ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే
ఈ ఏడాది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఎంపికచేసిన 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో ఆరుగురు భారత సంతతి రచయితల రచనలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో బోస్టన్‌కు చెందిన ప్రముఖ సర్జన్‌, రచయిత అయిన అతుల్‌ గవాండే, విఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహ రచనలకు విశేష గుర్తింపు లభించింది. ఆధునిక వైద్యంపై అతుల్‌ రాసిన ‘బీయింగ్‌ మోర్టల్‌: మెడిసిన్‌ అండ్‌ వాట్‌ మేటర్స్‌ ఇన్‌ ది ఎండ్‌’ పుస్తకం నాన్‌ ఫిక్షన్‌ విభాగంలో రెండో స్ధానం సాధించింది. ఈ పుస్తకం వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఈ ఏడాది ఎంపిక చేసిన అత్యుత్తమ 10 పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన షాపింగ్‌లో ఈ పుస్తకాన్ని ఇష్టపడి మరీ కొనటం విశేషం. ఇక బుధవారం విడుదల అయిన రామచంద్ర గుహ తాజా రచన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’ మరో ప్రముఖ రచనగా నిలిచింది. కవిత్వ విభాగంలో ఢిల్లీకి చెందిన అఖిల్‌ శర్మ పుస్తకం ‘ఫ్యామిలీ లైఫ్‌’ ఉత్తమ రచనల్లో ఒకటిగా నిలిచింది. కళ, సాంకేతికత మధ్య సంబంధాన్ని హృద్యంగా వర్ణించిన ‘గీక్‌ సబ్‌లైమ్‌: ద బ్యూటీ ఆఫ్‌కోడ్‌, ద కోడ్‌ ఆఫ్‌ బ్యూటీ’ పుస్తక రచయిత విక్రమ్‌ చంద్ర కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ రచనకు ఆయన 1996లో కామన్‌వెల్త్‌ రచయితల బహుమతి పొందారు. ఈ జాబితాలో రచయిత, పాత్రికేయుడైన ఆనంద్‌ గోపాల్‌ అఫ్గానిస్థాన్‌లో అమెరికా యుద్ధంపై రాసిన పుస్తకంతో బాటు 9/11 ఘటన ఆధారంగా కాలమిస్ట్‌, పేరొందిన రచయిత ఆనంద్‌ గిరిధర్‌రాసిన పుస్తకాలకూ చోటు దక్కింది
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.