గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18 16-జైనకవి రుషి -జిన రత్న

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18

16-జైనకవి రుషి -జిన రత్న

లీలావతి సార అనే కావ్యాన్ని రాసిన జిన రత్న జైన పండితుడు రుషి .ఇప్పటి రాజస్థాన్ లోని ఝాలార్ అంటే అప్పటి జాబాలి పుత్రాలో దీన్ని రాశాడు .మహారాస్ట్ర జైన అనే ప్రాకృత భాష లో జినేశ్వరుడు అనే బౌద్ధ ఆచార్యుడు రాసిన’’నివ్వాన ఇలావైకహా ‘’ పెద్ద ఉద్గ్రందానికి ఇది సంక్షిప్త వివరణ .జిన రత్న తన జీవిత గురించి ఎక్కడా చెప్పుకోలేదు. తన గురువులను మాత్రం మనస్పూర్తిగాఅశ్వా సాంతాలలో స్మరించాడు .జినేశ్వరుని గురువైన వర్ధామా నుడి నుండి అందరిని పేర్కొన్నాడు .తన గురువైన మరో జినేశ్వరునీ కీర్తించాడు .దీనిని 1285లో రాశాడు .

కవిత్వం లో గీర్వాణం

జినరత్న సాహిత్యాన్ని ,సాహిత్య శాస్త్రాన్నిశ్వేతాంబర  జైన గ్రంధాలను గురువు జినేశ్వరుని వద్ద అభ్యసించాడు .మిగిలిన గురువులవద్ద అవసరమైనవి అన్నీ నేర్చాడు .వారి తో తన లీలావతీ సార గ్రంధానికి మెరుగులు దిద్దిన్చుకొన్నాడు .మొదటి అధ్యాయం లో జినేశ్వరుడు రాసిన మహా గ్రంధం లోని శ్లోకాలు తనకు ఎలా ఆడర్శమైనాయోవివరించాడు .కధనాన్ని పూర్తిగా అనుకరించి సంక్షిప్తతకు వన్నె తెచ్చానని చెప్పాడు .అందుకే జినేశ్వరుడి నివ్వాన గ్రంధ కంటే జినరత్న రాసిన లీలావతారికకే అధిక ప్రాచుర్యం లభించి ఇంటింటా పారాయణ గ్రంధమైంది .మహారాస్ట్ర జైన ప్రాకృతం లో రాయబడటంవలన ప్రజలు మరీ చేరువైంది .ఇది దాదాపు సంస్కృతానికి దగ్గరగా ఉండటం మరొక గొప్పలాభం చేకూర్చింది . అనువైన ఛందస్సును ,అలంకారాలను ఉపయోగించికావ్యానికి వన్నె తెచ్చాడు .సంస్కృత వ్యాకరణాన్ని అనుసరించి రాసినా సంస్కృత పదాలను గ్రహించినా జన జీవితం లో వాడుకలో ఉన్న వాటినీ తీసుకొని భాషను పరిపుష్టి చేశాడు .

సులభమైన శైలి తో ,ప్రవాహ వేగం తో కావ్యాన్నిమాధుర్య విలసితం గా  తీర్చిదిద్దాడు .సూటిగా హృదయానికి తాకేట్లు డొంక తిరుగుడు లేకుండా రాయటం వలన కావ్యం జన లోకి చొచ్చుకుపోయింది .నగర ,అరణ్య తటాక ,ప్రక్రుతి ,యుద్ధ వర్ణనలు సంస్కృత మహాకావ్యాన్ని తలపిప జేస్తాయి భాష వీటిలో చాలా సాంద్రమై ఆకట్టుకొంటుంది .క్లే సాంస్క్రిట్ లైబ్రరి వారు దీన్ని ఆంగ్లం లోరిచార్డ్ ఫైన్స్ చేత  అనువాదం చేయించి  ‘’ఎపిటోం ఆఫ్ క్వీన్ లీలా వతి’’అనిపేరుపెట్టారు .

ఇందులో అనేక కధలున్నాయి .అనుష్టుప్ ఛందస్సు ను కవిబాగా ఉపయోగించుకొన్నాడు .చెవులకు ఇపుగా ఉంటె వినే వారికి ఆసక్తికలుగుతున్దికనుక అలా రాశాను అని చెప్పుకొన్నాడు .ప్రతిపాత్రా ప్రయోజనం కలిగి ఉంటుంది .కధలలో నాటకీయత బాగా ఆకర్షిస్తుంది అదే గొప్ప ప్లస్ పాయింట్ అయింది .మంచి చెడుల మధ్య ఉన్న అతి సూక్ష్మ భేదాన్ని చక్కగా వివరించాడు .రాజు రాణి ప్రేమ కదఅనేక ఒడి దుడుకులలకు లోనై  చివరికి సుఖాంతం అవుతుంది  .కధలో కద మిమిళితమైగోలుసుల్లా బంధాన్ని కలిగి ఉంటాయి ఇందులో .కర్మ కు ప్రాధాన్యంఉంటుంది .పునర్జన్మ ఉంటుంది .సంసార జలధిలో బతుకు నావ నడుపుకొంటూ తీరం చేరాలి .అనేది ఇందులో ఉన్న సారాంశం.

Inline image 1

మరోకవితో మళ్ళీ కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.