సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1
ముందు మాట –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14
డా.శ్రీ అసిలేటి నాగ రాజు -ప్రముఖ కధకులు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారి ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటి పై పరిశోధన చేసి రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో శర్మ గారి అభ్యర్ధన మేరకు నేనూ పాల్గొన్నాను .అదే నాగరాజు గారితో మొదటి పరిచయం .సుమారు వారం క్రితం నాగ రాజు గారు ఫోన్ చేసి తానూ ‘’వికలాంగుల కధలు –అస్తిత్వ చిత్రణ ‘’కదా సంకలం తెస్తున్నానని ,ముందుమాట రాయమని కోరగా సరేనన్నాను .ఇరవై అయిదు కధలను వివిధ వయసులలో ఉన్నవారు రాసిన కధలు ఇవి .అందులో ఆరుగురు వికలాంగులు కూడా ఉండటం సంకలనానికి నిండు దనం తెచ్చింది .నాగరాజు కూడా వికలాంగుడే. లబ్ధ ప్రతిస్టూ లైన అడవి బాపిరాజుగారు , ,జూపాక సుభద్ర గారల కధలు కూడా ఉండటం తో మరింత శోభ చేకూరింది .కద కద కోసం కాకుండా జీవిత సత్యాన్వేషణ కోసం రాసిన కధలివి .వికలాంగుల మానసిక వేదన ,సమాజం వారిపట్ల చూపే నిరాదరణలను అధిగమించి నిత్య చైతన్యం తో విధి ఎర్పరచిన వక్రత ను అవక్ర పరాక్రమమైన ధైర్యం తో ఎదుర్కొని ,లక్ష్యాన్ని ఎన్నుకొని ,గమ్యం చేరే విధానం దాదాపు అన్ని కధల్లోనూ స్పుటం గా కన్పించింది .ఆశా దీపం ఆరిపోకుండా కాపాడుకొనే చిత్తస్థైర్యం ముగ్ధులను చేస్తుంది .తాత్కాలికం గా కుంగి పోయినా బంతి లాగా మళ్ళీ ఎగిరేపాత్రలుదిశా నిర్దేశం చేస్తాయి .వికలాంగు లైనా వారి మనసు వికలాంగం కాదు .అందులో సంపూర్ణ వికసనం దర్శిస్తాం .హెలెన్ కెల్లర్, సుధా చంద్రన్ ,స్టీఫెన్ హాక్ లాంటి వారి జీవితాలను తెలుసుకొని స్పూర్తి పొందిన వారికధలే ఇవి .,నిరాశా ,నిస్పృహలతో ఆత్మ హత్య చేసుకో కుండా ,ఆత్మ స్థైర్యం తో జీవించిన వారి కధలు, గాధలే ఇవి .అందుకే ‘’సర్వాంగ సుందరం ‘’అన్నాను .
ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రక మైన ఆత్మ ఘోష .జీవితపు మాధుర్యాన్ని జుర్రుకోవాలనే ఆలోచన ,తానూ ఎదిగి తన లాంటి నిర్భాగ్యులకు సేవ చేయాలనే కృత నిశ్చయం ఈ కధల్లో ఉన్న అంతస్సూత్రం .కృత్రిమత మచ్చుకు కూడా కనపడ కుండా సహజ సుందరం గా రాసిన ఈ కధల్లో ఆయా పాత్రల అస్తిత్వం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది .పాత్రల మనో నిబ్బరానికి ,ఆదర్శాలను ఎంచుకొన్న వైనానికి ముచ్చట పడతాం .ఇవికధలు కావు –జీవితపు సత్య చిత్రణలే అనిపించేంత గొప్ప గా దాదాపు అందరూ రాశారు .మాండలికం లో రాసినా ,లంబాడీ తండా భాషలో రాసినా కధలు అందం గా వచ్చాయి .మనసుకు పడతాయి ఆలోచింప జేస్తాయి .’’మన కర్తవ్యం ఏమిటి ?’’అనే దుగ్ధను రేకెత్తిస్తాయి .ఈ కదాసంకలనం చదవటం నాకు గొప్ప అను భూతిగా ఉంది .దీనిపై నాలుగు మాటలు రాయటం నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇవి ముద్రణ పొంది మిగిలిన వారికి స్పూర్తి ,ప్రేరణ కలిగిస్తాయన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-14-ఉయ్యూరు
