గౌతమీ మాహాత్మ్యం-3 నాలుగవ అధ్యాయం –బలిప్రసంశ

         గౌతమీ మాహాత్మ్యం-3

నారదుడు బ్రహ్మను ఆకమండలం లో గంగా దేవి ఎలాచేరింది ,ఈలోకం లోకి ఎలావచ్చింది సవివరంగా తెలియజేయమని కోరాడు .బ్రహ్మ ‘’దేవ శత్రువు బలిరాక్షసుడు ధర్మ వీర ప్రజారక్షణ ,గురుభక్తి సత్య ,వీర్య బల,త్యాగ క్షమా గుణాలతో జగజ్జేత అయ్యాడు.ఇతడిని చూసి దేవతలు అసూయపడి ,అతడిని ఎలా జయించగలం అని మీమా౦స పడ్డారు.ముల్లోకాలలో కల్లోలాలు లేవు ,శత్రువులులేరు వ్యాధి అనావృస్టి మనోవ్యధ లేనేలేవు ప్రజలకు’’నాస్తి’’ అనేది లేదు .అని తలచి ,అతని కీర్తితోనే ఓడించాలి అని నిశ్చయించి విష్ణువును చేరి తము దైత్యబలి ని ఎలాకీర్తి౦చగలం,ఇప్పుడు నువ్వే  మాకు దిక్కు అని వేడుకున్నారు .కరగిన కరి రక్షకుడు ‘’బలి నా భక్తుడు అతనినిజయించటం ఎవరి తరమూ కాదు .యుక్తితో అతడిని జయించి మీ స్వర్గం మీకు అప్పగిస్తానని అభయమివ్వగా సంతోషించి వాళ్ళు వెళ్ళిపోయారు .

  తర్వాత విష్ణువు అదితి గర్బం లో ప్రవేశింఛి జన్మించగా దేవతలు ఉత్సవాలు చేశారు .యజ్ఞేశుడు యజ్నపురుషుడు వామనుడిగా జన్మించాడు .బలపరాక్రమాలలో  శ్రేష్టుడైన బలి’హయ మేధయాగానికి పూనుకొని ,రాక్షసగురువు శుక్రాచార్యుని ఆధ్వర్యం లో యాగం మొదలుపెట్టాడు .హవిర్భాగం పొందటానికి దేవ గాంధర్వ ,పన్నగులు చేరారు .ఎవరికి ఏదికావాలో అది ఇచ్చాడు ,షడ్రసోపేత భోజనాలు పెట్టాడు ,బ్రాహ్మణులను పూజించి దానాలు విశేషంగా చేశాడు .ఇంతలో వామన బ్రహ్మ చారి చిత్రకు౦డలదారియై రాగా ,వచ్చినవాడు మారువేషంలో ఉన్న విష్ణువే అని గ్రహించి శుక్రాచార్యుడు శిష్యునితో ‘’వచ్చిన వాడు విప్రుడు కాదు .యజ్న పురుషుడు నారాయణుడే .అతడేదదైనా యాచిస్తే నాతొ సంప్రదించి నేను ఔనంటేనే దానమివ్వు ‘’అని హెచ్చరించాడు .దీనికి బలి’’యజ్నపురుషుడే యాచి౦చటానికి వస్తే మీతో సంప్రదించాల్సిన పనేముంది ?’’అని భార్యతో సహా వామనుని చేరి ‘’ఎందుకోసం యాచకుడవైనావు “”?అని చేతులు జోడించి అడిగాడు ‘.’’పదత్రయభూమి’’ఇమ్మని కోరాడు ..మళ్ళీ ‘’రాజేంద్రా !భూమే ఇవ్వు ఇంకేమీవద్దు ‘’అనగా అలాగే అన్నాడు బలి .మహర్షులు పురోహితుడైన శుక్రుడు ,లోకనాథులు,దైత్య సంఘం  చూస్తుండగా,నానా రత్నఖచిత కలశం నుండి నీరు ధారగా పోస్తూ జయజయ ద్వానలమధ్య బలి మూడు అడుగుల భూమి వామనుడికి దానం చేశాడు .తనకు దానమిచ్చిన భూమి ని వెంటనేస్వాదీనం చేయమన్నాడు వామనుడు .సరే అనగా వామనుడు విపరీతంగా పెరిగిపోయాడు .ఆశ్చర్య పడిన బలి’’లోకేశ్వరా !నీశక్తికొద్దీ విజ్రు౦భించు .’’అనగానే విప్రబాలుడు ‘’అన్ని విధాలా నేనే జయించాను దైత్యేశా !’’అంటూ ఇంకా పెరిగిపోయాడు .విక్రముడైన వామనుడు తాబేలు వీపుపై ఒకపాదం ఉంచి, రెండవపాదం యజ్ఞవాటికలోపెట్టి, మూడవ పాదం పెట్టటానికి చోటులేక బలినే అడిగాడు ఎక్కడ పెట్టాలని .చిరునగవుతో బలిభార్యతో సహా కృతజ్ఞత గా నమస్కరించి ,’’జగద్రూపా !మూడవపాదం నా వీపు మీద పెట్టు’’అని కోరాడు .బలిభక్తికి సంతోషించి వామనరూప విష్ణువు వరం కోరుకోమన్నాడు ,దానికి బలి’’నీకు దానంగా భూమి అంతాఇచ్చేసి , నేను మళ్ళీ నిన్ను ఏదో కోరితే దానం వ్యర్ధమౌతుంది ‘’అనగా మరింత సంతోషించి  అడగకపోయినా బలికి రసాతలాదిపత్యం ,భవిష్యత్తులో ఇంద్రపదవిని,ఏకచ్చత్రాదిపత్యాన్ని ,అనశ్వరమైన యశస్సు అనుగ్రహించాడు .భార్యతో సహా బలిని రసాతలానికి తీసుకు వెళ్లి ,ఇంద్రునికి మళ్ళీ ఇంద్రపదవి కట్టబెట్టాడు విష్ణువు .

  బ్రహ్మలోకాన్ని చేరిని విష్ణు పాదాన్ని శంకరుడు ఇచ్చిన కమండలం లోని గంగాజలం తో పూజించాలని భావించి మంత్ర పూత౦ గంగాజలాన్ని విష్ణుపాదం పై చల్లాడు .తర్వాత ఆ జలం మేరు పర్వతం పై పడి నాలుగు పాయలై భూమికి చేరే ప్రయత్నం లో పూర్వ ,దక్షిణ ,పశ్చిమ,ఉత్తర దిశగా బయల్దేరగా,దక్షిణ దిశా ప్రవాహాన్ని శంకరుడు తన జటా జూటం లో బంధించాడు .పశ్చిమమవైపు జలం మళ్ళీ బ్రహ్మ కమండలం లోకే చేరింది .ఉత్తరానికి పారిన నీటిని విష్ణువు గ్రహించాడు .తూర్పు దిశా ప్రవాహాన్ని దేవతలు పితరులు ,లోకపాలురు గ్రహించారు .దక్షిణ దిశకు ప్రవహించిన విష్ణు పాదోదకమైన గంగ లోక మాతృక బ్రహ్మ సంబంధమైన లోకమాతలు .శివజటాజూటం  లోని గంగా ఇవన్నీ శుభోదయాలే వీటిని స్మరిస్తేనే కోరికలు తీరుతాయి .  

  రేపు నాగుల చవితిశుభాకా౦క్షలతో  

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-11-18-ఉయ్యూరు         

image.png
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.