సరస భారతి 64వ సమావేశం –శ్రావణ మాసం విశిష్టత

సరస భారతి 64వ సమావేశం –శ్రావణ మాసం విశిష్టత

సరసభారతి 64వ సమావేశం ‘’శ్రావణ మాసం ‘’విశిష్టత పై ఈ రోజు  29-7-14-మంగళ వారం సాయంత్రం 6-30గం లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ‘’మహిత మందిరం ‘’లో జరిగింది .అధ్యక్షత వహించిన నేను ‘’శ్రవణా నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చిన నెల శ్రావణ మాసం అంటారు .వేదం లో ఈ నెలను ‘’నభస్ ‘’అన్నారు .శ్రవణం విష్ణు మూర్తి జన్మ నక్షత్రం కనుక ఆయనకు ఆయన అర్ధాంగి లక్ష్మీ దేవికి ప్రియమైన మాసం .ఈ నెలలో గృహ ప్రవేశం చేస్తే అన్నీ కలిసి వస్తాయి .ఈ మాసం లో జన్మించినవారు ప్రపంచ గౌరవం పొందుతారని జ్యోతిశ్శాస్త్రం చెప్పింది .జగన్నాధుడు ,శ్రీ కృష్ణుడు ,బలరాముడు హయగ్రీవుడు ,విఖనసా చార్యులుజన్మించారు. హయగ్రీవ జయంతిని శ్రావణ పౌర్ణమి  నాడు నిర్వహిస్తారు .పౌర్నమినాడే ఉపా కర్మ చేస్తారు .అలా చేస్తే ఆధ్యాత్మికత ,మానసిక ,శారీరక ఆరోగ్యం లభిస్తాయి .జంద్యానికి ఉపనయనం నాడు కట్టిన ‘’మౌంజి ‘’(జింక తోలు ముక్క)ను తీసేయ్యటమే ఉపాకర్మ ,.దీనితో వటువుకు అన్ని అర్హతలు సంక్రమిస్తాయి .రాష్ట్రీయ స్వయం సెవక సంఘం వారు   ఈ పౌర్ణమినాడు ‘’రక్షా బంధన్ ‘’ఉత్సవం నిర్వహిస్తారు .భగవాధ్వజ్ (కాషాయ జెండా)ను పూజించి రక్ష కట్టి స్వయం సేవకులందరూ ధ్వజ ప్రణామం చేసి ఒకరికొకరు ఎదురెదురు గా నిలబడి రక్ష కట్టుకొని దేశాన్ని రక్షిస్తామని శపథం చేస్తారు .దేశ భక్తీ గీతాలు పాడతారు .ఈ రోజే వారు ‘’గురు దక్షిణ ‘’కార్యక్రమం నిర్వహిస్తారు .దేశం కోసం  తమ వంతు ధర్మం గా తోచిన ధనసహాయం చేయటమే గురు దక్షిణ .ఇవ్వ దలచుకొన్న డబ్బును కవర్ లో పెట్టి అందులోని చీటీపై పేరు రాసి యెంత డబ్బు ఇచ్చిందో రాసి కవర్ మూసి ధ్వజం దగ్గర సమర్పిస్తారు .ఎవరెంత ఇచ్చిందీ ఎవరికీ తెలియదు .అంతా అయిన తర్వాత పదాదికారులు లెక్క వేసి నాగ పూర్ లోని ప్రధాన ఆఫీసుకు పపిస్తారు .ఆ తర్వాత మొత్తం యెంత వచిందో తెలియ జేస్తారు .ఇలా  గురు దక్షిణ ను ఏడాదికి ఒక సారి మాత్రమె నిర్వహిస్తారు ఎప్పుడు పడితే అప్పుడు చందాలు వసూలు చేయక పోవటం వారి సంస్కృతి. శ్రావణం లో గర్భ ధారణా మంచిది కాదని చెపుతారు .

   ‘’ఇతర రాష్ట్రాలలో ఏం చేస్తారో తెలుసుకొందాం .తమిళ నెల ‘’ఆడి ‘’ఈ మాసం తోనే ప్రారంభమౌతుంది వారిది సూర్య గణనం .ఆడి అమావాస్య వారికి పరమ పవిత్రమైనది .అన్ని మంచిపనులు ఆరోజే చేస్తారు .గుజరాత్ ,మహారాష్ట్ర ,గోవాలలో శ్రావణ పౌర్ణమిని ‘’నరాలి ‘’పూర్ణిమ అంటారు .నారల్ అంటే కొబ్బరికాయ (నారికేళం )ఆ రోజున వరుణదేవుడి అనుగ్రహం కోసం కొబ్బరి కాయ కొట్టి పూజిస్తారు .కొంకణ తీర వాసులు సముద్రుని దేవతగా పూజించి కొబ్బరికాయ సమర్పిస్తారు .వారికి చేపల వేటకు ఇది అనువైన కాలం .చేపలు బాగా దొరుకుతాయని విశ్వాసం .శ్రావణ బహుళ పంచమి నాగ పంచమి .నాగ దేవతను అర్చిస్తారు శ్రావణ మాసం చివరి రోజును మహా రాష్ట్ర‘’పోలా ‘’ఉత్సవం జరుపుతారు .ఎద్దు ఆవు మొదలగు పశువులకు పూజ చేస్తారు .కర్నాటక లో కృష్ణ పంచమి ని ‘’బసవ పంచమి ‘’గా వీర శైవ మహా భక్తుడు బసవ్మహారాజు శివైక్యం చెందినా రోజు ననిర్వహిస్తారు .దక్షిణాన ‘’అవని ఆవిత్తం ‘’అంటే ఉపకర్మ పౌర్నమినాడే చేస్తారు .ఒరిస్సా లో ‘’గంహా పూర్ణిమ ‘’అంటారు .పశువులను అల్లంకరించి పూజిస్తారు .బంధువులకు ‘’పిదా ‘’అనే మిఠాయి పంచుతారు .

          జగన్నాధ సంస్కృతీ ని అనుసరించే ఒరిస్సా ,బెంగాల్ ప్రాంతాలలో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున రాదా  కృష్ణులు  వర్షా నందాన్ని పొందిన రోజు ను జరుపుతారు. ఆ రోజు నుండి పౌర్ణమి వరకు ‘’జులాన్ యాత్ర ‘’చేస్తారు .రాదా కృష్ణులను ఉయ్యాలలూపుతూ ఊరేగిస్తారు .మధ్య ప్రదేశ్ ,చతీష్ ఘడ్ ,జార్ఖండ్ ,బీహార్ లలో ‘’కజారి పూర్ణిమ ‘’పేరు తో నిర్వహిస్తారు .ఇది రైతులకు ఇష్టమైన పండుగ .మగ సంతానం ఉన్న వారు శుక్ల నవమి నుండి పౌర్నమివరకు దీన్ని చేస్తారు .గుజరాత్ లో ‘’పవిత్రోపన ‘’పేరుతొ పౌర్ణమిని నిర్వహిస్తారు .ఈ రోజు శివ పూజ చేసి తరించటం వారి సంప్రదాయం .జార్ఖండ్ లోని దియోగడ్ లో శ్రావణ మేలా నిర్వహిస్తారు .అందరూ కాషాయ వస్త్రాలు ధరించి వంద కిలో మీటర్ల దూరం లో ఉన్న గంగానది నుండి పవిత్ర జలాలను తెచ్చుకొని నిల్వ ఉంచుకొంటారు. ఇది శివ దర్శనానికి అనువైన కాలమని భావిస్తారు .దీనికే ‘’కన్వార్ యాత్ర’’అని పేరు .శ్రావణ బహుళ విదియ నాడు మంత్రాలయ రాఘ వేంద్ర స్వామి ముక్తి పొందిన రోజు ‘’అని చెప్పాను

 ముఖ్య అతిధి శ్రీమతి వేదాంతం శోభ శ్రీ శ్రావణమాసం లో గౌరీ దేవి పూజను ప్రతి మంగళ వారం పెండ్లి అయిన ముత్తైదువులు చేస్తారని ఇలా అయిదేళ్ళు చేసి ఉద్యాపన నిర్వహిస్తారని రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని అందరూ చేసుకొంటారని ,అత్తమామలను ఆహ్వానిస్తారని లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని మంగళ వారం నోము నోస్తే మాంగల్యం బలం బాగా ఉంటుందని ,పార్వతి తపస్సు చేసి గౌరవర్ణం లోకి మారి గౌరీ అయిందని శ్రావణ గౌరీ వ్రతం సకల శుభ ప్రదామని ,శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాస్టమని ఆరోజు ఉట్టి కొడతారని కృష్ణుడికి ఇష్టమైన వెన్న  ,కట్టే కారం నైవేద్యం పెట్టి అందరికి ప్రసాదం గా ఇస్తారని , దీనికే గోకులాష్టమి అనిపేరని వివరించారు .

 డాక్టర్ దీవి చిన్మయ శ్రావణం లో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియ జేశారు కాళ్ళకు పశుపు రాస్తే అది క్రిమి సంహారం కనుక వర్షాకాలం లో తిరిగినా కాళ్ళు పాసి పోవనిచెప్పారు శనగలు వాయనం ఇస్తారని ఇవి గర్భాన్ని శుద్ధి చేసి గర్భ కోశానికి బలం చేకూర్చి మంచి సంతానం కలిగేట్లు చేస్తాయన్నారు .ఈ నెలలో జలుబు దగ్గు మామూలేనని దీనికి అల్లం ,తేనే ,ధనియాలు ,జీలకర్ర కలిపి తింటే చాలన్నారు లేత వేపాకు రసం తేనే లో కలిపి నాలికకు రాస్తే చాలా దోషాలు పోతాయని చెప్పారు .మన వాళ్ళు ఏది చెప్పినా దానివెనక ఆరోగ్య సూత్రాలున్తాయని వాటిని గమనించాలని అప్పుడే చేసే పని సద్వినియోగం అవుతుందని చెప్పారు సరస భారతి ఇలాంటి విషయాలపై మంచి కార్య క్రమాన్ని నిర్వహించి నందుకు అభినందించారు .

      అతిదులిద్దరికి ఆలయ మర్యాద తో అర్చకుడుశ్రీ మురళి సత్కరించారు సరసభారతి శోభాశ్రీ కి శాలువ కప్పి ,సరసభారతి ప్రచురణలను జ్ఞాపికను నగదును అంద జేసి సత్కరించింది

               కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి   అతిధులను వేదికపైకి ఆహ్వానించి ,కార్య క్రమాన్ని నిర్వహింఛి వందన సమర్పణ చేశారు .

     సభ ప్రారంభం అవగానే ఇటీవల మరణించిన భాషా శాశ్ర్త్ర వేత్త  డా .చేకూరి రామా రావు మృతికి అందరు శ్రద్ధాంజలి ఘటింఛి మౌనం పాటించారు .నేను చే.రా.గురించి,అయన సాహితీ సేవ గురించి  క్లుప్తం గా వివరించాను .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-14-ఉయ్యూరు .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.