కూతురుకాని కూతురే తల్లికాని తల్లి

కూతురుకాని కూతురే తల్లికాని తల్లికొన్ని బంధాలు తమాషాగా యేర్పడి శాశ్వత బంధాలౌతాయి .చిరస్మరణీయాలౌతాయి .మధుర భావ బంధురాలౌతాయి ..ఎన్నో జన్మల అనుబంధాలేమో అనిపిస్తాయి .ఆ బంధానికి రెండు వైపులవారి స్పందనలు మరింత బలీయమైతే ఇక వాటిని గురించి చెప్పటానికి మాటలే ఉండవు . .ఆనందాను నుభవమే అయి మనసునమల్లెలై విరబూసి దిగంత వ్యాప్త పరిమళీ భూతాలౌతాయి .అలాంటి అనుబంధమే శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారికి ,డా  కామేశ్వరిగారికి యేర్పడింది .ఆమె ఆయనకు కూతురుకాని కూతురు మాత్రమే కాదు తల్లికాని  తల్లి కూడా ..  అబ్బూరి రామకృష్ణారావు  గారు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి ప్రోత్సాహం తో ”నన్నయ భట్టు పద ప్రయోగ కోశం ”తయారు చేశారు అంటే నన్నయ భారతం లో  యేపద0 యెన్ని సార్లు యెక్కడెక్కడ ప్రయోగించాదో తెలియజేసే ”కంకార్డెన్స్ ”అన్నమాట ..దీని ఆవిష్కరణ తిరుపతి వెంకటేశ్వరా యూని వర్సిటీలో జరిగి ,నన్నయ  భాషను గురించి  ప్రసంగించటానికి దువ్వూరి వారిని ఆహ్వానించారు .మాట్లాడి మేడ మెట్లు దిగుతుంటే ఇద్దరు ”కుమారికలు” కనిపించి శాస్త్రిగారికి నమస్కరించారు .అందులో ఒకామె శాస్త్రిగారి శిష్యురాలు రాజేశ్వరి .ఆమె ఎం.ఏ చేసి పిహెచ్ డి పరిశోధన చేస్తోంది .తిరుపతియాత్రకువచ్చి ,శాస్త్రిగారి ఉపన్యాసం ఉందని తెలిసి వచ్చి,శాస్త్రిగారిని పలకరించటానికే ఆగారు .తనకు వేసిన పూలదందను ”అమ్మా తీసుకోమని ”రాజేశ్వరికి ఇవ్వబోతుంటే ,,రెండవ ఆమె ”మాస్టారూ మేమిద్దరం తీసుకొంటాము ”అని చేయి చాచింది .ఆమె యెవరు అని రాజేశ్వరిని అడిగితే ”మనవూరే వైజాగు .మెడిసిన్ పూర్తి చేసి కేజీ హెచ్ లో పనిచేస్తోంది .మీరు కొద్దిగా తెలుసట..తిరువణ్ణామలై వెడుతూ ఇక్కడ ఆగింది .ఇక్కడే కలిశాం ..నాతో పాటు మీ ప్రసంగం వినటానికి వచ్చింది ”అని చెప్పి పరిచయం చేసింది .అప్పుడు డా.కామేశ్వరి ”నాన్నగారూ !నేను రాజేశ్వరిలా శిష్యురాలినికానప్పటికీ ,మీకు దగ్గర దాననే అనుకోవాలని నా కోరిక .కేజీహెచ్ దగ్గరే మిమ్మల్నొకసారి చూశాను ..రమణాశ్రమ ప్రయాణం లో మీరు ఇక్కడ ఈమెతో కలిశారు  .మీటింగులో మీ మాటలు యెంతో సంతోషం ఆనందం కలిగించాయి .వైజాగ్ వెళ్ళాక ,మీ ఇల్లుకనుక్కొని వచ్చి కలుస్తాను ”ఆనగా  మాస్టారు ”సరేనమ్మా ”అనటం ఆతర్వాత యెవరి దారి వారు వెళ్లిపోవటం జరిగింది .ఇదే ఈ నాన్న ,కూతుర్ల తొలి పరిచయం . అదే   అత్యంత శాశ్వతమైంది .యేలాగో చూద్దాం .   వైజాగ్ లో కామేశ్వరి మళ్ళీ ఒకసారికలిసి అడ్రస్ తెలుసుకొన్నదికాని మళ్ళీ ఇద్దరూ కలవటం కుదరలేదు .ఒక నెల గడిచాక ఒక రోజు ఉదయం 
ఇంట్లో యేదో అనబోతుంటే ,శాస్త్రిగారి నోటి వెంట మాట రాలేదు ..యేదైనా చెప్పాలనుకొంటే నోట్ బుక్ మీద రాయటమే .అందరూ కంగారు పడ్డారు ..అప్పుడు కేజీహెచ్ లో ent  స్పెషలిస్ట్ డా పిన్నమనేని నరసింహారావు  గారోక్కరే .ఆయన్ డిపార్ట్మెంట్ హెడ్ .ఆయనదగ్గరకు రిక్షాలో పెద్దబ్బాయిని తీస్సుకొని వేడితే ,ఇల్లు తాళం వేసి ఉంది .యెప్పుడొస్తారో తెలీదని ప్రక్కవారు చెప్పారు ..కామేశ్వరి జ్నాపకమొచ్చి కాగితం మీద అబ్బాయికి రాసి ఇద్దరూ కామేశ్వరి ఇంటికి వెళ్లారు .కొడుకును లోపలికి పంపి ,విషయం చెప్పమనగా అతను అలానే చెప్పగా కామేశ్వరి గబగబా పరిగెత్తు కొచ్చి,బుజ0 మీద చేతులు వేసి ”నాన్నా !మాట రావటం లేదా ?”అని అడిగి లేదని చెబితే ,కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి .చీరకొంగుతో ఆమేతుడిచి ,”నాన్నా! నేనున్నానుగా .హాస్పిటల్ కు  వెడదాం .ఆదివారమైనా ఫరవాలేదు ”అని చెప్పి 5,7యేళ్ళ వయసున్న తన కొడుకులను జాగ్రత్తగా ఉండమని చీప్పి శాస్త్రిగారబ్బాయిని మరో రిక్షాలో రమ్మని శాస్త్రిగారి రిక్షాలో కూర్చుని హాపిటల్ కు తీసుకు వెల్లీంది.పేషెంట్ ను చూడమని అక్కడివారికి చెబితే ”ఆదివారం .యెలా’?అని వారంటే దబాయించి ”తండ్రికి మాటరాకపోతే వారాలూ వర్జాలూ చూస్తారా డాక్టర్లమై ఉండి కూడా ”అన్నది ఖంగుతిని ”యెవరమ్మా ఆయన ”?అని అడిగితే ”మా నాన్న ఆండీ ”అని చెప్పగా ,అందరూ మర్యాదలు చేసి నాలుగురైదుగురు డాక్టర్లు మూగి తలోపరీక్షా చేసి, ఇంజెక్షన్ చేసి ”అమ్మా !మీ నాన్నగారికేమీ డిఫెక్ట్ లేదు ఈ ఇంజెక్షనేసాయంకాలం ఒకటి రేపు పొద్దున ఒకటి  మీరే చేయండి .తగ్గిపోతుంది ”అని చెప్పి రెండు సీసాలిచ్చారు ..ఆమె ”ధాంక్ యు డాక్టర్స్ ”అని చెప్పి ,శాస్త్రిగారబ్బాయితో ”అన్నయ్యగారూ !నాన్న ను  ఇంటికి తీసుకు వెళ్ళి విశ్రాంతిగా ఉంచండి .సాయంత్రం 5గంటలకు తీసుకువస్తే ఇంజెక్షన్ చేసి పంపుతాను ”అని చెప్పింది .ఇంటికి చేరి,యేదో కొంతతిని నిద్ర పోయారు .నాలుగంటలకు మెలకువవచ్చి అబ్బాయీ అని కేక వేశారు స్పస్టంగా  లేకపోయినా బాగానే ఉంది.వచ్చి ”వెడదామా” అంటే నీర్గసంగా  ఉంది రేపు పొద్దున వెడదాం అన్నారు .సరే అనుకొన్నాక మళ్ళీ గాఢంగా నిద్రపోయారు .    రాత్రి 11 కు తల్పు చప్పుడైంది  .చాలా పిలుపులకు మెలకువ వచ్చియెవరు మీరని అడిగారు.”డాక్టర్ల0”అంగానే తల్పు తీయించగా డా కామేశ్వరి మరి ముగ్గురు డాక్టర్లు  .దగ్గరకొచ్చి మంచం మీద కూర్చుని ”నాన్నా!మాట్లాడు తున్నావే .సాయంత్రం 6దాకా నీకోసం చూసి ,ప్రతి ఆదివారం వెంకటేశ్వరస్వామి గుడికి వెడతామ్ .మీరొస్తే ఉండమని ఇంట్లో చెప్పి దర్శనం చేసి ఇంటికి వేడితే మీరు రాలేదని చెబితే  మేమే  ఇక్కడికి వచ్చాం ”అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చింది ఆమానవీయురాలు .”ఆమాటా వాత్సల్యం చూస్తే గౌరవ మర్యాదలతో పిలుస్తున్నట్లు ఉన్నా ఆమె నాన్నా అంటుంటే కన్నకొడుకు పిలిచే పిలుపులా ఉంది..ఆమె దృస్తీలో నేను తండ్రినో ,కొడుకునో ?నా దృస్టి లో  ఆమె నాకు తల్లో,కూతురో ? ఆవేళ నాకు  తెలియలేదు .అప్పుడే కాదు ఇప్పటికీ 13-14 యేళ్ళు గడిచినా  తెలీదు  ”అన్నారు దువ్వూరివారు . ఆ అనుబంధం మరింత యెలా బలపడిందో ఈ సారి తెలుసుకొందాం .    సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-19-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.