అమెరికా లో ఆంద్ర తేజం
సమాజ సేవా” భవానీ దీక్ష ‘
అమెరికా వచ్చి బాగా సంపాదిస్తూ హాయిగా విలాస జీవితం గడ పచ్చు నని అందరు అనుకోవటం సహజం .ఈ మధ్య కొందరు మాతృదేశాన్ని గుర్తించి ,అనేక సేవా ,అభి వృద్ధి కార్య క్రమాలలో భాగ స్వాము లవుతు ,జన్మ భూమి ఋణం తీర్చు కొంటున్నారు .ఎక్కడ ఉన్నా మన చుట్టూ సమాజం ఉంటుంది .సమాజ పురోగతే మానవ ప్రగతి .ఈ రెండు అవినా భావ సంబంధం కలిగి ఉంటాయి .మనం ఉంటున్న దేశం మనదే .అక్కడి సమాజమూ మనదే .అందు లో మనమూ ఒకల్లమే ఈ భావన వస్తే ,విశ్వ జనీన భావన కలుగు తుంది .అప్పుడు మనం చేసే సేవా కార్య క్రమాలకు ,అర్ధం ,పరమార్ధం లభిస్తాయి .ఇలా సమాజ సేవా కార్య క్రమాలలో నిర్వి రామం గా పాల్గొంటూ ,తన చుట్టూ ఉన్న సమాజ ప్రగతికి దోహద పడుతున్న తెలుగు వారెందరో ఉన్నారు .వారినే నేను ”అమెరికా లో ఆంద్ర తేజం ”అన్నాను .అలాంటి వారి లో అమెరికా ఆగ్నేయ రాష్ట్ర మైన అలబామా లోని హన్ట్స విల్ నివాసి ,కృష్ణా జిల్లా వాసి అయినశ్రీమతి కాకాని భవాని గారు ముఖ్యులు గా కనీ పించారు .క్రిందటి వారం నా అలబామా ప్రయాణం లో ,ఆమెను వారింట్లో భర్త డాక్టర్ ప్రసాద్ గారితో పరిచయం కల్గించారు నా మిత్రులు మైనేని గోపాల కృష్ణ గారు .ఆమె చేస్తున్న సమాజ సేవా కార్య క్రమాలను వివ రించి చెప్పారు . ”సమాజ సేవా భవానీ దీక్ష”గా ఆమె సాగిస్తున్న కార్య క్రమాలను మన వారందరికి అంద జేయట మే నా ఉద్దేశ్యం .మిగిలిన వారు కూడా ప్రేరణ పొందుతారనే విశ్వాసం .
ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో కూచి పూడి కి దగ్గర గ్రామం అయిన” పెడసన గల్లు” లో భవాని జన్మించారు .మెన మామ పెంపకం లో పెరిగారు .ఆయన ఈమె జీవితాన్ని తీర్చి దిడ్డ టానికి మంచి పునాది వేశారు .ఉయ్యూరు దగ్గర గ్రామ మైన ఆకునూరు నివాసి కాకాని బ్రహ్మేశ్వర రావు గారి పెద్ద కుమారుడుడాక్టర్ కాకాని ప్రసాద రావు గారి తో వివాహం జరిగింది .ఇద్దరు అమెరికా చేరారు .ప్రసాద్ వైద్య వ్రుత్తి లో విశేష అనుభవాన్ని సంపాదించి అలబామా లో హన్త్స్ విల్ లో స్థిర పడ్డారు .సంతానం కూడా అభి వృద్ధి లోకి వచ్చింది .సమాజం లో ఆదర్శమైన వైద్యులు గా ఆయన పేరొందారు .జెనరల్ మరియు వాస్క్యులర్ సర్జన్ గా ప్రసాద్ లబ్ధ ప్రతిష్టులు .కావలసి నంత సంపాదించి ,ఇక సంపాదన పై వైముఖ్యం పెంచుకొని వాలంటరీ గా పదవీ విరమణ చేశారు .సంసారం తో సంతృప్తి గా జీవిస్తున్నారు .
శ్రీ మతి భావాని34 ఏళ్ళు గా సమాజ సేవా కార్యక్రమాలలో ,విద్యా ,సంక్షేమ కార్య క్రమాలలో అగ్ర గామి గా నిలి చారు .భర్త కు చేదోడు గా ఉంటూ ,అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు .ఆమె మంచి వాణిజ్య వేత్త .హన్ ట్స్విల్ లో ఎన్నో స్వచ్చంద సంస్థ లకు ఆమె నిర్వా హకు రాలు . .2004లో girls inc. state అవార్డ్ పొందారు .మరుసటి ఏడాదిnational conference for community sister hood పురస్కారక్మ్ పొంది తన సేవా కార్య క్రమాలకు తగిన గుర్తింపు తెచ్చు కొన్నారు .అలాగే arthitis foundation ,women hounoring wmen;s health మొదలైన విలువైన అవార్డులను ,రివార్డు లను పొందిన మహిళా మాణిక్యం కాకాకి భవాని గారు .
ఆమె ఆలోచన లన్ని సమాజ అభి వృద్ధి మీదే ఉంటాయి .ఆమె మేదో జనిత మైన భావనే ”ఆశా కిరణ్ ”అనే లాభా పేక్ష లేని సేవా సంస్థ .అమెరికా లో ఉన్న దక్షిణ ఆశియా వాసుల కల్లోల జీవితాలకు వెలుగు నివ్వటానికి ఏర్పడిన సంస్థ ఇది ..భవాని ”progres bank and trustకు కు సెక్రెటరి మరియు డైరెక్టర్ .అంతే కాదు -international finance for intergraph corporation కు సీనయర్ స్టాఫ్ సూపెర్వైసేర్ .ఇలా ఆమెను వరించని పదవి లేదు అంటే ఆశ్చర్యంలేదు .
సమాజం లో వివిధ వవర్గాల మధ్య సమన్వయము సాధించ టానికి ఆమె గొప్ప కృషి చేస్తున్నారు .అందరికి ఆరోగ్యం అందించాలనే ఆమె దీక్ష ఆమెది .దానికోసం ఆమె నడుం కట్టి ముందు నిలిచారు .ఎన్నో స్వచ్చంద సంస్థలను ఈ కార్య క్రమం లో భాగా స్వామ్యులను చేయటం లో కృత క్రుత్యులయారు .madisaan county medical alliance medical society of the state of Alabama కు అధ్యక్ష త వహిస్తున్నారు .అలానేsouth medical association and hospice కు సారధి గా ఉన్నారు .ఆమె స్వచ్చంద సేవా దీక్షితు రాలు . authority of the city of hants villiie hospital foundation ,మరియు the state wide health planning council వంటి ఎన్నో సంస్థలకు గౌరవ స్థానం లో బాధ్యతలు నిర్వ హిస్తు ,సమాజ హితైషి గా జీవితాన్ని సార్ధకం చేసు కొంటున్నారు .
సమాజం లో వివక్షత కు గురైనపిల్లలను , సమాజవిస్మృత పిల్లలకు ఆమె అండా ,దండా గా నిలుస్తున్నారు .వివిధ కారణాల సల్ల విద్యకు దూరమైనబడి ఈడు బాల బాలికలను స్చూల్ల లో చేర్పించి ,వారి విద్యాభి వృద్ధికి పూర్తీ సహాయం అందిస్తున్నారు .దీనికి తార్కాణమే ఆమె the national children;s advocacy center in varjinia కు బోర్డ్ చైర్ పెర్సన్ గా గౌరవ స్థానాన్ని అది రోహించటం .ఆమె సేవకు తగ్గ ప్రతిఫలం, ,పురస్కారం ఇది .
విద్య నేర్వటం తో పాటు సరైన వృత్తిని ఎన్ను కోవటానికి తగిన సలహా సంప్రదింపులు ఇవ్వాలన్న ఆమె ఆలోచన మంచి కార్య రూపం దాల్చింది .ఎందరికో మార్గ దర్శనం చేసింది .దీనికోసంwomen council foundation కు ఆరేళ్ళు నిర్విరామం గా పని చేసి అనేక మంది కి ఉపాధి మార్గాలను కల్పించింది . U.A.H.foundation board commission ను ద్వారా అనేక ముందడుగు పధకాలను చేబట్టి ఆదర్శ మహిళా గా నిల బడింది .randolph school ,women;s economic development council foundtion boardవంటి మరెన్నో సేవా సంస్థలతో ,వాటి సేవలో ప్రత్యక్ష భాగస్వామ్యం భావాన్ని గారికి ఉంది .
సమాజాభి వృద్ధి పధకాలలో ముందుండి నడి పించిన ముందు చూపున్న మహిళా భవాని .వీటి కోసం Hants villiie maadisaan county కి అధ్యక్షు రాలిగా , హన్ ట్స్ విల్ తెలుగు సంస్థ కు ప్రారంభ అధ్యక్షు రాలిగా పని చేసి తెలుగు భాషా సంస్కృతుల ను సంరక్షించే అనేక కార్య క్రమాలను నిర్వ హించింది .కళా పురస్కారాన్ని అందుకొన్నది .కళా సంస్థart council కు నేతృత్వం వహించింది .హంట్ స్విల్ లోని అంతర్జాతీయ సంఘానికి మార్గ దర్శనం చేసింది .ఆ సంస్థ శత ,ద్వి శత వార్షికోత్సవ నిర్వ హాణ లో ప్రముఖ పాత్ర వహించింది .

ఆమె ఆర్ధిక శాస్త్రం లో డిగ్రీ సాధించింది .బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లో హన్త్స్ విల్ లోని అలబామా యుని వేర్సిటి నుండి మాస్టర్ డిగ్రీ సాధించింది .ఆమె పత్రికా రంగం లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు .”ప్రవాసి హెరాల్ద్’అనే పత్రిక ను స్థాపించి ,దాని సంపాదకు రాలుగా ఉంటూ ,దానినీ తన అభిరుచి మేరకు తీర్చి దిద్దు తున్నారు .’సమాజ సేవే ఉచ్చ్వాస నిస్శ్వాసాలుగా అనుక్షణం జీవితాన్ని పండించు కొంటున్న ధన్య జీవి శ్రీ మతి కాకాని భవాని . అందరికి ఆమె జీవితం ఆదర్శం కావాలి .ఉత్తేజం,ప్రేరణ పొందాలి .
మీ— గబ్బిట దుర్గా ప్రసాద్– 4-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com


i am really happy to have come to know about a good samaritan. my thanks to both durgaprasad garu and gopala krishna garu.
regards,
a gandhi
LikeLike