‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’–పుస్తకా విష్కరణ
సాహితీ బంధువులకు శుభ కామనలు- నేను రాసిన ఎనిమిదవ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న పదమూడవ పుస్తకం ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’’పుస్తకం ,సరస భారతి ,స్థానిక ఏ.జి.అండ్ ఎస్ జి సిద్దార్ధ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహింపబడుతున్న సభలో ‘’28-8-2014గురు వారం ఉదయం 10గం .లకు ముఖ్య అతిధి ,ఆంద్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరింప బడుతుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .ఈ సభలో శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు ,ముఖ్య కార్య దర్శి డా .జి.వి.పూర్ణ చంద్ గారు ,రమ్య భారతి మాసపత్రిక సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటున్నారు .
ఈ పుస్తకానికి స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అని, వారి బావ గారైన డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారికి, వారి 90వ జన్మ దినోత్సవం 28-8-14-గురువారం నాడు అంకిత మిస్తున్నామని ప్రముఖ రచయిత ,ప్రఖ్యాత వరంగల్ డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ గారు దీనికి సమీక్ష రాస్తున్నారని మరొక సారి గుర్తు చేస్తున్నాను .
పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రికను ఆగస్ట్ మొదటి వారం లో అందజేస్తామని తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-14-ఉయ్యూరు .

