ఉత్తర కర్మలు అవసరమా?గురు జగ్గి వాసుదేవ్ –

నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన నేటి జీవితానికి పలు విధాలుగా దోహదపడిన మునుపటి తరాల పట్ల కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడిన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు ఇది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా, చనిపోయిన వారికి ఉత్తర కర్మల ద్వారా ఒక అనుకూల వాతావరణం సృష్టించడం గురించి సద్గురు ఇక్కడ మాట్లాడుతున్నారు.
ఎవరైనా చనిపోయినపుడు, అతని కుటుంబీకులు అతనికై కొన్ని క్రతువులు చెయ్యడమన్నది యోగా సంస్కృతిలో ఒక భాగం. కాని దురదృష్టవశాత్తు గత 100-150 సంవత్సరాల్లో ఈ ఆచారాలు చాలా వరకు మరుగునపడి మిగిలిన అవశేషమంతా పాడైపోయి ఈ తతంగమంతా పూర్తి వాణిజ్యంగా మారింది. కొంతకాలంగా ఈ విషయం నన్ను బాధిస్తోంది. అందుకే, మా ఆశ్రమంలో స్థాపించిన లింగభైరవిని శక్తి మూలాధారంగా ఉపయోగించి, మేము మరణించిన వారి కోసం ‘‘కాలభైరవకర్మ’’, ‘‘కాలభైరవశాంతి’’ అనే నిర్దిష్ట ప్రక్రియలను మొదలుపెట్టాము. మీకు తెలిసిన వారు లేక మీ మిత్రులకు తెలిసిన వారెవరైనా చనిపోతే, 14 రోజుల లోపల మీరు వారు బతికున్నప్పుడు ధరించిన ఒక వస్త్రంలోని ఒక చిన్న గుడ్డ ముక్కను పంపితే, ఒక నిర్దిష్ట క్రతువు నిర్వహించవచ్చు. ఉదాహరణకు ఎవరో, ఎక్కడో చనిపోయారని అనుకుం దాం. మీరు వారు చనిపోయారని అనుకుంటారు. కాని ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు, అతను కేవలం తన దేహాన్ని, జీవితమని అతనికి తెలిసినదంతా కోల్పోయాడు, అంతే. అతను దేహాన్ని పోగొట్టుకున్నప్పుడు, అతను తన విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతాడు. ఉదాహరణకు ఎవరైనా మద్యం ఎక్కువగా తాగినపుడు లేక మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు జరిగేదేమిటంటే వారు వారి విచక్షణ కోల్పోతారు. సంతోషంగా ఉన్న వారు వారి వివేకాన్ని కోల్పోతే, వారు మరింత సంతోషానికి గురవుతారు. కాని అదే విచారంగా ఉంటే వారు తాగినా లేక మత్తు మందులు తీసుకున్నా వారు మరింత విచారానికి గురవుతారు. మందు లేక మత్తుమందు దానంతటదే ఆహ్లాదాన్ని లేక విచారాన్ని కలుగజెయ్యదు, మీరిది గమనించారా?
ఒకసారి మనసు తన విచక్షణను కోల్పోతే మీరు కాస్త సంతోషాన్ని సృష్టించినా, అది మరింత ద్విగుణీకృతం అవుతుంది. మీరు కాస్తంత విచారాన్ని సృష్టించినా, అదీ విస్తారమవుతుంది. తాగినపుడు ఆనందంగా అయ్యేవారు కొంతమంది ఉన్నారు. తాగినపుడు అధిక విచారానికి గురయ్యే వారు కొందరున్నారు. వారి ప్రాథమిక స్థితి ఏదైతే, అదే అతిశయమవుతుంది. ఎందుకంటే మనసు తన విచక్షణ కోల్పోయింది.
శరీరాన్ని కోల్పోయినపుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. కాని మరింత అధికంగా జరుగుతుంది. విచక్షణ అసలు ఉండనే ఉండదు. తాగుబోతులో కూడా అది ఉంటుంది. పిల్లల్లో కూడా అది ఉంటుంది. కాని చనిపోయిన వారిలో అది పూర్తిగా ఉండదు. చనిపోకముందు ఏ ప్రవృత్తులైతే ఉన్నాయో అవే విస్తారమవుతాయి. చనిపోయిన తరువాత అత్యంత విచారకర మైన స్థితిలోకి పతనం చెందితే మనం దానిని నరకం అంటాం. చాలా ఆనందకరమైన స్థితిలోకి వెళితే మనం దాన్ని స్వర్గం అంటాము. నరకం, స్వర్గం అనేవి భౌగోళిక ప్రదేశాలు కావు. వివేకాన్ని కోల్పోయినపుడు వ్యక్తులు ఏదో ఒక విధంగా ఏదో ఒక స్థితికి చేరుకుంటారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, పఠించడానికి భారతీయ సంస్కృతిలో ఏదో ఒక మంత్రం నేర్పిస్తారు. దాని ఉద్దేశం మీరు ఈ మంత్రం పఠిస్తూ ఒక రకమైన సంతోషాన్ని సృష్టించుకుంటారనే. ఆ శబ్దాలు చనిపోయిన వారిలో ఒక విధమైన ఆనంద ప్రకంపనలను కలిగిస్తాయి. కనుకనే భారతీయ సంస్కృతిలో ఈ మంత్రాలసు సృష్టించారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, కూర్చుని ఈ మంత్రాలను జపించాలి. వారి చెయ్యి పట్టుకోవడమో, అదో ఇదో చెయ్యడమో కాదు కేవలం కూర్చుని ఈ మంత్రాలను పఠించాలి. సాంప్రదాయ ప్రకారం చూస్తే ఇండియాలో ప్రజలు వారికి ప్రియమైన వారు మధ్యలో చనిపోవాలని ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే మీరు మీ కుటుంబం మధ్య చనిపోతే, ఎన్నో భావోద్వేగాలు ప్రకటితమవుతాయి. పాశ్చాత్య సంస్కృతిలో దీనిపై అవగాహన లేదు. అందువల్ల వారు వారి కుటుంబ ఆదరణలో, సౌకర్యవంతంగా చావాలనుకుంటారు. కాని ఇది తెలివైన పని కాదు. ఆధ్యాత్మికంగా అనుకూలం, సచేతనం అయిన ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం నిజంగా తెలివైన పని. అక్కడ వీలైనంత హుందాగా శరీరాన్ని వదిలి వెళ్లవచ్చు. మీరు హుందాగా జీవించి ఉంటే మీరు హుందాగా మరణించడం అనేది కూడా చాలా ముఖ్యం అవుతుంది. ఈ దేశంలో ముసలితనంలో కుటుంబం మధ్య చావకూడదని ఒంటరిగా చనిపోవడానికి కాశీకి వెళతారు. ఎందుకంటే కుటుంబం మధ్య చనిపోతే మీరు వారి వంక అనురాగంతో చూస్తారు. సులువుగా దేహాన్ని విడిచిపోవడం మీకు వీలుకాదు, విచారం కలుగుతుంది. ఆ విచారం పెరిగి పెద్దదై మిమ్మల్ని ఏదో భయంకరమైన దానిలోకి నెడుతుంది. అది ఇతరులకు కూడా మంచిది కాదు. అందుకే మరణం వచ్చినపుడు, దూరంగా వెళ్లి ఒంటరిగా చనిపోతారు. ఇది ఉద్వేగాలను బట్టో లేక ఆలోచనలను బట్టో చేసే పని కాదు. మరణం గురించిన నిర్దిష్ట అవగాహన, జ్ఞానం ఉండటం వల్ల ఇలా చేస్తారు.
ఒక వ ్యక్తి ముసలితనం వల్ల మరణించినపుడు, తదనంతరం అతని జీవితాన్ని ఆనందభరింత చేసేందుకు మనకు ఇంకా 11 నుంచి 14 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి ఆనందం అందిస్తే, మీరు ఒక్క చుక్క ఆనందాన్ని అతనిలో వేసినా, ఇది కొంత కాలం తరువాత ఒక ఆనందసాగరం అవుతుంది. ఎందుకంటే అతనిలో వివేకం లేదు. అతను ఆ ఆనందాన్ని ఆపలేడు. మీరు నవ్వడం మొదలుపెడితే, కొన్నిసార్లు మీకు నవ్వాగదు. అప్పుడు మీ విచక్షణ ‘ఇక చాలు’ అంటుంది. అపుడు మీరు ఆ నవ్వు ఆపేసి, మీ పనిలో మీరు వెళతారు. కాని మరణించిన వారు నవ్వడం మొదలుపెడితే వారు ఆపలేరు. అక్కడ తట్టి చెప్పేందుకు విచక్షణ గల మనసు ఉండదు. అది కేవలం పెరిగి ఉధృతమై, సాధారణంగా స్వర్గం అనబడే ఒక అతిశయమైన ఆనందమవుతుంది. ముసలి వయసులో చనిపోతే, మనం ఈ ఆనందపు చుక్కను ఆ జీవిలోకి 14 రోజుల వరకు వెయ్యగలుగుతాము. ఒకవేళ ఎవరైనా 40 ఏళ్లలోపే చనిపోతే మంచి యవ్వనంలో ఉన్నా శరీరం దెబ్బతిని జీవనక్రియల ఆచరణకు యోగ్యం కాకుండా పోవడం వల్ల చనిపోతే అప్పుడు 48 రోజుల వరకు చాలా సులభంగా ఆ జీవిలో ఈ ఆనందపు చుక్కను వెయ్యగలుగుతాము. ఎవరైనా చాలా మంచి ఆరోగ్యంతో ఉండి చనిపోతే, మనం 90 రోజుల వరకు అలా ప్రభావితం చెయ్యగలం. 50-55 ఏళ్ల వయసులో ఉండి చురుకైన, ఫలవంతమైన జీవితం జీవిస్తూ ఏదో కారణం వల్ల శరీరం దెబ్బతినడం వల్ల చనిపోతే, అప్పుడు మనం ఆ జీవిని కూడా 48 రోజుల వరకు ప్రభావితం చెయ్యగలుగుతాము.
– సద్గురు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.