులు గా ఉన్నాయి .రగిలే యువతకు ప్రతి రూపాలు .బొమ్మల కొలువులో వాళ్ళు రాజు ,రాణి గా ఉండి ఫిక్షనల్ పాత్రలై అలరించాయి .టాక్సీ లపై వీటిని పెట్టుకొని తిప్పుతుంటే న్యు యార్క్ నగర వాసులకు చీమ కుట్టినట్లుగా కూడా లేక పోయింది .ఎవరినీ ఆకర్షి౦ప లేక పోయాయి .అవి కనబడిన ఫౌంటెన్ లలోకి దూకటం ,బట్టలు దాదాపు విప్పుకు తిరగటం డిన్నర్ టేబుల్స్ దగ్గర డాన్సులు చేయటం ,ఫైర్ అలారాలను మోగించటం ,దాని రక్షకులు ఎక్కడ మంటఎక్కడ మంట అంటూ పరిగెత్తుకు రావటం జేల్డా తన రొమ్ముల్ని చూపించి ఇక్కడేఅనటం-ఇదంతా ఒక కౌమారఆటగా అసంబద్ధ ఉల్లాస భరిత కలగా ఫిట్జెరాల్డ్ ప్రతిధ్వనింప జేశాడు ప్రపంచాన్ని జయించిన తర్వాత అలేక్సాండర్, అనుభవించిన దుఖం ,ఒక రోజు ఫిఫ్త్ ఎవేన్యు పై స్వారి చేస్తుంటే విజయం,నష్టాల అసంబద్ధత (పారడాక్స్ )అనుభవించటం ‘’నేను గట్టిగా అరిచాను –కారణం నాకునేను కోరింది  అంతా దొరికింది  ఇంతఆనందం నేను మళ్ళీ పొందలేను అని ‘’రాశాడు .

   పార్టీలకు డబ్బు కట్టాలి చిన్న కధలు బాగానే ఆదాయాన్నిస్తున్నాయి కాని అప్పుల్లో కూరుకు పోయి రాయబోయే ,రాబోయే10 పుస్తకాలను తాకట్టు పెట్టి  పదహారు వందల డాలర్లు ప్రింటర్స్ దగ్గర అప్పు తీసుకొన్నాడు.జేల్డా విపరీత దుబారా ఖర్చు రాబడిని తెలుసుకోకుండా చేస్తున్న అనవసర ఖర్చు భరించలేక  మళ్ళీ తాగుడుకు బానిసై ఇంటికి దూరమై బతుకు తున్నాడు .ఫిట్జెరాల్డ్ దంపతులు స్థిరం గా ఒక చోట ఉండలేక ఊళ్లు ఇల్లు మారుతున్నారు .ఈ కాలపు మొదటివివరాలన్నీ ‘’ఫ్లాపెర్స్ అండ్ ఫిలాసఫర్స్ ‘’అనే చిన్న కదల సంపుటిలో చూపాడు .25 ఏళ్ళ రచయిత కు రావాల్సిన కీర్తి రాలేదు .కాని రెండవ నవల ‘’ది బ్యూటిఫుల్ అండ్ డామ్మేడ్ ‘’డబ్బు పెద్దగా రాల్చక పోయినా గొప్ప అన్వేషణ ఉంది .జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకొని సమాధానం వెతికాడు .విషాదాంతమే అయినా నూటికి నూరు శాతం అర్ధరహితం అన్నాడు విల్సన్..హీరో హీరోయిన్ ఇద్దరూ పరమ డిబాచరర్ లుగా ఉండి,మొదటి నుంచి చివరదాకా యేసీరియస్  పనీ చేయక , ఆ పిచ్చిమాలోకాలు హేతువాడులుగా అనిపిస్తారు .వాళ్ళు సామాన్య జీవితాన్ని స్పర్శించినప్పుడల్లా మానవ వ్యవస్థలు ఏవగి౦పుకలిగే ఫార్స్ గా ,పనికిమాలిన అసంబద్ధమైనవిగా చూపిస్తారు .చివరగా సైన్యం డబ్బు పిచ్చి లోకం ,వ్యాపార ద్రుష్టి లను బహిర్గతం చేస్తారు గౌరవమర్యాదలూ విషయమూ ఏమీ లేకుండానే అని రాశాడు విల్సన్ .

   డిగ్నిటి  మీదవ్యామొహం తో ఫిట్జెరాల్డ్ లాంగ్ ఐలాండ్ లో డబ్బు మంచినీళ్ళ ప్రవాహం లా ఖర్చుచేశాడు .ఒక్క ఏడాది  లోనే 36 వేల డాలర్లు తగలేశాడు.ఇంకో అయిదు వేల డాలర్ల అప్పులో మునిగాడు. అప్పు చేసి పప్పు కూడు అంటే ఏమిటో  రుజూ చేశాడు.’’స్కాట్ గురువు’’ స్కాచ్ తాగి .వెజిటబుల్స్ ‘’అనే నాటకం రాశాడు .అందులో కొంచెం రాజకీయవ్యంగ్య  వాసన ఉండటం తో ఫెయిలయింది .చిన్న కదల రెండవ సంపుటి’’టేల్స్ ఆఫ్ ది జాజ్ ఏజ్ ‘’ విడుదల చేశాడు .ఇందులో ‘’లీస్ ఆఫ్ హాపినేస్స్ ,మే డే ‘’,ది డయమండ్ యాజ్ బిగ్ యాజ్ రిట్జ్ ‘’అనే మూడు కట్టుకధలు -ఫేబుల్స్ ఉన్నాయి .అప్పటికి వయసు 27మాత్రమే .కొన్ని నెలల తర్వాత ఫిట్జెరాల్డ్ లు అన్ని విలాసాలకు దూబరా ఖర్చులకు దూరమవ్వాలని  యూరప్ కు మకాం మార్చారు .ఫ్రాన్స్ లో జేల్డా ఒక యువ ఫ్లయర్ తో ప్రేమాయణం సాగించింది .ఫిట్జెరాల్డ్ అహం దెబ్బతిన్నా ,అతని ప్యూరిటన్ భావాలకు విఘాతం కలిగినా నోరు మెదపలేక పోయాడు దీనివలన తాను పరిణతి చెందానని అనుకొని పబ్లిషర్ కు జాబు రాస్తూ ‘’నేను చాలా అసంతృప్తి తో ఉన్నాను .కాని నా పనికి ఆటంకం లేదు .నేను ఎదిగాను ‘’అని రాశాడు .రోమ్ కు చేరారు .అసహనం పెరిగిఅందరితో పోట్లాడుతూ  ఫిట్జెరాల్డ్ఒక  టాక్సీ డ్రైవర్ తో తగాదా పడి వాడిని కొట్టి దెబ్బలు తిని  అరెస్టయి జైలు కు వెళ్ళాడు .కాప్రి స్వర్గం  అనుకొన్నాడు .పెద్ద ప్రేగు వాచీ ఇన్ఫ్లుఎంజా బారిన పడి ఇద్దరూ మళ్ళీ ఫ్రాన్స్ చేరారు ‘’వెయ్యి పార్టీలు – పని నిల్  ‘’అని రాసుకొన్నాడు .

   తాగుడుకు ఏదీ అడ్డం కాలేదు .నాన్ స్టాప్ గా పెగ్గు మీద పెగ్గు లాగిస్తూనే ఉన్నాడు .తాగి ఎక్కడికి వెడుతున్నాడో తెలీక వెళ్లి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో తిరిగి వచ్చేవాడు ఇదీ అయ్యగారి ‘’పాన కత’’.అయిదేళ్ళలో లక్షా పదిహీను వేల డాలర్లు సంపాదించి అంటే ఏడాదికి ఇరవై మూడు వేల డాలర్లు పోగేసుకొంటూ కూడా సాధారణ రచయితలు  కలలు కనే సుఖమయ జీవితాన్ని అనుభవించ లేక పోయాడు .పబ్లిషర్ కు రాస్తూ ‘’మా జీవిత స్థాయిని తగ్గించుకోలేం.ఈ ఆర్ధిక అరక్షణ ను ఎదుర్కొలేను ‘’ అని తెలియ జేశాడు .ఇంకా తాను  హాండ్ సమ్ గా అండర్ గ్రాడ్యుయేట్ గా అడాలసెంట్ గా ఉన్నాననే భ్రమ పడుతూ ,అవతల వారిని ఆకర్షించలేక ,చిలిపి పరిహాసం ,జోకులతో ,ఒక్కో సారి అవి వెనక్కి పేలగా  ఇబ్బంది పడుతూ చివరికి పరిస్థితిని యెంత దాకా తెచ్చుకొన్నాడు అంటే స్నేహితులందరూ ‘’సారీ ‘’తోనూ హోటళ్లుఅన్నీ ‘’నో ఎంట్రీ ‘’బోర్డుల తోనూ వెనక్కి పంపించేదాకా .ఇందులోంచి బయట పడేయ్యటానికి జేల్డా  కొత్త ఉత్సాహ ప్రేరకంగా అనేక చిట్కాలు ప్రయోగించి చివరికి ఆత్మహత్య  దాకా వెళ్ళింది .స్కాట్ మరింత బరి తెగించి డిప్రేస్ అయ్యాడు .’’నాకు ఇంకా 22 ఏళ్ళే .నారచనే నన్ను సంతోష పెడుతుంది .నేను మెంటల్ గా ఫిజికల్ గా  హాంగోవర్ లో ఉన్నాను ‘’అని రాశాడు .

   పరిస్థితులు ఇలా ఉన్నాకూడా ఫిట్జెరాల్డ్  మరో రెండు పుస్తకాలు ‘’ది గ్రేట్  గాట్స్ బి ‘’,ఆల్ ది సాద్ యాంగ్ మెన్ ‘’ విడుదల చేశాడు  .రెండవది 1926 లో వచ్చింది .ఇందులో అతని పాత కధలు రెండు –రిచ్ బాయ్, వింటర్ డ్రీమ్స్ ‘’ఉన్నాయి .గాట్స్ బి మాత్రం ఫిట్జెరాల్డ్ రచనలలో మాస్టర్ పీస్ .ఇంకా తప్పించుకొనే వారి గురించి సహజ ముద్దులు గురించే రాస్తున్నాడు .బైరానిక్ లవ్ ఆఫ్ రోమాన్స్ ను రొమాంటిక్ లపై రియలిస్ట్ ల వెక్కిరింతల్ని ,పేదవాడు ధనికులను ఆరాది౦చటాన్ని  ఆర్టిస్ట్ లు డబ్బు ను ఏవ గి౦చుకోవటాన్నిరాస్తూ ఒక వైపును సమర్ది౦చటమూచేశాడు .విశ్లేషకులు ఫిట్జెరాల్డ్ ప్రోగ్రెస్ ను వివిధ కారణాల తో సమర్ధించారు .హెచ్ ఐ మెంకాన్ ‘’The Great Gatsby is an exposure of  the florid show of  American life –the high carnival of those who have too much money to spend and too much time for the spending of it ‘’అంటే టి ఎస్ ఇలియట్ ‘’the first step that American fiction has taken since Henri James ‘’అని మెచ్చుకొన్నాడు .

Inline image 1  Inline image 2

            సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-16 –ఉయ్యూరు  

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్

   సాహిత్య చరిత్ర కారులు ప్రతి యుగానికి ఒక లక్షణాన్ని  ఆపాదిస్తారు. కాని ,ప్రస్తుత యుగ లక్షణాన్ని ‘’ఏజ్ ఆఫ్ యా౦ గ్జైటీ’’ అన్నవాడు ఎఫ్ .స్కాట్ ఫిట్జెరాల్డ్.4-9-1890 న అమెరికా మిన్నెసోటా రాష్ట్రం సెయింట్ పాల్ లో ఫిట్జెరాల్డ్ పుట్టాడు .తల్లి తరపు దూరపు చుట్టం పై గౌరవం తో ఫ్రాన్సిస్ స్కాట్ కీ ఫిట్జెరాల్డ్ గా చర్చిలో పేరు నమోదయింది .మంచి కుటుంబమేకాని దరిద్రం తో అల్లల్లాడి౦ది .తండ్రి చేతకాని దద్దమ్మ .కొడుకు కు పదేళ్ళు రాకుండానే ఉద్యోగం పోగొట్టుకొన్నాడు .30 ఏళ్ళ తర్వాత  ఫిట్జెరాల్డ్ తన ఓటమిని గ్రహించి  ఈ విషయాన్ని తండ్రి ముందే గ్రహించాడని తెలుసుకొన్నాడు .ఈ విషయాలన్నీ రాసుకొన్నాడు .ఓటమి ,దురదృష్టం అనే రెండు అంశాలమీద ఫిట్జెరాల్డ్ సాహిత్యమంతా నడుస్తుంది .జాన్ ఓ హరా అనే రచయితకు ‘’సగం బ్లాక్ ఐరిష్ ,సగం పాత అమెరికన్ రక్తం తో గతకాలపు గొప్పల్ని నెమరేసుకొంటూ  , ఏదో సాధించామని ప్రగల్భాలు పలకటం అలవాటైంది ‘’అని చెబుతూ ‘’being born in an atmosphere of crack ,wise crack and counter crack ,I developed a two cylinder inferiority complex .I I spent my youth in alternately crawling in front of kitchen maids and insulting the great ‘’అని చెప్పుకొన్నాడు .

  కుటుంబం బీదరికం లో మగ్గుతున్నా తల్లికి ఫిట్జెరాల్డ్ అంటే ప్రాణం .ఒక ఆంట్ ఆతను న్యు జెర్సీ లోని న్యూమాన్ లో ఉన్న కేధలిక్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించటానికి సాయం చేసింది .అక్కడ రాణించ లేక పోయాడు .చాలా అందంగా ఆకర్హణీయంగా,మంచి రంగుతో ,నీలి కళ్ళతో అందమైన ముద్దు గుమ్మలాగా కనిపించేవాడు . ఫుట్ బాల్ ఆడేవాడుకాడు .పుట్టుకతో వచ్చిన వక్తృత్వం తో ప్రతి వాడితోనూ వాదించేవాడు .’’ బీద వాడు- ధనవంతుల స్కూల్ ‘’అనేది మనసుపొరల్లో ఎప్పుడూ మసిలేది .17 వ ఏట ప్రిన్స్ టన్ లో చేరి ,అండర్ గ్రాడ్యుయేట్ సాహిత్య కారులతో ముఖ్యంగా జాన్ పీల్ బిషప్ తో బాగా దోస్తీ గా ఉన్నాడు .ఈ స్నేహం జీవితాంతం ఉంది .ఎడ్మండ్ విల్సన్ జూనియర్ ఇతనికి సాహిత్య చేతనగా  నిర్వహణ కారుడుగా ఉండేవాడు .న్యూమాన్ చేసే తప్పులు చేయక ,ఫుట్బాల్ ఆటలో చేరి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు,135 పౌండ్ల బరువుతో కొత్త స్క్వాడ్ ఏర్పరచాడు .తర్వాత తనలోని సృజనకు పదును పెడుతూ నాటకాలపై ద్రుష్టి పెట్టాడు .ట్రెయినింగ్ క్లబ్ కోసం ఒక ‘’ఒపరెట్టా’’రాశాడు .ప్రదర్శనలో లేకపోయినా గ్రేడులు మాత్రం దారుణంగా రావటం తో కట్టిపెట్టాడు . కాస్ట్యూమ్ తో ఉన్న అతని ఫోటో ను పబ్లిసిటి డిపార్ట్మెంట్ అందరికి చూపించి ‘ ప్రిన్స్ టన్  కొత్త మ్యూజిక్ నాటకం లో ’బహు సొగసైన షో గర్ల్ ‘’అని ప్రచారం చేసింది .

     సెలవులలో ఇంటికి తిరిగి వచ్చి 19 వ ఏట మొదటి సారి జినేర్వా కింగ్ అనే ఒకమ్మాయిని ప్రేమించాడు .ఆమె అందమైన ధనికుల పిల్ల .ఆమెకు అయస్కాంత ఆకర్షణ ఉందని ,అన్నిరకాలాఫిట్జెరాల్డ్ కు జోడీ అని ,అతని పేదరికం ,అనిశ్చితత్వం ,ఊహ లకు తగినదని ఆయన చరిత్రకారుడు ఆర్ధర్ మిజేనర్ రాశాడు .ఆమె అన్నిటా విజయాలను సాధించినా అనాఘ్రాత పుష్పం అన్నాడు .ఫిట్జెరాల్డ్ చివరి రోజులలో  ఆమెను వదిలిన 20 ఏళ్ళకు కూడా జినేర్వా గురించిన ఆలోచన వస్తే కళ్ళ వెంట కన్నీరు కారేది .తర్వాతెప్పుడో ఆమెను హాలీ వుడ్ లో చూసి మళ్ళీ అదే ప్రేమ మైకం లో పడ్డాడు .వారిద్దరిమధ్య రోమాన్స్ చోటు చేసుకోలేదు .ఆమె దక్కక పోయినా గ్రేడ్లు కూడా దక్కక ఒక ఏదాది చదువు ఆగటమేకాక గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు యూని వర్సిటీ అభిమానమూ పొందలేక పోయాడు .ట్రయాంగిల్ క్లబ్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికకాలేక పోయాడు .జేనేర్వా ఇక జన్మ లో తనను పెళ్లి చేసుకోదు అనే నిర్ణయానికి వచ్చాడు ఫిట్జెరాల్డ్ .ఇది చాలా బాధాకరమైంది .తన నోట్ పుస్తకాలలో ‘’that is the stamp that goes into my books so that people can read it blind like Braile’’అని రాసుకొన్నాడు .

   మొదటి ప్రపంచ యుద్ధం ఫిట్జెరాల్డ్ లో దేశభక్తి కాని ఉత్సుకతను కానీ కల్పించలేదు .’’ఈ అనివార్య యుద్ధం నన్ను ఇరిటేట్ చేస్తోంది ‘’అన్నాడు .ప్రజల  సెంటి మెంటాలిటి తనకు  పక్కలో బల్లెంగా ఉందన్నాడు .సైన్యం లో చేరటాని అప్ప్లై చేశాడు .21 వయసు దాటిన నెలకు అది వచ్చింది .యుద్ధానికి వెళ్ళాడు .తల్లికి జాబు రాస్తూ ‘’cold bloodedly and purely for social reasons ‘’మిషతో యుద్ధానికి వెడుతున్నానని తెలియ జేశాడు .ఆతన్ని తీరాలు దాటి పంపలేదు .దానిబదులు చాలా కాంప్ లలో పని చేశాడు .ఫోర్ట్ లీవెన్ వర్త్ లో ‘’the world’s worst second lieutenant ‘’అని చెప్పుకొన్నాడు .’’ది రొమాంటిక్ ఈగోయిస్ట్ ‘’అనే నవల ఇప్పుడే రాశాడు .దీని రాత ప్రతి తిరస్కరింప బడిన తర్వాత తన ప్రేమికురాలు జినేర్వా పెళ్లి చేసుకో బోతోందని తెలిసింది .అదే సమయం లో ఒక కాంప్ డాన్స్ లో జేల్డా సేయ్రీ అనేఅందం ఆకర్షణ ,చొరవ వ్యక్తిత్వం ఉన్న బాల్ డాన్స్ బెల్లీ అయిన 18  ఏళ్ళ  అమ్మాయితో పరిచయమై ఇద్దరూ ప్రేమ రొంపిలో దిగి భవిష్యత్తు పై కలలు కన్నారు .  1919 ఫిబ్రవరిలో ఫిట్జెరాల్డ్ ను ఘనంగా ఆర్మీ నుంచి విడుదల చేశారు .

మళ్ళీ సాధారణ పౌరుడై జర్నలిస్ట్ ఉద్యోగం వెతుక్కొని జేల్డా ను పెళ్లి చేసుకొందామనుకొన్నాడు ..న్యు యార్క్ చేరి ఏడు పత్రికల చేత తిరస్కరింప బడి ‘’నేను ఆఫీస్ బాయ్స్ ను ఇంప్రెస్ చేయటం లో  విఫలమయ్యాను ‘’అనుకోని ఒక అడ్వేర్ టైజింగ్ కంపెనీలో కాపీలు రాసే పనికి నెలకు 90 డాలర్లకు  చేరాడు .రాత్రిళ్ళు తన కధలకు కేటా యించుకొన్నాడు ..అవన్నీ తిరుగుటపాలో క్షేమంగా తిరిగోచ్చేవి ..’’బేబ్స్ ఇన్ ది వుడ్స్ ‘’ను హెచ్ ఎల్ మెంకేన్ ,జార్జి జీన్ నాధన్ లు చిన్న సెట్ గా 30 డాలర్లకు  ప్రింట్ చేసే సరికి ,122  ప్రింటెడ్ రిజేక్షన్ స్లిప్పులు అందుకొన్నాడు .జేల్దాకు జాబులు రాస్తూనే ఉన్నాడు ఈ పరిస్తితుల్లో ఆమె దక్కదేమో అనుమానం పీడించింది .ఆ భయం తో అలబామాలోని మాంట్ గోమరి లో ఉన్న జేల్డా ను చూడటానికి ఉన్న కొద్ది డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాడు .ఆమె త్వరగా పెళ్లి చేసుకోవటానికి కాని ,అసలు పెళ్లి చేసుకోవటానికి కాని ఇష్ట పడలేదు ‘’షేక్స్ పియర్ మొహం’’ వేసుకొని మళ్ళీ న్యు యార్క్ చేరాడు .చెదిరిన మనసుతో దేవదాస్లాగా  పూటుగా తాగి రోజులు గడిపాడు .మళ్ళీ స్వంత ఊరు సెయింట్ పాల్ చేరాడు .అప్పటికే రాయటం మొదలెట్టి ఆపేసిన నవలను పూర్తీ చేసే ప్రయత్నం చేశాడు .రొమాంటిక్ ఈగో యిస్ట్ లోని మంచి పేరాలనన్నిటిని తీసుకొని మళ్ళీ ఆ ఎపిసోడ్ లనుతిరగ రాశాడు .కాని సంతృప్తి కలగక విసిరి పారేస్తే ఒక స్నేహితుడు దాన్ని ‘’ది కలేక్తేడ్ వర్క్స్ ఆఫ్ ఫిత్జరాల్ద్ ‘’అనే పేరు సూచించాడు .23 వ ఏట ‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’పేరు పెట్టి పంపాడు .ఎడిటర్ మాక్స్ వెల్ పెర్కింగ్ వెంటనే దాన్ని అంగీకరించి అందులో ఉన్న జీవ శక్తికి అభినందించాడు .దశ మారుతుంది అనుకొన్నాడు కాని జేల్డా ఇంకా పచ్చ జెండా ఊపలేదు .పబ్లిషర్ త్వరలోనే అచ్చు పూర్తీ చేసి అమ్మకాలకు పెడతానన్నాడు ఈలోపు పాతకధలు కొన్నిటిని రిపేర్ చేసి కొత్త రూపు తెచ్చాడు .1919 చివరి మూడు నెలలలో తొమ్మిది రాశాడు .అన్నీ బాగా అమ్ముడుపోయాయి .రేట్లు పెంచి అమ్మారు .’’ది సాటర్ డే ఈవెనింగ్ ‘’పత్రికరెండు కధలకు వెయ్యి డాలర్లు ఇచ్చింది .వీటినే రెండేళ్ళ క్రితం డజన్ పత్రికలు    నిర్దాక్షిణ్యంగా తిరస్కరి౦ చాయి .

Inline image 1

    Inline image 2

సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-7-16 –ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -224 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -4(చివరిభాగం

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -224

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ 4(చివరిభాగం)

  తన విరోధులను మాయ మాటలు ,తెచ్చిపెట్టుకొన్న గాంభీర్యం ,నియంతృత్వపు తీవ్రతలతో భయపెట్టాడు .ఇష్టం లేనిశాంతి ఒడంబడికను పూర్తిగా 1938 లో కాల రాచి పారేశాడు .విముక్తి మంత్రం తో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తనను ‘’నీట్జేస్చేన్ సూపర్ మాన్’’ గా ‘’క్రిస్టియానిటి ముసుగులో ఉన్న క్రూర నియంత ‘’ గా ప్రత్యక్షమై ,తాను జర్మనీ  దేశ భవిష్యత్తు ను నిర్ణయించే విధాతగా ప్రకటించుకొని ‘’దేవుడు నన్ను ప్రపంచ ప్రజల విముక్తి కోసం పంపాడు .ప్రజల మానసిక దౌర్భాగ్యం నుంచి విడుదల చేస్తాను .ప్రతి వ్యక్తి కి స్వాతంత్ర్యాన్నిచ్చి కాపాడుతాను ‘’అని నమ్మించాడు .ముందుగా ఆయన విముక్తి చేసింది జర్మనీనే .తర్వాత ఆస్ట్రియా .బవేరియా సరిహద్దులలోకి దండును పంపుతూ ,భయ పడేట్లు చేసి ఆస్ట్రియన్ చాన్సెలర్ కర్ట్ వాన్ స్కూస్నిజ్ ను రాజీనామా చేసేట్లు చేశాడు .మార్చి 12 న వియన్నా లో ప్రవేశించి ,అక్కడ ముందే రిహార్సల్ చేయించిన జనం చేత జయజయ ధ్వానాలు పలికి౦చుకొన్నాడు .కొన్ని నెలలాగి మళ్ళీ కొత్త డిమాండ్ లు చేశాడు .జేకోస్లో వేకియాలోని జర్మన్లకు ఆపద్బాఓ ధవుడని పించుకొన్నాడు .ఇంతలో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ లు జెక్ లను సూడేటేన్లాండ్ ను అప్పగించామనికోరాయి .సెప్టెంబర్ 13 న హిట్లర్ మరో ట్ర౦ప్ కార్డ్ ప్రయోగించాడు .మ్యూనిచ్ లో దీనితో ఇప్పటిదాకా తాము రక్షకులమనుకొంటున్న జక్ ను బ్రిటన్ ఫ్రాన్స్ లు వదులుకోవాల్సి వచ్చింది . బ్రిటిష్ ప్రధాని చామ్బర్లేన్ లండన్ కు పీచే మూడ్ అయ్యాడు .వెళ్లి లండన్ లో ‘’మ్యూనిచ్ లోమనకాలం లో  శాంతి ఒప్పందం కుదిర్చాను ‘’అని ప్రకటించు కొన్నాడు .

             50 వ ఏట హిట్లర్ ‘’కొరక రాని కొయ్య’’ అయ్యాడు .అతని ముఖం లో హిప్న టైజ్ చేసే కళ్ళు ,వాటిలో తీక్ష్ణ ద్రుష్టి తప్ప ఇంకేమీ ప్రత్యేకతలు లేవు .ముఖం కుదించుకొని గట్టిపడినట్టు,చెత్త గా నటించే విదూషకుడిగా ,సాధారణ నుదురు గడ్డం మూతి  కనుబొమలు చార్లీ చాప్లిన్ మీస౦  తో వికృతంగా ఉండేవాడు  .చాప్లిన్ విషాద నవ్వు పుట్టించే ముఖం బదులు ద్వేషం ప్రతిధ్వని౦చేది  .చెడు అలవాట్లు లేని రాక్షసుడు హిట్లర్ .పొగ తాగేవాడు కాదు .తాగుడు అలవాటు లేదు .మాంసం తినేవాడుకాదు .మగువ పై మొహం లేదు .అంటే మకార త్రయానికిదూరం . జెలి అనే యువ నీస్ కు మాత్రమే స్వంతమైన వాడు .ఆమెను తన అపార్ట్ మెంట్ లో ఆమె వయసు ఇరవై లోపు ఉండాగానే  కాల్చి చంపేశాడు .దీనికి కారణం ఏమిటో తెలియదుకాని ఆమె ది ఆత్మ హత్య అని ప్రచారం చేయించాడు .తర్వాత ఈవా బ్రాన్ తో సంసార జీవితం సాగించాడు .హిట్లర్ కు చర్చ కాని వ్యతిరేక అభిప్రాయం కాని నచ్చదు .’’ఈ సీతయ్య ఎవరిమాటా వినడు ‘’అన్న నందమూరి హరికృష్ణ డైలాగ్ లాగా హిట్లర్ ఎవరిమాటా వినేవాడుకాడు .ఆయనకు ఇష్టమైనది మిలిటరీ బాండ్  దానితో పాటు  జర్మనీ సంగీత కారుడు వాగ్నర్ కూర్చిన ‘’నార్డిక్ మ్యూజిక్ ‘’మాత్రమే ఇష్టం .

  50  వయసులో హిట్లర్ కు విజయాలు ఒక దాని వెంట ఒకటి వచ్చి మీద పడ్డాయి .19 39 లో తన కిష్టమైన ‘’బలమే మొదటి చట్టం  బలమే హక్కును సృష్టిస్తుంది ‘’అనే సింహ నాదం చేశాడు .స్లోవాకియాను మాతృదేశం  నుండి విడిపోమ్మని కోరాడు .మేమెల్ కు చేరి లొంగ దీసుకొని రీచ్ కి కట్ట బెట్టాడు .ఏప్రిల్ లో’పోలాండ్ తో కుదుర్చుకొన్న ’యుద్ధ వివరణ  ఒప్పందాన్ని’’,ఇంగ్లాండ్ తో చేసుకొన్న సముద్ర సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు .  రూజ్ వెల్ట్ ను కాదని దాన్జింగ్ ను ఇవ్వమని కోరాడు .మే లో జర్మని ఇటలీలు మిలిటరీ ఒప్పందం చేసుకొన్నాయి .ఆగస్ట్ లో రష్యాతో దురాక్రమణ రహిత ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడు .ఈ రకంగా జర్మనీని రెండు వైపులా  యుద్దాన్నుంచి తప్పించు తప్పించాడు .తనకు అందరూ భయ పడ్డారని భావించి తూర్పు నుంచి ప్రమాదం లేదని తలచి పోలాండ్ ను సెప్టెంబర్ 1 న జయిఛి డాన్జింగ్ ను స్వాధీన పరచుకొని ,కావాలనే వార్సా మొదలైన సిటీలపై బాంబుల వర్షం కురిపించాడు .రెండు రోజుల తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్ లు ఈ వివాదం లో చేరాయి .దీనితో భయంకర రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది .

 1940 లో హిట్లర్ స్టార్ తిరిగి ,ఎగ బాకింది .అతని సైన్యాలు పోలాండ్ ను తుడిచి పెట్టేశాయి .కొద్దికాలం ఓపిక పట్టి పశ్చిమ రాజ్యాలతో శాంతి ఒప్పందం కుడుర్చునేట్లు అభినయి౦చాడు .కాని జర్మనీ భాషలో ‘’సిట్జ్ క్రీగ్ ‘’అనే ’’ సిట్ డౌన్ వార్ ‘’ఒక్కసారిగా అకస్మాత్తుగా ‘’బ్లిట్జ్ క్రీగ్ ‘’అంటే ‘’మెరుపుదాడి’’ గా పరిణమించింది .నాజీలు నెదర్లాండ్,బెల్జియం ,లక్సేన్ బెర్గ్ ల పని పట్టారు  .హాలండ్ బెల్జియం లు మే లో  తామే లొంగిపోయాయి .బ్రిటిష్ సైన్యం బందీ అయింది .డన్కర్ బీచ్  నుండి చాలా భాగం బ్రిటిష్ సైన్యాన్ని తప్పించేశారు .చాలా టాంక్ లు ,ఆయుధ సామగ్రి నస్టమైంది  .జూన్ 13 న నాజీలు పారిస్ నగరం లోకి దూసుకు పోయారు .మూడు రోజుల తర్వాత మార్షల్ పీటైన్ఫ్రాన్స్ ప్రధాని అయి హిట్లర్ తో శాంతి చర్చలు జరిపాడు .జులై లో జర్మని ఇంగ్లాండ్ పై భారీ విమాన దాడి చేసి పౌర నగరాలపైనా కేధడ్రిల్లపైనా అకారణం గా బాంబుల వర్షం కురిపించింది .పనిలోపనిగా ఇటలీ దెబ్బతిన్న ఫ్రాన్స్ పై యుద్ధానికి దిగింది .దీన్నే ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ‘’వెన్ను పోటు ‘’అన్నాడు.రుమేనియా హ౦గెరీలు జర్మనీతో చేతులు కలిపాయి .సంవత్సరాంతానికి’’ స్వస్తిక పతాకం ‘’యూరప్ లోనార్వే ,డెన్మార్క్ లతో సహా  చాలా దేశాలలో రెప రెప లాడింది .

   1941 మరొక గణనీయ మైన విజయ పరంపరను హిట్లర్ కు అందజేసింది .హిట్లర్ గ్రీస్ ,ఇంగ్లాండ్ లపైకి ఉరికాడు ఇంగ్లాండ్ దాడి నుండి తప్పించుకొని రక్షించు కోవటానికి  చాలా తక్కువ ప్రయత్నం చాలా ఆలస్యం గా  చేసింది .యుగోస్లావియా సయోధ్య కుదుర్చుకొన్నది .ఇక పడమటి లో తనను నిలవరించేవారేవ్వరూ లేరని ,రెండు వైపులా యుద్ధం ఎందుకని తూర్పు దేశాలపైఒక్కసారిగా  విరుచుకు పడ్డాడు  .ముందుగా రష్యాపై దాడి చేసి స్టాలిన్ శ్రేణిని నాశనం చేసి ,తర్వాత కీవ్, మాస్కో ,లెనిన్ గ్రాడ్ పై పడ్డాడు .యుద్ధ నిపుణులు రష్యా సైన్యాన్ని మూడు వారాల్లో మట్టు పెట్టగలరని మొత్తం రష్యా ను ఆరువారాల్లో ఊదేయగలరని  జోస్యం చెప్పారు  .కనుక హిట్లర్ నాజీ సైన్యం రష్యా లోపలి భాగాల్లోకి దూసుకు వెళ్ళి కీవ్ ,ఒరెల్ లు పట్టుకొని లెనిన్ గ్రాడ్   నుచుట్టుముట్టాయి . .ఇంకేముంది రష్యా పని అయి పోయింది జర్మనీ చేతిలో రష్యా ఓడిపోయింది ఇక కోలుకోలేదు లేవలేదు పూర్తిగా నాశనమై పోయింది  అని హిట్లర్ ప్రగాల్భాలతో ప్రకటించాడు .

        జపాన్ పెరల్ హార్బర్ పై దాడి చేసినపుడు అమెరికా కూడా యుద్ధానికి దిగాల్సి వచ్చింది .’’పుచ్చిపోయిన ప్రజాస్వామ్యం ‘’అంటే ఏవగింపు ద్వేషం ఉన్న హిట్లర్ అమెరికా పై యుద్ధం ప్రకటించాడు .దీనితో అల్ప జాతులనూ ,పనికి రాని ప్రజాస్వామ్యాలను ఒక్క దెబ్బతోతన నాజీ కాన్సేంట్రేషన్ కాంప్ లతో ,అత్యంత పాశవిక చర్యలతో తుడిచి పెట్టి  నాశనం చేయచ్చు అనుకొన్నాడు . జబ్బులు ,ఆహార లేమి , భయోత్పాతం చేయలేని పనిని ఇంజెక్షన్లు ,తగల బెట్టడాలు , గాస్ చే౦బర్ల తో పాశవిక మారణ హోమాన్ని సాధించాడు .న్యూరేం బెర్గ్ విచారణలలో ,యుద్ధ ప్రారంభ సమయం లో తొమ్మిదిన్నర మిలియన్ల యూరోపియన్ జ్యూస్ ఉండేవారని ,యుద్ధం తర్వాత మూడు మిలియన్ల మంది మాత్రమే  మిగిలి ఉన్నారని తేలింది .ఇవన్నీ హిట్లర్ ను సాడిస్ట్,  అమానుష స్ట్రాట జిస్ట్  అనటానికి దోహదం చేశాయి .’Brutality is respected .’The plain man in the street respects nothing but brute strength and ruthlessness .The people need fear .They want  some one to frighten them and make them shudderingly  submissive >They need something that give them a thrill of horror .terror is the most effective political instrument . I shall not permit my self to be robbed of it simply because  a lot of stupid mollycoddles  choose to be offended by it ‘’ఇవీ  హిట్లర్ ధర్మ పన్నాలు  .’’ ది వాయిస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ‘’లో హీర్మాన్ రాస్చేనింగ్ ‘’లో హిట్లర్ తన అధికారుల్ని బండ బూతులు తిట్టేవాడని ,కాళ్ళతో తన్నేవాడని ,పిడికిళ్ళు టేబుల్ పైన కొట్టేవాడని ,దెబ్బతిన్న పిల్లాడో పిచ్చిపట్టిన స్త్రీ యో చేసినట్లు రాక్షసంగా ప్రవర్తి౦ చే వాడని రాశాడు వాళ్ళందరూ ఏడుస్తూ రోదిస్తూ అన్నీ  భరించేవారట .’’The most  horrible warfare is the kindest .The important thing is the sudden shock of an overwhelming fear of death .These so called atrocities spare me a hundred thousand individual  actions against disobedience and discontent. People will think twice before opposing us when they hear what to expect in the camps ‘’ఇదీ హిట్లరీయం ,హిట్లర్ మార్క్ పాలన .రావణా పాలన .

 విపరీతంగా అన్నిరకాల నష్టం పొందుతున్నా ,నెపోలియన్ వాటర్లూ పరాభవ గాధ తెలిసినా ,ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా మొండిగా తన నాజీ సైన్యాన్ని మరింతగా రష్యా లోపలి భాగాలలోకి చొప్పించాడు .మిలియన్ కంటే ఎక్కువ సైన్యం తో స్టాలిన్గ్రాడ్ వద్ద మోహరించాడు .ఇటలి లో పొందిన నష్టాన్ని పూడ్చుకోవటానికి డేరింగ్ డాషింగ్ వీరుడు రామ్మేల్ ను ఆఫ్రికా కు పంపాడు .మొదట్లో కొంచెం విజయం సాధించినా అతనునిలువరింప బడ్డాడు .నాజీ ఆక్రమణ నుంచి రక్షించు కోవటానికి  ఫ్రాన్స్ తన నావికా దళాన్ని ఉపసంహరించింది .చరిత్రలో అంతవరకూ ఎన్నడూ జరగని విధంగా అమెరికా ఇంగ్లాండ్ లు ఉత్తర ఆఫ్రికాలో అతి పెద్ద సైన్యాన్ని ది౦పేసి యుద్ధం చేశాయి .సిసిలీనుంచి బేస్ గా తీసుకొనిదక్షిణ ఇటలీ పై  అమెరికా యుద్ధం చేసింది .’’ఫ్యూహ్రేర్ ‘’హిట్లర్ జాతకం తిరగ బడింది .1943 లో అమెరికా యూరప్ కోటలను ధ్వంసం చేస్తే ,రెడ్ ఆర్మీ హిట్లర్ సైన్యాన్ని చావు దెబ్బ తీసి వెనక్కి తరిమేశాయి .ముస్సోలినీ పతనం చెందగానే ఇటలి యే హామీలు లేకుండానే లొంగి పోయింది .నాజీలు రోమ్ ను ఆక్రమి౦చగానే ఇటలీ జర్మనీకి ఎదురు తిరిగింది .అమెరికా యుద్ధ విమానాలు పగలూరాత్రి నాన్ స్టాప్ గా జర్మనీ పారిశ్రామిక వాడలపై బాంబు వర్షం కురిపించాయి .ఒకే ఒక రాత్రి అమెరికా అయిదు వందల యుద్ధ విమానాలతో  బ్రేమిన్  ఆయువు పట్ల పై దాడి చేసి కోలుకోకుండా చేసింది .బెర్లిన్ పై వందకు పైగా దాడులు చేసింది .హాంబర్గ్ పీనుగుల పెంట అయింది .

194 4  లో హిట్లర్ సైనికాధికారులు తాముచావు  దెబ్బతిన్నట్లు తెలుసు కొన్నారు .కాని హిట్లర్ అహం ఇంకా చావలేదు .ప్రజల బతుకు కంటే తన ప్రిస్టేజ్ ప్రధానమని భావించాడు .శాంతి అసాధ్యమని ప్రతి సైనికుడు వెనక్కి తిరగ కుండా పోరాడి చావాల్సిందేనని హుకుం జారీ చేశాడు .రష్యా అన్ని చోట్లా ఎదురు తిరిగే స్థాయిలో ఉంది .ఒడేస్సాను సేవెస్ట పోల్ ,మిన్స్క్ రుమేనియా లను తిరిగిపొంది హ౦గరీని  యుద్ధాన్ని ఆపు చేయమని ఒత్తిడి తెచ్చింది.అమెరికా బ్రిటన్ కెనడాల బలగాలు ఫ్రెంచ్ తీరాలపై మొహరించాయి .రెండు నెలల తర్వాత ఫ్రాన్స్ దాక్షిణ భాగాలను స్వాధీనం చేసుకొన్నాయి .సెప్టెంబర్ లో అమెరికా సైన్యం జర్మనీలో ప్రవేశించింది .1945 ఫిబ్రవరిలో బెర్లిన్ సైన్యాన్ని తూర్పుకు తరుముతుంటే రష్యా  తూర్పునుంచి దాడి చేసింది.హిట్లర్ పైనా ,ఆయన జేనరల్స్ పైనా దాడిచేశారు .గాయపడిన హిట్లర్ చావు నుండి తప్పించుకొన్నాడు .ఇంత జరిగినా అపజయాన్ని అంగీకరించ లేక పోయాడు హిట్లర్.మానవత్వం,హృదయమూ లేని ఆజ్ఞలను జారీచేసి వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకొని ,చివరికి గత్యంతరంలేక అన్ని కార్యక్రమాలకు దూరమయ్యాడు .బాంబులతో ధ్వంసమైన నగరాలనైనా కనీసం వెళ్లి చూడ లేదు .శాంతి కోసం ప్రయత్నం చేయలేదు .మిగిలిపోయిన సైన్యానికి నాయకత్వం వహించి చావో రేవో అంటూ పోరాడనూ లేదు   .బాంబ్ ప్రూఫ్ షెల్టర్ లో తలదాచుకొన్నాడు. భార్య, కొద్ది మంది వీరాభిమానుల తో ఉన్నాడు .1945 ఏప్రిల్ తర్వాత రష్యా జెండా రీచ్ స్టాగ్ పై  ఎగిరింది .హిట్లర్ దాక్కున్న సురక్షిత బంకర్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కరిపించింది .తనకు చావు దగ్గర పడిందని గ్రహించి హిట్లర్ ఆయన దర్పానికి గర్వానికీ,ఆత్మ ద్రోహానికి  మాస్టర్ పీస్ అనిపించే ఒక వీలునామా తయారు చేయించాడు .జరిగిన తీవ్ర నష్టానికి ప్రాణాలకు సానుభూతికూడా చెప్పకుండా ,ఇంకా తానూ జర్మనీ సంరక్షకుడిని విముక్తి దారుడిని అనే అనే భ్రాంతిలో పడి  ‘’actuated solely by love and loyalty ‘’అంటూ ‘’ఆరేళ్ళ యుద్ధం వలన అనేక రకాలుగా ఇబ్బందిపడినా దెబ్బ తిన్న జర్మనీ దేశ గౌరవాన్ని పెంచే దాని ఆకాంక్షను తీర్చే   గొప్ప ఘన కార్యంగా చరిత్రలో నిలిచి పోతుంది అని రాశాడు .తరుమబడిన సైనికులు కొందరు ఇంకా ఆయనకోసం,ఆశయ౦ కోసం  పోరాడుతూనే ఉన్నారు .కాని ప్రపంచాన్నిభయం తో  దొర్జన్యం తో   ,విచక్షణా రాహిత్యం తో  అమానుషంగా వణికించిన జర్మనీ నియంత హిట్లర్ పిరికి వాడుగా తనను కాల్చుకొని19 45 ఏప్రిల్ 30 న 56 వ ఏట  చచ్చిపోయాడు .కొన్ని గంటల క్రితమే ఆయన్ను పెళ్లి చేసుకొన్నా మిస్త్రేస్ విషం తీసుకొని చనిపోయింది . గాసోలీన్ మంటల్లో హిట్లర్ కాలి మసి అయ్యాడు .అవే పాపం ఆయనకు జరిగిన అంత్యక్రియలు .‘

హిట్లర్ చేసినట్లుగా చెప్పబడే అకృత్యాలు ఈనాడు నమ్మ శక్యం గా ఉండవు .దేశాన్ని ప్రేమించి జాతిని ఉద్ధరిస్తానని మాట ఇచ్చి జర్మనీ ఐక్యత సాధించి ప్రపంచం ఆర్యజాతి సర్వోత్క్రుస్టత కు మురిసి దేశోద్దారకుడిని అని ప్రకటించుకొన్న హిట్లర్ అంత క్రూరుడా అనిపిస్తాడు .కాని ఆయనలో ఉన్న ద్వేషం ,పగ ప్రతీకారం ,దౌష్ట్యం ,అధికార దాహం  అమానుషత్వం చరిత్రలో మచ్చలుగా మిగిలిపోయాయి .

హిట్లర్ చావును చాలామంది ఆహ్వానించారు చావుతో ఆయన పేరుకూడా ఖననం అయ్యింది .కొద్దిమందిమాత్రమే ఆయన కోసం ఏడ్చారు .చాలామందిని ఆయన ఎద్పించాడుకనుక వాళ్ళకళ్ళల్లో ఆనందం విరిసింది . Hitler’s actions and Nazi ideology are almost universally regarded as gravely immoral;[355] according to Kershaw, “Never in history has such ruination—physical and moral—been associated with the name of one man”.[356] Hitler’s political programme brought about a world war, leaving behind a devastated and impoverished Eastern and Central Europe. Germany itself suffered wholesale destruction, characterised as Stunde Null (Zero Hour).[357] Hitler’s policies inflicted human suffering on an unprecedented scale;[358] according to R.J. Rummel, the Nazi regime was responsible for the democidal killing of an estimated 19.3 million civilians and prisoners of war.[325] In addition, 29 million soldiers and civilians died as a result of military action in the European Theatre of World War II.[325] The number of civilians killed during the Second World War was unprecedented in the history of warfare.[359] Historians, philosophers, and politicians often use the word “evil” to describe the Nazi regime.[360] Many European countries have criminalised both the promotion of Nazism andHolocaust denial

 Historian Friedrich Meinecke described Hitler as “one of the great examples of the singular and incalculable power of personality in historical life

English historian Hugh Trevor-Roper saw him as “among the ‘terrible simplifiers’ of history, the most systematic, the most historical, the most philosophical, and yet the coarsest, cruelest, least magnanimous conqueror the world has ever known”.[363] For the historian John M. Roberts, Hitler’s defeat marked the end of a phase of European history dominated by Germany.[364] In its place emerged the Cold War, a global confrontation between the Western Bloc, dominated by the United States and other NATO nations, and the Eastern Bloc, dominated by the Soviet Union.[365] Historian Sebastian Haffner avers that without Hitler and the displacement of the Jews, the modern nation state of Israel would not exist. He contends that without Hitler, the de-colonisation of former European spheres of influence would have been postponed.[366] Further, Haffner claims that other than Alexander the Great, Hitler had a more significant impact than any other comparable historical figure, in that he too caused a wide range of worldwide changes in a relatively short time span.[367]

According to a U.S. Office of Strategic Services report, “The Nazi Master Plan”, Hitler planned to destroy the influence of Christian churches within the Reich.[380][381] His eventual goal was the total elimination of Christianity.[382] This goal informed Hitler’s movement early on, but he saw it as inexpedient to express this extreme position publicly.[383]According to Bullock, Hitler wanted to wait until after the war before executing this plan.[384]

Speer wrote that Hitler had a negative view of Himmler’s and Alfred Rosenberg‘s mystical notions and Himmler’s attempt to mythologise the SS. Hitler was more pragmatic, and his ambitions centred on more practical concerns.[385][386]

Researchers have variously suggested that Hitler suffered from irritable bowel syndromeskin lesionsirregular heartbeatcoronary sclerosis,[387] Parkinson’s disease,[273][388]syphilis,[388] giant cell arteritis with temporal arteritis,[389] and tinnitus.[390] In a report prepared for the Office of Strategic Services in 1943, Walter C. Langer of Harvard Universitydescribed Hitler as a “neurotic psychopath“.[391] In his 1977 book The Psychopathic God: Adolf Hitler, historian Robert G. L. Waite proposes that Hitler suffered from borderline personality disorder.[392] Historians Henrik Eberle and Hans-Joachim Neumann consider that while Hitler suffered from a number of illnesses including Parkinson’s disease, he did not experience pathological delusions and was always fully aware of, and therefore responsible for, the decisions he was making.[393][261] Theories about Hitler’s medical condition are difficult to prove, and placing too much weight on them may have the effect of attributing many of the events and consequences of Nazi Germany to the possibly impaired physical health of one individual.[394] Kershaw feels that it is better to take a broader view of German history by examining what social forces led to the Nazi dictatorship and its policies rather than to pursue narrow explanations for the Holocaust and World War II based on only one person.[395]

Hitler followed a vegetarian diet.[396] At social events he sometimes gave graphic accounts of the slaughter of animals in an effort to make his dinner guests shun meat.[397]Bormann had a greenhouse constructed near the Berghof (near Berchtesgaden) to ensure a steady supply of fresh fruit and vegetables for Hitler throughout the war.[398] Hitler publicly avoided alcohol. He occasionally drank beer and wine in private, but gave up drinking because of weight gain in 1943.[399] He was a non-smoker for most of his life, but smoked heavily in his youth (25 to 40 cigarettes a day). He eventually quit, calling the habit “a waste of money”.[400] He encouraged his close associates to quit by offering a gold watch to any who were able to break the habit.[401] Hitler began using amphetamine occasionally after 1937 and became addicted to it in late 1942.[402] Speer linked this use of amphetamine to Hitler’s increasingly inflexible decision making (for example, rarely allowing military retreats).[403]

Prescribed 90 medications during the war years, Hitler took many pills each day for chronic stomach problems and other ailments.[404] He regularly consumed methamphetamine,barbituratesopiates, and cocaine.[405][406] He suffered ruptured eardrums as a result of the 20 July plot bomb blast in 1944, and 200 wood splinters had to be removed from his legs.[407] Newsreel footage of Hitler shows tremors of his hand and a shuffling walk, which began before the war and worsened towards the end of his life.[404] Ernst-Günther Schenck and several other doctors who met Hitler in the last weeks of his life also formed a diagnosis of Parkinson’s disease.[408]

 Inline image 1    Inline image 2
Inline image 4
Inline image 5Inline image 6

   సశేషం                                      

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment