పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని

శ్రీ కావ్య కంఠ వాసిష్ట  గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’చివరిదైన పదవ శతకం  నలభై వ స్తబకం  లో ‘’పాదాకులక వృత్తం ‘’లో దేవి దివ్య విభూతిని సందర్శించి ,ఆ అనుభూతిని మనకూ అందజేస్తున్నారు .ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రం గా భక్తికి పరాకాష్టగా ,ఆనందానికి అవధి రహితం గా పదే పదే మననం చేసుకొనే రీతిగా ఉంటాయి .ఆ వైభోగం చూద్దాం –‘’శమయతు పాపం దమయతు దుఖం ,హరతు విమోహం స్ఫుటయతు బోధం –ప్రధయతు శక్తిం మందం హసితం, మనసిజ శాసన కుల సుదృశోనః ‘’

అని మొదటి శ్లోకాన్ని చెప్పారు .మన్మధ వైఖరి అయిన శివుని ఇల్లాలు పార్వతీ దేవి మందహాసం మన పాపాలను నివారించి దుఖాలను నశింప జేసి ,భ్రమలను తొలగించి ,జ్ఞానాన్ని వికసింప జేసి ,శక్తిని ప్రకటించాలని ముని కోరుకొన్నారు .రెండవ శ్లోకం లో –‘

‘’ఆర్ద్రా దయాయా పూర్ణా శక్త్యా ,ద్రుష్టి వశం వదవిస్టపరాజా –అఖిల పురంధ్రీ పూజ్యా నారీ ,మమ నిశ్శేషాంవిపదంహరతు ‘’

దయతో అమ్మవారి మనసు మెత్త బడి శక్తి పూర్ణమై ,చూపులతోనే లోకేశ్వర శివుని వశ పరచుకొని ,లోకం లో ఇల్లాండ్ర చేత పూజింప బడుతూ ఉన్న పరమేశ్వరి ఆపదలను నశింప జేయాలని వేడుకొన్నారు .ఇక్కడి నుండి ప్రతి శ్లోకం ఒక రస గుళిక యే.కవి కవితామృత దారయే .

‘’శుద్ధ బ్రాహ్మణి మోదో దైవం ,తత్ర సిస్రుక్షతి కామో దైవం –సృజతి పదార్ధాన్ దృష్టిర్డైవం,తాన్భిభ్రాణే మహిమా దైవం ‘’

సకలం అని నిష్కళం అని విభజించ టానికి వీలు కానీ ద్వంద్వానికి అతీతమైన ,స్వతస్సిద్ధం అయిన బ్రహ్మలోని ఆనందం దైవం .అంటే దైవ స్వరూపం ఆనందమే అని అర్ధం .సృష్టించాలి అనే బ్రహ్మ గారి  కోరిక ఇచ్చ దైవం.అంటే ఇక్కడ దైవ స్వరూపం సృజ ఇచ్చ  .పదార్ధాలలను సృష్టించే బ్రహ్మం లోని ద్రుష్టి దైవం –అంటే సృష్టి నిర్వాహకం అయిన చూపు దైవమె .సృజింప బడిన పదార్దాలను భరించే బ్రహ్మం లోని మహిమ దైవం అంటే ధారణా శక్తి దైవమె .తరువాత

‘’విక్రుతౌ విక్రుతౌ ప్రకృతిర్డైవం ,విషయే విషయే సత్తా దైవం –ద్రుస్టౌ ద్రుస్టౌ ప్రమతిర్డైవం ,ధ్యానే ధ్యానే నిష్టా దైవం ‘’

వస్తువులు నామ రూపాలతో వికారాన్ని పొందుతూ ఉండి,,వాటి వికార రహితమైన ప్రక్రుతి దైవం .దృష్టికి గోచరం అయ్యే సమస్త విషయాలలోనూ ఉనికికి ఆధారమైన సత్త దైవామే .ప్రతి దర్శన క్రియ లోను ఉన్న బుద్ధి దైవమె .ప్రతి ధ్యానం లో ఉన్న నిష్ట అంటే దృఢమైన స్తితి దైవమె నంటారు గణ పతి ముని .తరువాతి శ్లోకం లో –

‘’స్పూర్తౌ స్పూర్తౌ మాయా దైవం ,చలనే చలనే శక్తిర్డైవం –తేజసి తేజసి లక్ష్మీ ర్డైవం ,శబ్దే శబ్దే వాణీ దైవం ‘’

ప్రతి స్పందన లోని మహా శక్తి దైవమె .ప్రతి కదలిక లోని చలన ఆవశ్యక శక్తి దైవమె .ప్రతి  తేజస్సులోని కాంతి దైవమె .ప్రతి ధ్వనిలోని చెవులకు వినిపింప జేసే శక్తి దైవమె అని వివరించారు .

‘’హృదయే హృదయే జీవర్డైవం ,శీర్శే శీర్శే ధ్యాయద్ద్సైవం –చక్షుషి చక్షుషి రాజర్డైవం ,మూలే మూలే ప్ప్రతప ద్డైవం ‘’

ప్రతిగుండేలో జాగరూకం అయిఉండేది దైవం .ప్రతి శిరస్సులో ధ్యానించేది దైవమె .ప్రతి కంటిలో ప్రకాశించేది దైవమె .ప్రతి మూలాధార చక్రం లో ప్రజ్వలించేది దైవమె .

‘’అభితో గగనే ప్రస ర్డైవం ,పృధివీ లోకే రోహద్డైవం –దినకర బింబే దీప్యద్డైవం,సిత కర బింబే సిన్చిద్డైవం’’

ఆకాశం అంతా వ్యాపించేది దైవం. భూమిలో మోలిచేది దైవం .సూర్య మండలం లో వెలిగేది దైవం .చంద్ర మండలం లో అమృతాన్ని స్రవించేది దైవం అన్నారు .

‘’శ్రావం శ్రావం వేద్యం దైవం ,నామం నామం రాధ్యం దైవం –స్మారం స్మారం దార్యం దైవం ,వారం వారం స్తుత్యం దైవం ‘’

మాటి మాటికి విని తెలుసుకోన దగింది దైవం .నిత్యం ప్రణామం తో ఆరాదించేది దైవం .స్మరణ చేస్తూ చేస్తూ ధారణ తో పొందదగింది దైవం. అనేక రకాలుగా వరించి స్తుతింప దగింది దైవం .

‘’శ్రుతిషు వటూనాం గ్రాహ్యం దైవం ,గృహినా మగ్నౌ తర్ప్యం దైవం –తపతా శీర్శే పుష్టం దైవం ,యతీనాం హృదయే శిష్ట దైవతం ‘’

బ్రహ్మ చారులకు వేదాధ్యయనమే ఆశ్రమ ధర్మం అయిన తపస్సు .అదే వారికి దైవం .గృహస్తులకు అగ్ని హోత్రమే దైవం .తపస్సు చేసేవారికి శిరస్సులో వృద్ధి పొందినదే దైవం .సన్యాసులకు దహరా కాశం లో వ్రుత్తి రహితమై ఆత్మ రూపం లో మిగిలిందే దైవం .

‘’నమతా  పుశ్పైఃపూజ్యం దైవం ,కవినా పద్యారాధ్యం దైవం –మునినా మనసా ధ్యేయం దైవం ,యతినా స్వాత్మని శోధ్యం దైవం ‘’

నమస్కరించే వాడికి పుష్పాలతో పూజింప దగినదే దైవం .కవికి పద్యాలతో ఆరాధింప బడేదే దైవం .మునికి మనసులో ద్యానింప దగినదే దైవం .ఇంద్రియ నిగ్రహుడైన యతికి తనలో శోధింప దగిన అంటే తన మూల రూప స్వరూప మైనదే దైవం అంటారు .తరువాత

‘’స్తువతాం వాచో విడధ ద్డైవం,స్మరతాం చేత స్స్ఫుటయ ద్డైవం –జపతాం శక్తిం ప్రదయ ద్డైవం ,నమతాం దురితం దమయత దైవం ‘’

స్తోత్రం చేసే వారి వాక్కులను స్తుతి సమర్దాలను  చేసేదే దైవం .ధ్యానించే వారి  చిత్తాన్ని వికశింప జేసేదే దైవం .మంత్ర జపం చేసే వారి శక్తిని విజ్రుమ్భింప జేసేదే దైవం .నమస్కరించే వారి పాపాలను నశింప జేసేదే దైవం .

‘’వాచో వినయం ద్వాహ్నౌ దైవం ,ప్రాణాన్ వినయ ద్విద్యుతి దైవం –కామాన్వినయ చ్చంద్రే దైవం ,బుద్దీర్వినయ త్సూర్యే దైవం ‘’

అగ్నిలో ఉండి వాక్కులను ఉపదేశించేది దైవం .మెరుపు లో ఉండి ప్రాణాలను నడిపేది దైవం .చంద్రునిలో ఉండి నియమించేది దైవం సూర్యునిలో ఉండి బుద్ధులను ప్రేరేపించేదే దైవం .వివరం గా చెప్పాలంటే –అగ్ని వాగ్దేవత అని వేదం చెప్పింది .అంత రిక్షం లో వ్యాపించిన జ్యోతిలో ఉన్న శక్తి ప్రాణులకు చలన శక్తి కలిగిస్తుంది .కోరిక తో మరణించిన వాడు చంద్ర లోకం చేరుతాడు .కనుక చంద్రుడిలో ఉండి కామాలను నియమిస్తాడు .సూర్యుడు బుద్ధి ప్రేరేపకుడు అని వేదం అన్నది .దీనికి గాయత్రీ మంత్రమే సాక్ష్యం .

‘’హృదయే నివసద్ గృహ్ణ ద్డైవం ,వస్తౌ నిసాద్విసృజ ద్డైవం –కంఠే నివాసత్ప్ర వద ద్డైవం ,కుక్షౌ నివస్ప్రపచ  ద్డైవం ‘’

హృదయం లో సాక్షిగా ఉండి అంతటిని తెలుసుకోనేదే దైవం .పొత్తి కడుపు నుండి మలిన పదార్ధాలను విసర్జించి ,నిర్మలత్వాన్ని కల్గించేదే దైవం .కంఠంలో ఉండి  ప్రవచనం చేసేది దైవం .పొట్టలో ఉండిద తిన్నదాన్ని జీర్ణం చేసేది దైవం .‘’దేహే నివాసద్విచలద్డైవం , పంచ ప్రాణాకారం దైవం –భాగి సమస్త స్యాన్నే దైవం ,స్వాహాకారే త్రుప్య ద్డైవం ‘’

దేహం లో స్తిరం గా ఉండి కదిలేది దైవం .పంచాప్రాణాకారం కలది దైవం .స్వాహాకారం లో తృప్తి చెందేది దైవం .

‘’భిభ్రన్నారీ వేషం దైవం ,శుభ్ర దరస్మిత విభ్రాద్డైవం –అభ్రమ దాపహ చికురం దైవం ,విభ్రమ వాస స్థానం దైవం ‘’’

స్త్రీ వేషం ధరించిన ది దైవం .తెల్లని చిరునవ్వు ప్రకాశం కలది దైవం .నీల మేఘాన్ని మించిన కేశాలు కలది దైవం .విలాసాలకు నిలయమైనది దైవం .

‘’శీత జ్యోతి ర్వదనం దైవం ,రుచి బిందూప మరందం దైవం –లావణ్యామృత సదనం దైవం ,సమర రిపు లోచన మదనం దైవం

చంద్రుని వంటి ముఖం కలది దైవం .కాంతి బిందువులతో సమాన మైంది దైవం .సౌందర్యం అనే అమృతానికి నిలయమైంది దైవం .కామారి అయిన శివుని నేత్రానందకారకం  దైవం .

‘’లక్ష్మీ వీచి మదలికం దైవం ,ప్రజ్ఞా వీచి  మదీక్షం దైవం –తేజో వీచి మదధరం దైవం ,సమ్మద వీఛి మదస్యం దైవం ‘’

శోభా తరంగాలతో కూడిన లలాటం కలది దైవం .చిన్మయ తరంగ ముల  చూపు  కలది దైవం .తేజస్సు అనే తరంగ సహితమైన కింది పెదవికలది దైవం .ఆనంద తరంగ భరితమైనది దైవం .

‘’కరుణాలోలిత నేత్రం దైవం ,శ్రీ కారాభ శ్రోత్రం దైవం –కుసుమ సుకోమల గాత్రం దైవం ,కవి వాగ్వై భవ పాత్రం దైవం ‘’

దయ అలల్లాగా ప్రసరిస్తున్న కన్నులు కలది దైవం .సంస్కృతం లో ,తెలుగులో రాయబడే శ్రీ అనే అక్షరాన్ని పోలిన చెవులు కలది దైవం .కుసుమ కోమల శరీరం కలది దైవం .కవి వర్ణన లకు ఆస్పదమైనది దైవం .

‘’హిమవతి శైలే వ్యక్తం దైవం,సిత  గిరి శిఖరే క్రీడ ద్డైవం –తుంబురు నారద గీతం దైవం ,సురముని సిద్ధ ధ్యాతమ్ దైవం ‘’

హిమాలయాలలో ఉమాదేవి గా విరాజిల్లేది దైవం .కైలాస శిఖరం పై క్రీడించేది దైవం .తుంబురు నారద భక్త గాయకులచే కీర్తింప బడేది దైవం .దేవతలు ,మునులు ,సిద్ధుల చేత ఏకాగ్రత తో ద్యానింప బడేది దైవం  .

‘’క్వచిదపి రతి శత లలితం దైవం ,క్వచి దపి సుతరాం చండం దైవం –భక్త మనోనుగవేషం దైవం ,యోగి మనోనుగ విభవం దైవం ‘’

ఒక చోట అనేక విలాసాలతో సౌమ్యం గా ఉండేది దైవం .వేరొక చోట మిక్కిలి భయంకర ఉగ్ర రూపం లో ఉండేది దైవం .భక్తుల మనస్సులను బట్టి బాహ్య ఆకారాలు ధరించేది దైవం .అమోఘమైన సంకల్పం ఉన్న యోగుల మనస్సులను అనుసరించి ఐశ్వర్యం కలది దైవం .

‘’చరితే మధురం స్తువతాం దైవం ,చరణే మధురం ,నమతాం  దైవం –ఆధరే మధురం శంభోర్డైవం ,మమతుస్తన్యే మధురం దైవం ‘’

స్తోత్రాలు చేసే వారికోసం తన చర్యల్లో మధురమైనది దైవం .నమస్కరించే వారి కోసం పాదాల యందు మధురమైనది దైవం .పరమ శివుని కోసం అధరోస్టం లో మధురమైనది దైవం .పుత్రుడైన గణపతి కి  మాత్రము స్తన్యం లో మధురమైనది దైవం.

భుజ భ్రుత విస్టప  భారం దైవం ,పద ద్రుత సంపత్సారం దైవం –లాలిత నిర్జర వీరం దైవం ,రక్షిత సాత్విక ధీరం దైవం ‘’

బాహువుల్లో జగత్తు యొక్క రక్షణ భారాన్నివహించేది దైవం .అన్ని సంపత్తులకు పాదములు కలది దైవం .దేవ వీరులను లాలించేది దైవం .సత్వ గుణ ప్రధానులైన జ్ఞానుల్ని రక్షించేది దైవం .ఇరవై నాలుగో శ్లోకం లో

‘’రమణ మహర్షే రంతే వాసీ ,మధ్యమ పుత్రో నరసింహస్య –వాసిష్టో యంమరుతాం మాతు ర్గణపతి రంఘ్రిం శరణ ముపైతి ‘’

అరుణాచలం లో ఉంటున్నభగవాన్ శ్రీ రమణ మహర్షి శిష్యుడు ,శ్రీ నరసింహ జనకునికి మధ్య తనయుడు ,వసిష్ట గోత్రోద్భవుడు అయిన ఈ గణపతి కవి ,దేవ మాత అయిన ఇంద్రాణీ దేవి చరణాలను ఆశ్రయిస్తున్నాడు .అంటూ చరణ మే శరణం అని భక్తిగా ఆర్తిగా అమ్మ పాదాలనాశ్రయించారు కవి ముని .చివరగా ఇరవై అయిదవ శ్లోకం –

‘’త్రిభువన భర్తుఃపరమా శక్తిః ,సకల సవిత్రీ గౌరీ జయతే –తన్నుతి రేషా గణపతి రచితా –పాదాకుల ప్రాంతా జయతి ‘’

మూడు లోకాలకు ప్రభువు అయిన పరమేశ్వరుని సర్వోత్క్రుస్ట శక్తి ,విశ్వానికి జనని అయిన ఉమాదేవి సర్వోత్తమం గా విరాజిల్లు తోంది .గణపతి కవి ‘’పాదాకుల వృత్తం ‘’లలో రచించిన శ్లోకాలతో ప్రశస్తం గా ముగిసిన శ్రీ ఉమా దేవి స్తుతి సర్వోత్క్రుస్టం  గా విలసిల్లు తోంది అని గణ పతి ముని తన వెయ్యి శ్లోకాల ‘’ఉమా సహస్రాన్ని ‘’చాలా అర్ధ వంతం గా ఎవరికైనా అమ్మ వారి పాదాలే శరణు అవే దారి చూపిస్తాయి అని ,సందర్భానికి తగిన  ‘’పాదాకుల వృత్తం ‘’ను ఎన్నుకొని మధుర మధురం గా దేవీ గానాన్ని చేసి అందులోని మాదుర్యామృతాన్నితనివార గ్రోలి ,మనకూ ఆ అమృత రససేవనం అందించి ధన్యులని చేశారు .

గణపతి ముని రచించిన  వెయ్యి శ్లోకాలతో,వాటికి చక్కని అర్ధ తాత్పర్యాలను శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు మనస్సుకు హత్తుకోనేట్లు రాసిన’’ఉమా సహస్రం ‘’  పుస్తకం555పేజీల  ఉద్గ్రంధం .దీనిని ఫిబ్రవరిలో శ్రీ రమణాశ్రమాన్ని దర్శించినపుడు కొన్నాను .కాని జూలై దాకా చదవ టానికి అవకాశం కలగ లేదు . ,జులై 18న చదవటం ప్రారంభించి నిన్న అంటే ఆగస్ట్ 17న నెల రోజుల్లో పూర్తీ చేశాను .ఎక్కడికక్కడ ఎన్నో కొత్త విషయాలు నన్ను ఆకర్షించాయి వాటిని మీ అందరికి తెలియ జేయటానికే కొన్ని వ్యాసాలు  రాసి గణపతి మునికవి ఆంతర్యాన్ని తెలియ జేసే చిరు ప్రయత్నం చేశాను .దోషాలన్నీ నావి .మహత్తు అంతా మహనీయులు కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని కవి గారిది అని వినమ్రం గా విన్న  వించు కొంటున్నాను .ఇంతటి గొప్ప గ్రంధం చదివే మహద్భాగ్యం నాకు ఏ పురాకృత సుకృతం వల్లనో లభించిందని ,ఉమా దేవి అనుగ్రహమే నన్ను ప్రేరేపించి చది వి చిందని ని నమ్ముతున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-14-ఉయ్యూరు

 

‘’

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.