అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా మరియు అమరజీవి కుశాల్ కొన్వార్

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా

అస్సాం మహిళా సింహం ,అమర జీవి ,ప్రముఖ స్వాతంత్ర్య సమార యోద్దురాలు జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ,బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు అసువులుబాసి వీరమరణం చెందిన సాహసురాలు కనకలతా బారువా .ఈమె కూడా ప్రస్తుతం విస్మృత యోదురాలై పోయింది .ఆమె గురించి వివారాలు తెలుసు కొందాం .

అస్సాం లోని దరంగ్ జిల్లా బోరంగ బారిలో కనకలతా బారువా 22-12-1924న జన్మించింది .తండ్రి కృష్ణ కాంత్ .తల్లి కామేశ్వరి బారువా .తాతగారు ఘనా కాంత బారువా దరంగ్ జిల్లా  లో గొప్ప వేటకాడు .ఆమె పూర్వీకులు డోలా కారి బారువా రాజ్యానికి చెందిన వారు .దోలకారి ఇంటిపేరును వదిలేసి బారువా పేరునే ఉంచుకున్నారు .అయిదేళ్ళకే తల్లిని ,పదమూడేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయినదురదృష్ట వంతురాలు కనక లత .మూడో క్లాస్ వరకు మాత్రమె చదివి ,కుటంబం లోని చిన్న పిల్లలను సంరక్షించే ఉద్దేశం తో చదువు మానేసింది .

క్విట్ ఇండియా ఉద్యమం లో అస్సాం లోని గొహ్ పూర్ సబ్ డివిజన్ లో యువత ‘’మృత్యు వాహిని “’దళాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని ఎదిరిస్తుంటే కనకలత కూడా అందులో చేరి పోరాడింది .20-9—1942నాడు మృత్యు వాహిని దళం స్తానిక  పోలీస్ స్టేషన్ పై జాతీయ పతాకను ఎగర వేయాలని నిశ్చయించింది .గ్రామస్తులందరూ నిరాయుధులుగా కనక లత నాయకత్వం లో ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు .అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఇంచార్జి పోలీస్ ఆఫీసర్ రేవతి మోహన్ సోమ్ .జనం ఉద్దేశ్యం గ్రహించి ,ముందుకు అడుగు వేస్తె తీవ్ర పరిస్తితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు .పోలీసుల హెచ్చరికలకు వీసమంతా కూడా భయపడకుండా జైజై  లు కొడుతూ  వాహిని దళం స్టేషన్ ను సమీపించింది .కనక లత చేతిలో జాతీయ పతాకం రెప రెప లాడుతోంది. దాన్ని పోలీస్ స్టేషన్ పై ఎగరేయాలనే ఉత్సాహం తో ఆమె ముందుకు నిర్భయం గా అడుగులు వేస్తూ దూసుకు పోతోంది .పోలీసులు ఆమె పై కాల్పులు జరిపారు .ఆమె చేతిలోని జెండాను ఆమె వెనకే ఉన్న ముకుంద కాకోటి తీసుకొని ముందుకు వెళ్ళగా  పోలీసులు తుపాకీ గుళ్ళ వర్షం కురిపించారు .ఈవిదం గా పోలీస్ ఆక్షన్ లో కనకలతటా బారువా ,ముకుంద కాకోటి ఇద్దరు ప్రాణాలు అర్పించి అమర జీవులైనారు .మాతృభూమి సంరక్షణ కోసం ధైర్యం గా జాతీయ జెండాను ఎగర వేసే ప్రయత్నం లో అమరజీవి అయిన కనకలత వయస్సు అప్పటికి పది హేడేళ్లు మాత్రమే నని తెలిస్తే ఆ యువతి సాహసానికి నివ్వెర పోతాం ..

భారతీయ తీర రక్షణ ఫాస్ట్ పెట్రోల్ నౌకకు 1977కనకలతా బారువాగా  నామకరణం చేసి ప్రభుత్వం గౌర వించింది .2011లో గౌరీ పూర్ లో కనకలత నిలు వెత్తు విగ్రహాన్ని ఏర్పరచి ప్రభుత్వం నివాళు లర్పించింది .

 

అస్సాం లో క్విట్ ఇండియా ఉద్యమం లో ఉరితీయ బడ్డ  – కుషాల్ కొన్వార్

అస్సాం లోనే మరో స్వాతంత్ర్య సమార యోధుడు క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులు బాసి అమరుడైనాడు .ఆయనే కుశాల్ కొన్వార్ .21-3-1905న అస్సాం లోని  ఈ నాటి గోలా ఘాట్ జిల్లా సరూపతార్ దగ్గర బలిజాన్ లో కుశాల్ కొన్వార్ జన్మించాడు .బెజ్ బారువా స్కూల్ లో చదివాడు .గాంధీ గారి సహాయ నిరాకరణ పిలుపుకు ఉత్తేజితుడై ఇష్టం గా పాల్గొన్నాడు .మహాత్ముడి మంత్రం’ సత్యం .అహింస స్వరాజ్యం ‘’కొన్వార్ పై గొప్ప ప్రభావాన్ని కల్గించింది .ఈ భావ వ్యాప్తికి ఒక ఎలిమెంటరి స్కూల్ పెట్టి అందులో గౌరవ ఉపాధ్యాయుడు గా పని చేసి విద్యార్దులలో జాతీయ స్పూర్తి రగిలించాడు .తరువాత బలిజాన్ టీ ఎస్టేట్ లో గుమాస్తాగా,సూపర్వైజర్ గా  చేరి పని చేశాడు. మనసంతా మహాత్ముని పిలుపే నిండిపోయి ,పూర్తిగా స్వాతంత్ర్య సమరం లో అంకితభావం తో పని చేయాలనే నిర్ణయానికి వచ్చాడు .సరూపతార్ ప్రాంతం లో కాంగ్రెస్ పార్టీని స్థాపించి ,బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకం గా సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమాలు నిర్వహించాడు .సరుపతార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డాడు .

কনকলতাৰ প্ৰতিমুৰ্তি.JPG  

1942ఆగస్ట్ 8న బొంబాయి లో కాంగ్రెస్ సమావేశం లో మహాత్ముడు ‘’క్విట్ ఇండియా ‘’పిలుపు నిస్తూ తీర్మానాన్ని ఆమోదింప జేశాడు .భారత దేశం నుండి పూర్తిగా బ్రిటీష్ వాళ్ళు వెళ్లి పోవాల్సిందే అన్నది ఆ తీర్మాన సారాంశం .గాంధి అక్కడి నుంచే ‘’విజయమో వీర స్వర్గమో ‘’అనే పిలుపు నిచ్చాడు ఇది దేశ జనాలకు మంత్రమే అయింది.దీనికి బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహం చెంది గాంధి తో సహాఅనేక మంది  జాతీయనాయకులను అరెస్ట్ చేసి జల లో పెట్టించింది  .కుల మతాలకు అతీతం గా ఆ సేతు హిమాచల పర్యంతం ప్రజలు వీధుల్లోకి వచ్చి బహిరంగం గా  ‘’క్విట్ ఇండియా ‘’నినాదాలు చేస్తూ ‘’వందే మాతరం ‘’అంటూ నినదిస్తూ ఉద్యమం  చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్ర పోయి కంటికి కునుకు లేకుండా చేశారు .గాంధి శాంతియుతం ఆ సత్యాగ్రహం చేయమని పదే పదే చెప్పినా కొన్ని చోట్ల హింసా దౌర్జన్యం చోటు చేసుకొని భీభత్సం సృష్టించింది .ప్రభుత్వ ఆఫీసులను  రైలు, బస్సులను తగల బెట్టి కమ్యూని కేషన్ లను విధ్వంసం చేశారు ప్రజలు ప్రజల ఆగ్రహానికిది పరా కాస్ట గా నిలిచింది .

అస్సాం లో కూడా క్విట్ ఇండియా ఉద్యమం ఊపు అందుకొన్నది .అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు గోపీనాద్ బర్దోలోయ్ ,సిద్ధినాద శర్మ లను బొంబాయి కాంగ్రెస్ సభల నుంచి తిరిగి వస్తుండగా  బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .అస్సాం మిగతా ప్రాంతాల నాయకులైన బిష్ణురాం మేది ,బిమలా ప్రసాద్ చాలిహా మొదలైన వారినీ జైలు లో పెట్టింది .మిగిలిన దేశం తో పాటు అస్సాం కూడా హింసా ప్రజ్వలనం తో అట్టుడికి పోయింది .10-10-1942 న మంచు దట్టం  గా కమ్ముకున్న సమయం లో గోలా ఘాట్ జిల్లా లోని సారూ పాటర్ వద్ద రైల్వేలైన్ కున్న  స్లీపర్లను కొందరు తొలగించారు .అదే దారిపై నడిచిన మిలిటరీ ట్రెయిన్  పట్టాలు తప్పటం వలన వందలాది బ్రిటిష్, అమెరికన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు .బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రాంతం లో సైనికులను మొహరించి దోషులను పట్టుకొనే ప్రయత్నం తీవ్రం గా చేసింది .కని  పించిన ప్రతివాడిని విపరీతం గా కొట్టి హింసించి అరెస్ట్ చేసి .టెర్రర్ సృష్టించింది ఆ ప్రాంతం లో ..

ఈ రైలు కుట్రకు ముఖ్య పాత్రధారి కుశాల్ కొన్వార్ అని భావించి వెతికి పట్టుకొని అరెస్ట్ చేసింది .మహాత్ముని అడుగు జాడల్లో అహింస సత్య వ్రతం తో ఉద్యమాన్ని నడుపుతున్న కుశాల్ కు ఈ కుట్ర తో ఏమీ సంబంధం లేని అమాయకుడు .ఈ విషయాన్ని ప్రజలంతా ముక్త  కంఠం తో మొట్టుకొన్నారు .కాని ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఉండవనే సామెత రుజువు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .కుశాల్ మాత్రమె దీనికి ముఖ్య సూత్ర దారి అని నమ్మి ,అతన్ని గోలాఘాట్ నుంచి తీసుకొని వచ్చి 5-9-1942నఅరెస్ట్ చేసి జోర్హాట్ జైలు లో పెట్టింది .సి.ఏం హంఫ్రీ నాయకత్వం లోని కోర్టు  ఏ రకమైన ఆధారాలు లేక పోయినా ,చూప లేక పోయినా కుశాల్ దోషి అని నిర్ధారించింది,ఉరిశిక్ష వేసింది  .కుశాల్ భార్య ప్రభావతి  జోర్హాట్ జైలుకు వచ్చి నిర్దోషి ,అమాయకుడు అయిన తన భర్తకు ను దోషి అని అని తేల్చటం భరించ లేక వల వలా ఏడ్చేసింది .ఆమెను ఓదారుస్తూ కుశాల్ ‘’వేలాది మంది స్వాతన్నత్ర్య సమర సైనికులు ఉండగా   నామాతృదేశం కోసం ప్రాణాలను అర్పించే అరుదైన గౌరవం నాకు భగవంతుడు కల్పించాడు ఇది నాకు అదృష్టం ‘’అని ఆనందం గా సంతృప్తిగా చెప్పిన దేశ భక్తుడు కుశా ల్ .ఉరి శిక్ష అమలు అయ్యేదాకా జైలు లో భగవద్ గీత చదువుకొంటూ ,ప్రార్ధనలు చేసుకొంటూ కాలం గడిపిన స్తిత ప్రజ్ఞుడు కొన్వార్ .Image result for kushal konwar  Inline image 1

15-6-1943 తెల్ల వారుజామున 4-30 గం లకు కుశాల్ కొన్వార్ ను జోర్హాట్ జైలు లో  ఉరితీశారు .ఉరికంబం ఎక్కి ధైర్యం గా ‘’ఇంక్విలాబ్ జిందాబాద్ ‘’అంటూ నినాదాలు చేసి ,తనకిష్టమైన ప్రార్ధనగీతం ‘’పార్ కోరా రఘునాధ –సంసార సాగర ‘’ పాడు కొంటు అసువులు బాసి అమరజీవి అయ్యాడు .’మహాత్మా గాంధీ ‘’జీవించటం మరణించటం అనే కళా మర్మం తెలిసిన వాడే అసలైన సత్యాగ్రహి .అలాంటి అరుదైన సత్యాగ్రహి షహీద్ కుశాల్ కొన్వార్ ‘’అని  ప్రశంసించాడు ..

కుశాల్ కొన్వార్ నిర్భీతికి ఒక ఉదాహరణ –బలిజియన్ టీ ఎస్టేట్ లో సూపర్ వైజర్ గా కుశాల్ పని చేస్తున్నప్పుడు ,పక్కనే ఉన్న  ఇంగ్లీషు దొర విల్సన్ యజమానిదైన జముగురి టీ ఎస్టేట్ కి చెందిన అరవై డెబ్భై ఆవులు వీరి టీ తోటల్లోకి చొరబడి నాశనం చేస్తూంటే కుశాల్ వాటినన్నిటిని తాళ్ళతో బంధించాడు .అ ఆవుల్ని కాసేవాడు వచ్చి విడిచిపెట్టమని కోరితే ,వాళ్ళ యజమానినే వచ్చి అడగమని చెప్పాడు .వాడువెళ్లి చెబితే దొర వచ్చాడు .ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి దొర కర్రతో కొన్వార్ ను కొట్టబోతే కొన్వార్ వెంటనే చెప్పు తీసి పీత కొట్టుడు కొట్టేశాడు..కుశాల్ తీవ్రత ధైర్య సాహసాలకు భయపడి దొర పారిపోయాడు .ఈ సంఘటన తో అతని పేరు ఆ ప్రాంతమంతా మారు మోగి రైతు సంఘానికి నాయకుడిగా ఎన్నుకొన్నారు .కుశాల్ కొన్వార్ బలిదానం వృధా పోలేదు .భారత దేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.