కృష్ణ నుంచి గంగదాక-2

కృష్ణ నుంచి గంగదాక-2

అలహాబాదు చాల ప్రసిద్ధమైంది .ఇక్కడే ఆది శంకరాచార్యులు మండన మిశ్రుని ,ఆయన భార్య ఉభయ భారతిని వాదం లో ఓడించి శిష్యునిగా మార్చాడు .ఆయనే పద్మ పాదుడు .అలాగే బౌద్ధ ధర్మం ఏమి చెప్పిందో తెలుసు కోవటానికి కొద్దికాలం ఆధర్మ చరణ చేసిన ఆయన హిందూ ధర్మానికి చాలా అపచారం చేశానని వూక లో పడుకొని దేహాన్ని కాల్చుకుని దేహత్యాగం చేసినది ఇక్కడే .త్రివేణి సంగమం లో పునిస్త్రీలు భర్తతో కలిసి వేణి పూజ చేసుకుంటారు.ఇది జీవితం లో ఒక్క సారే చేసుకోవాలట. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి సుమారు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ,ఇక్కడే పురోహితునిగా స్థిర పడిన పురోహితులు హరి జగన్నాధ శాస్త్రి గారు .మంచి పురోహితులు .బాగా చేయిస్తారు .మేము మొదటి మూడు సార్లు ఆయనతోనే చేయించాము .ఆయన దగ్గర వుండటనికి రూములు దొరుకు తాయి .ముందుగా చెప్తే టిఫిన్ ,భోజనం కూడా ఏర్పాటు చేస్తారు.అచ్చంగా ఆంధ్రా భోజనమే దొరుకు తుంది అదీ విశేషం .ఈయన గారి మేనల్లుడే కాశీ లో పురోహితునిగా వున్నా చల్ల లక్ష్మణ శాస్త్రి .అక్కడా వుండటానికి ,అవకాశాలున్నాయి . అలహాబాద్ నుంచి వారణాసి 120 కిలోమీటర్లు .ఇంకో విషయం .ఆగ్రా ఢిల్లీ లనుంచి యమునా నది ఇక్కడికి అలహాబాద్ లో చేరుతుంది-.గంగా నది హరిద్వారం దగ్గర హృషీకేష్ నుంచి భూమార్గం పట్టి ఇక్కడికి చేరుతుంది .ఇక్కడినుంచి కాశీ కీ ప్రయాణం చేస్తుంది .అదీ ఈ రెండు నదుల కధ . తెల్లవారు ఝామునే అంటే జూన్ 23 న అందరం కారులో నాలుగు గంటలకే బయల్దేరాం.తెల్ల వారు ఝామున రెండు గంటలకే అందరం లేచి ,కాల కృత్యాలు తీర్చుకున్నాము .గంగా నది పక్క నుంచే ప్రయాణం .ఇక్కడి నుంచే శ్రీ రాముడు ,లక్ష్మణుడు ,సీతా దేవి గంగను దాటి దండకారణ్యం ప్రవేశించారు.కార్ డ్రైవర్ కు పిలక జుట్టుంది .బాగా నడిపాడు .మధ్యలో ఒక చోట ఒక బడ్డి కొట్టు దగ్గర ఆగి ,కాఫీ తాగాము .మట్టికప్పులలో కావాలని తాగాము .అందరు సంతోషం గా వాటిలో తాగారు .కొన్ని ఖాళీ కప్పులు అడిగి తెసుకుంది ప్రభావతి వుయ్యుర్లో చూపించటానికి .సుమారు మూడు గంటల ప్రయాణం తర్వాత కాశి చేరాం .మహారాజా రోడ్ లో వున్న స్టేట్ బ్యాంకు హాలిడే హోం చేరి సామాన్లు దించాము .కావలసినవి సర్దుకొని అక్కడి బాయ్ ఇచ్చిన కాఫీలు తాగి ఒక అరగంటలో హరిశ్చంద్ర ఘాట్ చేరాం .ఒడ్డున బట్టలన్నీ పెట్టి అందరం గంగా నదీమతల్లి లో స్నానం చేశాం .ప్రవాహం తక్కువే .జన్మ జన్మల పూజా ఫలం ఇక్కడ స్నానం .ఈ హరిశ్చంద్ర ఘాట లోనే పూర్వం సత్య హరిశ్చంద్ర మహారాజు తన కొడుకు లోహితాష్యుని దహనం చేశ్హాడు ,ఇక్కడే వీర బాహు అనే కాటి కాపరికి అమ్ముడు పోయాడు .వీర బాహు వంశం ఇప్పటికి ఘాట్ ను పర్యవేక్షణ చేస్తోంది. భార్య చంద్ర మతి ఇక్కడే ఒక బ్రాహ్మణ స్త్రీ కీ పనిమనిషిగా సేవలు చేసింది .హరిశ్చంద్ర చక్రవర్తి జాతకం అంతా తల క్రిందులైనది ఇక్కడే .అను క్షణం శవాలు కాలుతూనే వుంటాయి లాట్లకు లాట్లు కర్ర దుంగలు ఘాటు ఒడ్డున నిలవ వుంటాయి .సగం కాలిన శవాలను గంగలో తోయటం ఇక్కడ మామూలే .కాశీ అంటే మహా స్మశానం .ఇక్కడ చని పోతే ముక్తి తప్పదు . చని పోయే వారి చెవిలో శివుడు శ్రీ రామ తారక మంత్రం వుపదేశిస్తాడట .అందుకే ఇక్కడికి చేరి అద్దెకు ఇల్లు తీసుకొని అందులో వుంటూ మరణాన్ని ఆహ్వానిస్తారు .నిత్యం శ్రీ విశ్వనాధదర్శనం ,గంగా స్నానం చేస్తూ .జన్మ పండించుకొంటారు .అన్నపూర్ణమ్మ వుంది కనుక తిండికి లోటు లేదు .ఏ కులానికి ఆకులం సత్రాలు లున్నాయి భోజనం పెడతారు .కాశీ లో తొమ్మిది రోజులు ఉండాలని నియమము .చాలా మంది పాటిస్తారు .బ్రాహ్మణులకు కరివేన వారి సత్రం మంచి సేవ లు చేస్తోంది .మున్డుగా మనం ఎంతమంది భోజనానికి వస్తామో వుదయమే చెప్పాలి గాత్రంతో సహా .పద కొండు గంటల కల్ల భోజనం పెడతారు .సాయంకాలం టిఫిన్ మాత్రమె .పులిహోర ,పిండి ,అటుకుల పులిహోర, దోసె ఇలా వేరైటి లుంటాయి. సాయంత్రం రైల్ కీ వేల్లెవాళ్ళకి ప్యాక్ చేసి ఇస్తారు. మజ్జిగ ఇస్తారు .అన్నీ చాలా మర్యాదగా శ్రద్ధ గా చేస్తారు .అడిగి అడిగి వడ్డిస్తారు .చాల రుచికరం గా వుంటాయి ఏవైనా .ఆన్న పూర్ణా దేవి ప్రసాదం గా భావించి ,కళ్ళ కద్దుకొని భక్తీ ముక్తి వస్తుందనే పూర్తీ విశ్వాశం తో తింటారు.. వీళ్ళ మొదటి సత్రం శ్రీ శైలం లో ఉంది. ..ఇక్కడే ఆంధ్ర ఆశ్రమం వుంది .గదులు దొరుకు తాయి వుండటానికి .ఇక్కడ వుండి కరివేన వారి సత్రం లో భోజనం చేస్తుంటారు ,దీనికి దగ్గరే నారద ఘాటు ,మానస సరోవరం ఘాటు వున్నాయి సరే –గంగా స్నానం చేశాం కదా నేను పితృదేవతలకు ,బంధువులకు ,మిత్రులకు నాకు తెలిసిన వారందరికి జల తర్పణ౦ చేశాను .అందరి స్నాన సంకల్ప మంత్రం చెప్పి స్నానం చేయించాను .గట్టు మీదకు చేరి నేను తెచ్చుకున్న స్ఫటిక శివ లింగానికి అభిషేకం నమక ,చమకాలతో చేసుకున్నాను .ఆడ వాళ్ళు దీపాధన చేసుకున్నారు ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇక్కడ గంగమ్మ ఒడ్డున ఇవన్నీ జరుపు కోవటం పదేళ్ళ క్రితం వచ్చినపుడు కూడా వారం రోజులుండి రోజు గంగా స్నానం ,ఒడ్డున అభిషేకం మహాన్యాసం తో చేసుకున్నాను .విశ్వేశ్వర దర్శనము చేసే వాళ్ళం . నెమ్మదిగా అందరం మెట్లు ఎక్కి హరిస్చంద్ర ఘాట్ చివర రోడ్ కు దగ్గర్లో వున్న చల్లా లక్ష్మణ శాస్త్రి గారింటికి చేరాం .మా బావ మరిది ఆనంద్ ముందే అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ అంటే మా అత్త గారి ఏడవ మాసికం ఏర్పాటుకు సిద్ధం చేశాడు. పది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటలకు పూర్తి అయింది .మూడు కూరలు, గారేలు, బూరెలు మూడు పచ్చళ్ళు తో బ్రాహ్మణ వంటతో మంచి ,కైకలూరు పురోహితులు చక్కని మంత్రోచ్చారణతో ఇద్దరు భోక్తలతో జరిగింది భోజనం బాగానే వుంది అచ్చంగా మన ఇళ్ళ దగ్గిర జరిగినట్లే ఉంది. లక్ష్మణ శాస్త్రి గారు అమలా పురం నుంచి ఇక్కికి వచ్చి పౌరోహిత్యం చేస్తూ స్థిరపడిపోయారు . కాశి అనేబడే వారణాశి వరుణ ఆశి అనే 2 నదుల మధ్య వుంది .నది ఒడ్డున వ్యాపించిన నగరమిది .ఇక్కడే దివోదాసు అనే రాజు పరిపాలించాడు శ్రీనాధుడు ‘’దివోదాసు బహా విశ్రాంత బలమ్ము చేత అని ‘’భీమ ఖండ పురాణం లో వర్ణించాడు .ఆయనే ఆయుర్వేదానికి ఆద్యుడైన ధన్వంతరి మహర్షి గా తరువాత జన్మ ఎత్తాడు .కాశీ పట్టు బట్టలకు పేరు .మగవాళ్ళకు కాశీ పట్టు బట్టలు బాగుంటాయి .ఆడ వాళ్లకు బెనారస్ పట్టుచీరలు బాగా నచ్చుతాయి .కాశితువ్వాళ్ళు ఎరుపురంగులో ముచ్చటగా వుంటాయి .దర్భ తో చేసిన చాపలు ఇక్కడి ప్రత్యేకత .అన్గోస్త్రాలు ,ధావళి లకు ప్రసిద్ధి .కావాలని మడి కట్టుకొనే వాళ్ళు కొనుక్కుంటారు .కాశీ లోనే బుద్ధుడు సారనాద్ దగ్గర మొదటి సారిగా శిష్యులకు బౌద్ధ ధర్మాన్ని బోధించాడు .సారనాద్ దగ్గర స్థూపాలు తప్పక చూడాలి .మేము వెళ్ళలేదు ఇదివరకే చూశాం .అశోక స్తంభం ,అశోక చక్రం ఇక్కడేమ్యూజియం లో వున్నాయి భారత దేశం జాతి గుర్తుగా జాతీయ చిహ్నం అయ్యింది. .ఆయుర్వేదం ఇక్కడి నుంచే వ్యాప్తి చెందింది .వ్యాస మహర్షి ఇక్కడే తన ఉపనిషత్తులు పురాణాలు, బ్రహ్మ సూత్రాలు రాశాడు వ్యాస మహర్షి .ఇక్కడే ఏడు రోజులు భిక్ష తనకు ,తన శిష్యులకు దొరక్క కోపం తో కాశీ ని శపించాడు చివరికి అన్నపూర్ణ దేవి ఇంటికి పిలిచి ఆతిద్యం ఇచ్చింది. కానీ శివునికి కోపం వచ్చి కాశీ లో వుండే అర్హతలేదని ,కాశీని వదిలి పొమ్మని హెచ్చరించాడు .అప్పుడు అవతలి ఒడ్డున వున్న కాశీ మహారాజు పాలిస్తున్న ప్రదేశం చేరి ఆక్కడే వున్నాడు .దానినే వ్యాస కాశి అంటారు .బోటు మీద అక్కడికి వెళ్లి చూడచ్చు .ఇప్పుడు బ్రిడ్జి పడింది కోట వుంది అక్కడే మన రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించిన స్థలం వుంది డబ్బులు లేక అక్కడినుంచి చొక్క పుస్తకాలు తలపై గట్టిగా కట్టుకొని ,గంగా నదిని ఈదుకుంటూ కాశీ చేరి బడికి వెళ్లి చదువుకొని మళ్ళీ సాయంత్రం ఈదుకుంటూ ఇంటికి చేరిన మహోన్నత వ్యక్తీ శ్రీ శాస్త్రీజీ .బిస్మిల్లాఖాన్ కాశీలో నే వుండే వారు ,తన షహనాయితో విశ్వనాదున్ని పరవసింప చేసిన భారత రత్న ఖాన్జీ .ఇతర దేశాల వాళ్ళు రమ్మని ఆహ్వానించారు అయినా గంగను , విశ్వనాధుడు ని వదిలి రాలేనని ఇక్కడే స్తిర పడిన మహాను బవుడు అయన. కాని ఆయన్ని అంత్య కాలంలో భారత ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వకపోవటం విచారకరం. ఇక్కడ హనుమాన్ భక్తులు ఎక్కువ తాలి ఖానా లున్నాయి ,కుస్తీ పట్టటం లో మంచి శిక్షణ నిస్తారు .మల్ల యోధులకు ప్రసిద్ధి వ్యాసుడు ఆతర్వాత దక్షిణాదికి వచ్చి బాసరలో సరస్వతీ దేవిని గోదావరి ఒడ్డున ప్రతిష్టి౦చాడు .అగస్త్య మహర్షి ,భార్య లోపాముద్ర తో కలిసి విశ్వేశ్వర దర్శనం తో పులకించి ,వింధ్య పర్వత గర్వమణచి దక్షిణాదికి ముఖ్యం గా ఆంధ్ర రాష్ట్రం చేరాడు .ద్రాక్షారామం ,భీమేశ్వరాలను సందర్శించాడు .తమిళులకు అగస్యుడ౦టే వీర అభిమానం .వాళ్ళ రచన లన్నిటిలో అయన ప్రస్తావన వుంటుంది . శ్రీ రాముడు ,హరిశ్చంద్రుడు సగరుడు ,దివోదాసు ,బింబిసారుడు ,అశోకుడు, మౌర్యులు, గుప్తులు, అయోధ్య నవాబులు అందరు కాశీ ని పాలించారు .రాణి అహల్యాదేవి కీ కాశీ అంటే భక్తీ ప్రపత్తులు ఎక్కువ పూర్వపు చక్రవర్తులు అశ్వమేధయాగం చేసిన ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘాట్ అంటారు .మణికర్నికఘాట్ చాల పవిత్రమైనది గా భావిస్తారు .కేదార్ఘాట్ కు మంచి పేరుంది ఒడ్డున కేదారేశ్వరుడు ఉంటాడు. కాశీ లో ఈ చివరనుంచి ఆచివర కు 64 ఘాట్లున్నాయి .యాత్రికులు బోటు లో అన్నీ తిరిగి చూస్తారు కాశీకి విదేశీ యాత్రికులు చాలా ఎక్కువమంది వస్తారు .ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు భక్తీ శ్రద్దలతో గంగా స్నానం చేసి దైవ దర్శనం చేస్తారు .ముక్తి క్షేత్రమనే నమ్మిక .ఎంతో మంది తెలుగు వారు ఇక్కడ స్థిరపడ్డారు .కాశీ మొదటినుంచి గొప్ప ఆర్ష విద్యా కేంద్రం .అన్నీ రాష్ట్రాల వారు ,వేదం ,శాస్త్రం ,వ్యాకరణం ,తర్కం నేర్చుకోవ టానికి కాశీ కె వచ్చే వారు .ఇక్కడి పండితుల దగ్గర చేరిరి శిష్యరికం చేసి విద్యనేర్చి పట్టా పొంది ఇళ్లకు వెళ్ళే వాళ్ళు .విద్యకు చాల సంవత్సరాలు గడిపేవారు ఎక్కడ జయించి జయ పత్రిక పొందినా కాశీ పండితుని మెప్పించి జయ పత్రిక పొందితేనే గుర్తింపు .అంతటి మహోన్నత పాండిత్యం ఇక్కడి పండితులది .తరువాత స్థానం బెంగాల్ లోని నవద్వీపనిధి. అయితే మన పండితులు కొందరు ఇక్కడి పండితుల్ని జయించి సెహబాష్ అనిపించుకున్న వారు వున్నారు .ఈ విహయాలు నేను రాసిన ‘’ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలన్కారులు ‘’అనే పుస్తకంలో వున్నాయి మిగిలిన విషయాలు మళ్ళీ రాస్తాను మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 01-jul-2011 —కాంప్ —బెంగళూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

2 Responses to కృష్ణ నుంచి గంగదాక-2

  1. venkateshwarlu.d's avatar venkateshwarlu.d says:

    durga prsad garu Hari Jaganadha sasthry mariyu challa lakshmana sasthry garala adresslu phone numberlu ivvagalaru.

    Like

    • gdurgaprasad's avatar gdurgaprasad says:

      challaa lakshmana shaastri -s/vijayakumarB-6/58 ,59 raaja harischandra road -solar pura -varanasi 221001 phone -0542 -2275197
      hari jagannadha shastri s/lakshmana kumara shastri -110/105 bakshi dara ganj -alaha bad -211006 –phone –0532 -25017 cell -09415238615–durgaaprasad

      Like

Leave a reply to gdurgaprasad Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.