సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్

సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్

  • 21/12/2014
TAGS:

ముషీరాబాద్, డిసెంబర్20: దేశంలో సోషలిస్టు భావాలకు ఒక భూమిక ఏర్పడటానికి సంత్‌గాడ్గే బాబా మహరాజ్ భోదనలు, కీర్తనలు ఎంతగానో ఉపకరించాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సంత్‌గాడ్గే బాబా మహారాజ్ అంబేద్కర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాడ్గేబాబా 58వ వర్థంతి కార్య క్రమం నిర్వహించారు. సంస్ధ చైర్మన్ అందోల్ నర్సింగ్‌రావు ఆధ్వర్యంల సికింద్రాబాద్ శ్రీనివాసనగర్‌లో జరిగిన కార్యక్రమానికి చిలకలగూడ సిఐ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై గాడ్గేబాబా చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర సంచారి అయన గాడ్గేబాబా జనం మదిలో చిరస్తాయగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో డా. సి. రాజా, రజనీకాంత్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సంత్‌గాడ్గే వర్థంతి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20: వాగ్గేయకారుడు సంత్‌గాడ్గె బాబా 58వ వర్థంతి సభను పట్నంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంత్‌గాడ్గె చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జన సమితి కన్వీనర్ కంబాలపల్లి సాయినాథ్, టిఆర్‌ఎస్ నాయకులు భర్తాకి రాజు, ఎల్లేష్, ఎండి అస్లం, బిఎస్పి నాయకులు మేడిపల్లి మహేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కప్పాటి రఘు మాట్లాడుతూ రజక కులంలో పుట్టి వాగ్గేయకారునిగా ఎదిగిన సంత్‌గాడ్గె మహనీయుడని కొనియాడారు.

గాడ్గేబాబాకు ఘన నివాళి
నల్లకుంట, డిసెంబర్ 20: స్వఛ్చతను పరిశుభ్రతను ప్రతి పౌరుడు ఆచరించాలన్న గాడ్గేబాబా అన్నారని సెయింట్ గాడ్గే బాబా మహారాజ్ మిషన్ అధ్యక్షుడు అమరజ్యోతి, ప్రధాన కార్యదర్శి కొండేటి నాగేశ్వరరావుఅన్నారు. శనివారం డిడీ కాలనీలోని సంహయోగ కేంద్రంలో గాడ్గేబాబా 58వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గాడ్గేబాబా చిత్రపటానికి పూల మాల వేసిన అనంతఠం వారు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందే పారిశుద్ధ్య ప్రాముఖ్యతను చాటి చేప్పి ప్రజలలోచైతన్యం కలిగించిన మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. గాడ్గేబాబా తన కీర్తనలతో సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలడానికి కృషి చేశారన్నారు. నేటి యువత ఆయన ఆలోచన విధానాలను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బాబాసాహెచ్ అంబేద్కర్ కూడా గాడ్గేబాబా ప్రవచనాలు ఆదర్శనీయమని ఎన్నో సందర్భాలలో పేర్కొన్నట్టు తెలిపారు. చీపురు పట్టుకుని స్వఛ్చ్భారత్‌లో భాగంగా గ్రామగ్రామాన తిరిగి గ్రామాలను తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలకుస్ఫూర్తినింపారన్నారు.ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు డా.సి.రాజు, వి.సత్యనారాయణ, జి.మస్తానయ్య, ఆంజనేయులు, టి.సాంబశివరావు, ఆర్‌ఎన్. విశ్వాస్, ఎంఎన్ రావు, రజనీకాంత్, కనకయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.