”మా అన్నయ్య ”ఆత్మీయ కవితా సంకలనం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు శుభకామనలు -సరససభారతి 94 వ సమావేశంగా ,సరసభారతి రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో న ”మా అన్నయ్య ”పై నిర్వహించిన ఆత్మీయ కవిసమ్మేళనం కవితా సంకలనాన్ని 17-7-16 ఆదివారం ఉదయం 10 గం  లకు విజయవాడ చండ్ర  రాజేశ్వర రావు లైబ్రరీ(బందరు రోడ్డులోని పశువుల ఆస్పత్రి కి ఎదురు రోడ్డు లో ) ప్రముఖ కథానికా రచయిత ,న్యాయవాది,విశ్లేషకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆవిష్కరిస్తారు . సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతం రాజు మల్లికగారు ఈ పుస్తకానికి స్పాన్సర్ అని మీకు తెలిసిన విషయమే .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం త్వరలోనే అంద  జేస్తాము  .సాహితీ మిత్రులు అందరూ పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా కోరుతున్నాం –

గబ్బిట దుర్గాప్రసాద్ -సరస భారతి  అధ్యక్షులు  ,చలపాక ప్రకాష్ -రమ్య భారతి అధ్యక్షులు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.