విక్టోరియారాణి కాలపు మహిళ
స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసి, స్త్రీ వాద రచయిత్రి అని పేరు పొంది అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన నవలా కథా రచయిత్రి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్జీనియా ఉల్ఫ్. స్త్రీల మనో వేదనల పై ఎన్నో సమా వేశాలలో ఉద్వేగం గా ప్రసంగించింది .వారి దయ నీయ పరిస్థితులకు విచలితు రాలయింది .ముఖ్యం గా ఆమె బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కాలం లో స్త్రీల దుర్భర పరిస్తితులను అధ్యయనం చేసింది. వారి పట్ల సాను భూతిని కనపరిచింది ఆ కాలపు స్త్రీ లగురించి స్త్రీ రచయితలు అసలేమీ రాయక పోవటాన్ని ఉల్ఫ్ జీర్ణించుకోలేక పోయింది .వారి స్వాతంత్ర్యం అణచి వేయ బడిందని ఆవేదన చెందింది .వీలైనప్పుడల్లా మహిళా రచయితలను వాటి పై సమగ్ర అద్యయనం చేయమని కోరింది …వెలుగు లోకి రానిఎన్నో విషయాలున్నాయని ,ఇప్పటికీ అవి ప్రపంచం ముందు ఉంచక పోతే తమల్ని చరిత్ర క్షమించదని చెప్పేది .స్త్రీ రచయిత కు స్వేచ్చ ఉండాలని ,ఆమె కొక ప్రత్యేక గది ,ధనమూ ఉంటేనే ఆమె రచనలను స్వేచ్చగా చేయ గలుగుతుందని అభి ప్రాయ పడింది .ఆమె ఆరాటం ఎలాంటిది అంటే ఒక రోజు రోజంతా ఇవాళ బ్రిటిష్ లైబ్రరీ అనబడే ఆనాటి బ్రిటిష్ మ్యూజియం లో స్త్రీ జీవితాలకు సంబంధించిన సమా చారాన్ని సేకరించ టానికి గడిపింది .అనేక చరిత్ర పుటల్ని తిరగేసింది .
ఆమె సేకరించిన సమాచారం ప్రకారం ఎథెన్స్ నగరం లో ఆడ వాళ్ళను తూర్పు భాష లను నేర్చుకో కుండా కట్టడి చేశారని తెలియ జేసింది .ఈరిపిడియస్ రాసిన నాటకాలలో ప్రసిద్ధ నాయికలైన ఆంటిగన్ ,కసండ్రా , నేస్త్ర ,ఫీద్రి మీడియామొదలైనపాత్ర ధారణచేసి సెభాష్ అని పించుకొన్న మహిళా నటీ మణు లందరూ కూటికి గడవని నిరు పేదలే నని బయట పెట్టింది ఉల్ఫ్ ..సమాజం లో గౌరవ కుటుంబాలలో నుండి వచ్చిన స్త్రీలు ఎన్నడూ బజారు లో ఒంటరిగా దర్శన మిచ్చేవారు కాదని చెప్పింది .కాని స్త్రీ వేషం వేసే నటీమణులు మాత్రం నాటక రంగం లో విజ్రుంభించి పురుషులతో సమానం గా నటించి మెప్పు పొందేవారని,ఒక్కో సారి నాయక వేషం వేసిన వారి కంటే నాయిక వేషం వేసిన మహిళ లే అత్యున్నత ప్రమాణ మైన నటన కన బరచే వారని ఆమె స్పష్టం చేసింది .
ఇవాళ మనం అను కొంటున్న ఆధునిక సమాజం లో కూడా అదే విషాద దృశ్యం కనిపించటం సిగ్గు చేటు అంటుంది వర్జీనియా ఉల్ఫ్ తన ఉల్ఫ్ స్వరం తో .ఈ విషయం లో షేక్స్ పియర్ నాటకాల కాలం లో కూడా రోసా లిండ్ ,లేడి మెక్బెత్ పాత్రల్ని పోషించిన స్త్రీలు అందరి కంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నారని వీటిపై అధ్యనం చేసిన చరిత్ర కారులు చెప్పారని ఆమె అన్నది .అంతే కాదు రీన్స్ రాసిన ఆరు విషాదాంత నాటకాలలో కూడా నాయికా పాత్రధారులే చిరంజీవులై నిలిచారు .మగ వారి సంగతి దేవుడికే ఎరుక .ఈ నాటక పాత్రలలో హీర్మియాన్ ,ఆండ్రీ మాక్ బెరింన్స్ పాత్రలను జీవింప జేశారు .ఇక ఇబ్సన్ నాటకాలను చూస్తే కూడా ఇదే అభిప్రాయం బల పడుతుంది .సోలేగ్ ,నారా ,హిల్డా ,వేగాల్ ,రెబెక్క ,వెస్ట్ లతో పోల్చదగిన మగ పాత్రలు కలికానికి కూడా కనీ పించవు .అని ఉల్ఫ్ ఉవాచ . .
షేక్స్ పియర్ కాలం లో పురుష రచయితలందరూ సానెట్ ను ,పాటను విజ్రుంభించి రాసి ప్రాచుర్యం తెస్తే ఒక్క గానొక్క స్త్రీ రచయిత కూడా వీటి వైపు కన్నెత్తి చూడక పోవటం ఉల్ఫ్ కు ఆశ్చర్య మేసింది .షేక్స్ పియర్ నాటకాలు అలా నిశ్చల చిత్రాలుగా గోడకు వేలాడుతూ ఉంటాయి. లేక సాలీడు గూడు లాగ అల్లుకొని రహస్య గృహాలు లాగా కని పిస్తాయి ఒక సారి ఆ గూడు ఛేదిస్తే అవి గాలిలో కట్టిన గూళ్ళు కాదని,యేవో క్షుద్ర కీటకాలు నిర్మించినవి కాదని తెలుస్తుంది అవి బాధలతో బరువు తో జీవించిన మానవ మాత్రులు నిర్మించిన అందమైన గూడులని, అవి మెరిసే దారాలన బడే డబ్బు ,ఆరోగ్యం తో నిర్మించ బడినవని ఆమె అంటుంది .అవి మనం నివసించే మన ఇంటి వంటివే నన్న భావన కలిగిస్తాడు షేక్స్ పియర్ అన్నదిఆమె .
ఉల్ఫ్ తాను ఒక సారి ట్రేవిలియాన్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్‘’చదువుతుంటే అందులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చదివి చలించి పోయానన్నది .అందులో భార్య ను కొట్టే హక్కు భర్తకు ఉందని ,దాన్ని గొప్పగా భావించి స్త్రీలను విపరీతం గా హింసించే వారని తెలుసుకొని నిశ్చేష్టురాల నయ్యానని చెప్పింది .తండ్రి కుదిర్చిన సంబంధాన్ని కూతురు అంగీకరించి పెళ్లి చేసుకోక పోతే ,ఆమెను కొట్టి ,ఒంటరిగా గదిలో బంధించ టానికి బల వంతం గా తోసేసి, షాకులు కూడా ఇచ్చే వారని చదివా నని చెప్పింది .వివాహం అనేది స్త్రేకి స్వయం నిర్ణయం కాదని , అది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయమని ఆ నాటి పై తరగతి కుటుంబాలలో ఇది సర్వ సాధారణం అని ఆమె తెలుసుకొన్నట్లు వివరించింది..క్రీ.శ 1470 లో మత ప్రవక్త ,రచయిత అయిన చాసర్ కాలం తర్వాత,పెండ్లికి ముందు చేసే ప్రదానం ఆడపిల్ల ఉయ్యాలలో ఉన్నప్పుడే జరిగి పోయేదని, .దాది లేక నర్సు పెంపకం అయి పోగానే ఆడ పిల్ల మగ పిల్లాడి తలిదండ్రులు పెళ్లి చేసే వారని చదివి ఆమె అవాక్కయ్యానని.చెప్పింది .
తర్వాత రెండు వందల ఏళ్ళకు కూడా స్టువార్ట్ రాజుల కాలం లో ఉన్నత ,మధ్య తరగతి కుటుంబ వధువుకు కొంత హద్దు లో ఉన్న స్వేచ్చ లభించిందని ,ఆమె బాగా సంపన్నుని ,హోదా ఉన్న వాడిని ,సంఘం లో గౌరవ స్థానం లో ఉండే వాడిని పెళ్లి చేసుకోవాలని ఆంక్ష లుండేవని చదివింది .ఉల్ఫ్ .ట్రావేల్యాన్ చరిత్ర కారుడు రాసిన దాని బట్టి షేక్స్ పియర్ స్త్రీలు ,పది హేడవ శతాబ్ది స్త్రీలు అయిన వేర్నీస్ ,హచిన్సన్ లు వ్యక్తిత్వానికి ,శీలానికి విలువ నిచ్చినట్లు కని పించదన్నాడట
క్లియోపాత్రా మాత్రం తన దారి తాను తొక్కింది .అలాగే లేడి మెక్బెత్ అరుదైన తరహా ఉన్న స్త్రీ లా కని పిస్తుంది .ప్రొఫెసర్ ట్రేవేల్యాన్ రాసిన ప్రకారం షేక్స్పియర్ స్త్రీలు వ్యక్తిత్వానికి ,శీలానికి ప్రాధాన్యత నిచ్చే వారు కాదు ..ప్రాచీన కాలం నుండి కవులు క్లెమెన్స్త్రె ,ఆన్టిగన్ ,క్లియో పాత్రా లేడీ మెక్బెత్ ,ఫిదేరీ ,క్రేస్సిడా ,రోసాలిండ్ ,దేస్డోమోనా ,మాల్ఫీ లోని డచేస్ వంటి స్త్రీ లను ఓడలకు దీపం వత్తి కాల్చి దీపం వెలిగించి నట్లు చేశారన్నాడు .వచన రచయితలు మిలియా మాంట్ ,క్లారిసా ,బెకీ షార్ప్ అన్న కేరీనినా ,ఎమ్మా బోవారి ,మేడం డీ గుర్మాన్టిస్ లు ఆడవారిలో వ్యక్తిత్వం ,శీలం లేవనే అభిప్రాయ పడ్డారని తేల్చాడు .కాని కల్పనా సాహిత్యం లో ముఖ్యం గా మగ రచయితలు రాసినవాటిలో వీరోచితం గా స్త్రీ ప్రవర్తించి నట్లు , మగవారితో సమాన ఫాయిదా లో ఉన్నట్లు రాశారు ఇది కల్పనా సాహిత్యం కదా .అలా రాసి తృప్తి పడ్డారంతే . కొన్ని సార్లు మగ వారి కంటే ఆధిక్యత లో ఉన్నట్లుకూడా రాశారు .నిజం గా స్త్రీ ని గదిలో బంధించి ,కొట్టి, హింసించి ,ఆమె సర్వ హక్కులు హరించిన కాలమే అది అంతా .
స్త్రీ స్థానం ఎంత ఉన్నత మైనదైనా ,ఆమెకు ఎంత ప్రాముఖ్యం ఉన్నా ,ఆమె సంఘం లో విలువ లేనిదే అయి పోయింది .ప్రత్రి పుస్తకం లో ,ప్రతి పుస్తక కవర్ పేజీ పైన ఆమె ను అద్భుతం గా చిత్రించే వారు .ఆమె కు మాత్రం చరిత్ర లో స్థానం కల్పించలేదు ఆమె కు తీరని అన్యాయమే చేశారు .కల్పిత కదా సాహిత్యం లో స్త్రీ -రాజులను ,విజేతలను సామ్రాజ్యాలను ప్రభావితం చేసి విజ్రుంభించింది .కాని నిజానికి ఆమె ఎవరో ఒక కుర్రాడికి బానిస గానే ఉండి పోయింది .తలిదంద్రులిష్ట పడిన వారితో ఉంగరాలు మార్చుకొంది తప్ప వ్యక్తిత్వాన్ని చూప లేదు .ఆమె నోటి నుండి ఉత్తేజ పూర్వక వాక్యాలు కాని ,ఉత్తమ మైన ఆలోచనలు కాని ఆమెగురించిన సాహిత్యం లో ఆమె ఆమె పెదవి దాటి బయటకు రాక పోవటం అత్యాశ్చర్యకరమే ., ఆమె ఎప్పుడూ భర్త ఆస్తి గానే పరిగణింప బడింది అని వాపోయింది రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్
విక్టోరియా రాణి కాలంలోని సాహిత్యం లో ఉన్న స్త్రీలందరూ ఎముకలు, కండరాలు ఉన్న మాంసపు ముద్దల్లాగా కని పిస్తారు కాని వారి ఆలోచనలు, మనసు, తెలియ జెప్పిన రచన లేవీ రాక పోవటం విచారకరం అన్నది ఉల్ఫ్ .ఒక గాజు బొమ్మ లాగా ,షోకేసు లో బొమ్మ లాగా ఉంటుంది కాని వ్యక్తిత్వం ఉన్న మహిళగా ఎక్కడా కనిపించదు జీవచైతన్యం తో తోణికిసలాడే మహిళ మచ్చుకైనా కని పించక పోవటం దురదృష్టకరం . .తనకు ప్రొఫెసర్ ట్రేవిల్యాన్ దృష్టిలో చరిత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలని పించి, ఆయన రాసిన వాటిని చదివానని అందులో ఎలిజబెత్ పేరు, మేరీ పేర్లు అప్పుడప్పుడు కనిపించాయని అవీఒక రాణి గారి పేరో, లేదా ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ పేరో తప్ప సామాన్య స్త్రీ ల పేర్ల గురించి ఎక్కడా కనిపించదుఅన్నది. .మధ్యతరగతి స్త్రీలు, చరిత్ర ను తిరగ రాసిన వారు, గత కాలానికి వెలుగు దివ్వెలు అయిన మహిళా జాతి రత్నాల ఊసెక్కడా కనిపించక పోవటం మరీ వింత ..చరిత్ర లో సరే సరి కాని ఎక్కడైనా ముచ్చట కైనా కధల్లో లో కూడా ఆమె ప్రసక్తి లేదు .జాన్ ఆరబీ అనే ఆమె తన జీవిత చరిత్ర రాసుకొన్నాఆమె మరణం తర్వాత ప్రచురింప బడింది . ఆమె గురించి చెప్పుకొన్నది చాలా అరుదు .ఆమెకు డైరీ రాసే అలవాటు కూడా లేదు .ఆమె రాసిన కొన్ని ఉత్తరాలు మాత్రమే లభించాయి .ఆమె ను అర్ధం చేసుకోవా టానికి,ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించటానికి ఆమె రాసిన నాటకాలు ,కవిత్వం కూడా లభించలేదు .ఆమె ఎలా జీవించింది స్వంత ఇల్లు ఉందా ,నౌకర్లు చాకర్లు ఉన్నారా ,ఆమె ఇస్టాయిస్టాలేమిటి?ఆమెకు వంట చేయటం వచ్చా ఆమె పుట్టిన తేదీ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏ చర్చి ఫాదర్ దగ్గరో ఉన్న సమాచారం , లేక చర్చి రిజిస్టర్లు,జమా ఖర్చుల పుస్తకాలే ఆధారం .ఎలిజ బెత్ రాణి కాలపు మహిళలు ఎక్కడో విసిరేసి నట్లుంటారు వారి ని గురించిన సమాచారం సేకరించటానికి చరిత్ర కారులు ప్రయత్నించనే లేదని అభియోగం తెచ్చింది వర్జీనియా ఉల్ఫ్ .జేన్ ఆస్టిన్ గురించి, మేరి రస్సెల్ మిల్ ఫోర్డ్ గురించి చరిత్ర అంతా ఒక శతాబ్దం కాలం పబ్లిక్ దృష్టిలో పడకుండా చరిత్ర మరుగున ఉండిపోవటం విచారకరం అంటుంది బాధ గా వర్జీనియా ఉల్ఫ్ .ఆమె తపన అందరికి ఉంటే ఈపాటికి ఆ నాటి మహిళా జీవితం గురించి సమగ్ర మైన చరిత్ర లభించి ఉండేది .ఆ చరిత్ర జ్ఞాపకాల లోకి ఆమె తొంగి చూసి, ఆనాటి స్త్రీ జీవితం పై కొద్దో గొప్పో వెలుగు ప్రసరింప జేసి మహిళా మన్ననలను పొందింది వర్జీనియా ఉల్ఫ్ ..స్త్రీ జాతి వర్జీనియా ఉల్ఫ్ కు చాలా రుణ పడి ఉంది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
– See more at: http://vihanga.com/?p=7413#sthash.qcFD99zh.WYN8P3jN.dpuf
