పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6
ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?
వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తోంది .శ్రుతుల కాలం లో గుర్రం సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రులకు ప్రతీక వృషభం .చక్రానికి ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రాన్ని ఉంచేవారు .ఇదే ప్రభా మండలం గా అభి వృద్ధిపొంది ఉండవచ్చు అని పుట్టపర్తి వారూహించారు .తర్వాత అదే విష్ణు చక్రం అయింది .బౌద్దులకాలం లో అదే ధర్మ చక్రం అయింది .జీవితానికి సంకేతమే అయిం దది. శ్రీరామ పట్టాభిషేక సమయం లో శ్రీరాముడు తన కులదైవం అయిన శ్రీ రంగ నాదుడి విగ్రహాన్ని సుగ్రీవుడికి ప్రదానం చేశాడు .అదే శ్రీరంగం లోని రంగనాధ విగ్రహం ..మహా భారతం లో స్త్రీపర్వం లో ఇలాంటి కొన్ని సన్నీ వేశాలు కనిపిస్తాయి .పూజలకే కాక మనుషులకు కూడా ప్రతిక్రుతుల్ని ఏర్పాటు చేసేవారట .రాముడు సీతా విరహం తో అశ్వమేధ యాగాన్ని జానకి ప్రతిమ ను దగ్గరుంచుకొని చేశాడు .ద్రుతరాసత్రుడికి భీముడిపై ఉన్న కోపం తీర్చటానికి కృష్ణుడు భీముని ఇనుప ప్రతిమ చేయించి గుడ్డిరాజు ముందు పెడితే భీముడే అనుకోని కౌగిట్లో నలిపేశాడు అది పొడి పొడి అయింది . దీన్నే ద్రుతరాస్ట్ర కౌగిలి గా లోకం లో ప్రచారం అయింది .
దేవాలయాలలో అర్చా మూర్తులనేకాక ,చక్రాలన్ని ,యంత్రాన్ని స్థాపించే అలవాటుంది .వైష్ణవులు సాలగ్రామాలను భక్తితో అర్చిస్తారు . అవి నేపాల్ దగ్గరలోని గండకీ నదిలో దొరుకుతాయి.ఇది గంగకు ఉపనది .గండకి ఒకప్పుడు వేశ్య .తర్వాత పరమ భక్తురాలైంది .భక్తీ తో శ్రీ మహా విష్ణువును చేరువైంది .ఆయన వరం కోరుకో మంటే ,ఆయన తన గర్భం లో జన్మించాలని కోరుకొన్నది .సాలగ్రామ రూపం లో గండకి కి జన్మిస్తానని అభయమిచ్చాడు .శై వులకు ‘’బాణ లింగాలు ‘’ పూజార్హాలు .ఇవి నర్మదానది గుండం లోని ఓంకార క్షేత్రం లో లభిస్తాయి .గండకీ నది ,సాలగ్రామ విషయాలు వరాహ పురాణం లో ఉన్నాయి .సాల గ్రామాలలో నల్లనివి ,గోధుమ రంగువి ,ఆకు పచ్చనివి ,తెల్లనివీ ఉంటాయి .కొన్ని మిరియం గింజ సైజు నుండి ,చాలా పెద్ద సైజు వరకూ ఉంటాయి .శ్రీ కూర్మ క్షేత్రం లో సాలగ్రామం చుట్టుకొలత మూడడుగులు .అహోబిల కొండపై నరసింహ దేవాలయం లోని సాలగ్రామం కూడా పెద్దదే .ఇళ్ళల్లో ఉండేవి చిన్నవిగానే ఉండాలి .అరచేతిలో పట్టే దిగా ఉంటె ప్రశస్తం .
సాలగ్రామాలలో ఉన్న చక్రాలను బట్టి ,రంధ్రాలను బట్టి వాటి స్వరూప నిర్ణయం చేస్తారు .తెరచున్న నాలుక లా ఉండేది ఉగ్రనారసింహం .ఇది గృహస్తులు పూజించ దగినది కాదు .వక్త్రాలు బాగా తెరచి ఉన్నట్లు కాక సామాన్యం గా ఉంటె శ్రేష్టం అంటారు వాటి విలువ తెలిసిన సరస్వతీ పుత్రులు .వీటిలో నూటికి పైగా భేదాలున్నాయట .మూడు చక్రాలతో నల్లగా ఉండేది లక్ష్మీ నారాయణం .పైన రెండు చక్రాలుండి కొండ ఒకే రంధ్రం ఉంటె లక్ష్మీ నారసింహం.అలాగే వరాహ ,భూ వరాహ మొదలైన సంకేతాలెన్నో ఉన్నాయట .మత్స్య సాలగ్రామం ఇంట్లో ఉంటె చాలా మంచిది .దట్టమైన రంగుతో కాకుండా ,లేత రంగులున్నవి వ్యూహావతార సాలగ్రామాలు .అంటే వాసుదేవ సంకర్ష ణాలు ,అని రుద్ధ ప్రద్యుమ్నాలు .ఇవి కాక హిరణ్య గర్భ సాలగ్రామం అని ఇంకోటి ఉంది .సాధారణం గా సాలగ్రామాన్ని పాలల్లో కాని ,నీళ్ళల్లో కాని వేస్తె కొద్దిగా బరువు పెరగటం దాని లక్షణం . ఆకారం కూడా పెరుగుతుంది..ఇదే సాలగ్రామ పరీక్ష .వరాహ పురాణం లో ఈ పరీక్ష పై ఆ చాలా విషయాలున్నాయి .సాలగ్రామాన్ని రాగి నాణాల మధ్య ఉంచి పట్టుకొంటే అది గుండ్రం గా తిరుగు తుంది .సాలగ్రామం పగిలినా దోషం ఉండదని ఆచార్య ఉవాచ . .సాలగ్రామం లో దేవుడు ఎప్పుడూ ఉంటాడనే, పూజ లో దానికి ఆవాహనాదులు ఉండవు .కొన్ని దేవాలయాలో సాలగ్రామ మూర్తులే ఉంటాయి .ఇలాంటి అర్చావతారాలకు శక్తి ఎక్కువ .తిరుమల శ్రీనివాసుడు ఇలాంటి సాలగ్రామ విగ్రహమే .అందుకే ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు .కంచి ,ఆళ్వారు తిరునగరి ,మద్రాసు లోని పార్ధ సారధి విగ్రహాలు ఇలాంటి విశిస్టమైనవే .
బాణ లింగాలు గుండ్రం గా ఉంటాయి .శ్రీశైలం లో అనేక బాణ లింగాలున్నయంటారు నారాయణాచార్యులవారు . గోమతీ నది సముద్రం లో కలిసే చోట ‘’ద్వారకా మూర్తి ‘’ఒకటి ప్రసిద్ధమైనది .ఇది సాలగ్రామలకంటే గొప్పది అని అంటారు .ద్వారకా మూర్తి ఉన్న ఇంట్లో అన్న వస్త్రాదులకు లోటుండదు .’’శోణ భద్ర గణపతి ‘’మరో విశిష్టమైనది .ఎర్రగా ఉండి శోణ నదిలో దొరుకుతుంది .’’ఆదిత్యం ,స్పటికం’’ కాశీ లో దొరుకుతాయి .’’హేమాక్షి ‘’ఒక విధమైన లోహం.అది శక్తికి సంకేతం .’’హేమాక్షి ‘’శిలయొక్క మలం . .యంత్రాలలో వైష్ణవులకు ‘’సుదర్శనం ‘’శ్రేష్టం .శాక్తులకు ‘’శ్రీచక్రం’’ విశిష్టమైనది .ఉత్తరాది కొన్ని దేవాలయాలో మూర్తులకు బదులు’’గ్రంధాలు ‘’పూజింప బడుతాయి .పంజాబ్ లో గురు గ్రంధ సాహెబ్ అలాంటిదే.కొన్ని రామాలయాలలో తులసీ రామాయణం ‘’ఉంచి పూజిస్తారు .ఒరిస్సాలోని క్రిష్ణాలయాలలో ‘’భాగవత మహా గ్రంధం ‘’ఉంచి పూజిస్తారు .తిరువంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో పది వేల సాలగ్రామాలున్నాయట .భక్తిలో యెంత వైవిధ్యం ఉందొ మూర్తుల్లోనూ అంతే వైవిధ్యం ఉందని పుట్టపర్తి వారు అంటూ ముగించారు ప్రతిమా రాదన విషయాన్ని .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-14-ఉయ్యూరు

