మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7
మహమ్మద్ ఇక్బాల్ మతం
మహమ్మద్ ఇక్బాల్ తత్వ ,న్యాయ శాస్త్రాలను జర్మని గ్లాండ్ దేశాలలో చదివి అధ్యయనం చేశాడు .మంచి కవి.ఆధునిక యుగం లో మహామ్మదీయులలో గొప్ప దార్శనికు డని ప్రసిద్ధి చెందాడు ఇక్బాల్1877నవంబర్ తొమ్మిది న జన్మించి 1931 ఏప్రిల్21 న మరణించాడు ఆయన్ను ”అల్లామా ఇక్బాల్ ”అని కూడా పిలుస్తారు .ఉర్దూ ,పార్సీ భాషల్లో ప్రావీన్యుడు పాకిస్తాన్ ఉద్యమ నేత కూడా .ఆయన్ను ”లాహోర్ ఇక్బాల్”అంటారు .పెర్శియన్ భాషల్లో మట్లాడటం రాయటం చేశాడు 1922 లో కింగ్ జార్జ్ నైట్ హుడ్ ప్రదానం చేశాడు .ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కు నాయకుడు . ”షేర్ ఏ మార్శిక్ ”అంటే ”పోయేట్ ఆఫ్ ది ఈస్ట్” గా బిరుదు పొందాడు . ”ముసాఫిర్ ఆఫ్ పాకిస్తాన్ ”అంటే పాకిస్తాన్ ఆలోచనా జీవి ”అని పిలువా బడ్డాడు . పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్బాల్ ను ”జాతీయ కవి ”హోదా నిచ్చి గౌరవించింది ఽఅయన పుట్టిన రోజు ను ”ఇక్బాల్ డే ”గా నిర్వహిస్తున్నారు . .ఆయన రాసిన ”సారే జహాసె అచ్చా హిందూ సితార్ హమారా ”గీతం జాతీయ గీతం గా భారత దేశం లో గౌరవం పొందింది .
ఆయనపై జలా లుద్దీన్ రూమి ,బెర్గ్ సన్ మొదలైన వారి ప్రభావం ఎక్కువ .నివృత్తి అనే మాట ఇక్బాల్ కు గిట్టని మాట.జీవితం అంటే ప్రవృత్తియే అంటే యాక్తివిటి అన్నాడు .పాపం లో ఉంటూ అధర్మం తో పోరాడటం లోనే జీవితం ఉంది అని చెప్పాడు .ఈశ్వరుడిని ధర్మాన్ని అంగీకరించే వారందరూ మహామ్మదేయులే అని అభిప్రాయ పడ్డాడు .ఇస్లాం అంటే సత్యమే అన్నాడు .మహమ్మద్ ప్రవక్త దాన్ని సంపూర్ణం గా పొందాడు .ఇతరులకూ ఆయన సత్యాన్ని ప్రసాదించాడు .జాతి ,పదవి ,డబ్బు మహమ్మదీయులకు గొప్పదనాన్ని కలిగించవు .నీతి ఒక్కటే నిర్ణయిస్తుంది అస్తిత్వ కార్యాలన్నీ ఆత్మా చేయిన్చేవే .కనపడేది అంతా ఆత్మ యొక్క రహస్యమే .ఆత్మ సారం లో అనేక విశ్వాలుఉన్నాయి
ఆత్మ మేల్కొని సంవేదన చెంది తనను తాను ద్రుఢం చేసుకొంటుంది .అప్పుడు ఆలోచన జగత్తు ప్రకాశితం అవటం తో అనాత్మ వెలుగు లోకి వస్తుంది వ్యాపారం కోసం ఆత్మా శయి విషయాలుగా ,సాధ్య ,సాధనాలుగా ఇంకా ఎన్నో రూపాలుదాలుస్తుంది .కాలం అనేది ఆత్మకు రంగ భూమి .కాలం అనంతం కనుక ఆత్మ చేసేదంతా శాశ్వత ప్రాముఖ్యాన్ని పొందుతుంది ..ఇతిహాసం ఆత్మ కు తన స్వభావం తెలుసుకోనేట్లు చేస్తుంది .జీవితం అంటే నిరవచ్చిన్న చైతన్య తరంగం .కాలం యొక్క మూలాన్ని ,దాని సత్ విషయాన్ని తెలుసుకోవటమే అక్షయ జీవిత రహస్యం .
లాహోర్ లో ఇక్బాల్ సమాధి
జీవిత ధారణకు ఇచ్చ ,తృష్ణ కారణాలు .అవే పరి రక్షణ చేసి లక్ష్యాన్ని ఏర్పరుస్తాయి .ఇచ్చ, ,ఆదర్శం లేని వాడు చచ్చిన వాడితో సమానం .జీవితాన్ని తీర్చి దిద్దేది, సౌభాగ్యాన్ని కల్గించేది ఇచ్చ మాత్రమె మానవ నిర్వహణం అంతా యిచ్చయే .ధర్మం మీద ఆధార పడ్డ సంఘం తో తాదాత్మ్యం చెందటం వల్ల ఆత్మ అర్ధ వంతం అవుతుంది .సంపూర్ణ ఆత్మ వికాసానికి ప్రేమ ముఖ్యమైనది .ప్రేమ ఆత్మను సజీవం గా,ఇంకా కాంతి వంతం గా చేస్తుంది .ప్రేమ వల్లనే ఆత్మ యొక్క సత్తా ప్రకాశిస్తుంది .అప్పుడు ఆత్మ లో ఉన్న అజ్ఞాత శక్తులు వృద్ధి చెందుతాయి .అన్ని ఆదర్శాలకు ,గొప్ప కర్మలకు కారణ మైన ఈశ్వరుని యందు కలుగు ఆనంద అతిరేక పూర్వ మైన శక్తి నే నిజమైన ప్రేమ అంటారు .’’భగవత్ ప్రేమ చివరకు భగవంతుడే అవుతుంది ‘’అని ఇక్బాల్ ప్రవర్త తన కవిత్వం, లో గ్రంధాలలో ఇస్లాం సారాన్నే తాను చెప్పానని ప్రకటించాడు .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –6-9-13- ఉయ్యూరు .