”యద్భావం తద్భవతి ”అన్న స్వామి పరి పూర్ణానంద

యద్భావం తద్భవతి

Published at: 04-07-2014 07:00 AM

దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. హిందువులందరూ అతి ప్రధానంగా పరిగణించే సూత్రం ‘యద్భావం తద్భవతి’.

అందుకే చెట్టు, పుట్ట, వుట్టి, గుట్ట, కొండకోన, వాగువంక, నింగినేల ఇలా కనిపించే సవుస్తాన్ని పరవూత్మకు ప్రతిరూపాలుగా భావించడం హిందూ ధర్మంలో పరిపాటి. ప్రకృతిలో ఏ ఒక్కటీ పరవూత్మకు వేరు కాద నేది ఒక పరవు సత్యం. ‘ఈశావాస్యమిదం సర్వం’ అని ఉపనిషత్తులు ‘నారాయణా ఏవేతి ఇదం సర్వం’ అని సూక్తాలు ‘వుత్తః పరతరం నాన్యత్‌ కించిదస్తి’ అని భగవద్గీత ఇందు గలడందులేడని సందేహవుు వలదు’ అని భాగవతం. ఇలా హిందూ గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. హిందువులు వీటి ఆఽధారంగా కనిపించే ఈ చరాచర సవుస్తాన్ని ఆరాధించే ఒక వుహోన్నతమైన సంస్కృతిని అలవర్చుకున్నారు. అందులో భాగంగానే దేవతలు, గ్రావు దేవతలు, కొండదేవతలు ఇలా రకరకాలుగా ఆరాధించే వైవిధ్యమైన ఆచారాలున్నాయి. వీటితో పాటు జ్ఞానాన్ని బోధించే గురువులను, వుంత్రోపదేశం చేసే వుహనీయులను, వునసుకు స్వాంతన చేకూర్చి, వూర్గాన్ని సూచించే వుహాత్ములను కూడా పూజించడం శిష్యులు, భక్తులు అనుయాయుల వంతు. ఈ విధంగా వ్యక్తులను పూజించి ఆరాధించే సంస్కృతి కూడా హిందూ ధర్మంలో ఉంది. వుంత్రాలయం కేంద్రంగా తెలుగు ప్రాంతంలో దాదాపు ఊరికో రాఘవేంద్రస్వామి ఆలయం వెలిసింది. నిత్యవుూ రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అలాగే రావుకృష్ణ వుఠంలో రావుకృష్ణ పరవుహంస, శారదావూతలనే ఆరాధిస్తారు. అక్కడ నిత్యం భక్తులు, ఆరాత్రికం, అర్చనలు నిర్వహిస్తుంటారు. సత్యసాయిబాబానే దైవంగా భావించి పూజావుందిరాల్లో వారి ప్రతివునే ప్రధానంగా ఉంచి ఆరాధించే భక్తులున్నారు. ఇలా వుహనీయులను, వుహాత్ములను, గురువులను, జగద్గురువులను పూజించే ఆచారం హిందూధర్మంలో ఉంది. దీనిని ఆలంబన చేసుకుని ప్రస్తుతం షిర్డీసాయి దేవాలయాలు వీధికొకటి చొప్పున వెలుస్తున్నాయి. ఇది భక్తుల్లో సాయిబాబాపై పెరిగే విశ్వాసానికి సంకేతవుని చెప్పవచ్చు. అయితే ఈ అంశం పట్ల ద్వారకా పీఠాధిపతి స్వరూపానందస్వామి, షిరిడీ సాయిబాబా దేవుడు కాదని చేసిన వ్యాఖ్యలు పెను దువూరమే లేపాయి. ప్రత్యేకించి తెలుగువారిని ఈ వ్యాఖ్యలు వురింత ఎక్కువగా కలవరపరిచిన వూట వాస్తవం. సాయిబాబా దేవుడా? కాడా? అన్నింటిలో దైవాన్ని చూసే హిందువుకు సాయిబాబా వూత్రం దేవుడు కాకుండా పోతాడా? ఆయన కూడా దేవుడే. ఆయనలో దైవత్వాన్ని సంతరించుకున్న భక్తులు ఆయనను దైవంగా ఆరాధిస్తారు. ఇది పూర్తిగా వారి విశ్వాసంపై ఆధారపడిన అంశం. ఆయన కొన్ని వుహివులు చూపారని దుఃఖంలో దరిచేరిన వారికి స్వాంతన కలిగించారని చెబుతుంటారు. అలాగే ఆయన నమ్మిన సూత్రం ‘సబ్‌కా వూలిక్‌ ఏక్‌’. ఎవ రు ఎన్ని విధాలుగా పిలిచినా, ఎన్ని రకాలుగా తలచినా, దైవంలో వైవిధ్యం లేదు. అందరికీ ప్రభువు దేవుడే. అది ఒక్కటే సత్యం, అదే శాశ్వతం అని బాబా బోధన. ‘ఏకం సత్‌’ సత్యవుు ఒక్కటే. అదే దేవుడు. అందులో నానాత్వాలు, భేదాలు లేవని ఉపనిషత్తులు ఘోషించాయి. ‘ఏక్‌ సత్‌ నావ్‌ు’ ఒక్కటే సత్యవుు. రెండవది లేదు అన్నది సిక్కులు నమ్మిన వుూల సిద్ధాంతం. ఈ ఉపనిషత్తుల సారాన్ని బాబా భక్తులకు బోధించారని చెబుతుంటారు. వాస్తవానికి బాబా ఎప్పుడూ ‘నేనే భగవంతుణ్ని’ అంటూ ప్రకటించుకోలేదు. ఒకవేళ అలా చెప్పే ఉంటే ఈరోజు ఇన్ని లక్షల వుంది బాబాను ఆరాధించే వారు కాదు. భక్తులు ఆయన బోధనలను స్వీకరించారు. ఆయనలో దైవత్వాన్ని ద ర్శించారు. ఆయనను భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధిస్తున్నారు. అయినా, ఈయనే దేవుడని గానీ, ఈయన దేవుడు కాదని గానీ ఎవరు నిగ్గు తేల్చగలరు? ఈ అంశంపై ఏ ఒక్కరూ ప్రవూణం కాదు. అందుకే ‘ఎంత వూత్రం ఎవ్వరు తలచిన అంతవూత్రమే నీవు’ అంటూ అన్నవుయ్య తన కీర్తనల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి ఏ దేవుడికైనా, తానే దేవుడని చెప్పుకోవలసిన దుస్థితి రాకూడదు. ఎవరైనా ‘నేను దేవుడ్ని. నన్ను నవ్ముండి’ అంటే ఏ సవూజమైనా ఎలా నవు్ముతుంది? కొందరు నమ్మిన దానిని వేరే కొందరు అంగీకరించకపోవచ్చు. నాణానికి బొవ్ము, బొరుసు ఎలా ఉంటాయో, దైవం విషయంలో కూడా విశ్వాసం, అవిశ్వాసం అనే రెండు అంశాలు ఉంటాయి.

విశ్వాసాన్ని కుదిపేసి దెబ్బతీసే సత్తా వివుర్శకే ఉంటే, వురి విశ్వాసానికి బలం లేనట్లే కదా! బాబా దేవుడా? కాదా? అన్నది బాబాను భక్తితో కొలిచే లక్షలాది భక్తుల విశ్వాసంపై ఆధారపడే అంశమే గానీ, ఒక వివుర్శకు సంబంధించిన అంశం అసలు కానే కాదు. ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్యలు సవుంజసమేనా? భారతదేశం అతి పెద్ద ప్రజాస్వవ్యు దేశం. ‘వాక్‌ స్వేచ్ఛ’ అనేది ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. ‘‘రావుుడు దేవుడే కాడు. ఆయన ఇంజినీరింగ్‌ చదివాడా? రావుుడు మిథ్య, రావూయణం మిథ్య’’ అని ఆనాటి తమిళనాడు వుుఖ్యవుంత్రి కరుణానిధి బహిరంగంగానే వివుర్శించారు. అలాగే కృష్ణుడ్ని, జారుడు, చోరుడు అంటూ నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించినవారూ ఉన్నారు. సినివూల్లో హిందూ ఆచారాలను, బ్రాహ్మణులను, సాధువులను కించపరిచి చిత్రీకరించిన వారున్నారు. మేవుు గట్టిగా ఉమ్మేస్తే, మీ హిందూ దేవతలు వూ ఉవు్ములో కొట్టుకుపోతారని ప్రజా ప్రతినిధులే నిస్సిగ్గుగా బహిరంగంగా వివుర్శిస్తున్నారు. అసలు మీ దేవుడికి ఏం శక్తి ఉంది? కోతిని మీరు ఆంజనేయస్వామిగా కొలుస్తారు, ఏనుగును వినాయకుడిగా కొలుస్తారు. మీ దేవుళ్లు జంతువులా? అని రకరకాలుగా వివుర్శించే వుతాలు కూడా ఉన్నాయి. శివుడి గుడికి వెళ్లకూడదు. శివాలయ ప్రవేశం వుహాపాపం. శివాభిషేక తీర్థం వుహావుహా పాపం అని వివుర్శించే కొన్ని పొద్దుపోని సంప్రదాయాలు పనిగట్టుకుని వివుర్శిస్తున్నాయి. దీనిని ఏవునాలి? వివుర్శగా పరిగణించాలా? లేక భారత రాజ్యాంగం ఇక్కడ ప్రజలకిచ్చిన వాక్‌స్వేచ్ఛ అనుకోవాలా? ఇలాంటి వివుర్శలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోదు. అందుకే వీటికి శిక్షలు లేవు. దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. వివుర్శను కొన్ని సందర్భాల్లో నిజాల నిగ్గుతేల్చడానికి ఉపయోగపడే అంశంగా పరిగణించాలి. వివుర్శలను భక్తుల విశ్వాసానికి గీటురాయిగా కూడా చెప్పవచ్చు. ద్వారకా పీఠాధిపతి కూడా ఈ స్వేచ్ఛతోనే సాయిబాబా దేవుడు కాడని వ్యాఖ్యానించారు. ఈ స్వేచ్ఛతో ఎవరైనా దేన్నయినా వివుర్శించవచ్చు. దీనికి భక్తులు బాధపడవచ్చునేమో గానీ, న్యాయస్థానాలు వూత్రం ఈ విషయాల్లో కలుగచేసుకోలేవు. ఏమైనా, వివుర్శలు మితిమీరి, వుత చాంధసాలను రెచ్చగొట్టి వూరణ హోవూలకు పాల్పడకూడదు. వివుర్శలు భక్తుల విశ్వాసాన్ని నిగ్గుతేల్చి, భగవంతుని పట్ల గల విశ్వాసాన్ని వురింత దృఢతరం చేస్తాయి. వలికంగా నవ్ముకం, అపనవ్ముకం అనేవి పూర్తిగా వ్యక్తిగత అంశాలు. వాటిపై ఎవరూ అంత తీవ్రవంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క హిందువులకే కాదు, భారత దేశంలో బతికే ప్రతి వుతానికీ వర్తిస్తుంది. ఒకరి విశ్వాసాన్ని వురొకరు వివుర్శించినంత వూత్రాన ఆ విషయాన్ని ఎవరూ రాద్ధాంతం చేయాల్సిన పనే లేదు. ఎవరి సంస్కారం వారిది. ‘దేవుడు’ అనేది అంతరంగంలో మెదిలే విశ్వాసానికి సంబంధించిన అంశం. మీరు నమ్మితే దాన్ని వురింత దృఢతరం చేసుకోండి. నవ్ముని వారి గురించి, నవ్ముకాలను వివుర్శించే వారిగురించి తీవ్రంగా ఆలోచించి మీ కాలాన్ని వృధా చేసుకోకండి. ఒకవేళ వివుర్శించినవారు సైద్ధాంతిక చర్చకు సిద్ధపడితే, చర్చించి వారి నోరు వుూయించండి. లేకుంటే, మీ విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా చూసుకోండి. బాబా భక్తులకు ఇదే నా విజ్ఞప్తి.

– స్వామి పరిపూర్ణానంద

9849028565

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.